23, ఏప్రిల్ 2015, గురువారం

invitation to discussion




 ఇప్పుడు మన దేశంలో తీవ్రమైన వివాదాన్ని రేకెత్తిస్తున్న అంశం;ఆధునికీకరణ,పారిశ్రామికీకరణ అందుకు వ్యతిరేకంగా రైతుల వద్ద భూసేకరణకు నిరాకరణ,పర్యావరణరక్షణ..(modernization,industrialization  vs.refusal by farmers ,protection of environment.) రెండు వైపుల వాదం బలంగానే వుంది.మనం చైనాలాగ  ఇంకా బాగా అభివృద్ధి చెందాలంటే   మొదటిది తప్పదంటుంది ప్రభుత్వం.ఇంకొక వర్గంవారు దానిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.నేను నిపుణిణ్ణి కాదు.అందువల్ల ఈ విషయాలు బాగా తెలిసిన వారు చర్చలో తమ అభిప్రాయాలు  తెలియ జేయ కోరుతున్నాను.  

invitation to discussion




 ఇప్పుడు మన దేశంలో తీవ్రమైన వివాదాన్ని రేకెత్తిస్తున్న అంశం;ఆధునికీకరణ,పారిశ్రామికీకరణ అందుకు వ్యతిరేకంగా రైతుల వద్ద భూసేకరణకు నిరాకరణ,పర్యావరణరక్షణ..(modernization,industrialization  vs.refusal by farmers ,protection of environment.) రెండు వైపుల వాదం బలంగానే వుంది.మనం చైనాలాగ  ఇంకా బాగా అభివృద్ధి చెందాలంటే   మొదటిది తప్పదంటుంది ప్రభుత్వం.ఇంకొక వర్గంవారు దానిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.నేను నిపుణిణ్ణి కాదు.అందువల్ల ఈ విషయాలు బాగా తెలిసిన వారు చర్చలో తమ అభిప్రాయాలు  తెలియ జేయ కోరుతున్నాను.  

16, ఏప్రిల్ 2015, గురువారం

AL BERUNI




 ఘజనీ మహమ్మద్ 17సార్లు మనదేశంపై దండెత్తి అనేక దేవాలయాల్ని ధ్వంసం చేసి ,సంపదకొల్లగొట్టి దోచుకొనిపోయినట్లే మనకు తెలుసు.కాని ,అతడు తన ఆస్థానంలో పండితుల్ని.కవుల్ని,శాస్త్రజ్ఞుల్నీ పోషించినట్లు చాలామందికి తెలియదు/.అందులో ఒకడు అల్ బెరుని. గొప్పవిద్వాంసుడు.శాస్త్రజ్ఞుడు.అతడు మన దేశంలో 13 సంవత్సరాలు నివసించి మన గ్రంథాలు సేకరించి,పండితులనుంచి సమాచారం సేకరించి ,పరిశోధనలు చేసి మనదేశం పైన ఒక పెద్దగ్రంథం వ్రాసాడు.అందులో హిందువుల ఆచారవ్యవహారాలు,దేశ  పరిస్థితులు,ఇక్కడి శాస్త్రగ్రంథాలు,మతము,పురాణాలు,పంచాంగం ఒకటేమిటి చాలా విస్తారంగా రచించాడు.కొన్ని చోట్ల విమర్శలు కూడా నిశితంగా చేసాడు.తప్పక  చదవ వలసిన పుస్తకం        INDIA by AL BERUNI.edited byDr.Edward C. Sachau ;RUPA PUBLICATIONS NEW DELHI.         

7, ఏప్రిల్ 2015, మంగళవారం

rudramadevi




  ఉద్రమదేవి సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నది కాబట్టి,వీలయితే అడవి బాపిరాజుగారు  రచించిన 'గోన గన్నారెడ్డి 'అనే నవలను చదివితే మంచిది.చాలాకాలం క్రిందటే బాపిరాజుగారు  చాలా పరిశోధించి ఈ నవల వ్రాసారు.చిన్నప్పటినుండి రుద్రమదేవిని మగపిల్లవాడిగా పెంచడం.చాలాకొద్దిమందికే ఈ విషయం తెలియడం,తర్వాత  ముమ్మడమ్మను ఆమెకు వివాహం చేయడం,మగవేషంలోనే ఆమె రాజ్యంచెయ్యడం వంటి అనేక వింత విషయాలు ఇందులో ఉన్నాయి. సినిమాను తీసినవాళ్ళు ఈనవలను చదివి ఉంటారనుకొంటాను.గోనగన్నారెడ్డి అనేకులదృష్టిలో గజదొంగ, కాని అతడు రుద్రమదేవికి యుద్ధాల్లో సహాయం చేస్తాడు.వీలయితే చదవ వలసిన నవల.