31, అక్టోబర్ 2014, శుక్రవారం

Name of the capital




  రెండు విషయాల గురించి గట్టిగా వ్రాయదలుచుకొన్నాను.
   1.ఆంధ్రప్రదేష్ రాజధాని;మన రాజధాని గురించిస్థలనిర్ణయం జరిగిపోయింది .కాబట్టి పేరు కూడా నిర్ణయమైపోవాలి.అమరావతి 400సంవత్సరాల కాలం ప్రాచీన విశాల సామ్రాజ్యానికి  రాజధాని.ఇంచుమించు ఆప్రదేశంలోనే ఇప్పుడు రాజధానిని నిర్మించబోతున్నారుకాబట్టి అమరావతి అనిపేరుపెట్టడమే సముచితం.ఏ వ్యక్తి పేరు పెట్టడం బాగుండదు. అమరావతే మనరాజధాని.
    2.నవంబర్ 1వ తేదీ ఆంధ్రప్రదేశావతరణ   జరిగింది.ఆ తేదీనే మనం పండుగగా జరుపుకొంటున్నాము.జూన్ 2వతేదీన అందులో ఒకభాగం విడిపోయింది.ఆ తేదీని తెలంగాణా వారు జరుపుకోనిండి .మనరాష్ట్రావతరణ దినోత్సవం మాత్రం నవంబర్ 1వతారీకే.మార్చకూడదు.జూన్2 విషాదదినం.ఆరోజు జరుపుకోవడమేమిటి అర్థంలేకుండా.ఇలాంటి సలహాలు ప్రభుత్వానికి ఇచ్చిన కుహనామేధావులెవరు?
       ఈ రెండు విషయాల గురించి ప్రజలుగట్టిగా అడగాలి.బ్లాగు మిత్రులనుంచి స్పందనలు,అభిప్రాయాలు కోరుతున్నాను.  
    

janjhavati kathalu=contd(Final)



 మొత్తం మీద ఈ 21 కథలను పరిశీలిస్తే ఇవన్నీ తీవ్రవాద వామపక్ష ధోరణిలో వ్రాసినట్లున్నది.నీటిప్రాజెక్టులకీ,విద్యుత్ ప్రాజెక్టులకీ ఈ రచయితలంతా వ్యతిరేకులని అనిపిస్తున్నది.ఒక ఎకరా కూడా లేని  భూమితో5,6,మంది ఎలాజీవిస్తారు? చిన్న కమతాలు పోవడం మంచిదే కదా!ఒకప్పుడు వీరు ఎదుటి వారిని ఏ కారణాలతో అభివృద్ధి  నిరోధకులన్నారో ,ఇప్పుడదే కారణాలతోపర్యావరణరక్షణ పేరుతో సమర్థిస్తున్నారు.పర్యావరణసమ్రక్షణ మంచిదే.కాని అభివృద్ధి చెందిన ఫ్రాన్స్,జెర్మనీ ,స్విస్స్ వంటి దేశాలు పర్యావరణని   కాపాడుకొంటూనే నగరాలనీ,సంపదనీ.అభివృద్ధినీ సాధించుకోలేదా?
   ఈ కథలు వివిధ కాలాల్లో దశకాల్లో రాసినట్లు కనిపిస్తుంది.కాని దేశంలో జరిగిన,జరుగుతున్న,అభివృద్ధి మాత్రం వీరికి  కాబట్టినట్లు లేదు.పేదరికంతగ్గిందికదా!లేబరుకెంత డిమాండు వుందిప్పుడు?రచయితలు దేశంలో వస్తున్న మంచి, చెడ్డ ,అన్ని మార్పుల్ని బాగా అధ్యయనం  చెసి రాస్తే మంచిదనుకొంటాను.
       ఈ కథా రచయితలందరూ నిష్ణాతులని ముందే పేర్కొనడం జరిగింది.కొన్ని కథాంశాలు,కథనం బాగున్నవని చెప్పవచ్చును.కాని కొన్ని  కథలకు ముగింపు స్పష్టంగా లేదు.కొన్ని కథల్లో  రచయిత చెప్పడంలో గందరగోళంలో పడినట్లు అనిపిస్తుంది.
        ఐనా ఈ కథాసంకలనం శ్రీకాకుళసాహితివారి మంచి ప్రయత్నం అని చెప్పాలి.జిల్లాలోని నదులపేర్లతో కథాసంకలనాలు ప్రచురిద్దామన్న వీరి ప్రయత్నం అభినందనీయం.ఇప్పటికి నాగావళి,వంశధార పేర్లతో రెండు సంపుటాలు వెలువడ్డాయి.ఇది మూడవది.ఇంకా మరికొన్ని వెలువడవచ్చును.వీటన్నిటినీ చదివితే ఉత్తరాంధ్రప్రజా జీవితం,పరిస్థితులు,ఇటీవలి చరిత్ర గురించి పాఠకులకు ఒక అవగాహన ఏర్పడుతుంది. కథరచించిన కాలం పేర్కొనిఉంటే బాగుండేది.
                           (సమాప్తం)  

30, అక్టోబర్ 2014, గురువారం

JANJHAAVATI KATHALU--REVIEW--3rd part




  ఉత్తరాంధ్ర ప్రసిద్ధ కథారచయిత రెడ్డిశాస్త్రి గారి కథ ' అస్తమయం ' :లచ్చయ్య దిక్కులేని ముసలాడు.ఎలాగో వూరివాళ్ళ సాయంతో కాలం వెళ్ళబుచ్చుతుంటాడు.అతడి నేస్తం గురయ్య మరో వృద్ధుడు.చాలీ చాలని బతుకు తెరువుమాత్రం ఇస్తున్న చిన్న మెట్టపొలాన్ని అమ్మేసి పట్నానికి పోయి పనిచేసుకొని బతుకుదామని  కొడుకు పోరుపెడుతుంటాడు.ఆ మాటచెప్పి గురయ్య లచ్చయ్య సలహా అడుగుతాడు.లచ్చయ్య ఎటూ చెప్పలేకపోతాడు.చివరకు,తరాలు మారేయని,కొడుకు చెప్పినట్లేచెయ్యమని చెప్తాడు.పొలం అమ్మడం యిష్టం లేని గురయ్య నూతిలోపడి  మరణిస్తాడు.లచ్చయ్య షాక్ తో మరణిస్తాడు.ప్రజలు ' రెండూళ్ళ ముదర బుర్రలు మరి లేకంటా పోయాయి ' అనుకొంటారు.
  వ్యవసాయం గిట్టుబాటుగాక  రైతులు పట్టణాలకి వలసలుపోవడం  ఈ కథలో ప్రధానాంశం.
      ఇక మిగతా కథల గురించి క్లుప్తంగా;--
    'కళింగ ఎక్స్ ప్రెస్ ' (కొప్పల భానునూర్తి) కూడా వలసలగురించి : మొదళ్ళు-చిగుళ్ళు (దాసరి రామచంద్రరావు) బాలకార్మికుల స్థితి ,పిల్లలు స్కూలులో చదువుకొంటూ ఒకవైపు,పనుల్లోకి వెళ్ళవలసిన అవసరం  ఇంకొకవైపు అనే అంశం గురించి."భస్మసిమ్హాసనం' (పంతుల కమలకుమారి" ) కలవంటి కథ.పల్లెల్ని ధ్వంసం చేసి పరిశ్రమలు పెట్టడం గురించి,మత్స్యకారుల జీవితాలలోని కష్టాలగురించి కథాంశం. 'ఆటుపోటు " (చింతాడ తిరుమలరావు) ,రెక్కసాగనికథ(నాగులమహంతి రమణమూర్తి) ఈ రెండు కథలు మధ్యతరగతి చాలీచాలని ఆదాయాల గురించి
 "విరమణలేని కథ"(ఉపాధ్యాయుల గౌరీశంకరరావు)  ఒక మధ్యతరగతి ఉద్యోగి పనిచేసే మిల్లు మూతపడడంతో  యాజమాన్యం ఇచ్చిన పరిహారం చాలకపోగా ,మళ్ళీ వేరే ఉద్యోగం కోసం ప్రయత్నంలో తిరుగుతూ ఉండడం కథాంశం"అనగనగా ఒకరోజు " (పత్తి సుమతి ) పిల్లల చదువు గురించి ఒక గృహిణి పడే పాటులు .''భూతాలసొరగం ''(చింతా అప్పలనాయుడు)  ఒక జంగందొర కాలమానపరిస్థితుల వల్ల తన పాటకి ప్రోత్సాహంలేక ఆదాయంలేక పడే అవస్థల గురించి. ''నీడ '' (పి.వి.నర సిమ్హారావు ) తనకి కొంత ధనసహాయంజేసి,తాను కట్టుకొన్న యింటినే కాజేద్దామనుకొన్న  షావుకారు కి ఎదురుతిరిగి ఇంటిని కాపాడుకొన్న వైనం.''బందెలదొడ్డి '' (కె.వి.కూర్మనాథ్ ) బందెలదొడ్డి లో పెట్టిన పశువులు ,మనుషులు,ముఖ్యంగా తమ యజమానులగురించి వాటి అభిప్రాయాలు చెప్పుకొంటూ మాట్లాడుకొడం  తమాషాగా ఉంటుంది. ''చెలగాటం ''( ఆప్తచైతన్య ) మన్యప్రాంతంలోని హాస్టల్లో ఒక గిరిజనకుర్రాడికి జబ్బుచేస్తే వాడికేమైనా అయితే తన పీకకుచుట్టు కుంటుందని  హెడ్మాస్టర్ కొంత డబ్బిచ్చి వాడిని తండ్రితో ఇంటికి పంపించేస్తాడు. ''పిల్లలకోడి '' (ఆర్.రామక్రిష్ణ) ఇది కూడా పారిశ్రామీకకరణం భ్రమలో పడి ,పొలాలు వదలుకొని పట్టణాలకి వలస పోవద్దని ఉద్బోధించే కథ.
                                (ఇంకా వుంది) 

29, అక్టోబర్ 2014, బుధవారం

janjhavati kathalu -2 (contd)


 మరొక కథ;' ముంపు ':గంటేడ గౌరినాయుడు గారు  రాసినది.నాగావళితీరప్రాంతంలో నీటి ప్రాజెక్టు గురించి ఒక పల్లెలో జరుగుతున్న చర్చలు,వాదోపవాదాలు,ఆందోళనలుగురించి.ప్రాజక్టు వల్ల ముంపులో ఇల్లు ఖాళీ చేసిపోవలసి వస్తుందని ఒకపక్క  బెంగ.మరోపక్క నష్టపరిహారం వస్తుంది కదా దానితో ఏంచెయ్యాలని ఆలోచన.ప్రాజెక్టు ఇక్కడైక్కడకాదు దూరంగా ఎగువన కడితే మనకి మంచిదని వూరి మాస్టారి ఉపన్యాసం.కథకి పర్యవసానం ఏమీ లేదు.అనిశ్చితంగా ముగుస్తుంది.ఇంతకీ ప్రాజెక్టుకి  రచయిత అనుకూలమా,వ్యతిరేకమా అనేది తెలియదు.(దరిమిలా జంఝావతి ప్రాజెక్టు పూర్తి ఐనట్లు తెలుస్తున్నది.)
      జి.యస్.చలంగారి రచన 'పొగ 'అనే కథ.ఇది రోడ్డు రవాణా,పాఠశాలల  ప్రైవేటీకరణకి వ్యతిరేకం గా రాసింది.ప్రభుత్వం ఎలాగనిర్లక్ష్యం,దుష్పరిపాలన ద్వారా R.T.C.బస్సుల్ని ,ప్రభుత్వ స్కూళ్ళని నిర్వీర్యం.నిరుపయోగకరంగా,మార్చిరద్దుచేద్దామనిచూస్తున్నదో వివరించారు.ప్రయివేటు రవాణాని,విద్యని ఎలా ప్రోత్సహిస్తున్నదో ఆవైనం,దానికి వ్యతిరేకంగా కథా నాయకుడు పిడికిలి ముగించడంతో కథ ముగుస్తుంది.
  ' చేదుఫలం ' కథ పడాల జోగారావు రచన.గ్రామీణ సహకార  బాంకుల్లో,అక్రమాలు, అవి నడిచే తీరు వాటి లోతట్టు సమాచారంinside information  తో రాసినది.ముకుందం అనే  ఉద్యోగి  తనకిష్టం లేకపోయినా కొన్ని చర్యలలో  ఇరుక్కొని ఆ ఇబ్బందుల్లో నుంచి తనకున్న మంచిపేరు goodwill వల్ల బయటపడటం కథ.తోడి మేనేజర్లు బాగా ధనమూ,ఆస్తిపాస్తులు సంపాదించుకొన్నా  ,తాను మాత్రం అలాగే ఉండిపోవడం బంధుమిత్రుల విమర్శకి  గురి అవుతాడు.
   మరొక ప్రసిద్ధ కథకుడు అట్టాడ అప్పలనాయుడు రచించినదీ' షా--- '' అనే కథ. చదరంగంలో  ఎత్తులు,పైఎత్తులులాగే రాజకీయాల్లో వాటిగురించి విశదంగా రాసారు.పల్లెల్లోంచి వచ్చిన చిన్న పెట్టుబడిదార్లు ,పడమటినుంచి  వచ్చిన బడా పెట్టుబడిదార్ల   పోటీకినిలబడలేకపోవడం అందుకు ప్రతిగా మరొక    ఎత్తు వెయ్యడం ప్రధానాంశం.I.T.,PHARMA  కంపెనీల నీటి అవసరాలకోసం  ప్రాజెక్టు డిజైను మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ప్రజల చేసే ఆందోళనని చిన్నపెట్టుబడిదారు ప్రోత్సహిస్తాడు.స్థానికప్రజల అవసరాల్ని తీర్చేవిధంగ మొదటి డిజైనుప్రకారమే నిర్మించాలని సామాన్యప్రజలతోబాటు లోకల్ సావుకార్లు కూడా పాల్గొంటారు.  

28, అక్టోబర్ 2014, మంగళవారం

janjhaavati kathalu-a review.




 జంఝావతి కథలు;శ్రీకాకుళ సాహితి వారి ప్రచురణ.
---------------------------------
శ్రీకాకుళ సాహితి వారు ఉత్తరాంధ్రలోని నదులపేర్లతో అక్కడి రచయితల కథా సంపుటాలు ప్రచురించుదామనే  సంకల్పంలో భాగంగా జంఝావతికథలు ప్రచురించారు.ఇందులో కథకులు చాలామంది ప్రసిద్ధులే.చాలాకథలు పత్రికల్లో వచ్చినవే.మొత్తం 21 కథలు ఇందులోఉన్నవి.
  కథకుల్లో  వామపక్ష తీవ్రభావ ధోరణి స్పష్టంగా ఉన్నది.  ఉత్తరాంధ్ర గ్రామీణ ప్రాంతాల జీవనంలో వచ్చిన మార్పులు,మానవ సంబంధాల  విచ్చిత్తి    కనిపిస్తుంది.
వ్యవసాయంలో వచ్చిన మార్కెట్ ధోరణి,రైతుల కష్టాలు గూరించికూడా చాలామంది రాసారు.దాదాపు అందరూ అక్కడి మాండలికం లోనే బాగారాసారు.కాని మళ్ళీ మనం 50,60,ఏళ్ళ వెనక్కి వెళ్ళగలమా,వెళ్ళడం మంచిదా అని నా సందేహం.
 మొట్టమొదటికథ; కాళీపట్నం రామారావు గారిది (కా.రా.మాస్టారు) '' అన్నెమ్మనాయురాలు " రైతు కుటుంబంలోని  పెద్దావిడ.పొరుగూరివారితో  కోర్టు వ్యాజ్యాలతో చాలాపొలం పోగా మిగిలినదానితో మనమడితో కలిసి కాలం గడుపుతూ ఉంటుంది.మనమడు పొలం అమ్మేద్దమంటాడు.లేకపోతే తనవాటా పంచి ఇమ్మంటాడు.చివరకి తప్పనిసరి అయి వాటా రాసి ఇచ్చేస్తుంది.తరాలలో వచ్చిన భేదం చిత్రిస్తుంది.కథ పెద్దగాలేదు.వ్యాసంలా ఉంది.కథలు రాయడం మానేసిన మాస్టారు మొగమాటానికి కథ రాసి ఇచ్చినట్లు  అనిపిస్తుంది.
  రెండో కథ ; ' సాటింపు ' B.V.A. రామారావు నాయుడు గారి రచన.ఉబ్బసవ్యాధితో బాధపడే చినజన్నోడు అమ్మవారిపండుగలో 'సిరిమాను '  ఎక్కకుండా తప్పించుకోడానికి పక్క వూరికి పారిపోతాడు.కాని ఊరిపెద్దలు అతని కొడుకు వెంకటిని సిరిమానుఎక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విని,తిరిగివచ్చి తానే సిరిమాను  ఎక్కి ఊరేగింపులో మరణిస్తాడు. ఊరిపెద్ద కొడుకు రాజబాబుని నక్సలైట్లు కాల్చి చంపుతారు.సంబరం ఆగిపోతుంది.మూఢాచారాలకి,ఆధునిక భావాలకి మధ్య ఘర్షణని ఇంకా బాగా చిత్రించి ఉండవలసినది. కాని ఇంతటితో మూఢాచారాలు ఆగిపోతాయా అనే రచయిత ప్రశ్నతో కథ ముగుస్తుంది.
  మూడో కథ; మన్యం పల్లెలో  పండిన పంట అమ్ముతే షావుకారుకే  అమ్మాల. అతడే ధర నిర్ణయిస్తాడు.వాడిదే మొనోపలీ .ఒకసారి అలా అమ్మకుండా ఎదురు తిరిగితే  ముసలయ్యను,పొలీసుల ద్వారా దౌర్జన్యం చేయించి ,పంటని షావుకారుకే చేర్పిస్తారు.మన్యం ప్రజలని షావుకార్లు,పోలీసులు ఎలా  దోచుకొంటున్నారో తెలియజెప్పే కథ.    (ఇంకావుంది) 

6, అక్టోబర్ 2014, సోమవారం

V.I.P.opinions




 ముళ్ళపూడి రమణ గారు ఒకసారి రాసిన విషయం .ఆయన బాధపడినా ఏమీ అనలేక  ఉండిపోయినట్లు కనిపిస్తుంది.' బాలే 'లాగ తీసిన కళాఖండం  'సీతాకళ్యాణం '
  సినిమా ఇంగ్లాండు లో మంచి ప్రశంసలు పొందిన తర్వాత బాపు,రమణలు దాన్ని బిశ్వజిత్రాయ్ కి చూపించితే,అంతాచూసి  ఆ రోజుల్లో పెర్షియన్ కార్పెట్లు లేవు అనేసి  లేచి చక్కా వెళిపోయినట్లు రాసుకున్నారు.పాపం వీళ్ళు బాధ పడ్డా ఏమీ అనలేకపోయారు.ఆ పాయింటు మినహా మిగతా సినిమా అంతటిలోను,ఆయనకి బాగున్నవి ఒక్కటీ కనబడలేదా.ఇంగ్లండులో తనసినిమాలకన్నా గొప్ప ప్రశంసలు పొందినందుకు ఈర్ష్య అనుకోవాలా?ఒకోసారి గొప్పవాళ్ళు కూడా ఈర్ష్యా,అసూయలకి లోనవుతారనుకొంటాను.ఐనా రామాయణ  కాలంలో తివాసీలు లేవని ఆయన ఎలా అనుకున్నారు?రత్నకంబళ్ళు గురించి మన కావ్యాలనిండా వర్ణనలు   ఉన్నాయికదా.( తివాసీలు,పెర్షియాలోనేగాని మనదేశంలో  తయారయేవి కాదని అంటారు.పూర్వకాలం నుంచి పారసీక దేశానికి  చీనా దేశానికి,మన దేశానికి,వ్యాపారసంబంధాలు ఉండేవని చరిత్రలో తెలుస్తుంది.కాళిదాసు తన రఘువంశ ' కావ్యంలో శ్రీరామునికి పూర్వుడైన   రఘుమహారాజు పారశీకదేశంపై దండెత్తి జయించినట్లు రాశాడు. అందువల్ల ఎవరికైనా విమర్శించేముందు చాలా జాగ్రత్త అవసరమనుకొంటాను.  

4, అక్టోబర్ 2014, శనివారం

swatcha Bharat




 స్వచ్చ భారత్ కార్యక్రమాలు.ప్రముఖ నాయకులు,అధికారులు,చీపురుకట్టలతో చెత్త తుడవడం కొత్తకాదు.ఇదే మొదటి సారి కాదు.మరి ఎందుకు  విఫలమౌతున్నదో ప్రతిసారి అని ప్రశ్నించుకొంటే  కారణాలు తెలుస్తాయి.
   1.ఈ కార్యక్రమం కొన్నిసంవత్సరాలు  ఆగకుండా సాగాలి.
   2.సరియైన డ్రైనేజి  కల్పించాలి.
   3.మురుగునీరు ఆధునికపద్ధతిలో  ట్రీట్ చెయ్యకుండా జలాశయాల్లో కలపడాన్ని నిషేధించాలి.
   4.పై విధంగా చెయ్యాలంటే  తగిన నిధులు ఖర్చుపెట్టకుండా సాధ్యం కాదు.
   5.ఇంటింటికీ వెళ్ళి చెత్త కలెక్ట్ చేసి తగిన విధం గా దాన్ని డిస్పోజ్ చెయ్యాలి.అలాచెయ్య కుండా వీధుల్లో చెత్తపారబోసే వాళ్ళకి  జరిమానా విధించి తీరాలి.అంతేకాదు,అలా ఏర్పాటు చెయ్యని పంచాయితీ,మున్సిపాలిటీ  అధికారులపైన కూడా జరిమానా విధించాలి.
   6.ప్రతి ఇంటికి టాయిలెట్(పట్నాలు,పల్లెలు కూడా )ఉండితీరాలి.ఒకసంవత్సరం  గడువు ఇచ్చి ఆలోగా కట్టుకోకపోతే రూ.పదివేలు జరిమానా విధించాలి.మరీ పేదవారయితే ప్రభుత్వమే కట్టించి  ఇవ్వాలి.
    ఇంకా ఇలాంటి చర్యలు కఠినంగా తీసుకోకుండా అరుదుగా పెద్దలు చీపుర్లు పట్టుకుంటె ఏమీ లాభం ఉండదు.ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉంటుంది.

varma gari tactics




 రాంగోపాలవర్మ  గారి ఫాక్టరీ నుంచి తరచుగా సినిమాలు తయారవుతూ ఉంటాయి.ఇవి సాధ్యం ఐనంతవరకూ తక్కువ బడ్జెట్ లో తయారవుతాయి.మరి వాటికి కొంత పబ్లిసిటీ  అవసరం కదా!అందుచేత అందులో వివాదాస్పదమైన కథా,కొన్ని అంశాలు ప్రవేశ పెడతాడు. ఇక పైసా ఖర్చు లేకుండా దానిపై  మీడియాలో  విమర్శలు చెలరేగుతాయి.అందుకు జవాబుగా వర్మగారు నాఇష్టప్రకారం నేను సినిమా తీయడానికి నాకు స్వేచ్చ ఉంది  అంటారు.ఒకోసారి సెన్సారువారి అభ్యంతరాలు కూడా పబ్లిసిటీ కి తోడ్పడతాయి.సినిమా విడుదల ఐనతర్వాత,వ్యతిరేక ప్రదర్శనలు కూడా జరగవచ్చును.వీటన్నిటివలన,అ సిన్మా బాగులేక పోయనా కలెక్షన్లు వస్తాయి.
 అందువల్ల వర్మ సినిమా ని పట్టించుకోకుండా ignore చెయ్యడమే మంచిది.అందులో మన sensibilities కి అభ్యంతరకరమైనవి ఉన్నట్లు తెలిసినా.