12, ఆగస్టు 2011, శుక్రవారం

Rajanikantarao


బాలాంత్రపు రజనీకాంతరావు గారి గురించి శ్రీవేణుగోపాల్గారు ఏదొ కోడ్ లో రాయడంవల్ల చదవలేకపోయాను.నాకు తెలిసిన నాలుగు ముక్కలు రాస్తున్నాను.రజని అని పిలవబడే ఆయన మా చిన్నప్పటికే ప్రసిద్ధుడు .ఇప్పుడాయన  కి  90 పైనే ఉంటాయి.రేడియొ లో ఆఫీసర్గా  పనిచేస్తూ ,ఎన్నో లలితసంగీత గేయాలకి ,నాటకాలకి సంగీతం సమకూర్చేవారు.ప్రయోక్తగా ఉండేవారు. నాకు బాగా
 జ్ఞాపకమున్నవి.    .- రాజేస్వరరావు పాడిన "ఓహో విభావరీ" ,సూర్యకుమారి పాడిన "శతపత్రసుందరి" రజని గేయాలే.స్వర్గసీమ సినిమాలో దేశమంతా మారుమోగిన  భానుమతి పాడిన "ఓహోపావురమా" పాటకి స్వరకల్పన ఆయన చేసిందే.కవిగా గాయకుడిగా  సంగీతకర్తగా  మహోన్నత వ్యక్తి  రజని .ఈ తరం వారికి తెలియడానికి  ఈ కొన్ని మాటలు రాసాను.

కామెంట్‌లు లేవు: