27, డిసెంబర్ 2012, గురువారం



  


  ఈనాడు (27-12-12)తెలుగుగడ్డపై 37 స.;తర్వాత తిరుపతిలో రాష్ట్రపతిచె ప్రారంభింపబడిన4వ ప్రపంచ తెలుగుమహాసభల ప్రారంభోత్సవం బాగానే జరిగిందని నా అభిప్రాయం.విమర్శలు ఎలాగూ ఉంటాయి.కొన్ని పొరబాట్లు కూడా జరిగిఉండవచ్చును.కాని మొత్తం మీద జయప్రదంగానే జరిగిందని చెప్పవచ్చును.' మా తెలుగుతల్లి ' ప్రార్థనాగీతం సుశీల, బాలసరస్వతి బాగా పాడలేకపోయారు,వృద్ధాప్యంవలన.ఎవరైనా మంచి యువ గాయనీగాయకులచే పాడించవలసింది.
  కిరణ్కుమార్ రెడ్డి గారి ప్రసంగాన్ని మామూలుగా హేళన చెస్తూఉంటారు.కాని ఆయన తెలుగు ఈమధ్య improve  అయింది.చిత్తూరు యాస ఉండవచ్చును ,కాని అందులో తప్పేమీలేదుకదా.కొంచెం తప్పులున్నా  గవర్నర్ గారు తెలుగు బాగానే మాట్లాదుతారు. 
  సభలకి good start  అనుకోవచ్చును.

18, డిసెంబర్ 2012, మంగళవారం

backwardness-2



 


  ఆర్యా,మీ గణాంకాల్ని  అంగీకరించడానికి అభ్యంతరం ఏమీ లేదు.ఉభయగోదావరి  జిల్లాలు నీటివసతివలన పంటలు అధికంగా పండుతాయని  తెలిసిందే.కాని ఇతరవిషయాలలో అంత ఎక్కువ తేడాలు లేవు. (2011 లో ప్రభుత్వ గణాంకాలప్రకారం.)ఇక్కడివాళ్ళలో enterprise తక్కువ.నేను చెప్పదలుచుకొన్నది అదే.అన్నిటికీ ప్రభుత్వాలను నిందిస్తూ కూర్చో లేము కదా.విశాఖరేవు,పరిశ్రమలు,కాకుందా ఫెర్రోఅలాయిస్ పరిశ్రమ  ఉన్నది.అణువిద్యుత్కేంద్రం తయారవుతున్నది. ఫార్మా కారిడర్ పరిశ్రమలు ఉన్నవి.వెనుకబడినతనం అనేది మన మెదడులో ఉన్నది అని చెప్పడమే నా ఉద్దేశం.ఇది తెలంగాణా వారికీ వర్తిస్తుంది .                                     

11, డిసెంబర్ 2012, మంగళవారం

కమనీయం: Backwardness

కమనీయం: Backwardnesscpbrownsevasamithi@yahoo.com

10, డిసెంబర్ 2012, సోమవారం

Backwardness




 వెనకబడిన వాళ్ళం,వెనకబడ్డ ప్రాంతం అని చెప్పుకోడం ఇప్పుడు ఒక అలవాటయింది.ఉత్తరాంధ్ర(నాది ఆ  ప్రాంతమే ఐనా )బాగా వెనకబడింది అంటుంటారు.కాని నేను అలా అనుకోను.ఈ ప్రాంతంలో  వర్షాలు బాగానే పడతాయి.ఏరులు,వాగులు చాలాఉన్నవి.పంటలు బాగానే పండు తాయి.ఇటీవల విద్యాలయాలు,ఆస్పత్రులు ,బాగావృద్ధిచెందాయి.పర్యాటక రంగం కూడా పెరుగుతున్నాది.మధ్యకోస్తా ఆంధ్రులు ఇక్కడ కొండలు,అడవులు ఉండటం చేత మీరు వెనకబడ్డారని అంటారు.అవి ఉండటం అదృష్టం,అందం.అడవులు ,కొండలు లేని పశ్చిమ గోదావరి,కృష్ణా ,గుంటూరు జిల్లాలకన్నా ఉత్తరాంధ్ర జిల్లాలు  అందంగాఉంటాయి.గణాంకాల ప్రకారం కూడా అంత పెద్ద తేడా ఏమీ లేదు.తెలంగాణా జిల్లాలు కూడా (కొంచెం తరతమ భేదాలు తప్పించి ) వెనకబడలేదని నా అభిప్రాయం.
  

7, డిసెంబర్ 2012, శుక్రవారం

GLOBALIZATION (contd.)





  ఐతే ప్రపంచీకరణ వలన నష్టాలు ,లాభాలు ఉన్నాయి.
    నష్టాలు;-1.దేశీయ పరిశ్రమలు దెబ్బతినడం.2.ఆర్థికంగా విదేశాలపైన ఆధారపడవలసి రావడం.3.విదేశ భాషాసంస్కృతుల కు లొంగిపోవడ4.ఇతరదేశాల్లో కలిగే ఆర్థిక, రాజకీయ సంక్షోభాల వలన మన ప్రయోజనాలు దెబ్బతినడం.ఇటువంటి నష్టాలు ఉన్నాయి.
 లాభాలు;- 1.మన ఎగుమతులవలన ఆర్థికలాభం.2.ఇతరదేశాల్లో ఉద్యోగాలు,వ్యాపారాలు సంపాదించడం.3.సాంకేతిక,వైజ్ఞానిక రంగాల్లో అభివృద్ధి చెందిన దేశాల సహాయసహకారాలు.4.ఇతర దేశాల్ల్లో మనం పలుకుబడి,వనరులు ,ముడిపదార్థాలు సంపాదించుకోవడం వంటి లాభాలు కూడా ఉన్నాయి .
   మనం గుర్తించవలసిన అంశం ; పూర్వం లాగా మనదేశం ఇప్పుడు బలహీనమైన,పేదదేశం కాదు.అభివృద్ధి పథంలో పయనిస్తూ బలీయమౌతున్న దేశం. మనకంపెనీలు ఇతరదేశాల్లో విస్తరిస్తున్నాయి.అక్కడ మనవాళ్ళు ఆస్తిపాస్తులు సంపాదించుకొంటున్నారు.మిలిటరీ, ఆర్థికసంపత్తిలో ,మనదేశం p.p.p. ప్రకారం 4వస్థానంలో ఉంది.అందువలన ప్రపంచీకరణ అంటే భయపడనక్కరలేదు.అందులోఉన్న మంచి ని తీసుకొని ,చెడ్డని వదిలివేయడం నేర్చుకొంటే సరిపోతుంది. 

Globalization





  ఇటీవలకాలంలో ప్రపంచీకరణ(globalization) గురించి ఎక్కువగా వినిపిస్తున్నది.తీవ్ర వాదోపవాదాలు చెలరేగుతున్నాయి.ఇప్పుడు ఎక్కువైనా పూర్వకాలమ్నుంచి ఈ ప్రక్రియ కొంత జరుగుతూనేఉన్నది.ఈ మాటకి అర్థం ఏమిటి?ఒక్క ఆర్థికవిషయాల్లోనే కాదు; రాజకీయ,సాంఘిక,భాషా సాంస్కృతిక వ్యవహారాలన్నిటి లోను దేశాల మధ్య పరస్పర ప్రభావము, ఆధిక్యము,సమ్మిశ్రమము జరగడమే.రోమన్ సామ్రాజ్యకాలంలో దాని ప్రభావం చాలా దేశాలపై పడినది.మనదెశ ప్రభావం తూర్పు,ఆగ్నేయ ఆసియా దేశాలలో బాగా కనిపిస్తుంది.16వ శతాబ్దమ్నుంచి పశ్చిమ యూరప్  సామ్రాజ్యాల విస్తరణ వలన ఆసియా,ఆఫ్రికా ,అమెరికా ఖండాలలో యూరప్ ప్రభావం వాటిపై పూర్తిగా పడింది.అంతకు ముందు ఇస్లాం ద్వారా ఆరబ్ మత,భాషా ,సంస్కృతుల ప్రభావం అట్లాంటిక్ నుంచి పసిఫిక్ మహాసముద్రం దాకా వ్యాపించింది కదా.ఆధునికవిజ్ఞానం,పరికరాలవలన యీ ప్రపంచీకరణ అతివేగంగా జరుగుతున్నది .(to be continued) .

30, నవంబర్ 2012, శుక్రవారం

S.V.B.C.CHANNEL


  
 ఈ మధ్య శ్రీవెంకటేశ్వర S.V.B.C.CHANNELప్రసారాలని వీక్షించారా?అవి ఎంత అధ్వాన్నంగా ప్రసారమవుతున్నవో గమనించారా?అందులో అంశాలగురించికాదు.అవిబాగానేఉంటున్నాయి.ప్రసారపద్ధతిగురించే నా ఫిర్యాదు.T.T.D. ఇంజనీర్లు,టెక్నీషియన్లు ఇప్పటికైనా ఈ తప్పుల్ని సరిచేస్తారని ఆశించవచ్చా? 

13, నవంబర్ 2012, మంగళవారం

Posting from android tablet

From now onwrds post fromandroid

14, అక్టోబర్ 2012, ఆదివారం

Wuthering heights-a novel.




 ఎమిలీబ్రాంటి =బ్రాంటీ సోదరీమణుల్లో రెండవది.ముగ్గురూ రచయిత్రులే.
  జననం;1818;మరణం;1848.
 ఆ రోజుల్లో ఇంగ్లాండ్ వంటి దేశాల్లో క్షయ వ్యాధి ఎక్కువగా ఉండేది.కీట్స్ ,వర్జీనియావుల్ఫ్ ఆ వ్యాధి తోనే మరణించారు.ఎమిలీ కూడా చిన్నవయసులోనే క్షయతో మరణించింది.ఆమె రచించిన ' వుదరింగ్ హైట్స్ ' అనే నవల ప్రసిద్ధమైనది.ఇతర రచనలు అంతగా లభ్యం కాలేదు.జేన్ ఆస్టిన్ నవలల తర్వాత అంత ప్రసిద్ధమైన నవలా(స్త్రీలు రచించినవి )లేదు.ఇప్పటికీ పాఠకులు ఇస్టపడేది.
 ఐతే ఈ నవలలో విశిష్టత ఏమిటి?తమ యింట్లో పెరిగిన జిప్సీ కుర్రవానికీ,  యింటి యజమాని కూతురికీ ప్రణయం ప్రధానాంశం.ఆ యజమాని కొడుకుకీ జిప్సీ కుర్రవానికీ మధ్య వైరం మరొక ముఖ్యమైన అంశం.కేథరిన్ ఎర్న్ షా (హీరోయిన్ ) హీథ్ క్లిఫ్ (జిప్సీ) ప్రేమ  సఫలం కాదు.కేథరిన్ ఇంకొకరిని వివాహం చేసుకుంటుంది.ఈ నవలలో ఎవరూ ఉన్నతమైన ,ఉదారమైన భావాలు,ప్రవర్తన కలిగి వుండరు.పగ,అసూయ,వైరం  ఎక్కువగా కనిపిస్తాయి.ఐతే తీవ్రమైన భావోద్వేగాలు,ఆవేశాలు,తీవ్రవాంచలు,(passions) ఎక్కువగా నవలలో ఆవహించి ఉంటాయి.బహుశా అవే ఈ నవలకి ఆకర్షణలు అయివుంటాయి.
  ఈ నవలని పలువిధాలుగా రివ్యూ చెసారు.విమర్శించారు.మార్క్సిస్టు దృక్పథం తో ,స్త్రీవాద దృక్పథంతో సమీక్షించారు.మనస్తత్వ పరిశీలనతో పరిశోధించారు.కాని ఏకాభిప్రాయం రాలేదు.మానవుల్లోని చీకటికోణాలని చూపించేనవల అంటారు.మీరే చదివి అభిప్రాయం ఏర్పరచుకొండి.నేను మొదటిసారి విద్యార్థి దశలో చదివాను. బాగా అర్థం కాలేదు.రెండోసారి చదివినప్పుడు అర్థం చేసుకొన్నాను,It is a dark novel. 

16, సెప్టెంబర్ 2012, ఆదివారం

Lady Doctors.--pioneers

-
 

  ఈ వ్యాసం నా వ్యాస సంపుటి ' సంధ్యారాగం 'నుంచి తీసి రాస్తున్నాను.మహిళల గూర్చి రాస్తున్న సౌమ్య గారి వంటి వారికి ఉపయోగపడ వచ్చును.
 
 '' స్త్రీలు--వైద్యవృత్తి . ''
  -------------------------
  ఈ రోజుల్లో మహిళలు వైద్య వృత్తి లో అన్ని శాఖల్లోను విరివిగా ఉన్నారు.కాని ఒకప్పుడు మాత్రం చాలా తక్కువగా ఉండేవారు.ఆ రోజుల్లో ఆడవాళ్ళు చదువుకోడమే బాగా తక్కువ కదా. అందువల్ల అటువంటి పరిస్థితుల్లో వైద్యవృత్తిలో చేరి అందరికీ,తరువాత వారికీ మార్గదర్శులైన మహిళల గురించి తెలియజేస్తాను.
 1. మిస్ హ్యూలెట్ --( Miss Hewlett )1866 మొట్ట మొదట మన దేశంలో వైద్య వృత్తి అవలంబించి మంత్రసానులకు(midwives ) కి తరిఫీదు ఇచ్చింది.
 2.ఆనందీబాయి జోషి M.D.-- అమెరికాలో వైద్యం చదివి కొల్ హాపూర్ హాస్పటల్ స్థాపించిన ప్రథమ భారతీయ మహిళ (A.D.1888 )
 3. మిస్ ఆనీ వాక్ (Miss.Anne walke L.M.& S)భొంబాయిలో మెడికల్ పట్టా పొందిన మొదటి మహిళ.
 4.మిస్ సోఫియా ఇడా స్కుడ్డర్ (Miss.Sophia Ida Scudder M.D.DSc.) భారత దేశంలో జన్మించి ,అమెరికాలో వైద్యం చదివి ,ప్రసిద్ధిపొందిన రాయవెల్లూరు హాస్పటల్ ,మెడికల్ కాలేజి స్థాపించిన ప్రఖ్యాతి పొందిన మహిళ (1918)
 5.మిసెస్.ముత్తు లక్ష్మీ రెడ్డి M.D.C.M. వైద్య రంగం లోనే గాక సాంఘికసేవ ,జాతీయ కాంగ్రెస్ ఉద్యమంలో కూడా కృషి చేసారు. మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి వైస్ ప్రెసిడెంట్ గా కొన్నాళ్ళు పని చేసారు.1954 లో  మద్రాస్ కేన్సర్ హాస్పటల్ ని స్థాపించారు.
 6.డా .కెప్టెన్ లక్ష్మి (Dr.Captain Lakshmi ) .నేతాజీ  సుభాస్ చంద్ర బోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ లో పనిచేసారు.ప్రపంచ యుద్ధం తర్వాత వైద్యవృత్తిలో ఉంటూ ,సాంఘిక రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నారు.ప్రతిపక్షాల  తరఫున ఒకసారి భారత్ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడి పోయారు.ఇటీవలనే  
మరణించారు.
 7.డాక్టర్ సుశీలా నయ్యర్.M.D. -ఢిల్లీ ఆరోగ్యమంత్రి గా (1952-1955) పనిచేసారు.కాంగ్రెస్ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు.1962లో కేంద్ర ఆరోగ్య మంత్రిగా నియమింపబడ్డారు.సేవాగ్రాం  లో కస్తూర్బా ట్రస్టు ద్వారా పలు ఆరోగ్య కార్యక్రమాలను నిర్వర్తించారు.
 8.డాక్టర్.లాజరస్ (Dr.H.M.Lazarus M.B.B.S.'M.R.C.P.'F.R.C.S.) వాల్తేరులో జన్మించి కొన్నాళ్ళు విశాఖపట్నం  K.G.హాస్పటల్ లో గైనిక్ సర్జన్ గా పనిచేసారు.మేము మెడిసిన్ చదువుతూ ఉన్నరోజుల్లో ఆవిడ పనిచేస్తూ ఉండేవారు.2వ ప్రపంచ యుద్ధ కాలంలో మిలిటరీలో పనిచేసారు.నర్సింగ్,మిడ్వైఫరీ స్కూలుని (Nursing &Midwifery school ) స్థాపించారు.
  కొద్దిమంది pioneers ఐన లేడీ డాక్టర్ల గురించి మాత్రమే వ్రాసాను.ఇటీవల కాలంలో వీరిని అనుసరించి వైద్య,ఆరోగ్య రంగాల్లో వివిధ శాఖల్లో ప్రవీణులు,ప్రఖ్యాతులైన మహిళలు చాలా మంది ఉన్నారు.
              -----------------
   

15, సెప్టెంబర్ 2012, శనివారం

Alfred Hitchcock.--contd.



 6వ దశకంలో హిచ్కాక్ శీతలయుద్ధం (cold war between America and Soviet Union) నేపథ్యంలో రెండు చిత్రాలు తీసాడు.1.టొపాజ్ Topaz.దీనికి లియాన్ యూరిస్ నవల ఆధారం.టొపాజ్ అన్నది ఒక కోడ్ నేము.మధ్యలో రచయితకి,దర్శకుడికీ వచ్చిన భేదాభిప్రాయాల వల్ల అంకున్నట్లు రాలేదు.అంతగా విజయం సాధించలేదు.క్యూబా అమెరికా పక్కనే ఉన్న చిన్న కమ్యూనిస్ట్ దేశం.అక్కడ సోవియెట్ తన క్షిపణుల్ని పెట్టడం వలన ప్రపంచయుద్ధం వస్తుందని భయపడ్డారు.చివరకు రష్యా వాటిని ఉపసంహరించుకోడం వలన ఆ సంక్షోభం తొలగిపోయింది.దీనినే cuban crisis అంటారు.2.టార్న్ కర్టెన్ torn curtain ఇది బెర్లిన్  కమ్యూనిస్ట్ పాలనలో ఉన్నప్పుడు జరిగినట్లు తీసిన కథ.రెండిటి లోను గూఢ చారి చర్యలు,ఎత్తుగడలు,క్షిపణి రహస్యాలు,(missile secrets ) ప్రధానపాత్ర వహిస్తాయి.కథ అనేక మలుపులు తిరుగుతుంది.
 తర్వాత మళ్ళీ ఆయన తనకి ఫేవరెట్ కథల వైపు మళ్ళాడు. 1.మార్నీ - ఇందులో జేంస్ బాండ్ గా ప్రసిద్ధిపొందిన షాన్ కానరీ హీరొ.  దొంగ అని తెలిసినా మార్నీ అనే అందగత్తె వ్యామోహంలో పడి,ఆమె దొంగ అని తెలిసినా    పెళ్ళి చేసుకొంటాడు.కాని frigidity వలన ఆమె కాపురం చేయలేకపోతుంది.అందుకు కారణాలు అన్వేషిస్తూ మార్ని తల్లిని కలుసుకొంటాడు. ఆమె ఒక వేశ్య.మార్ని చిన్నతనంలో ఒక విటుడు తల్లిని గట్టిగా కొడుతూఉంటే సహించలేక వాడిని కత్తితో పొడిచి చంపుతుంది.అప్పటి నుంచి ఆమెకు మగవాళ్ళమీద కోపం.అసహ్యం.చివరికి psychiatric treatment వలన బాగయి హీరోతో కాపురం చేస్తుంది.ఈ సినిమాలో మనస్తత్వ  పరిశోధన ,child trauma  వంటి విషయాలతో ఉంటుంది.
  ఫ్రెంజీ (frenzy) మళ్ళీ లండన్ కూరలమార్కెట్ (covent garden ) ప్రాంతంలో వరుస హత్యల మీద సినిమా.ఇది రీమేక్.ఇద్దరు కవలల్లో ఒకడు హంతకుడు.కాని నిర్దోషి అమాయకుడి మీద ఆరోపణలు ,పోలికలవలన,వస్తాయి.చివరకు అసలు హంతకుడు పట్టుబడతాడు.నెక్ టై హత్యలని పూర్వం నిజంగా జరిగిన ఘటనలే ఈ సినిమాకి
ఆధారం అంటారు.
  ఆయన ఆఖరి చిత్రం 1976 లో తీసాడు.కొన్ని టీ,వీ.సీరియల్స్,షోలు కూడా నిర్వహించాడు. 5దశాబ్దాలపాటు (50 సంవత్సరాలపైగా )సాగిన అల్ఫ్రెడ్ హిచ్ కాక్ సినీ జీవితాన్ని అంచనా వెయ్యడం కష్టమే.ఒక రకం (genre) సిన్మాలకి ఆయన పెట్టిందిపేరు.master of suspense అని పేరుగాంచాడు.50 చిత్రాల్ని తీసాడట.అందులో నేను చూసిన కొన్నిటి గురించే రాసాను .ఇప్పటికీ DVD  లో దొరుకుతున్నవి .
   చివరగా హిచ్ కాక్ చిత్రాల్లోని ప్రత్యేకతలు కొన్ని వివరిస్తాను.1,నవరసాల్లో భయానక,బీభత్స,అద్భుత రసాల్ని ఎక్కువగా కలిగి ఉంటాయి.2.ఉత్కంఠ suspense ప్రధానం.నేరం crime  ప్రధానాంశం.కాని ఎక్కువ రక్తపాతం ,పోరాటాలు ఉండవు.3. మంచి నవలల ఆధారంగా చాలా సినిమాలు తీసాడు.4.కథనంలో ప్రావీణ్యం ఉంటుంది.కొన్నిటిలో ప్రారంభంలోనే హంతకుడెవరొ తెలిసినా కథనంతో ఆసక్తి కలిగిస్తాడు.5.కొన్ని సినిమాల్లో ఆఖరి సీను climax అద్భుతంగా ఉంటుంది.(ఉదాహరణకు;
 స్ట్రేంజెర్స్ ఒన్ అ ట్రైన్ లో కార్నివాల్,వెర్టిగోలో చర్చ్ శిఖరం,నార్త్ బై నార్త్ వెర్త్ లో
 రష్మోర్ పర్వతం ,మాన్ హూ న్యూ టూ మచ్లో కాన్సర్ట్ హాల్ -ఈ దృశ్యాలన్నీ గొప్పగాఉంటాయి. 6.పెద్ద సెట్టింగులు,అనవసరపు సీనులు ఉండవు.7.మామూలు మనుషుల్లో దాగిఉండే దురాశ, క్రౌర్యం వెల్లడిస్తాడు.వాస్తవికతేగాని అభూతకల్పనలు ఉండవు.8.ఈయన సినిమాలు కొన్ని చాలా మలుపులతో, చిక్కుగా ఉండి జాగ్రత్తగా చూడక పోతే అర్థం కావు.
  గొప్పవాడయినా ,సామాన్యుడయినా ప్రతి మనిషి జీవితంలో ఒక ఉచ్చదశ ఉంటుంది.
   ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ జీవితంలో 1950--1960 మధ్య స్వర్ణయుగం అంటారు.అప్పుడు ఆయన తీసిన సినిమాలు క్లాసిక్స్ గా పరిగణింపబడి శాశ్వత కీర్తిని సంపాదించి పెట్టాయి.
                      (సమాప్తం)  
 
                             

ALFRED HITCHCOCK --contd.



  1954లో రెయర్విండోrear window సినిమా జేంస్ స్టీవర్ట్,గ్రేస్కెల్లీ తో తీసాడు.హీరో కాలు విరిగి మంచం పాలయి ఊసుపోకకు కిటికీ లోనుంచి చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ ని గమనిస్తూఉంటాడు.ఎదురుగా ఒక ఫ్లాట్లో భర్త భార్యని హత్యచేసి,శవాన్ని ఎక్కడో దాచినట్లు అనుమానిస్తాడు. మొదట్లో అతని ప్రియురాలు ,డిటెక్టివ్ మిత్రుడు నమ్మరు.చివరికి వాళ్ళ సాయంతో రహస్యాన్ని చేదిస్తాడు.ఇందులో గ్రేస్ కెల్లీ విలన్ ఇంట్లోకి పరిశోధించడానికి వెళ్ళగా అప్పుడే వాడు తిరిగి రావడం ,ఆమె దాక్కొని ఎలాగో తప్పించుకొనడం,  ఇదంతా నిస్సహాయంగా కిటికీ లోంచి చూస్తున్న స్టీవార్ట్  తో బాటు మనమూ చాలా సస్పెన్స్ అనుభవిస్తాము.
 the man who knew too much sinimaaలో హీరోకి ఒక వీ.ఐ.పీ. ని హత్య చెయ్యడానికి జరుగుతున్న ప్రయత్నం తెలుస్తుంది.ఆ ముఠా అతని నోరు మూయించడానికి అతని కొడుకును కిద్నాప్ చేస్తారు.ఇందులో డోరిస్ డే పాడిన కేసెరాసెరా  అనేపాట ప్రసిద్ధమైనది.చివరకు రాయల్ ఆల్బర్ట్ హాల్లో సంగీత కచేరీ జరుగుతున్నప్పుడు ముఠా జరపబోయిన హత్యాప్రయత్నాన్ని హీరో భగ్నం చేస్తాడు.ఈ సీనులో సంగీతం తారస్థాయికి చేరుతూ దానితో బాటు action,suspense పెరుగుతాయి. గొప్పగా ఉంటుంది.
  55లో to catch a thief సినిమాలో కేరీగ్రాంట్ పూర్వం పెద్ద దొంగగా ఉండినా ప్రస్తుతం మర్యాదగా జీవితం గడుపుతూ ఉంటాడు.సంపన్నుల విడిది ఫ్రెంచ్ రివేరా లో వరసగా ఆభరణాల చోరీ జరుగుతుంటాయి.పోలీసులు గ్రాంట్ని అనుమానించి నిఘా పెడతారు.తన నిర్దోషిత్వాన్నొ నిరూపించుకొనడానికి అతడు ప్రయత్నించి ఎలాగో అసలు దొంగను పట్టుకుంటాడు.ఇంతకీ అసలు దొంగ హీరో స్నేహితురాలయిన ఒక యువతే ! ఈ చిత్రానికి అకాడమీ అవార్డు లభించింది.
  58లో వెర్టిగో vertigo అనే చిత్రం  ఒక నవల ఆధారంగా తీసారు.జేంస్ స్టీవార్ట్ రిటైర్డ్ పోలీసు ఆఫీసర్.అతనికి ఎత్తయిన స్థలాలంటే భయం.acrophobia అంటారు. అందువలన ఒక హత్యను సరిగా శోధించలేక పోతాడు.చర్చి శిఖరం నుంచి పడిపోయి మరణించింది అనుకొన్న స్త్రీ మరలా కనిపిస్తే ,ఆమె వెంటబడి రహస్యాన్ని కనుగొంటాడు.జరిగిందేమంటే భర్త భార్యను చంపి చర్చి పై నుంచి తోసివేసి ఆమె లాగే ఉన్న మరొక స్త్రీ చంపోయినట్లు డిటెక్టివ్ ని నమ్మిస్తాడు.ఇటీవల అమెరికాలో ప్రేక్షకుల సర్వేలో దీనిని అత్యుత్తమ చిత్రం గా ఎన్నుకున్నారు.
 1959లో  North by North west వచ్చింది.ఇందులో మళ్ళీ కేరీ గ్రాంట్ హీరో.తనను చంపబోయే విలన్ల నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నాలతోనే కథ నడుస్తుంది.శత్రువు హెలికాప్టర్ తో దాడి చేసినప్పుడు గోధుమపొలాల్లో  దూరి తప్పించుకొనేసీను,చివర్లో మౌంట్  రష్మోర్ మీద తీసిన దృశ్యాలు ఉత్కంఠభరితంగా ఉంటాయి.(mount Rushmore మీది giant size నలుగురు అమెరికన్ ప్రెసిడెంట్ల ముఖాల  చెక్కడాలపైన ఈ దృశ్యం చిత్రీకరించారు.
   1960 లో సైకో  (psycho) చిత్రం తీసాడు.ఇది ఒక కల్ట్ సినిమా అని చెప్పవచ్చును.ఒక నవల ఆధారంగా తీసింది.మోటల్ షవర్లో జరిగిన హత్య ,తల్లి శవం (mummy) తో సైకో సంభాషణ ,చివరి సీను అన్నీ అప్పట్లో కొత్త.జలదరింపు కలిగిస్తాయి.తర్వాత సైకో ని అనుకరిస్తూ చిత్రాలు ఎన్ని వచ్చినా ఇదే అన్నిట్లోకి ఉత్తమమైనదిగా పేరు పొందింది.(psychic killers are common in America.Now they are increasing in India also )ఈ చిత్రాన్ని నేను రెండు సార్లు చూసాను.
   తర్వాత బిర్డ్స్ (BIRDS ) అని ఒకనవల ఆధారంగా తీసాడు.ఇందులో వేలకొద్దీ పక్షులు మనుషుల మీద దాడి చేస్తుంటాయి.నాకు అంతగా నచ్చలేదు.
  (మిగతా మరొక సారి.)
 

13, సెప్టెంబర్ 2012, గురువారం

Alfred Hitchcock



 ఆల్ఫ్రెడ్  హిచ్కాక్  గురించి కొంత సమాచారం వికీపీడియా లో లభ్యమౌతుంది.కాని స్వయంగా ఆయన సినిమాలు చూసిన అనుభూతి వేరు.జ్ఞాపకమున్నంతవరకు నేను చూసిన చిత్రాల గురించి రాస్తాను.కొన్ని టీ.వీ.పుణ్యమా అని మళ్ళీ చూసాను.ఆ రోజుల్లో సెసిల్.బి.డీమిల్లి అనే ఆయన భారీ సెట్టింగులతో పౌరాణిక ,చారిత్రక సినిమాలు తీసాడు.వాల్ట్ డిస్నీ కార్టూన్ సినిమాలు తీసే వాడు.హిచ్కాక్ ప్రత్యేకత ఉత్కంట,నేరము (suspense,crime ) ప్రధానమైనవి.అలాగని పోరాటాలు,రక్తపాతం ఉండవు.కొన్ని సినిమాల్లో హంతకుడెవరో ముందే తెలుస్తుంది.కాని,సస్పెన్స్ తో కథ నడిపిస్తాడు.ఆయన ప్రకారం కథా,స్క్రీన్ ప్లే పూర్తిగా సిద్ధమైతే సినిమా  దాదాపు పూర్తి అయినట్లే.అతడు పనిచేసినకాలం,తన మాటల్లోనే మూకీ సినిమాలనుండి తెలుపు-నలుపు టాకీలు,రంగుల సినిమాలు,సినిమాస్కోపు,3 Dలు ,టెలివిజన్ సీరియల్స్ వరకు చురుకుగా సాగింది.ఆయన సినిమాలు చాలా వరకు ప్రసిద్ధ నవలలు,లేక యదార్థ సంఘటనలని ఆధారంగా తీసినవే.ఇంగ్లాండ్లో మొదట్లో సినిమాలు తీసి పేరు గడించాడు.అవి 1.MAN WHO KNEW TOO MUCH 2.39 STEPS.3.THE LADY VANISHES.కాని వీటిని నేను చూడలేదు.
  తర్వాత అంతర్జాతీయ సినిమా కెంద్రమైన హాలీవుడ్ కి వెళ్ళి 1939 లో డాఫ్నె ద్యు మారియర్ ప్రసిద్ధనవల రెబెకా ని తెరకెక్కించాడు.దీనికి అకాడమీ అవార్డు కూడా వచ్చింది.ఇందులో ఉత్కంఠ ఉంటుంది కాని క్రైం ఉండదు.పెద్ద భవనంలో ఒంటరిగా ఉన్న యువతి అనుభవాలతో గొప్పగా ఉంటుంది.తర్వాత shadow of doubt తీసాడు.ఆయన్ని అడిగితే అదే తన ఫేవరెట్ సినిమా అన్నాడట.కాని నేను చూడలేదు.తర్వాత suspicion  అన్న సినిమాలో భార్యను హత్య చెయ్యడానికి ప్రయత్నించే భర్తగా ప్రసిద్ధుడైన హీరో కారీ గ్రాంట్ చేత అతని ఇమేజ్ కి విరుద్ధంగా వేయించాడు.విజయం సాధించాడు.అప్పటినుండి (1945)1960 దాకా ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ ఎన్నో సినిమాలు తీసాడు.master of suspense గా పేరు మారు మోగి పోయింది.
 1945లో స్పెల్బౌండ్ ( spellbound) చిత్రం మనస్తత్వ పరిశోధన,మతిమరుపు (amnesia) మీద తీసాడు.గ్రిగరీపెక్,ఇంగ్రిద్ బెర్గ్మన్ నటించారు.మొదటిసారి అర్థం కాలేదు. మళ్ళీ చూసినప్పుడు తెలిసింది.ఇందులో ప్రసిద్ధచిత్రకారుడు కంపోజ్ చేసిన స్వప్నదృశ్యం ఒక ప్రత్యేకత.నొటొరియస్( notorious )లో మళ్ళీ ఆ హీరో హీరోయిన్లతోనే 2వ ప్రపంచయుద్ధ నేపథ్యంలో గూఢ చర్యల గురించి తీసినది.
  రోప్ (rope) ఇందులో ఒక హాల్ లోనే కథ అంతా జరుగుతుంది.ఇద్దరు స్నేహితులు మూడవ వాణ్ణి చంపి ఒక పెద్ద భోషాణంలో శవాన్ని దాచేస్తారు.చాలమంది అతిథులు వస్తూపోతూ ఉంటారు .చివరికి డిటెక్టివ్ జేంస్ స్టీవార్ట్ రహస్యం కనిపెడతాడు.
   
   strangers on a train ;దీనిగురించి గతసారి వివరంగా రాసాను.క్లైమాక్స్ సీను చాలా బాగుంటుంది.
 Dial M for murder  భర్త తనమీద అనుమానం రాకుండా భార్యను కిరాయి హంతకునితో చంపించడానికి ప్లాను నడిపిస్తాడు.కాని అది బెడిసి కొట్టి తిరిగి అతని దోషం బయలుపడుతుంది.కిరాయిహంతకుడితో  ఆత్మరక్షణకోసం చెసిన పోరాటంలో భార్య వాడినే చంపివేస్తుంది.అంతా సస్పెన్స్ తో నడుస్తుంది.ఇది ఒక నాటకం ఆధారంగా తీసినది.తెలుగులో ప్రఖ్య శ్రీ రామ్మూర్తి గారు నాటకం గా అనువదించేరు.
   (మిగతా మరొక సారి.)

3, సెప్టెంబర్ 2012, సోమవారం


birthdays


 

 మా చిన్నప్పుడు 10,12 ఏళ్ళ దాకా మాత్రమే పుట్టిన రోజులు జరిపేవారు.పొద్దుటే తలంటిస్నానం తప్పదు.కొత్తబట్టలిచ్చి కట్టుకోమనేవారు.పూజచేసి దీవించవాళ్ళు.ఏదో ఒక పిండివంటతో భోజనం పెట్టేవారు.అంతా ఇంటిలోనే జరిగిది.ఎవరినీ పిలవడం అదీ ఉండేదికాదు.పెద్దయాక ,పుట్టినరోజు జరుపుకొనేవాళ్ళుకాదు.
  కాలక్రమాన అనేకమార్పులు వచ్చాయి.గ్రీటింగ్స్ పంపడం.పదిమందినీ పిలిచి పార్టీ ఇవ్వడం .బహుమతులు,కేక్ కట్చెయ్యడం ఇవన్నీ వచ్చాయి.ఇంకా సంపన్నులైతే ,ఏ 5 స్టార్ హొటల్ లో నో రిసెప్షన్ .పాటలు,డాన్సులు ,ఖరెదైన విందు,gifts ఇలా ఘనంగా చేస్తున్నారు.సరే,ఎవరి ఇష్టంప్రకారం,తాహతు బట్టి వాళ్ళు చేసుకొవచ్చును.ఆ హక్కు,స్వేచ్చ వారికి ఉన్నాయి.
  కాని ఒక్క సంగతి.గరికపాటి అవధాని గారు చెప్పినట్లు కొవ్వొత్తులు వెలిగించి ,ఉఫ్ మని ఆర్పేయడం మంచిదికాదు.అశుభం.దాని బదులు జ్యోతి ( లు ) వెలిగించి ఆర్పకుండా ఉంచడం  సంప్రదాయకంగ,శుభకరంగా ఉంటుంది.మిగతా కార్యక్రమాలన్నీ,వారి ఇష్టప్రకారం. జరుపుకోవచ్చును.  

27, ఆగస్టు 2012, సోమవారం

My house.

While writing about environment,I mentioned about  the compound of my house.Some friends asked me to attach photos to illustrate.so,I have attached 3 photos of the same.

26, ఆగస్టు 2012, ఆదివారం

my house compound




20, ఆగస్టు 2012, సోమవారం

Environment stories



 కన్నడభాషలో 'పరిసరదె కతగళు 'అనే పుస్తకాన్ని శ్రీ శాఖమూరు రామగోపాల్ గారు 'పర్యావరణ కథలు ',అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేసారు.కు.వెం.పు.(ప్రసిద్ధరచయిత,ప్రొఫెసర్,జ్ఞానపీఠ అవార్డ్ గ్రహీత ) గారి  కుమారుడు పూర్ణ చంద్రతేజస్వి కన్నడంలో  రాసినవి.ఆయన స్వచ్చందంగా ,నగరాలకు దూరంగా పడమటి కనుమల దట్టమైన  అడవుల్లో,శృంగేరికి దగ్గరలో పొలంకొని వ్యవసాయం చేస్తూ అక్కడే ఉండిపోయారు.అక్కడ తన అనుభవాలను,యదార్థ సంఘటనలనే చిన్న కథలుగామలచి రచించారు.ఆ ప్రాంతపు వాతావరణం,అడవులు,వన్యప్రాణులు,పల్లెప్రజలు,వాళ్ళ అలవాట్లు, నమ్మకాలు,చెట్టుచేమలు,జీవజాలం (flora and fauna )సమస్తం మనం  తెలుసుకోవచ్చు.ఇందులో ఆయన నవ్వుపుట్టించే ( misadventures ) ఘటనలు కూడా ఉన్నాయి.క్రమంగా అంతరిస్తున్న వన్యప్రాణులు,తరిగిపోతున్న అటవీ సంపద ,మాసిపోతున్న పాత వృత్తులు,కులాలు,జీవన శైలులు గురించి రచయిత ఆవేదన  స్పష్టమౌతుంది. వ్యవసాయదారుల పరిస్థితిని తెలిపే ఈ వాక్యాలు చూడండి. '' మైసూరు నుంచి  వ్యవస్థను చావనీకుండా  వ్యవసాయవృత్తిని చేపట్టిన నాకు అతను వ్యవసాయాన్ని బాల్ బాయ్ ఉద్యోగంకన్న తక్కువ స్థాయిలో ఉంటుంది అని చెప్పడం సహించలేదు నామనస్సుకు.అయితే నా ముందు జీవితం దిగులయ్యేట్లుగా ,అతను భవ్యభారతదేశంలో అందరిచే తిరస్కరించబడిన రైతువర్గం లోని దారుణ స్థితిగతుల సత్యమ్ను తెలుపుతున్నోడి లాగ నాకు అంపించింది. ''
 రామగొపాల్ గారు రాయచూరు జిల్లాలో కొన్నాళ్ళు వ్యవసాయం చేయడంవలన,కన్నడభాష,దాని నుడికారం తెలుసుకొనడం వలన తేజస్విగారి యీ కన్నడ పుస్తకాన్ని చక్కగా అనువదించగలిగారు.వన్యప్రాణి ప్రేమికులూ,అడవులు,పర్యవరణ ప్రియులూ తప్పక చదవవలసిన కథలపుస్తకం ఇది.దీనిని తెలుగువారికి అందించిన శ్రీ శాఖమూరు రామగొపాల్ గారిని అభినందిస్తున్నాను.

15, ఆగస్టు 2012, బుధవారం

INDEPENDENT INDIA-a summary



 అందరికీ స్వాతంత్ర్య దినశుభాకాంక్షలు.
  60 ఏళ్ళ నుంచి ,బ్రిటిష్ పరిపాలనాకాలం నుంచి చూస్తున్నానుకాబట్టి,ప్రజలు,ప్రభుత్వం సాధించిన అభివృద్ధి,విజయాలు,పొందిన అపజయాలు ,ఇంకా సాధించవలసినవి ,ఏపార్టీ కోణం లోనుగాక,సామాన్యపౌరుడిగా రాస్తున్నాను.
 1,1947-1960 'నెహ్రూగారి హయాం.కులమతభేదంలేని రాజ్యాంగం అమలులొకితేవడం.పంచాయతీరజ్ అమలు.హిందుకోడ్ సవరణ ,స్త్రీలకు హక్కులుకల్పించదం,స్వేచ్చాయుత ప్రజాస్వామికం,ఎన్నికలు,; ప్రైమరీ ఆరోగ్యకేంద్రాలు,I.I.T.,A.I.I.M.S.వంటి విద్యాసంస్థలస్థాపన,ప్రభుత్వరంగంలో చాలా భారీ పరుశ్రమల స్థాపన,ముందుచూపుతో అణు పరిశోధన,అంతరిక్షపరిశోధనా కేంద్రాల ఏర్పాటు.భారీ ఇరిగేషన్ ప్రాజెక్టుల స్థాపన.
  అపజయాలు తీవ్ర విమర్శలు; శాంతికాముకత్వంతో రక్షణావసరాలు అశ్రద్ధచేయడం.చైనాతో యుద్ధంలో ఓటమి.కాశ్మీర్ ని సంపూర్ణంగా విలీనం చేయకపోవడం. లైసెన్స్- పర్మిట్రాజ్యంగా మారడం.
  2.1960-1980 ఈకాలంలో ఆర్థికాభివృద్ధి మందగించింది.నెహ్రూ,లాల్బహదూర్శాస్త్రిల మరణం.సిండికేట్తో ఇందిరాగాంధి తగవు.ఎమర్జెన్సీ విధింపు.నక్సలిజం,ఖలీస్తాన్ ఉద్యమాలతో హింస, కరువుకాటకాలు. అశాంతి.
  పాజిటివ్గా ; పాకిస్తాన్ని ఓడించి బంగ్లాదేశ్ని  విడగొట్టడం. ఆటంబాంబుని పేల్చడం ,సైనికంగా దేశం బలపడటం.ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణచివేయడం.హరితవిప్లవాన్నిసాధించి (greenrevolution)కరువుకాటకాలనుంచి బయటపడటం.
 1980-1990 ;అబివృద్ధికి మొదటవేసిన బీజాలు క్రమంగాఫలించడం.communication  revolution ,టీ.వీ. టెలిఫోన్ల విస్తరణ ,పట్టణీకరణ ప్రారంభం.
 1990-2000;నరసిమ్హారావుగారి ఆర్థికసంస్కరణలు సరళీకరణ ( liberalization) వలన ఆర్థికపెరుగుదలరేటు ఎక్కువై సత్వర పారిశ్రామికీకరణ జరగడం.రోడ్లు,నౌకా విమానాశ్రయాల అభివృద్ధి .తర్వాత వచ్చిన వాజ్పాయిగారి ప్రభుత్వంలో కూడా ఈ అభివృద్ధిరేటు 8-9 % కొనసాగింది.
 2000 నుంచి-అభివృద్ధికొనసాగినా పేదరికం ఇంకా అధికంగానే ఉంది.రాష్ట్రాలలో వ్యత్యాసం ఉంది.దేశంలో సంపద,ఆదాయాలుపెర్గి వాటితోబాటు  భూమి,అస్తులు,వస్తువుల ధరలూ బాగా పెరిగాయి.ఇటీవల పలుప్రపంచదేశాల్లో మాంద్యంవలన ఆ ప్రభావం మనమీద కూడా పడింది.H.D.I.(HUMAN DEVELOPMENTINDEX )లో ఇంకా వెనకబదేఉన్నాము.
 2020నాతికైనా మనం ఈ కిందివి సాధిస్తే 'అభివృద్ధి చెందుతున్న దేశం'గాకాక '  'అభివృద్ధి చెందినదేశంగా ' పేరుపడతాము.
 1.ప్రతి గ్రామానికి,పేటకు,రోడ్డు,మంచినీరు,విద్యుత్ సప్లై ఇవ్వాలి.2.శిశు మరణాలుబాగా తగ్గించాలి.3.సగటు ఆయుర్దాయం కనీసం70సం.కి పెరగాలి.4. .అక్షరాస్యత కనీసం 90శాతానికి పెరగాలి. 5.ఆహారభద్రత,విద్య,వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి.6.infrastructure రోడ్లు,విద్యుత్ మొ;ప్రపంచప్రమాణాలతో సరితూగేలా అభివృద్ధి సాధించాలి.7.వ్యవసాయం,నీట్పారుదలప్రాజెఖ్తులపై ఎక్కువశ్రద్ధ చూపించాలి.
  అందువలన మనం నిరాశ చెందనక్కర లేదు. కలిసికట్టుగా,తెలివిగా ప్రభుత్వమూ,ప్రజలూ పనిచెస్తే ,మరొక 20లేక 30 సం;;లలో అగ్రరాజ్యాలలోమనదేశం స్థానం సంపాదించుకొంటుంది అని ధైర్యంగా చెప్పవచ్చును.
                జై హింద్.
                           

12, ఆగస్టు 2012, ఆదివారం

mullapoodi-2volume




 ఈ మధ్య ముళ్ళపూడి వెంకట్రమణగారు రాసిన కోతికొమ్మచ్చి2వభాగం చదవడం తటస్థించింది.ఇంకా కొందరు చదివే వుంటారు.మొదటి భాగంలో ఆయన చిన్నతనపువిశేషాలు,పేదరికం,పత్రికల్లో ఉద్యోగం.ఫ్రీలాన్స్ జర్నలిజం ,సినిమాల్లో కథలు,దైలాగులరచన గురించిఉన్నాయి.రెండోభాగంలో సినిమాల్లో కథ,స్క్రిప్టు రాయడం ,జ్యోతి పత్రికలో ఉద్యోగం- వీటితో విసిగి బాపూగారితో కలిసి నిర్మాతగామారి సాక్షిచిత్రంతో మొదలుపెట్టి సంపూర్ణరామాయణం వరకు స్వంత సినిమాలు తీసి లాభనష్టాలు,నిందలు,ప్రశంసలు పొందడం -ఇవన్నీఉన్నాయి. ఐతే ఒక కాలక్రమంలేకుండా ,ముందువి వెనక,వెనకవి ముందు రాస్తూ  జంప్ చేయడంవలన కోతికొమ్మచ్చి అనేపేరు పెట్టారు.దీనినిండా,సినిమావాళ్ళ కబుర్లూ,జోకులూ ముళ్ళపూడివారి,ఆయన టిపికల్ శైలి లో ఉంటాయి.స్వయంగా చదువుతేనే  enjoy చెయ్యగలం.మచ్చుకు -క్రూ 'రంగారావు ' ,చంద్రబాబునాయుడుగారిలాగ,' ముందుకు పోతాం ' మాలతీచందూర్గారిలాగ ' ముందే తరిగి వుంచుకున్న కూరముక్కలులాగ ' వంటి ప్రయోగాలు కొల్లలు.హాస్యబ్రహ్మ ముళ్ళపూడివారి కోతికొమ్మచ్చిని తప్పకచదవమని నా సలహా. 

8, ఆగస్టు 2012, బుధవారం

our house



 మాది 8గదుల పెద్ద ఇల్లు.కంపౌండ్లో ఫలపుష్ప జాతుల చెట్లు,మొక్కలు కూడాఉన్నాయి.ఇది ఎందుకు  రాస్తున్నానంటే,ఇంత పెద్దవికాకపోయినా ,ఈ వూళ్ళోను,మనకోస్తాజిల్లాల పట్టణాల్లో చాలా ఇళ్ళకి ముందు జాగాలేకపోయినా పెరళ్ళు ,అందులో  చిన్న తోటలు ఉంటాయి.కాని,ఇప్పుడు అలాంటి ఇళ్ళు,క్రమంగా అదృశ్యం అవుతున్నవి.అపార్ట్ మెంట్ కల్చర్ ఎక్కువవుతున్నది.దీన్ని ఆపలేము ఏమో.అటువంటి సమయంలో కనీసం రోడ్లపక్కన చెట్ల పెంపకం ,ప్రతీపేటలోను కాలనీలోను పార్కులు  ఏర్పాటు చేసి పచ్చదనాన్ని పెంపొందించాలి.

4, ఆగస్టు 2012, శనివారం

DR.PINAAKAPAANI



 డా.శ్రీపాద పినాకపాణిగారి గురించి ,ఆయన శతవత్సర వేడుకల గురించి పత్రికల్లో చదివిఉంటారు.100 ఏళ్ళు జీవించినవారు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చును.ఆయన గత కొన్ని సం.నుండి మంచంపట్టినా స్పృహలోనే ఉండి మాట్లాడుతున్నారట.
  మేము 1950-1955 మధ్య వైజాగ్ ఆంధ్ర మెడికల్ కాలేజిలో  చదువుతున్నప్పుడు మెడికల్ ప్రొఫెసర్గా ఉండే వారు.అప్పటి పద్ధతి ప్రకారం ఫుల్సూట్లో వచ్చేవారు.అప్పటికే బట్టతల బాగా ఉండేది.'తరనన 'అంటూ మెల్లిగా పాడుకుంటూ ,తల ఊపుతూ,రౌండ్స్ చేస్తుంటే మేము నవ్వుకొనేవాళ్ళం.అలాగని ఆయన తన డ్యూటీని,టీచింగుని అశ్రద్ధ చేసేవారుకాదు.తర్వాత కర్నూలు మెడికల్ కాలేజికి ప్రొఫెసర్ ప్రిన్సిపల్గా బదిలీఅయి అక్కడే రెటైరయి సెటిలయ్యారు.నేదునూరి,నూకల,శ్రీరంగం వంటి మహామహులు ఆయన శిష్యులు.
  పద్మభూషణ్ పినాకపాణీ గారి సంగీతజీవితం గురించి రాసే తాహతు నాకు లేదు.ఆయన గొప్ప theoritician .చాలా మార్గదర్శకమైన సంగీత గ్రంథాలు రచించినట్లు  తెలుసును.కాని ,ఆయన కంఠస్వరం,కచెరీ అంత ప్రజారంజకం గా  ఉండేవికావు.
  ఆయన మెడికల్ప్రాక్టీసు ద్వారా గొప్పగా సంపాదించినట్లులేదు.అప్పట్లో మా ప్రొఫెసర్లు చాలామంది అలాగే ఉండేవారు.ప్రాక్టీసుకన్నా టీచింగు మీద ఎక్కువ ఆసక్తి చూపేవారు.కాని strict గాను ,కోపిష్టులుగాను ఉండేవారు.

12, జులై 2012, గురువారం

GEORGE BERNARD SHAW




 G.B.SHAW లేక జార్జ్ బెర్నార్డ్ షా ఇప్పుడెందరికి గుర్తున్నాడో తెలియదు కాని 20 వ శతాబ్దపు ప్రథమార్థ భాగంలో షేక్స్పియర్ తర్వాత అంత గొప్ప నాటక కర్తగా పేరొందాడు.ఐరిష్ జాతీయుడు.చిన్నతనంలోనే తల్లీ తండ్రీ వేరైపోయారు.ఎక్కువ  చదువుకోలేదు.స్కూలంటే ద్వేషం.తర్వాత ఒక గుమాస్తా పని చేసాడు కాని ఆ ఉద్యోగమన్నా ద్వేషమే.తరవాత జర్నలిస్ట్ గా పనిచేస్తూ రచనలు ప్రారంభించాడు.పెట్టుబడి దారీ వ్యవస్థ అంటే పడదు.సిడ్నీ ,బియాట్రిస్ ,వెబ్ అనే దంపతులతో కలిసి ఫేబియన్ సొసైటీ అనే సోషలిస్ట్ సంస్థ స్థాపించాడు. సహజంగా తెలివయిన వాడు కాబట్టి మంచి నాటకాలను రచించి,నాటక శాలలలో ప్రదర్శింప జేసే వాడు.క్రమంగా మంచిపేరు ,ధనమూ కూడా సంపాదించాడు.1925 లో ఆతనికి  నోబెల్ బహుమతి లభించింది.
  Ideology  లో షా సోషలిజానికి సానుభూతిపరుడు.ధనస్వామ్యానికి ,యుద్ధాలకీ  వ్యతిరేకి.ఐతే తీవ్రవాదాన్ని,హింసామార్గాన్ని వ్యతిరేకించాడు.
 బెర్నార్డ్ షా నాటకాల్లో ప్రసిద్ధమైన వాటిలో కొన్ని ఇస్తున్నాను.-
  1.Saint Joan 2.Androcles and the lion 3.Major Barbara 4.The devil's disciple 5.Candida 6.Arms and the man 7.Mrs.Warren's profession 8.Ceasar and Cleopatra 9.Back to Methusela 10.Pygmalion .ఈయన నాటకాలు చాలా రంగస్థలం మీదే కాక సినిమాలుగాను,టీ.వీ. షోలుగాను నిర్మించారు.పిగ్మాలియన్ హాలీవుడ్లో My fair lady @ అనే మ్యూజికల్ చిత్రంగా ప్రసిద్ధి పొందింది.మన భారతీయభాషా చిత్రాల్లో కూడా అనేక అవతారాలు ఎత్తింది.
  బెర్నర్డ్ షా జననం ;1856-మరణం; 1950 .94 సం.జీవించాడు.
 షా హాస్యప్రియుడు, చతుర భాషి.ఆయన  quotes , witticisms  చాలా ఉన్నాయి.మచ్చుకి ఒక్కటి మాత్రం ఉదహరిస్తాను.
  ఒక పార్టీలో సిన్మా నటి ఒకామె షాతో అందట ' మీరు నేను పెళ్ళి చేసుకుంటే   నా అందమూ,మీ తెలివితేటలూ ఉన్న పిల్లలు పుట్తారు కదా ' అని.(షా అందగాడు కాదు ) దానికి షా జవాబు; 'కాని ఒకవేళ నా అందమూ ,మీ తెలివి తేటలూ ఉన్న పిల్లలు పుట్టుతారేమో '        

11, జులై 2012, బుధవారం

film music




 భారతీయ  సినిమాలకి సంగీతం ముఖ్యపాత్ర వహిస్తుంది అన్న సంగతి తెలిసినదే.ఐతే ఏది మంచి పాట అంటే భిన్నాభిప్రాయాలు ఉండవచ్చును.స్వర రాగ తాళ లయబద్ధమై శ్రావ్యమైన కంఠం తో గానం చేసిందే ఉత్తమ సంగీతం అంటారు.మన అభిరుచులు దాదాపు 12నుంచి పాతిక ( 25) ఏళ్ళ మధ్య స్థిరపడి పోతాయని అభిజ్ఞులు అంటారు.అందువలన ఆ వయసులో మనకు రుచించిన పాటలనే మనం మంచివనుకొంటాము.కాని విమర్శకులు చెప్పేదేమిటంటే వ్యక్తిగత అభిరుచులు మారినా ,ప్రతీ కళకీ కొన్ని ప్రామాణికాలు ఉంటాయని వాటిని బట్టే మనం నిర్దేశించాలని.వారి ప్రకారం నిష్పక్ష పాతంగా ,judge చేస్తే 1950=1970 మధ్యలో వచ్చిన సినిమా సంగీతమే అత్యుత్తమమైనదని,తెలుగు,హిందీ చిత్రసీమలు రెండిటిలోను ఆ యుగం period సంగీతానికి స్వర్ణయుగం అనవచ్చును .   

6, జులై 2012, శుక్రవారం

padyarachana

.


 ఈమధ్య అంతర్జాల సమస్య వలన రెండు శ్రీశంకరయ్యగారు ఇచ్చిన పద్యరచనలు చేసి కూడా నెట్లో ఉంచలేక పోయాను .వాటిని దిగువ రాస్తున్నాను.
  1.పద్యరచన35-28-6-12 ద్రౌపది వస్త్రాపహరణం చిత్రపటం గురించి-
      ఉచితానుచితముల నుపేక్షించి ధర్మజుడు
         స్వీయభార్యనె యొడ్డె సిగ్గుమాలి
      నిండు సభాస్థలి నెదుట జూచుచు నూర
          కుండిరి భీష్మాది కురుగురువులు
      దుష్టాత్ముడగు నీచ దుశ్శాసనుడు సాధ్వి
          వస్త్రమ్ము నపహరింపంగ జూసె
       ధర్మబద్ధత పాండుతనయులు వారింప
          కసహాయులట్టుల కదలకుండ్రి
            కృష్ణ భగవానుడే కాచె కృష్ణ నపుడు
            మహిళ స్థానమ్ము భరతసమాజమందు
            పురుషుల యహంకారమ్ము ,పరుషసరళి
            తెలుపు నీపటమ్మును జూడ గలుగు రోత .

    2 పద్యరచన 36
          ముసలి బిచ్చగాని ఫొతో ని చూసి  రాసినది.
        ''ఆరిపోయిన కుంపటీ'  యట్లు జవము
          సత్త్వములను గోల్పడి వృద్దజనుడొకండు
          వీధిలో బిచ్చమెత్తుచు వేచియుండె
          దానపరులెవరైన నుదారబుద్ధి
          ఆకలిని దీర్ప ధనమిత్తు రనుచు దలచి.
   
          అరువదేండ్ల స్వరాజ్యమ్ము నందు నేడు
           సైతమిట్టి స్థితిని గాంచ సిగ్గుచేటు
          సకలజనుల  శ్రేయో రాజ్య సాధనమ్ము
           ఇంక యెన్నాళ్ళు పట్టునో యేమొ కాని.
    మొదటి పద్యం మొదటి పాదం శ్రీ శ్రీ కి కృతజ్ఞతలతో
 
           
                          
   

26, జూన్ 2012, మంగళవారం

Rio-20 conference.



 ఈ మధ్య రియోడీజనీరో నగరంలో జరిగిన జీ-20 దేశాల శిఖరసమావేశం పెద్దగా ఏమీ సాధించకుండానే ముగిసింది.అందుకు కారణం అభివృద్ధి చెందిన అమెరికా,బ్రిటన్ ,వంటి అగ్రరాజ్యాలు ఆసక్తి చూపక పోవడమే.స్థూలంగా చెప్పాలంటే ; ఆ రాజ్యాలు బాగా  పారిశ్రామికీకరణం చేసుకొని,తమ బలం ,సంపదల వలన ప్రపంచంలో వనరులను వశపరచుకొన్నాయి.వాతావరణ కాలుష్యం,ఉద్గారాలు (toxic emissions ) ఆదేశాలే ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి.అవి తగ్గించుకోవడం  వాటికి ఇష్టం లేదు.కాని భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలను మాత్రం మీరు పరిశ్రమల కాలుష్యం,ఉద్గారాల్ని బాగా తగ్గించుకోమని సలహా ఇస్తాయి.అప్పటికీ మన ప్రధానమంత్రి గత దశాబ్దంలో ఈ దశగా తీసుకొన్న చర్యలను వివరించారు.మనము,చైనా, ఎక్కువగా తినడం వలన ఆహారపదార్థాల కొరత,వాటి ధరల పెరుగుదల కలుగుతున్నాయంటారు. అలాగే మన పరిశ్రమల పెరుగుదల వలన ప్రపంచం వేడెక్కుతున్నదని ,కాలుష్యం పెరుగుతున్నదని  వారి వాదన.కాని వాళ్ళ ప్రధాన బాధ్యత,భాగం పట్టించుకోరు.ఈ కారణాల వలన ఆ సమావేశం సఫలం కాలేదు.  

19, జూన్ 2012, మంగళవారం

INTACH.SEMINAR ON KALINGASEEMA




 17,18 జూన్ 2012న స్థానిక గాయత్రి కళాశాలలో  ,అధికారుల,దాతల సహాయంతో I.N.T.A.C.H.ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ హెరిటేజ్ తరఫున ఉత్తరాంధ్ర  సాంస్కృత ,వారసత్వ ,చారిత్రక సదస్సు జయప్రదంగా జరిగింది.రాష్ట్రం లోని వివిధ నగరాలనుంచి,ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన పరిశోధకులు,చరిత్ర ప్రొఫెసర్లు,పురావస్తు వేత్తలు(archeologists)ఉత్తరాంధ్ర ,కళింగ సీమ పై ముఖ్యంగా శ్రీ కాకుళం జిల్లాపై కేంద్రీకరించి వివిధ అంశాలపై పరిశోధనా పత్రాలు చదివి చర్చించారు.ఈ సదస్సును నిర్వహించిన వారినందరినీ అభినందిస్తూనే ,ఒక విషయం వ్రాయదలచుకొన్నాను.కార్యక్రమవివరాలు చివర దాకా ప్రజలకు తెలియజేయలేదు.సదస్సు గురించి పత్రికలు,టీ.వీ.లో ఏ ప్రచారమూ ముందుగా జరగలేదు.పేపర్లు,ఉపన్యాసకార్యక్రమాలు ఇంగ్లిష్ బదులు తెలుగులో జరిపించివుంటే  బాగుండేది. 

8, జూన్ 2012, శుక్రవారం

remakes



 ఈ మధ్య గుండమ్మకథ సినిమా రెమేక్ గురించి ఆలోచిస్తున్నారు.తెలుగులోనేకాక ,హిందీ,ఇంగ్లిష్ లో కూడా రెమేక్స్ వచ్చాయి.గతంలో ఆర్థికంగా బాగా విజయవంతమైనవి,లేక కళాత్మకమైనవని పేరు తెచ్చుకొన్నవి ఐన చిత్రాలను రీమేక్  చెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.ఇందులో అనుకూలతలు 1.కథ,సంఘటనలు కొత్తగా వెతుక్కో నక్కర లేదు.beaten track .ఇంతకు ముందు విజయ వంతమైంది , లేక పేరు తెచ్చుకొంది కాబట్టీమళ్ళీ విజయవంతం అవుతుందని ఆశ,నమ్మకం.2.ప్రతికూలత - వద్దన్నా పాతచిత్రంతో పోలుస్తారు.దానిని మించకపోయినా కనీసం అందులో 75 శాతమైనా బాగు లేకపోయినా,నచ్చకపోయినా చిత్రం విజయవంతం కాదు. నాటికీ నేటికీ అభిరుచులూ,ఆలోచనలూ మారిపోవచ్చును.సరీఇన పాత్రధారులు దొరకక పోవచ్చును.ఇప్పుడు గుండమ్మకథకి సూర్యకాంతం పాత్ర లాగ.మొఘల్-ఇ-అజాం ,సికందర్,మదర్ ఇండియా రీమేక్లు అలోచనలోనే ఉండిపోయాయి.
  తెలుగులో 'పోతన ' ,వేమన ' ,త్యాగయ్య ' పల్నాటియుద్ధం,' బీదలపాట్లు  ' వీటి రీమేక్స్ ఒరిజినల్స్ అంత ప్రజాదరణ పొందలేదు.'రామదాసు ' ,శ్రీరామరాజ్యం , పరవా లేదనిపించుకున్నాయి.
 'మల్లీశ్వరి,'విప్రనారాయణ ' మళ్ళీ రంగుల్లో తీస్తే బాగుంటాయి.కాని,పాత్రధారులకన్నా,వాటిలోని,అద్భుతసంగీతాన్ని కొత్తరకంగా కంపోజ్ చెయ్యడం చాలా కష్టం.మంచి సంగీతం లేకుండా ఆ రెండు సినిమాలూ,రక్తి కట్టవు.'నర్తనశాలకి  'S.V.రంగారావు లాంటి కీచక 'పాత్రధారిని తేవడం  కష్టం.అందుకే ఇటీవల అమితాభ్ బచ్చన్ ' క్లాసిక్స్ ' మళ్ళీ నిర్మించకుండా ఉండడమే మంచిదని అన్నాడు.
 

5, జూన్ 2012, మంగళవారం




  అజ్ఞాతగారికి,నేను బాణామతి,తులసిదళం నవలలు రెండూ చదివాను.అవి popular thrillers కిందికి వస్తాయిగాని ఉత్తమనవలల కిందికి రావు.రచయిత భావాలతో మనం ఏకీభవించనక్కర లేదనుకోండి.కాని ,వస్తువు,శిల్పం రెండూ బాగుంటే మంచిది కదా.విశ్వనాథవారి నవలల్లో నేను ఉత్తమం గా పరిగణించేవి 1.వేయిపడగలు.2.చెలియలికట్ట.3.ఏకవీర. ofcourse  లోకో భిన్న రుచి . 

visvsnatha novels -contd.




  నాకు విశ్వనాథవారి  'దిండు కింద పోకచెక్క 'నవల జ్ఞాపకం లేదు.అది నేపాళ రాజ వంశచరిత్రలలో ఒకటి అనుకొంటాను.'బాణామతి 'అంటే చేతబడి.అది మూఢ విశ్వాసం ఆధారంగా రాసిన నవల కాబట్టి మనకు నచ్చదు.
  'ఏకవీర 'చాలా కాలం కింద చదివిన నవల.దాని ఆధారంగా తీసిన సినిమా కూడా దాదాపు 40 ఏళ్ళు కావచ్చింది.గుర్తు తెచ్చుకొని రాస్తున్నాను.ఈ సినిమాలో N.T.రామారావు, కాంతారావు ,K.R.విజయ ,జమున ప్రధాన పాత్రధారులు.నటన,సంగీతం బాగుంటాయి కాని high brow అవడంవలన విజయం సాధించలేదు.
 ఏకవీర కథ 18 వ శతాబ్దం ,చారిత్రక నేపథ్యం గలది.అప్పటికే ఇంగ్లిష్ వారు ,ఫ్రెంచ్ వారు మన దేశంలో రాజ్యస్థాపన కోసం ,ఆధిపత్యం కోసం పెనగులాడుతున్నారు. మధుర,తంజావూరు రాజ్యాలను ,దక్షిణాంధ్ర నాయక రాజులు పరిపాలిస్తున్నారు.
  రాజకుమారుడు ,అతని మిత్రుడు ఇద్దరు చెరొక యువతిని ప్రెమిస్తారు.కాని విధివశాత్తు, ఒకరు ప్రేమించిన యువతిని మరొకరు వివాహం చేసుకో వలసి వస్తుంది.అందువలన వాళ్ళ జీవితాల్లో కలిగిన సంక్షోభం ,ఆవేదన చక్కగా చిత్రింపబడినవి.విశ్వనాథ వారి శైలి ,వర్ణనలు బాగుంటాయి.అవి వారి ప్రత్యేకత.చివరకు కథ విషాదాంతం అవుతుంది.
  ఈ నవల మళ్ళీ చదువుదామని ప్రయత్నించాను.కాని ఎక్కడా దొరకలేదు.(to be contd.)
  

3, జూన్ 2012, ఆదివారం

novels of ViSwanatha Satyanarayana

విశ్వనాథ వారి బహుముఖ ప్రజ్ఞా విశేషాల గురించి తెలిసిందే.ఆయన రామాయణ కల్ప వృక్షం ,ఆంధ్రప్రశస్తి, వంటి గొప్ప కావ్యాలే గాక కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్లి వంటి సరళ గేయాలు కూడ రచించారు. నవలలు,నాటకాలు రాసారు.ఆయన చేపట్టని ప్ర క్రియ లేదు.వేయి పడగలు  అనే బృహత్ నవల గు రించి ఈ మధ్య చర్చించు కున్నాము.దాని  తర్వాత చెలియలి కట్ట ,ఏకవీర నవలలు  ప్రసిద్ధి పొందాయి .
  చెలియలి కట్ట అంటే సముద్రపు గట్టు. సాధారణంగా ఆ హద్దుని దాటి సముద్రం రాదు.వచ్చింది అంటే ఏ సునామీ లాగానో నాశనం చేస్తుంది .అలాగే కొన్ని సాంఘిక కట్టుబాట్లు దాటితే సమాజానికి చేటు కలుగుతుంది .ఈ  నవల లో ,వదిన ,మరది  మధ్య అక్రమ సంబంధం కథావస్తువు .దాని వలన

 కలిగిన దుష్ ఫలితాలు  చిత్రించ బడినవి .చివర
 ముగింపు విషా దంతం.  (మిగతా మరొక సారి .)

1, జూన్ 2012, శుక్రవారం

BLOGS



 మా తరంవారికి కప్యూటర్లు ,ఇంటర్నెట్,తెలియదు.అప్పుడివి ఇండియాలో ప్రచారంలోకి రాలేదు.ఇటీవల కాలక్షేపం కోసం కొంచెం నేర్చుకొని బ్లాగులు చదవడం,వ్రాయడం చేస్తున్నాను.కాని ఫొటోలు,ఆడియోలు  ఉటంకించడం రాదు.ఆ మాయా మర్మాలు తెలిసిన నిపుణులు పెట్టుతున్న మంచి ఫొటోలు ,విడియోలు, ఆడియోలు చూసి ,విని ,ఆనందిస్తున్నాను.ఎన్నో sources నుంచి సేకరించిన దృశ్యాలు,సమాచారము,విజ్ఞానము కొద్దిగానైనా ఒకే చోట లభ్యం అవుతున్నది.
  ఈ బ్లాగులు వ్రాసేవారిలో 20నుంచి 80 వరకు వయస్సు వున్నవాళ్ళు,మహిళలు,కవులు,పండితులు,డాక్టర్లు,ఇంజనీర్లు,సైంటిస్టులు,ఉద్యోగులు,విద్యార్థులు  ఇంకా ఎన్నో వర్గాల వాళ్ళు ఉన్నారు.వివిధ అంశాల మీద సాధికారంగా వ్రాయగలిగిన వాళ్ళు ఉన్నారు.తీవ్రవాదులూ,మితవాదులూ ,సనాతనధర్మ వాదులూ ,నాస్తికులూ అందరూ ఉన్నారు.మంచిదే.ఎవరి అభిప్రాయాల్ని వారు గట్టిగా,తీవ్రంగా ప్రతిపాదించవచ్చును.వాదించవచ్చును.
  కాని కొందరు హద్దుమీరి పరుషవాక్యాలు రాయడం, తిట్టడం,indecent and unparliamentary language  తో అసభ్యంగా ఒకరినొకరు దూషించుకొంటున్నారు.ఇది మంచిదికాదు.ఎందుకంటే వారు మాత్రమే కాక ఎవరైనా చదువుతారు కదా!పెద్దవాళ్ళు,స్త్రీలు కూడా.అందువలన కాస్త సం యమనం పాటించమని విజ్ఞప్తి చేస్తున్నాను.బ్లాగు మిత్రులందరికీ అభినందనలు.

30, మే 2012, బుధవారం

Diet



 చాలా మందికి తెలిసే వుంటుంది.ఐనా కావలసిన వారు నోట్ చేసుకోవచ్చును.ఈ ఆహారం 1200 కేలరీల శక్తిని ఇస్తుంది.ఇది దాదాపుగా గుండెజబ్బు,రక్తపోటు,మధుమేహం ఉన్నవారికి అందరికి పనికి వస్తుంది.ఐతే స్థూలకాయం కూడా ఉంటే మరి కొంచెం తగ్గించి 1000 కేలరీల ఆహ్హారం తీసుకోవాలి.
   ఉదయం 7-30=8గం. 2,3 వెల్లుల్లి రేకలు.6-8 నానపెట్టిన మెంతులు మంచినీళ్ళతో.అరకప్పు నీళ్ళలో పావుకప్పు కాకరకాయ రసం.
   8-30=9 గం.-అల్పాహారం (breakfast) 2ఇడ్లీలు చట్నీతో.|లేక 1పరాటా కూరతో.అరకప్పు పాలు,లేక పాలతో కలిపి టీ లేక కాఫీ. పాలలో కొవ్వు ఉండకూడదు. చక్కెర వేసుకో కూడదు.  
   10-30=11గం.-1చిన్న కమలా లేక నారింజ పండు.
  12-30=1-30-భోజనం (lunch) -2 పుల్కాలు|లేక జొన్నరొట్టెలు ; చిన్న గిన్నెలో అన్నము ,ఉడకబెట్టిన కూరతో.;చిన్న గిన్నెలో పప్పు ,\లేక సాంబారు.
  4-6గం.మధ్య- - కొవ్వులేని అరగ్లాసు పాలు లేక పాలతో టీ లేక కాఫీ తాగవచ్చును.చక్కెర వేసుకోకూడదు.
  చిన్నగిన్నెలో సగం వేయించిన శనగలు,|లేక మొలకెత్తిన శనగలు,
  8-30==9గం.రాత్రి-భోజనం.(dinner) 2పుల్కాలు|లేక జొన్న రొట్టెలు ;1గిన్నె ఉడికించిన కూరగాయలు .1గ్లాసు కొవ్వులేని మజ్జిగ.
  10-11గం.మధ్యరాత్రి =1చిన్నగ్లాసుతో కొవ్వుతీసిన పాలు.
   Note;- పాలు,టీ, కాఫీలలో చక్కెర బదులు sugar free  మాత్రలు  1 లేక 2 వాడ వచ్చును.
 సాధారణ సూత్రములు.(general principles) 1.నెయ్యి,వెన్న ,కొబ్బరి,వాటితో వండిన పదార్థాలను వాడకూడదు.2.మిఠాయిలు ,మైదా,కేకులు ,తినకూడదు.పనస,మామిడి ,సీతాఫలం,వంటి గ్లూకోజ్ ఎక్కువగా వుండే పండ్లను తినకూడదు.టిన్స్ లోని ఆహారాన్ని వర్జించాలి.(tinned foods) .మాంసాహారం బాగ తగ్గించాలి.వదలి వేయడం మంచిది.చేపలు తినవచ్చును.బరువు పెరగకుండా చూసుకోవాలి.వయసుని బట్టి వ్యాయామం చెయ్యాలి.ఆహారంలో ఉప్పు తగ్గించాలి.చక్కెర వేసుకోకూడదు.మద్యం,పొగాకు ,వాడకూడదు.
   

3, మే 2012, గురువారం

national film awards



 ఈ రోజు జాతీయచలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవాన్ని టీ.వీ.లో కొందరైనా చూసివుంటారు.ఫిలింఫేర్ అవార్డులలాగ glamour లేకుండా అంతా అఫీషియల్ గా జరిగింది.కాని ఈ జాతీయ అవార్డులు ని చాలా ప్రముఖంగా,ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తారు.ఎక్కువగా మళయాళీ,కన్నడ ,బెంగాలీ ,మరాఠీ పేర్లే వినిపించాయి.ఒక్క తెలుగు పేరు కూడా వినిపించకపోవడం తో మనస్సు చివుక్కుమంది.మన తెలుగు చలన చిత్రాల ప్రమాణాలు 'కళాత్మకంగా ' చూస్తే ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమౌతుంది.
   కాని ఒక విషయం రాయదలుచుకొన్నాను.వచ్చే ఏడాది అయినా దర్శకుడు కె.విశ్వనాథ్ గారికి ప్రతిష్ఠాత్మక మైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ,ఆం.ప్ర.ప్రభుత్వము గట్టిగా కృషి చెయ్యాలి.అందుకు ఆయన అన్ని విధాలా అర్హుడు కాబట్టీ.
  రెందవ విషయం; మొదటి తెలుగు టాకీ 'ప్రహ్లాద ' ను ,సాంఘిక చిత్రాలకి మార్గదర్శకంగా 'గృహ లక్ష్మి ' చిత్రాన్ని తీసిన H.M.రెడ్డి పేరిట  మన రాష్ట్రంలో ఏ అవార్డూ లేక పోవడం శోచనీయం. ఇకమీదైనా ఆలోటు తీరుతుందని ఆశిస్తున్నాను.

2, మే 2012, బుధవారం

veyipadagalu-Novel.




 విశ్వనాథ సత్యనారాయణ గారిని ఆరాధించేవారు ఉన్నారు.తీవ్రంగా వ్యతిరేకించేవారు ఉన్నారు.ఆయన భావజాలమే ideologyయే దీనికి కారణం .కాని ఆయన ప్రతిభ,పాండిత్యం,కవితాప్రావీణ్యం, బహుముఖప్రజ్ఞల గురించి మాత్రం అందరూ ఏకీభవిస్తారు.ఐతే ప్రస్తుతం వీటి గురించి వ్రాయడం లేదు.వేయిపడగలు నవలలోని అంశాలగురించి వ్రాయదలిచాను.50 సం; లో సుబ్బన్నపేట అనే వూళ్ళో వచ్చిన మార్పులు (అంటే ఆంధ్రదేశపు పల్లెలు,పట్నాలలో వచ్చిన మార్పులకు ప్రతీకగా ) చక్కగా చిత్రించారు.విచిత్రమేమంటే అభ్యుదయనిరోధకుడు అని నిరసించిన వారే అవే అభిప్రాయాలని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు.ముఖ్యంగా  వామపక్షీయులు, పర్యావరణవాదులు,మానవహక్కులసంఘాలు.
 1.ఆయన ఆ నవలలో వరిపంట విస్తరించడాన్ని వ్యతిరేకించారు.ముతకధాన్యాలు,మెట్టపంటల్నిప్రోత్సహించాడు.అవే బలవర్ధకాలన్నారు
 2.జానపదకళలని వర్ణించారు.వాటి క్షీణతని గురించి బాధపడ్డారు.
  3.ముఖ్యంగా చేతి పనులు ,వృత్తుల విధ్వంసాన్ని నిరసించారు.
  4.పర్యావరణం ఎలా పాడయిపోతున్నదో వివరించారు.
  5.గ్రామాలు రాజకీయాలతో ఎలా కలుషితం అవుతున్నవో బాగా  చిత్రించారు.6.మానవ,కుటుంబ సంబంధాలు ఎలా విచ్చిన్నమౌతున్నవో వర్ణించాడు.
   ఈ రోజుల్లో ఇంచుమించు ఇదే భావాలతో ,అంశాలతో ఆధునికులు కథలు రాస్తున్నారు. విశ్వనాథవారు ఇవన్నీ ఊహించి ముందుగానే prophetic గా రాయడం గమనించవలసిన విషయం. అందుకే మనం ఆయనతో కొన్ని చాందసభావాల గురించి విభేదించినా ' వేయి పడగలు ' తెలుగులో గొప్ప నవలలలో ఒకటి అని అంగీకరించాలి. 

1, మే 2012, మంగళవారం

japan



 ఈ మధ్య the shrinking country అని ఒక వ్యాసం చదివేను.అందులో ప్రధానాంశాలు మాత్రం పేర్కొంటున్నాను.జపాన్ అభివృద్ధి చెందిన సంపన్నదేశమని మనకు తెలిసిందే. కాని ఒక దశాబ్దంగా ఆర్థికంగా depression లో ఉన్నది.దానికి తోడు జనాభా తగ్గుతున్నదట.కారణం ; చాలామంది యువతీ యువకులు పెళ్ళి చేసుకోకుండా ఉండిపోతున్నారట.చేసుకొన్నా 30,35 సం; దాటాకగాని చేసుకోటం లేదట. సహజీవనం ' చేస్తున్నవారు కూడా  వారి సంప్రదాయ బలంవల్ల  వివాహం కాకుండా పిల్లలను కనడానికి ఇష్టపడటం లేదు.మరొక విషయం; విదేశీయులు వాళ్ళ దేశానికి వలస రావడం జపాన్ వారికి వ్యతిరేక భావం వుంది.ఆయుప్రమాణం బాగాపెరగడం వల్ల దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోయి బాలల సంఖ్య తగ్గిపోయింది.పై కారణాల వలన జపాన్లో జనాభా (ముఖ్యంగా కష్టపడి పనిచేయగల యువ జనుల సంఖ్య తగ్గడం ఆందోళన కలిగిస్తున్నది.
  ఇటువంటి పరిస్థితులే అమెరికా, ఇంగ్లాండు వంటి దేశాల్లో కూడావున్నా ,వివాహం లేకుండా సహజీవనం చేస్తూ పిల్లలను కనడానికి ఆక్షేపణ లేదు.కొంతవరకు ఇతర దేశాలవారి వలసల్ని అనుమతిస్తారు.అందువల్ల అక్కడ పనిచేయగలవారి జనాభా అంతగా తగ్గడంలేదు.
   ఈ విస్   హయాలు మనం కూడా పరిశీలించవలసి వుందనుకొంటున్నాను.

japan




 ఈ మధ్య the shrinking country అని ఒక వ్యాసం చదివేను.అందులో ప్రధానాంశాలు మాత్రం పేర్కొంటున్నాను.జపాన్ అభివృద్ధి చెందిన సంపన్నదేశమని మనకు తెలిసిందే. కాని ఒక దశాబ్దంగా ఆర్థికంగా depression లో ఉన్నది.దానికి తోడు జనాభా తగ్గుతున్నదట.కారణం ; చాలామంది యువతీ యువకులు పెళ్ళి చేసుకోకుండా ఉండిపోతున్నారట.చేసుకొన్నా 30,35 సం; దాటాకగాని చేసుకోటం లేదట. సహజీవనం ' చేస్తున్నవారు కూడా  వారి సంప్రదాయ బలంవల్ల  వివాహం కాకుండా పిల్లలను కనడానికి ఇష్టపడటం లేదు.మరొక విషయం; విదేశీయులు వాళ్ళ దేశానికి వలస రావడం జపాన్ వారికి వ్యతిరేక భావం వుంది.ఆయుప్రమాణం బాగాపెరగడం వల్ల దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోయి బాలల సంఖ్య తగ్గిపోయింది.పై కారణాల వలన జపాన్లో జనాభా (ముఖ్యంగా కష్టపడి పనిచేయగల యువ జనుల సంఖ్య తగ్గడం ఆందోళన కలిగిస్తున్నది.
  ఇటువంటి పరిస్థితులే అమెరికా, ఇంగ్లాండు వంటి దేశాల్లో కూడావున్నా ,వివాహం లేకుండా సహజీవనం చేస్తూ పిల్లలను కనడానికి ఆక్షేపణ లేదు.కొంతవరకు ఇతర దేశాలవారి వలసల్ని అనుమతిస్తారు.అందువల్ల అక్కడ పనిచేయగలవారి జనాభా అంతగా తగ్గడంలేదు.
   ఈ విస్   హయాలు మనం కూడా పరిశీలించవలసి వుందనుకొంటున్నాను.

14, ఏప్రిల్ 2012, శనివారం

communist China




 వేగంగా అగ్రరాజ్యంగా వృద్ధి చెందుతున్న చైనాతో మనదేశం ఎలా వ్యవహరించాలి అన్నది ముఖ్యాంశం.టిబెట్ ని ఆక్రమించేవరకు మనకు చైనాతో  సరిహద్దు లేదు .తరవాత చైనాతో సరిహద్దు సమస్య తలెత్తింది.1962 లో చైనా మనపై దండెత్తి ఆక్ -సయ్ -చిన్ కొండ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నది.పైగా అరుణాచల్ తమదే అంటున్నది.
  రెండవది; మనకు వ్యతిరేకంగా ఉండే పాకిస్తాన్ తో స్నేహం చేసి సహాయం ,చేస్తూ ఉంటుంది. మూడు; ముందు ముందు ప్రపంచంలో వనరులకోసం ,వ్యాపారం ,ఖనిజాల కోసం చైనా, ఇండియా ల మధ్య పోటీ ఉంటుంది అనుకొంటున్నారు.నాల్గు; టిబెట్ పీఠభూమి లో పుట్టే పెద్దనదుల జలాలను ఉత్తరానికి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నది.ఇది జరిగితే మన దేశమే కాక బర్మా,థయిలాండ్, వీత్నాం ,పాకిస్తాన్, బంగ్లాదేశ్ నదీజలాల కొరతను ఎదుర్కోవలసి వస్తుంది.(సింధు, సట్లెజ్ ,బ్రహ్మపుత్ర,సాల్వీన్ మీకాంగ్ నదులు టిబెట్లో జన్మిస్తాయి. )2050 నాటికి చైనా,అమెరికాల తర్వాత మూడవ అగ్రరాజ్యంగా భారత్ అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా, భారత్ల మధ్య వాణిజ్యం పెరుగుతున్నది.ఈ నేపథ్యంలో ఇండియా చైనా పట్ల ఏ విధానాలు అవలంబించాలన్నది పెద్ద ప్రశ్న.మన నాయకులు,నిపుణులు ,మిలిట్రీ ,సివిల్ అధికారులు జాగ్రతగా ఆలోచించి చర్యలు తీసుకోవాలి.ఈ రెండు పెద్ద రాజ్యాల మధ్య ఘర్షణ రెండింటికి మంచిదికాదు.
  ఏమైనా చైనా పాకిస్తాన్ల మధ్య మైత్రి ,అణు ఆయుధాల ఉత్పత్తి సహకారం దృష్ట్యా మనం కూడా మన బలాన్ని బాగా పెంచుకో వలసి వుంటుంది.కాని సాధ్యమైనంత వరకు చైనాతో సత్సంబంధాలకై ప్రయత్నం చెయ్యాలి.(eternal vigilance is the price of Liberty )అన్నారు కదా!
   ఈ బ్లాగు పరంపరపై పాఠకుల విజ్ఞతకే ,వారి conclusions కి వదిలివేస్తున్నాను.
                    (సమాప్తం )   

13, ఏప్రిల్ 2012, శుక్రవారం

China-contd-12



 చైనా-11బ్లాగుల్లో Mr.John Keay రచించిన పెద్ద గ్రంథం China-a history (Harper press)ని అనుసరించి క్లుప్తంగా వ్రాసాను.నా అవగాహన,మేరకు ,నా అభిప్రాయాలను ,నా conclusionsతెలియజేస్తున్నాను.ఎవరైనా ఇంకా వివరాలు కావాలంటే జాన్ కే గ్రంథాన్ని చదవ వలసిందే.మొదట ప్రాచీన,మధ్యయుగాలలో చైనా గురించి ;-
  1.మన దేశంలాగే చైనా 5000సం; ప్రాచీన చరిత్ర గల దేశం.ఒకే సంస్కృతి వరుసగా కొనసాగిన దేశం.2.కంఫుసియస్ నీతి శాస్త్రం ,బౌద్ధ మతప్రభావాలతో సమాజం నడుస్తుంది.కాని మత మౌఢ్యం లేదు.3.హాన్ జాతి ప్రజలు ,అత్యధిక సంఖ్యాకులు .చైనీస్ భాష మండలిక భేదాలతో అత్యధిక ప్రజలు మాట్లాడుతారు.అందువలన మనకన్న ప్రజలు ఐకమత్యంతో ఉండే అవకాశం ఉన్నది.లిపి కూడా ఒకటే.4.మధ్యలో విచ్చిన్నమై అనేక రాజ్యాలుగా విడిపోయినా ఎక్కువ కాలం ఒకే సామ్రాజ్యంలో ఉన్నది.5.ఐనా సరిహద్దుల్లో ఉన్న సంచారజాతులు ( మంగోలులు, తార్తారులు, హూణులు ,మంచూలు,జుర్చెన్లు,టర్కులు,ఉయిఘర్లు  దాడిచేసి సరిహద్దు ప్రాంతాలని ఆక్రమించుకొనే వారు .అందులో  మంగోలులు,మంచూలు,చైనా మొత్తం ఆక్రమించి దాదాపు 4శతాబ్దాలు పాలించారు.చైనా మహాకుడ్యం (Great wall of China ) దండయాత్రలను ఆపలేకపోయింది.6.చైనా ప్రపంచానికి ఇచ్చిన బహుమతులు (gifts)  సిల్కు దారం ,బట్టలు ,పింగాణీ వస్తువులు,కాగితం,ప్రింటింగ్, నావికుల దిక్సూచి .7,పూర్వకాలం నుంచి చైనా ఎగుమతి,దిగుమతి  వ్యాపారాలు చేస్తూ ఉండేది.పేదరికంతో బాటు అధిక సంపదలు కూడా ఉండేవి.8.చైనా భూభాగంలో విస్తరించింది కాని సముద్రాంతర వలసరాజ్యాలు స్థాపించ లేదు.13,14,శతాబ్దాలలో తప్పించి పెద్ద నౌకా బలం ఏర్పాటు చేసుకో లేదు.9.మనదేశం,యూరప్ ,ఈజిప్టు వలె గొప్ప ప్రాచీన కట్టడాలు చైనాలో లేవు.కారణమేమంటే ,ప్రాచీనకాలంలో వారు ఎక్కువగా మట్టి,కర్రwood ఇటుకలు,పెంకులతో పెద్ద కట్టడాలనికట్టేవారు .అవి సిధిలమయేవి.10.మందుగుండు (gunpowder) చైనావారే కనిపెట్టారు కాని దానిని ఎక్కువగా  బాణాసంచా తయారీకి fireworks కే వాడేవారు.వారి నుంచి నేర్చుకొన్న అరబ్బులు,టర్కులు ,యూరపియన్లు దానిని తుపాకులు,ఫిరంగులు తయారు చేయడానికి ఉపయోగించుకొన్నారు
  11.ఇప్పటికీ చైనాలో దర్శించవలసిన వాటిలో ముఖ్యమైనవి.1 బీజింగ్ వద్ద చైనా గోడ 2మొదటి క్విన్ చక్రవర్తి సమాధి దగ్గర నిలువెత్తు వేలకొద్ది మట్టి బొమ్మల సైన్యం(TOY ARMY) 3 తియెన్మెన్ రాజ భవనల సముదాయం.4.పెద్ద బౌద్ధ విగ్రహాలున్న నదీ లోయ.5.సిల్కు వస్త్రాలు ,వాటిపై చిత్రకళ,జేడ్ అనే విలువైన రాళ్ళతో తయారు చేసిన కళాత్మక వస్తువులు.(వచ్చే సారి ఆధునిక  చైనా ,దాని ప్రాముఖ్యం గురించి వ్రాసి ముగిస్తాను.    

12, ఏప్రిల్ 2012, గురువారం

China-contd.-11




  1978లొ డెంగ్-సియాఓ -పింగ్ తన అభిప్రాయాల ప్రకారం ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు.అంతకు ముందే సోవియట్  యూనియంకి ,చైనాకి అభిప్రాయభేదాలు కలిగాయి.1972 లో అమెరికా అధ్యక్షుడు నిక్సన్ విదేశాంగ మంత్రి కిస్సింజెర్ సలహాతో బీజింగ్ వెళ్ళి మావో -సె - జంగ్  ని కలుసుకొని రహస్య చర్చలు జరిపాడు.
  డెంగ్ సూత్రాలలో ఎక్కువగా ఉదహరింప బడే వాటిని బట్టి అతని విధానాలు అర్థమౌతాయి.1.ధనం సంపాదించడం పాపం కాదు.(To get rich is no sin )2.ఎలకల్ని పట్టుతూ వుంటే పిల్లి తెల్లగా వున్నా నల్లగా వున్నా ఫరవా లేదు. (It does not matter whether the cat is black or white as long as it catches mice ) ఈ ఆర్థిక సంస్కరణల ద్వారా జరిగిన మార్పులు; 1.వ్యవసాయం మళ్ళీ ప్రైవేటు రైతు కుటుంబాల చేతులకు స్వాధీనమై ,ఉత్పత్తి పెరిగింది. 2.పరిశ్రమలలో ప్రైవేటు పెట్టుబడి ప్రోత్సహించుట వలన అవి బాగా పెంపొంది ఎక్కువ ఉత్పత్తిని సాధించాయి.3.విదేశీ పెట్టుబడులను,సాంకేతిక సహాయాన్ని ఆహ్వానించుట వలన సంపద, ఉత్పత్తుల నాణ్యత పెరిగింది.4.తీరప్రాంతాల్లో ప్రత్యేక ఆర్థిక మండలులను ఏర్పాటు చేసి నిబంధనలను సడలించడం వలన అక్కడ ఎగుమతి, దిగుమతులు బాగా జరగ సాగాయి. చైనాలో కార్మికశక్తి (Labour power ) చవకగా లభ్యం కాబట్టి ,చవకగా అనేక వస్తువులు ఉత్పత్తి చేసి అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేసి విశేషంగా విదేశీ మారక ద్రవ్యాన్ని డాలర్లలో చైనా ఆర్జించింది.
  1980 నుండి గత 30 ఏళ్ళుగా చైనా 10 % జాతీయోత్పత్తి లో అభివృద్ధి సాధించింది.( Fastest growth in G.D.P.) ఇప్పుడు ప్రపంచంలో ఆర్థిక, సైనిక, రంగాలలో మూడవ ప్రబలశక్తిగా రూపొందింది. విద్యా,ఆరోగ్యరంగాలలో కూడా మంచి అభివృద్ధి సాధించింది.
  కాని,చైనాలో స్వేచ్చ,ప్రజాస్వామ్యం లేవు.20 సం;; క్రితం బీజింగ్లో విద్యార్థులు స్వేచ్చ,ప్రజాస్వామ్యం కోసం జరిపిన ఆందోళనని ప్రభుత్వం క్రూరంగా అణచివేసింది. టిబెట్ ,సింకియాంగ్ లలో స్వయమ్నిర్ణయాధికారం కోసం జరిగిన తిరుగుబాట్లను తీవ్రంగా అణచివేసింది.మన దేశంలోవలె స్వెచ్చాయుత ఎన్నికలు లేవు.
   రాజకీయంగా కమ్యూనిస్టు ఏకపక్ష నియంతృత్వం ,ఆర్థికంగా ప్రైవేటు పెట్టుబడిదారి వ్యవస్థ ; ఇది నేటి చైనాలో పరిస్థితి.
   (వచ్చే సారి నా అభిప్రాయాలతో చైనా గురించి ఈ బ్లాగుల పరంపరను ముగిస్తాను.)   

10, ఏప్రిల్ 2012, మంగళవారం

China-contd.-11



 చైనా -1949-2012 ఈ కాలంలో కమ్యూనిస్టు పాలన కొనసాగింది.దీనిని rough గా 1950 నుంచి  1980 వరకు 30 సం;మావో యుగంగాను ,1980 నుంచి 2010 వరకు మావో అనంతరయుగం(post Mao era)లేక సంస్కరణల యుగంగా పేర్కొనవచ్చును.1976లో మరణించేదాకా  మావో తిరుగులేని నియంత.అతని కమ్యూనిస్టు భావజాలం ప్రకారం ,ప్రయివేటు కమతాలు రద్దు చేయబడి,ప్రభుత్వ పరమై ,కమ్యూనిస్టు కార్యకర్తల నిర్వహణలో గ్రామ రైతు సహకారసంఘాలచే వ్యవసాయం చేయబడింది. ( communes) అందరికి  కాంటీన్ల ద్వారా ఉచితంగా భోజన వసతి కల్పించారు.మొదట్లో ఈ విధానం బాగానే ఉన్నట్లు కనిపించింది.పెద్ద రైతులను,భూస్వాములను ప్రజాశత్రువులు గా ప్రకటించి శిక్షించారు.చాలామందిని చంపివేసారు.
  ఈ ఉమ్మడి వ్యవసాయం విఫలమైనది.కష్టించి పనిచేసే రైతులలో సోమరితనం ప్రబలింది.కార్యకర్తలు ఉత్పత్తి తప్పుడు లెక్కలు ,చూపించారు.పెరుగుతున్న జనాభా కి తగినంత ఆహార ఉత్పత్తి జరగలేదు .ఐనా పట్టణాలకి ఆహారం విధిగా ఎగుమతి చేయవలసి వచ్చింది.అందుచే గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన కరువు వచ్చింది.లక్షలాది ప్రజలు తిండి లేక మరణించారు
 పరిశ్రమల్లో త్వరిత ప్రగతి సాధించాలని ,కుటీరపరిశ్రమల ద్వారా దేశమంతా ప్రయత్నించారు.కాని ఆధునిక వస్తుసముదాయాన్ని,ఉక్కు వంటి వాటిని పాత కొలుముల్లో (furnaces of old model) తయారు చేసినవాటికి నాణ్తత లోపించి ,గిరాకి లేక (massproduction of big modern machines )ముందు విఫలమైనవి.దీనినే గొప్ప ముందంజ ( great leap forward ) అన్నాడు.
  మరొక ప్రతిపాదన కూడా ఆచరణలో విఫలమైనది.మావోయిజాన్ని దేశంలో బాగా ప్రచారం చేసి ,ఆచరించడానికి విశ్వవిద్యాలయాలు,కళాశాలలు ,మూసివేసి అధ్యాపకుల్ని,విద్యార్థులను గ్రామాలకి తరలించారు.ఎర్రసైనికులు (red guards ) అనేపేరుతో యువతీ యువకుల్ని తయారు చేసారు.వాళ్ళు,విప్లవవ్యతిరేకులనుకొన్న వారినందరినీ శిక్షించ సాగారు.
  ఐతే మావో యుగంలో ఏమీ సాధించలేదని చెప్పలేము.భారీ పరిశ్రమలు,విద్యుత్ ప్రాజక్టులు నెలక్ల్పబడినవి.(ప్రభుత్వరంగంలోనే) .విద్య,వైద్య సేవలు ఉచితం చేయబడినవి.స్త్రీలకు సమాన హక్కులు ఇవ్వబడినవి.చైనా మిలిటరీ బలం బాగా వృద్ధి చెందింది.రోదసీ,అణు ,పరిశోధనలు విజయం సాధించాయి.(space and atomic research) సోవియట్ యూనియన్ ఈ విషయాల్లో  చైనాకి చాలా సహాయం చేసింది.
  1976 లో మవో సె జంగ్  మరణించాక అధికారం కోసం పోరాటం జరిగింది.మావో భార్య జియాంగ్క్వింగ్ ( jiyangqing)ఆమె అనుచరులు(gang of four ) ప్రయత్నాలని వమ్ముచేసి డెంగ్ సి యా వో పింగ్ (Deng tse yao ping )  అతని సహచరులు అధికారం చే జిక్కించుకొన్నారు.జియాంగ్ వర్గం అతివాదులు,డెంగ్ వర్గం మితవాదులు.(మిగతా మరొక సారి    

CHINA-contd.10


 

   జపాన్ యుద్ధకాలంలో కమ్యూనిస్టు పార్టీ ప్రజాబలం బాగా సంపాదించుకున్నది. మావో సమర్థనాయకత్వం,ఎత్తుగడల వలన కొమింటాంగ్ ప్రభుత్వ సైన్యాలను పూర్తిగా ఓడించగలిగింది.చైనాని దాదాపు అంతటినీ ఆక్రమించింది.చియాంగ్ కై షేక్ లక్ష సైన్యంతో ఫార్మోజా దీవికి (నేటి తైవాన్) పారిపోయి అక్కడ అమెరికా రక్షణలో ప్రభుత్వం కొనసాగించేడు.
 1949లో  బీజింగ్ రాజధానిగా  కమ్యూనిస్టు రిపబ్లిక్ ప్రకటించ బడినది.మావో పార్టీ కార్యదర్శి ఐనా సర్వాధికారి అతడే.అతని సహచరులలో లీ షా చీ (lee shao chi ) రిపబ్లిక్ అధ్యక్షుడు; చౌ ఎన్ లే (chou en lay )  విదేశాంగ మంత్రి; లింబియావో (lin bi yao ) సర్వసేనాధిపతి.
 అసలు చైనా లో భాగాలు కాని (హాన్ జాతి వారి రాష్ట్రాలు కాని ) ప్రాంతాల సంగతి 1.మంచూరియా ; జపాన్ సైన్యాల ఉపసమ్హరణ తర్వాత కమ్యూనిస్టు సైన్యాలు మంచూరియాను ఆక్రమించేయి .2.మంగొలియా ; సోవియట్ యూనియన్ సహాయంతో స్వతంత్ర రాజ్యమైనై.3.ఇన్నర్ మంగోలియా ;ఇక్కడ్డ హాంజాతి ప్రజలు కూడా నివసిస్తూ ఉండటం వలన చైనా రిపబ్లిక్ లో భాగంగా కలిపివేసారు.4.సిన్ కి యాంగ్ ; ఉయిఘర్ జాతి ముస్లిములు ఉన్న ఎడారి ప్రదేశం.వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడినా అణచివేసారు.5.టిబెట్ ; చాలా కాలం ఇది స్వతంత్ర రాజ్యం.బ్రిటిష్ హయాంలో దీనిపై చైనాకి నామమాత్రపు సార్వభౌమ అధికారం ఇస్తూ ఒడంబడిక జరిగింది.దీని ఆధారంగా శాంతికాముకులు,సైన్యబలం లేని టిబెటన్లను అణచివేసి ఆక్రమించుకున్నారు.బౌద్ధ మతగురువు దలై లామా కొందరు అనుచరులతో కలసి రహస్యంగా 1959లో మనదేశానికి పారిపోయి వచ్చి శరణార్థిగా ఉంటున్నాడు.6.తైవాన్ ద్వీపం; అమెరికన్ నౌకా ,రాకెట్ సైన్య రక్షణలో స్వతంత్ర రాజ్యంగా ,ప్రజాస్వామిక విధానంలో ఉన్నది.ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందింది.7.హాంగ్కాంగ్; లీజు ఒడంబడిక కాలం పూర్తయాక 1999లో ఈ బ్రిటిష్ కాలనీ తిరిగి చైనాలో ప్రత్యేక ప్రతిపత్తితో చేరిపోయింది.ఆర్థికంగా సంపన్నమైన నగరం.
 చైనా సైన్యాన్ని P.L.A.peoples liberation army  అంటారు.            

China-contd.-10


 ౩.ఈలోగా జపాన్ బలపడి కొరియా,మంచూరియా,ఫార్మోజా లను ఆక్రమించింది.చైనాలో కూడా ఉత్తర,తూర్పు భాగాలని వసపరచుకోన్నది .షాంఘై ,నాన్జింగ్ వంటి ముఖ్య నగరాలను ఆక్రమించింది .రాజధాని,పశ్చిమాన చుంకిన్గ్కి తరలించారు.ఈ విపత్కర పరిస్థితులలో కమ్యూనిస్టులు,కౌమింటంగ్ ఒక సమాధానానికి వచ్చి ఉమ్మడిగా జపాన్ ని ఎదుర్కొన్నారు.1939 లో నాజీ జర్మనీ,ఇటలీ ,జపాన్లు కూటమిగా #(axispowers )గా ,అమెరికా,బ్రిటన్, ఫ్రాన్స్ ,చైనాలు మరొక కూటమిగా (allied  powers  )గా రెండవ ప్రపంచ మహాయుద్ధం 6 ఏళ్ళు జరిగింది.చివరికి 1945 లో జర్మనీ ,జపాన్లు ఓడిపోయినవి.జపాన్ తన సైన్యాలను పూర్తిగా ఉపసంహరించుకున్నది.
  తర్వాత మళ్ళీ ఆధిపత్యం కోసం కొమింటాంగ్ కి ,కమ్యూనిస్తులకీ పోరాటం ప్రారంభమైనది.

china-contd-10




 ఐనా అతివిశాలము,అధికజనాభా గల వ్యావసాయిక దేశమైన చైనాలొ గ్రామీణప్రాంతాలు,మారుమూల ప్రాంతాల్లో నిరక్షరాస్యత,పేదరికం ,వెనుకబాటుతనం ఇంకా ఎక్కువగానే ఉండినవి.పట్టణప్రజలు,ముఖ్యంగా యువత లో చైతన్యం ఎక్కువయింది.
   ఇక రాజకీయ పరిణామాల విషయం;; వివరాలలోకి పోకుండా క్లుప్తంగా ఇలాగ సమీక్షించవచ్చును.1.రిపబ్లిక్ స్థాపన తర్వాత ఎన్నికలు జరిగాయి.(కాని అప్పట్లో స్త్రీలకు వోటు హక్కు ఇవ్వలేదు.)  సన్యెట్సెన్ (sun yet sen)అనే యువనాయకుడు చాలా ప్రజాదరణ కలిగిఉండేవాడు.అతనికి దక్షిణ చైనాలో ఎక్కువ బలం ఉండగా ,ఉత్తర చైనాలో యువాన్షికాయ్ (yuvanshikayi) అనే నాయకునికి ఎక్కువ బలం ఉండినది.వీరి మధ్య విభేదాలవలన అంతర్ యుద్ధం జరిగింది.చివరికి సన్యత్సెన్ మరణించాక అతని పార్టీకి కౌమింటాంగ్ పార్టీకి (koumintang party)కి చియాంగ్కైషెక్ (chiyang kai shek ) అనే మిలిటరీ జనరల్ నాయకుడై 1924 నుండి 1949 వరకు చైనాను పాలించాడు.
  ఇతని కాలంలో మావో  సే తుంగ్ (mao tse djang)) నాయకత్వంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి బలపడింది .కొమింటెర్న్ (communist international) సలహాలతో నడచింది.నేషనలిస్ట్ కొమింటాంగ్ తో తలపడి పొరాడింది. పారిశ్రామిక దేశాల దృష్టి తో మార్క్స్ రాసిన దానిని గ్రామీణ,వ్యవసాయ చైనాకి మావో అన్వయించి గెరిల్లా పోరాటం కొనసాగించాడు.కొమింటాంగ్ సైన్యాలు వెంట తరుముతూ వుండగా 20000మంది అనుచరులతో 3000 మైల్లు ప్రయాణం చేసి యనాన్ ప్రాంతంలో(మంగొలియా సరిహద్దుకు దగ్గరగా స్థావరాన్ని ఏర్పరచుకొన్నాడు. దీనినే ప్రసిద్ధమైన లాంగ్ మార్చ్ (long march )అని పిలుస్తారు.

9, ఏప్రిల్ 2012, సోమవారం

China-contd-10

చైనా 1911 -1949 రాజరికం అంతరించి రిపబ్లిక్ అవతరించిన తర్వాతి చరిత్ర.మంచూ రాజుల పరిపాలన చివరికాలం లోనే  ఆధునికమైన పరిణామాలు ప్రారంభమై ,20 శతాబ్దంలో కొనసాగాయి.పాస్చ్చాత్య ప్రభావం వల్ల ప్రజాస్వామ్యభావాలు, శాస్త్రీయ ,సాంకేతిక విద్యా వ్యాప్తి జరిగాయి.రైలు మార్గాలు,టెలిగ్రాఫ్,టెలిఫోన్, కార్లు,బస్సులు,లారీల వలన మనుషులు,సరకుల రవాణా,పెరిగి సమాచారసౌకర్యం ఏర్పడింది .వ్యాపారం,పరిశ్రమలు వ్రిద్ధి చెందాయి.స్త్రీవిద్య,హక్కులు పెంపొందాయి.1902 లో బాలికల పాదాలు కట్లతో బంధించే దురాచారం నిషేధింపబడినది.చైనాలో కాగితం,ముద్రణ పూర్వ కాలంనుంచి ఉన్నా ,గ్రంథాలన్నీ పండితభాషలో రాసేవారు.వ్యవహారిక భాషలో వ్రాయడం ప్రారంభమైనది.ఆధునిక ముద్రనాయంత్రాలు ,టైపు మెషీన్ల తో అనేక పత్రికలూ,పుస్తకాలు ప్రచురించడం జరిగింది.పాథసాలలు,కళాశాలలు స్తాపనతో విద్యావ్యాప్తి జరిగింది  

China-contd-10.ain

చైనా 1911 -1949 రాజరికం అంతరించి రిపబ్లిక్ అవతరించిన తర్వాతి చరిత్ర.మంచూ రాజుల పరిపాలన చివరికాలం లోనే  ఆధునికమైన పరిణామాలు ప్రారంభమై ,20 శతాబ్దంలో కొనసాగాయి.పాస్చ్చాత్య ప్రభావం వల్ల ప్రజాస్వామ్యభావాలు, శాస్త్రీయ ,సాంకేతిక విద్యా వ్యాప్తి జరిగాయి.రైలు మార్గాలు,టెలిగ్రాఫ్,టెలిఫోన్, కార్లు,బస్సులు,లారీల వలన మనుషులు,సరకుల రవాణా,పెరిగి సమాచారసౌకర్యం ఏర్పడింది .వ్యాపారం,పరిశ్రమలు వ్రిద్ధి చెందాయి.స్త్రీవిద్య,హక్కులు పెంపొందాయి.1902 లో బాలికల పాదాలు కట్లతో బంధించే దురాచారం నిషేధింపబడినది.చైనాలో కాగితం,ముద్రణ పూర్వ కాలంనుంచి ఉన్నా ,గ్రంథాలన్నీ పండితభాషలో రాసేవారు.వ్యవహారిక భాషలో వ్రాయడం ప్రారంభమైనది.ఆధునిక ముద్రనాయంత్రాలు ,టైపు మెషీన్ల తో అనేక పత్రికలూ,పుస్తకాలు ప్రచురించడం జరిగింది.పాథసాలలు,కళాశాలలు స్తాపనతో విద్యావ్యాప్తి జరిగింది  

6, ఏప్రిల్ 2012, శుక్రవారం

China-contd-9

౧౮వ శతాబ్దంలో ఉన్నత స్థితిలో ఉన్న మంచూ సామ్రాజ్యం ౧౯వ శతాబ్దిలో కూడా కొనసాగినా ఇబ్బందుల్ని ఎదుర్కొంది.కొంత ప్రతిష్తను కోల్పోయింది.మొదట పేర్కొన్న ఆరుగురు చక్రవర్తుల తర్వాత మరి ఆరుగురు చక్రవర్తులు పాలించారు.చివరి నలబది సంవత్సరాలు నామమాత్రంగా ఇద్దరు చక్రవర్తులు ఉన్నా చిక్సీ అనే రాజమాత తెర వెనుక నుంచి పరిపాలన నిర్వహించింది.
   బ్రిటన్,ఫ్రాన్స్ ,పోర్చుగల్ ,హాలండ్ వంటి పాశ్చాత్య దేశాలు అప్పటికే ఇతర దేశాల్లో సామ్రాజ్యాలు స్థాపించుకొని ,చైనాలో వర్తకం,స్థావరాలు,రేవు పట్టణాల్లో ఆధిపత్యం గురించి చైనా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ ,రాయితీలు రాబట్టే వారు.
  ఇండియాలో తమ స్వాధీనంలో ఉన్న ప్రాంతాల్లో గంజాయి పంటను ప్రోత్సహించి  బ్రిటిష్ వారు దానిని చైనా వర్తకులతో కలసి ఆ దేశానికి ఎగుమతి చేసేవారు .ఇండియా ,ఛీ నాలలో  పూర్వకాలం నుంచి నల్లమందు వైద్యానికి వాడేవారు.కాని దానిని వ్యసనంగా మార్చి ప్రజలని దానికి బానిసలుగా చేసారు.గంజాయిని నిషేధించి ,మాన్పించడానికి ప్రభుత్వ ప్రయత్నాలు విఫలమైనవి.ఈ విషయంలో బ్రిటిష్ ,చైనా నౌకా దళాలకు పోరాటం జరిగింది.అందులో చైనా ఓడిపోయింది.దీనినే నల్లమందు యుద్ధం అంటారు.ఇది చైనా దేసభక్తులకు అవమానం గా తోచింది.
   స్వతహాగా హాన్జాతి వారికి మంచూ జాతి మీద గల వైమనస్యం తిరుగుబాట్లకు దారితీసింది.ఇందులో ముఖ్యమైనది ఎర్ర తలపాగాలు లేక red  Turbans  అనే సంఘం వారి తిరుగుబాటు.
  ఎక్కువ కాలం ,దాదాపు ఇరవయి సంవత్సరాలు జరిగిన ఉద్యమం,విప్లవం టైపింగ్ తియాన్గో '(heavenly kingdom of great peace )1899 లో తీవ్రమైనది.హాంగ్ క్సిక్వాన్ అనే యువకుడు క్రైస్తవ మాట ప్రభావం చేత తనను తాను ఏసుక్రీస్తు అపరావతారంగా భావించుకొని ప్రకటించుకొన్నాడు. 20000మన్ది అనుచరులను సంపాదించి యాన్గ్సీ నదీ ప్రాంతాన్ని ,అక్కడ కొన్ని నగరాలను స్వాధీన పరచుకొన్నాడు.కొంత సైన్యాన్ని రాజధాని బీజింగ్ పైకి ముట్టడికి పంపించాడు.కాని మంచూ రాజులు విదేశీ సైనిక సహాయంతో ఈ తిరుగుబాటుని అణచివేశారు.
  ఉత్తరాన రష్యా సామ్రాజ్య విస్తరణ ఆందోళన కలిగించింది.జపాన్ కూడా బలపడి కొరియా,మంచూరియాలను ఆక్రమిన్చెఅ ప్రయత్నం చేసింది.కాని అగ్రరాజ్యాల పరస్పర వైరుధ్యాల వలన రష్యా,జపాన్ల ప్రయత్నాలు ఫలించలేదు .
 మరొక ముఖ్యమైన తిరుగుబాటు మల్లయోధుల తిరుగుబాటు Boxers rebellion .కాని ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు.విదేశీయులు,వారి మతస్తులైన క్రైస్తవులకు వ్యతిరేకంగా జరిగింది.చాలామంది క్రైస్తవుల్ని ,మిశానరీలను చంపేశారు.చర్చీలను ద్వంసం చేసారు.కాని ప్రభుత్వం చూస్తూ మిన్నకుండింది.అంతర్జాతీయంగా దీనిపై తీవ్ర ఆందోళన కలగడంతో పాశ్చాత్య దేశాలు తమ సైన్యాలు పంపి ఈ తిరుగుబాటుని అణచివేసాయి.
 19va శతాబ్దంలో జాతీయ, అంతర్జాతీయ మార్పులు చాల జరిగాయి.శాస్త్రీయ విజ్ఞానం పెరిగింది.ఆధునిక విద్య,భావాలు అభివ్రిద్ది చెందాయి.రైలు మార్గాలు,టెలిగ్రాఫు వంటివి ప్రవేశ పెట్టబడినవి.స్త్రీలపై నిర్బంధాలు కొన్ని తొలగించారు .అందంకోసం బాలికల పాదాలు ఎదగకుండా కట్లు కట్టే దురాచారం నిషేధింపబడినది.
   సరిహద్దుల్లో తిరుగుబాట్లు జరుగుతూ ఉండేవి.కేంద్ర ప్రభుత్వం బలహీనపడి రాష్ట్ర గవర్నర్లు, పాలెగార్లు బలపడ్డారు.
   ఈ నేపధ్యంలో జాతీయ,ప్రజాస్వామిక  ఉద్యమం విజయవంతమై ,రాజరికం తొలగింపబడి రిపబ్లిక్ స్థాపించబడినది.అప్పటి చక్రవర్తి పేరు  పీ-యూ.చంతిపిల్లవాడు .అందువలన సంరక్షకులతో రాజప్రాసాదం లోనే ఒక భాగం లో ఉంచారు. 1911 లో రిపబ్లిక్ ప్రకటించబడి చైనా రాజరిక, ఫ్యూడల్ వ్యవస్థ నుంచి ఆధునిక యుగంలోకి అడుగుపెట్టింది.కాని ముందు ముందు ఎన్నో అంతర్పోరాటాలు,యుద్ధాలు,రక్తపాతం,కరవుకాటకాలు అనుభవించింది.
   (మిగతా మరొక సారి.)

5, ఏప్రిల్ 2012, గురువారం


2, ఏప్రిల్ 2012, సోమవారం

కమనీయం: CHINA-CONTD.=8

కమనీయం: CHINA-CONTD.=8

CHINA-CONTD.=8

 
  
 మింగ్ చక్రవర్తులలో చివరి వాడైన 'చోంగ్జెన్ 'ఆత్మహత్య చేసుకొన్నాక 'మంచూ ' సైన్యం రాజధాని బీజింగ్ ని ఆక్రమించుకొన్నది.కాని,మిగతా చైనా సామ్రాజ్యాన్ని ,సరిహద్దులలోని అనేక తెగల,జాతుల రాజ్యాలను ఆక్రమించడానికి 40 సంవత్సరాలు పట్టింది.మింగ్ రజవంశీయులి,సైనికాధికారులు చాలా తిరుగుబాట్లు లేవదీశారు.కొందరు మంచూ పక్షం చేరారు.తిరుగుబాటు దార్లలో ముఖ్యులు 'లీజిచెంగ్ ' ,'జెంగ్ చెంగాంగ్ 'అనేవారు.తీవ్రమైన పోరాటాల తర్వాత,విపరీతమైన జననష్టం,రక్తపాతం,నగరాలవిధ్వంసం జరిగాక మంచూలు తిరుగుబాట్లన్ని అణచివేశారు.యునాన్ కొండప్రాంతం,ఫార్మోసా (నేటి తైవాన్ ) తో సహా చైనా అంతా వారి అధీనంలోకి వచ్చింది.జుంగారియా, సింకియాంగ్ వంటి సరిహద్దు ప్రాంతాలు కూడా ఏళ్ళ తరబడి పోరాటాల తర్వాత వారి వశమైనవి.ఇవి బీడునేలలు,ఎడారులు.ఐనా చైనా రక్షణకి అవసరమని వీటిని ఆక్రమించారు. చివరగా లామాల అంతహ్ కలహాలను ఉపెయోగించుకొని టిబెట్ని కూడా ఆక్రమించారు.కాని అక్కడ కొద్ది సైన్యాన్ని,అధికారులను మాత్రం ఉంచి ఉపసమ్హరించుకొన్నారు.
   మంచూ రాజులు లామాలని గౌరవించేవారు.వజ్రయాన బౌద్ధమతాన్ని అనుసరించేవారు. చాల బౌద్ధ ఆలయాలను కట్టించారు.క్రీ.శ.1620నుంచి,1820 వరకు 7గురు చక్రవర్తులు పాలించారు.అందులో ముగ్గురు బాగా ప్రసిద్ధులు.వీరు ముగ్గురు మొత్తం 100 ఏళ్ళు పాలించారు.వీరి పేర్లు వరసగా ,'కాంగ్ క్సీ ' ,యోంగ్జెంగ్ ,'క్వియన్లాంగ్ ' .యుద్ధభూమిలోనేగాక పరిపాలనలో కూడా సమర్థులే.అటు మంచూ,మంగోలు ,సంస్కృతులు,ఆచారాలతో బాటు ,ఇటు చైనా హాన్ జాతి సంస్కృతి, ఆచారాలను కూడా పాటించారు.బొద్ధమతాన్ని.కంఫూసియస్ నీతిని కూడా అనుసరించేరు.    సాహిత్యాన్ని,కళలను పోషించారు.ఈ కాలంలో చైనా వైశాల్యంలోనే గాక సిరిసంపదలలో కూడా ప్రముఖంగా ఉన్నట్లు విదేసీ యాత్రికుల వ్రాతల వలన తెలుస్తోంది.ప్రధానంగా సిల్కు వస్త్రాలని ,పింగాణీ వస్తువుల్ని ఎగుమతి చేసి ,నూలు వస్త్రాలను ,సుగంధద్రవ్యాలను దిగుమతి (మన దేశం,ఇండొనీసియా దీవులనుండి ) చెసుకొనేది .ఈ వ్యాపారాన్ని పోర్చుగెసు,డచ్ ,ఇంగ్లీషు వర్తకులు చేజిక్కంచుకొని బాగా లాభాలు పొందేవారు.
  ఐతే మంచూ రాజుల నిరంకుశత్వం చినా వారికి పడలేదు.ముక్ఖ్యంగా వారి ఆచారం అంటే మగవారందరూ తలవెంట్రుకలు ముందుభాగంలో గొరిగించుకొని ,వెనక జుత్తు జడ వేసుకోవాలని నిబంధన.కాని దీనిని ఇష్టం లేకపోయినా పాటించకతప్పలేదు.లేకపోతే కఠిన శిక్షలు పడేవి.మనం ఈ దృశ్యాలను చైనా కుంగ్ఫూ,కరాటే సినిమాల్లో చూడవచ్చును.
  చైనా చక్రవర్తులు విదేశీ రాయబార్లను లెక్క చేసే వారు కాదు.అప్పటి బ్రిటిష్ రాజు జార్జి 3 రాయబారితో కానుకలు పంపిస్తే ఇవన్నీ మాకు ఉన్నాయి ,అవసరం లేదని పంపించేసాడు.
     ఈ వంశాన్ని '  క్వింగ్ మంచు ' వంశం అంటారు.(మిగతా మరొక సారి)       

29, మార్చి 2012, గురువారం

China-7-contd.


 

  మింగ్ వంశం 1368 నుంచి 1644 వరకు దాదాపు మూడు శతాబ్దాలు చైనా సామ్రాజ్యాన్ని పరిపాలించింది.ఇందులో కొందరు రాజులు అసమర్థులైనా,మధ్యలో కొన్ని అపజయాలు పొందినా రాజ్యాంగయంత్రం పటిష్టం గా ఉండటం వలన పరిపాలన బాగానే సాగింది.మొత్తం 16 చక్రవర్తులు పరిపాలించారు .మంగోలియా,కొరియా,జపాన్లపై దండయాత్రలు విఫలమైనవి.అన్నాం (నేటి వియత్నాం ) ని ఆక్రమించినా తీవ్రమైన తిరుగుబాట్ల వల్ల నిలబెట్టుకోలేక ఉపసమ్హరించు కోవలసి వచ్చింది.కాని,మిగతా సామ్రాజ్యమంతా శాంతి భద్రతలు నెలకొన్నాయి.కళలు,చేతి పరిశ్రమలు అభివృద్ధి చెందాయి.నవలలు రచించ బడ్డాయి.అందులో ఒకటి - పూర్వం హుయెన్ త్సాంగ్ భారత దేశ యాత్ర అనేక కల్పనలతో రచింప బడినది.విదేశాలతో వర్తకం ,దేశంలో పంటలు ,వాణిజ్యం అభివృద్ధి చెందాయి.40 ప్రధాన నగరాలు ఉన్నట్లు యూరపియన్ యాత్రికులు రాసారు.అంతకుముందు నుంచే వున్నా ఈ కాలంలో, పింగాణీపరిశ్రమ (porcelain),సిల్కు వస్త్రాలు, కాగితం,ముద్రణ,ఇంకా అభివృద్ధి చెందాయి. సిల్కు బట్టలపై చిత్రలేఖనం చైనా వారి ప్రత్యేకత.
  ఈ కాలంలో జరిగిన మరొక ముఖ్యమైన విషయం - 6సార్లు పెద్ద నౌకాదళం ఆగ్నేయ ఆసియాదేశాలు, శ్రీలంక,మనదేశంలో మలబార్ తీరం ,పెర్షియన్ సింధుశాఖ ,ఆఫ్రికా తూర్పు తీరాలను చుట్టిరావడం.కాని సముద్రాంతర వలసరాజ్యాలు మాత్రం స్థాపించలేదు.(ఒక శతాబ్దం తర్వాత యూరపియన్ దేశాలు ఆ పని చేశాయి ) ఇంత గొప్ప నౌకలని అంతవరకు ఏ దేశమూ తయారు చేయలేదట .కాని ఆ తర్వాత ఎందుకో చైనా నౌకాదళాన్ని నిర్లక్ష్యం చేసింది.
 మరొక ముఖ్య విషయం చైనా మహాకుడ్యాన్ని (great wall of China) పటిష్టంగా పునర్ నిర్మించడం.ఇప్పుడు యాత్రికులు బీజింగ్ దగ్గర చూసేది మింగ్ వంశం నాడు కట్టినదే అంటారు.
  ఈ కాలంలో చైనా జనాభా 3 రెట్లు పెరిగిందని అంచనా.అంతవరకు 2వేల సం; నుంచి 5-10 కోట్ల మధ్య ఉండే జనాభా దాదాపు 30 కోట్లకు పెరిగింది.మింగ్ రాజధాని మధ్య చైనా లోని నాంజింగ్ నుండి ఉత్తర చైనా లోని బీజింగ్ కు మార్చబడింది.అక్కడే అనేక రాజభవనాలు ,రోడ్లు ,ఉద్యానవనాలు ,సరస్సులు ,ఆలయాలు నిర్మించారు.వాటినే ఇప్పుడు పర్యాటకులు దర్శిస్తూవుంటారు.
 సాంస్కృతికంగా పెద్ద మార్పులేమె లేవు.కంఫుసియస్ నీతిశాస్త్ర పద్ధతుల్లోనే సమాజం ప్రవర్తిల్లుతుండేది.స్త్రీలు శీల వతులై ,భర్తలకు అనుకూలంగా విధేయులై ఇల్లు చక్క బెడుతూ ఉండాలి.సేవకులు  యజమానుల ఆజ్ఞలను పాటించాలి.ప్రజలు రాజభక్తితో ఉండాలి.వ్యక్తి జీవితంలో నిజాయితీ, సత్యసంధత తో గౌరవమర్యాదలు పాటించాలి.
 బౌద్ధమతాన్నికూడా ప్రజలు అనుసరించే వారు.బౌద్ధ ఆరామాలు చాల ఉండేవి.సన్యాసులు,శ్రమణకులు (monks) బొధలు చేస్తూ,తిరుగుతూ ఉండేవారు. గురుశిష్య సంబంధాలు మనలాగే ఉండేవి.
     (  మిగతా మరొకసారి.)                  

28, మార్చి 2012, బుధవారం

our armed forces




 ఈ రోజు పత్రికల్లో జనరల్ వీ,కే.సింగ్ స్టేట్మెంట్ చదివి రాస్తున్నాను.ప్రభుత్వాన్నిగాని,ఏ పార్టీని గాని సమర్థించాలని కాదు.నా సందేహాలను తెలియజేయడానికే.
  1.ఇన్నాళ్ళు వూరుకొని తనకు పదవీ కాలం పొడిగింపు ఇవ్వకపోయేసరికి అక్కసుతో ఇలా మాట్లాడినట్లు  ఉంది.
  2.మంత్రులు,రాజకీయనాయకులు అంతా అవినీతిపరులు,అసమర్థులూ అనుకొందాము.మరి సైనికాధికారులు ఏం చేస్తున్నారు?
  3.సైన్యాధ్యక్షుడు గా ఉన్న అతనికి ప్రమేయమేమీ లేదా?మన సైన్యాన్ని అన్ని విధాలా బలోపేతం చెయ్యడానికి ,మంచి,అధునాతన ఆయుధాలు సేకరించడానికి ఆయన బాధ్యత లేదా?
  4.సైన్యానికి తగిన ఆయుధాలను తయారు చేసుకోడానికి ,కొనడానికి ,చాలా కాలం పట్టుతుంది.దానికి చాలా procedures కమిటీలు తతంగం ఉంటుంది.అందువలన సింగు గారి ప్రకటన నిజమైతే ఆయన తో బాటు కనీసం గత 10 ఏళ్ళ నుంచి సంబంధిత కమిటీలు,
 మంత్రులు,సైనికాధికారులు ,అందరూ బాధ్యత ఎంతొకొంత వహించవలసి ఉంటుంది.
 5.అంతిమ నిర్ణయం కేబినెట్దే ఐనా సాంకేతిక సమాచారం ,సిఫార్సులు సైనిక నిపుణులు అందించవలసి ఉంటుంది.కేబినెట్ నిర్ణయాలు  దానిపైనే ఆధారపడిఉంటాయి.
 6.గతంలో బోఫోర్స్ ఫిరంగులు పనికిరానివి కొన్నారని విమర్శించారు.కాని కార్గిల్ యుద్ధంలో అవి తమ సామర్థ్యం నిరూపించుకొన్నాయి.అలాగే మన చిన్న నాట్ (GNAT) విమానాలు అంతకు ముందు యుద్ధంలో పెద్దవిమానాలపై పైచేయి సాధించాయి.
 7.ఏమైనా వీ,కే .సింగు గారు ఈ సైనిక బలహీనతలను సరిచేసి ,పటిష్టం చేయడానికి తన హయాంలో ఏ చర్యలు తీసుకొన్నారో  తెలియజేస్తే మంచిది.
 8.సైనిక రహస్యాలను వెల్లడించడం మంచిదికాదు.దీనిపై  ప్రతిపక్షాలలోని నిపుణులతోబాటు కమిటీ వేసి తగు చర్యలు తీసుకొంటే మంచిది.
 9.ఈ వ్యవహారాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోడంకంటే ,సైనిక పాటవాన్ని ఎలా బలపర్చుకొని దేశాన్ని శత్రుదుర్భేద్యం చెయాలనన్న విషయం  పై దృష్టి కేంద్రీకరించాలి.
   ఈ విషయంపై నాకన్నా మిలిటరీ వ్యవహారాలు తెలిసిన వారు ,నిపుణులు,స్పందించి వ్రాస్తే బాగుంటుంది.

China-6-contd.




  మనమిప్పుడు 11 వ శతాబ్ది వరకు చైనా చరిత్రను విహంగావలోకనం చేసాము.టాంగ్ వంశీయుల ఉచ్చదశ,క్షీణదశ తర్వాత చైనా 6,7,రాజ్యాలుగా విడిపోయింది.టాంగుట్,జుర్చెన్,మంగోల్,తార్తార్ ,టిబెటన్ మొ '" చైనీయేతర జాతులవారు చాలా భాగాలను ఆక్రమించుకొన్నారు. చైనా రాజులు యాంగ్- సికి- యాంగ్ నదీ ప్రాంతాన్ని ,దక్షిణ చైనా ప్రాంతాన్ని నిలబెట్టుకొన్నారు.ఈ వంశం పేరు సోంగ్ లేక సాంగ్ వంశం.(song dynasty  ) వీరు ఏ.డి. 1000 నుంచి 1250 వరకు పాలించారు.
  అప్పుడు ప్రపంచాన్నే గడగడ లాడించిన మంగోల్ దండ యాత్రలు చెంగిజ్ ఖాన్ నాయకత్వంలో ప్రారంభమయ్యాయి. ఆసియా, యూరప్ ఖండాల్లో విశాలమైన ప్రాంతాలు ,రాజ్యాలు జయించి చెహెంఘిజ్ఖాన్ ,అతని వారసులు,మధ్యధరా సముద్రం నుండి పసిఫిక్ మహాసముద్రంవరకు సామ్రాజ్యాన్ని విస్తరింప జేసారు.చెంగిజ్ మనుమడు కుబ్లైఖాన్ చైనా అంతటినీ వశపర్చుకొన్నాడు.తన వంశానికి 'యువాన్ ' వంశమని పేరుపెట్టుకొన్నాడు. మంగోలులు సంచారజాతులు కాబట్టి వారి జీవన విధానం వేరుగా ఉండేది. కాని ,కుబ్లైఖాన్ చైనా(హాన్ జాతి) వారి విధానాలను,కంఫూసియస్ సిద్ధాంతాలను అనుసరించి పరిపాలించేడు.ఇతని కాలంలోనే మార్కో పోలో అనే ఇటలీ దేశస్తుడు వచ్చి రాజదర్బారులో కొంతకాలం ఉన్నాడు.అతని వ్రాతలవలన ,అప్పటి చైనా దేశపు నగరాలు, సంపదలు, భవనాలు,వైభవం గురించి యూరప్ కి తెలిసింది.ఆకాలంలో యూరప్ ఇంకా పేదరికంలో, అనాగరకంగా వెనుకబడిఉండేది.అందువలన మార్కోపోలో రాసినవి అతిశయోక్తులో,కల్పనలో అని కొందరు అనుకొన్నారట.
   కుబ్లైఖాన్ చైనాను ఆక్రమించిన తర్వాత ,కొరియా, జపాన్, వీత్నాంలను ఆక్రమించడానికి పెద్ద నౌకా దళాన్ని తయారుచేసి పంపించాడు.కాని రెండుసార్లు పెద్ద తుఫాన్లు (టైఫూన్) వచ్చి ఆ ప్రయత్నాలు విఫలమైనవి.
  మంగోలువంశపు పాలన వంద 100 సంవత్సరాలు సాగినతర్వాత తిరుగుబాట్లు చెలరేగాయి. ఝూ (zhu) అనే వీరుడు నాయకత్వంవహించి క్రమంగా మంగోలుల పాలనను అంతంచేసి మళ్ళీ స్వదేశీ చైనా  వారి పాలనను ప్రారంభించాడు.చైనా చక్రవర్తిగా ప్రకటించుకొన్నాక (A.D.1375) తన వంశానికి 'మింగ్ ' (MING) అనే పేరు పెట్టుకొన్నాడు.మింగ్ అంటే ప్రకాశవంతమైన అని అర్థం.ఈ మింగ్ వంశం చైనా చరిత్రలో ప్రసిద్ధి గాంచినది. (మిగతా మరొక సారి. )
   

20, మార్చి 2012, మంగళవారం

18, మార్చి 2012, ఆదివారం

New Year Greetings to all


 

 నందన నామవత్సర   మమంద మనోజ్ఞ మహానుభూతులన్
 అందరు బంధు మిత్రులకు నందగజెయుత మంచు గోరుచున్
 అందములొల్కెడి జీవన మరందము గ్రోలుడి యంచు దెల్పెదన్
 డెందము పుల్కరింపగ ,స్వదేశ విదేశ ప్రజాళి కంతకున్ .

          ----------------------  
  నవయుగాదికి నాందిగా నందనాఖ్య
  వత్సరాంగన అరుదెంచె ,పల్లవసుమ
  శోభిత దుకూలమును దాల్చి శుభములీయ
  నెల్లవారికి ,స్వాగత మ్మీయ రండు.      
          ------------------

14, మార్చి 2012, బుధవారం

China-5-(contd.)




 ఈ టాంగ్ వంశ పాలనా కాలంలోనే చైనా సామ్రాజ్యం మధ ఏసియాలో సమర్ఖండ్ వరకు ఉత్తరాన మంచూరియా వరకు విస్తరించింది.ఆ కాలంలో (7,8,శతాబ్దులలో  )ప్రపంచంలోనే పెద్ద ,గొప్ప,సామ్రాజ్యంగా వెలసింది.చివరిలో  ఆన్ లుషాన్ అనే సైనికాధికారి తిరుగుబాటు చేసి రాజధాని చాంగాన్ ను ఆక్రమించి ,చక్రవర్తిని తరిమేసాడు.అతని మరణం తర్వాత మళ్ళీ రాజధాని టాంగ్ వంశస్తుల వశమైంది కాని,పూర్వ ప్రాభవం పొందలేక పోయింది.
  A.D.750 నుండి 907 వరకు వరుసగా 15 గురు చక్రవర్తులు పాలించినా ,తిరుగుబాట్లు ,సరిహద్దుల్లో ఆక్రమణలూ ఎక్కువైనవి.10వ శతాబ్దంలో 3రాజ్యాలుగా చీలిపోయింది.ఇందులో ఉత్తరప్రాంతాన్ని పాలించిన వారు చైనా హాన్ జాతీయులు కాదు.ఖిటాన్ అనే జాతి వారు .వారి భాష కూడా వేరు.
  6-10 శతాబ్దుల కాలంలో చైనాలో పరిస్థితులు.
  రాజకీయ పరిస్థితులు ఎలా మారుతున్నా దేశంలో జనజీవితం యధావిధిగా కొనసాగుతూ ఉంటుంది కదా. సిల్క్ బట్టల తయారీ. ఎగుమతులూ కొనసాగుతూ ఉండేది.వెదురు నుంచి కాగితం తయారీ అప్పటికే జరుగుతూ ఉందేది .A.D.8 వ శతాబ్దంలో పేపరు మీద అచ్చులతో ముద్రించడం (block  printing) ప్రారంభ మైనది.యూరప్లో గుటెన్ బర్గ్ ముద్రణా యంత్రాన్ని 15వ శతాబ్దంలో కనిపెట్టేవరకు వాళ్ళకు ప్రింటింగు తెలియదు.మనదేశంలో 18 వ శతాబ్దంలోనే మిషనరీలు అచ్చువేయడం   ప్రారంభించారు.చైనాలో అప్పటి నుంచే బౌద్ధ ,కంఫూసియన్ ,గ్రంధాలు ముద్రించడం ప్రారంభించారు.మన కావ్యాల్లో చీనిచీనాంబరాల ప్రసక్తి క్రీ.పూ.నుండే కనిపిస్తుంది.చైనాలో నదులు,కాలవల ద్వారా,రోడ్ల ద్వారా రాకపోకలు, సరకుల రవాణా,జరుగుతూ ఉండేవి. నౌకల ద్వారా సముద్ర వ్యాపారం జరుగుతూ ఉండేది.(మన దేశం,ఆగ్నేయాసియా దేశాలతో ఎక్కువగా సముద్రమార్గంలోను ,మధ్య ఆసియా,పెర్షియా ,టర్కీ ,యూరప్లతో భూమార్గంలో సిల్కు రోడ్డు పైన వాణిజ్యం జరిగేది.
  ఫ్యూడల్ పద్ధతిలో ,కంఫూషస్ సిద్ధాంతాలప్రకారం జరిగేది.శిక్షలు కఠినం గాఉండేవి.పెద్దలను చిన్నవారు ,యజమానులను సేవకులు,రాజులను ఉద్యోగులు ,ప్రజలు గౌరవించాలి ,ఆజ్ఞలను శిరసావహించాలి.
 ఆ కాలంలో పెద్ద నగరాలు లుయాంగ్ ,చాంగాన్,నాంజింగ్ ,యాంగ్జౌ, గువాంగ్జౌ, చెంగ్డు బీజింగ్,,కొంతకాలం లుయాంగ్, కొంతకాలం చాంగాన్ రాజధానులుగా ఉండేవి.ఉత్తరప్రాంతంలో గోధుమలు,జొన్నలు ,దక్షిణప్రాంతంలో వరి ఎక్కువగా పండించేవారు.పెద్ద పెద్ద కట్టడాలు  కూడా ఇటుకలు,మట్టి,పెంకులు, చెక్క కర్రల తోనే నిర్మించే వారు.
  ఇంతవరకు,10వ శతాబ్ధి   A.D.వరకు చాలా క్లుప్తంగా చైనా చరిత్ర తెలుసుకొన్నాము.ఇంకా ఉంది.to be continued  

 
  

13, మార్చి 2012, మంగళవారం

China-contd.




 చైనా -A.D.189 TO 550.
 హాన్ సామ్రాజ్యం అంతరించిన తర్వాత ,దాదాపు 400 సంవత్సరాలు చైనా మూడు రాజ్యాలుగా చీలిపోయింది.సరిహద్దు ప్రాంతాలన్నీ ఇతర జాతులవారు ఆక్రమించుకొన్నారు.మూడు రాజ్యాలలో ఉత్తర వెయ్ (wey) ,పశ్చిమ ప్రంతం షు,(shu) ,తూర్పు(wu) వు,అనిపేర్లు. వరుసగా వాటిని 5,16,9, వంశాలు పాలించాయి.ఈ కాలంలో కంఫుసీన్ ,దావొలా ఎ,బౌద్ధ మతాలు వర్ధిల్లాయి.వీటిని అనుసరించే వారి మధ్య చర్చలు,వాదప్రతివాదాలు జరిగేవి.ఒక్కొక్క సారి ఒకరి పద్ధతులను,సిద్ధాంతాలను,మరొకరు అనుసరించేవారు.కాని మతప్రాతిపదిక పైన యుద్ధాలు జరిగేవి కావు.చైనా చరిత్ర లో కూడా చాలా యుద్ధాలు ,రక్తపాతాలు,అంతహ్కలహాలు,జనహత్యలు జరిగాయి. కాని అవి మతం కోసం కాదు.రాజ్యం కోసం ,అధికారం, ప్రాబల్యం కోసం ,పగలు ద్వేషాల వలన జరిగాయి.
  సామ్రాజ్యం విచ్చిన్నమైనా ,వర్తకవ్యాపారాలు,కళలు,నాగరకత కొనసాగాయి.అనేక బౌద్ధ ఆలయాలు నిర్మించబడినవి.కాని అవి మన దేశంలో లాగ గుండ్రని స్తూపాల వలె కాక,చైనా పద్ధతిలో 3,4,అంతస్తులతో చతురస్రం గా నిర్మింపబడినవి.ఈ కాలంలో చైనా(హాన్) జాతివారే గాక హూణులు (Huns ) సియాలు (Xias) మొదలైన ఇతర జాతులవారు కూడా కొన్ని ప్రాంతాలు ఆక్రమించుకొని  పాలించారు.
   ఆ.డ్.550--755-ఈ కాలంలోనే మళ్ళీ చైనాని  ఒకే ఆధిపత్యం కిందికి తీసుకువచ్చే ప్రయత్నం జరిగింది.ఇందులో మొదటి కొంతకాలం సుయి (suyi) అనే రాజవంశం ,తర్వాత టాంగ్ (tang) అనే వంశం పాలించాయి.ఈ కాలంలోనే హుయన్సాంగ్ (xuanzang) అనే బౌద్ధ భిక్షువు మన దేశానికి వచ్చి బొద్ధమతాన్ని ,గ్రంథాలను అధ్యయనం   చేశాడు. అప్పుడు మనదేశంలో హర్షవర్ధనుడు పాలించేవాడు.ఈ యాత్రికుని చాలా ఆదరించాడు.హుయన్సాంగ్ A.D, 629లో చైనా వదలి చాలా కష్టం మీద భూమార్గంలో మనదేశం వచ్చి,దేశమంతా తిరిగి A,D.645 లో సముద్ర మార్గంలో తిరిగి వెళ్ళాడు. అనేక గ్రంథాలను  తీసుకొని వెళ్ళాడు.   -to be continued later
 

  

3, మార్చి 2012, శనివారం

office phones


 
  మీకెప్పుడైనా మీ సెల్ ఫొన్ నేలమీద విసిరిపారేయాలనిపించిందా?ప్రతివారికీ ఎప్పుడో ఒకసారైనా అనిపించిఉంటుందని నా నమ్మకం.
 ఈ మధ్య ఒక ఆఫీసులో పనిబడి వాళ్ళ నంబర్ కోసం ప్రయత్నించాను.కొన్ని ఆఫీసులూ ,బేంకులూ వాళ్ళ నంబర్లు ప్రచురించరు .ఒకాయన దానికి కారణం చెప్పాడు.ఎవళ్ళు పడితే వాళ్ళు అస్తమానం ఫోన్లు చేసి విసిగిస్తారట .నాకు కావలసిన ఆఫీసు నంబర్లు
ఎలాగో సంపాదించి ఫోన్ చేసాను.అందులో రెండు నంబర్లకి మీ నంబర్ సరిచూసుకొండి అని జవాబు వచ్చింది.మరి రెండునంబర్లకి రింగు వినబడుతున్నా ఎవరూ ఎత్తలేదు. అలా మూడు సార్లు  జరిగింది.ఆ రోజు సెలవు రోజు కాదు.ఫోన్ చేసిన సమయం కూడా ఆఫీసు టైమే.ఉదయం 11గంటలు.పోనీ బిజీగా వున్నారేమో నని మళ్ళీ 2గం/కి ఫోన్ చెసాను  మూడుసార్లు.రింగవుతున్నా ఈ సారీ  ఎవరూ పలకలేదు.సాయంత్రం 4గం/ కిమళ్ళీ ఫోన్ చేస్తే దయతలచి ఒక అమ్మాయి పలికింది .ఫలానా ఆఫీసరుతో మాట్లాడాలంటే ఇంకో నంబరుకి కనెక్ట్ చేసింది.ఈ సారి ఒక అశరీరవాణి ఈ ఆఫీసరు కావాలంటే ఈ నంబరులేక  ఈఆఫీసరుకైతే ఈనంబరు,ఆసెక్షన్ కైతే ఆనంబరు నొక్కమని,చివరగా నోరు మూసుకోవాలంటే ఈనంబరు నొక్కమని చెప్పింది.అశరీరవాణితో సంభాషణ కుదరదు కదా .నాకు కావలసిన నంబరు  గుర్తుపెట్టుకొని నొక్కాను,ఈసారి ఒక మొగ గొంతుక నాకు కావలసిన ఆఫీసరు ఈ నంబరు కాదని ఆయన వేరే డిపార్ట్మెంట్ అని మరోనంబర్ ఇచ్చాడు.ఆ నంబర్ నొక్కితే ఒక పాట వినిపించింది.పాట పూర్తయేదాకా విన్నాక ఆగిపోవడమే కాక కనెక్షన్ తెగిపోయింది.అరగంటపోయాక మళ్ళీ ప్రయత్నిస్తే మళ్ళీ ఇదే తంతు రిపీట్ అయింది.దానితో కోపమూ,దుహ్ఖమూ రాగా ,సెల్ ఫోన్ ని నేల మీదికి విసిరికొట్టాలని ,మనకే నష్టం కదా అని ఊరుకొన్నాను.
 తర్వాత ఒకసారి అమెరికా నుంచి వచ్చిన మిత్రుడికి ఈ విషయం చెప్పి అక్కడ ఇలా ఉండదు కదా అంటే 'అబ్బే ఇంత కాక పోయినా అక్కడ కూడా అప్పుడప్పుడూ ఇలా జరుగుతూ ఉంటుంది 'అన్నాడు.
  ఇంతకీ వీళ్ళు ఫోన్లు ఎందుకు పెట్టుకొంటారబ్బా అంటే ఒకాయన అన్నాడు.అవి మీకోసం ,నా కోసం కాదు.వాళ్ళకోసమ్మాత్రమే.వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడడానికి  ,వాళ్ళకి ముఖ్యమైన వాళ్ళు వారికి ఫోన్ చెయ్యడానికే. !








 
           

23, ఫిబ్రవరి 2012, గురువారం

china-contd.-3


 

 క్విన్ లేక చిన్ సామ్రాజ్యపు  చక్రవర్తి తన తర్వాత తన రాజ్యం శాశ్వతంగా ఉంటుందనుకొన్నాడు.కాని అతని మనమడి కాలంలోనే అంతరించింది.కొంతకాలం ఆధిపత్యపు పోరు ,అంతర్యుద్ధాలు ,తిరుగుబాట్ల తర్వాత ,క్రీ.పూ.210 నుండిక్రీ.పూ.140 వరకు ,మళ్ళీ క్రీ.శ.25 నుండి క్ర్హినాలో ఈ.శ.210 వరకు హాన్ వంశీయులు పాలించారు.మధ్య కాలంలో అనగా క్రీ.పూ.140 నుండి క్రీ.శ.25 వరకు వేరే వంశీయులు పాలించారు.మొత్తం మీద ఈ నాలుగు   వందల సం; కాలంలో దాదాపు చైనా అంతా ఒక పరిపాలనలోకి  వచ్చింది.ఈకాలంలో మన దేశంలో ఆంధ్ర శాతవాహన సామ్రాజ్యం వర్ధిల్లినది.( క్రీ.పూ.200-క్రీ.శ.200)వరకు.వీరి కాలం లోనే బౌద్ధమతం మధ్య ఆసియా నుంచి చైనాలో ప్రవేసించి ప్రజాదరణ పొందినది.కాని,కంఫుసస్ ,తావో బోధల ప్రభావం కూడా బాగా ఉండినది     చివరి రాజులు  బలహీనులు ,చిన్నపిల్లలు అగుట  రాజమాతలు  సలహాదారులు,రాజ్య పాలన సాగించే వారు.అంతహ్ పుర కుట్రలు ,తిరుగుబాట్లచేసామ్రాజ్యం పతనమై 4 రాజ్యాలు ఏర్పడి కలహించుకొంటూఉండేవి.సరిహద్దుల్లో హూణులనే జాతివారు తరచు దాడి చేసేవారు.
 ఐనా ఈ400సం;లోను చైనా సంపన్నమై,ప్రశాంతంగా వర్తక వ్యాపారాలతో వర్ధిల్లినదని చెప్పవచ్చును.
  హాన్ సామ్రాజ్య పతనం తర్వాత 400 సం;చిన్న రాజ్యాలు ఏర్పడి అస్థిరం గా ఉండేద్ .
 హాన్ సామ్రాజ్యం రోమన్ సామ్రాజ్యం కి సమకాలికమైందే.కాని 4వ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యం పతనమైనాక యూరప్లో మళ్ళీ సామ్రాజ్యం ఏర్పడలేదు.కాని చినాలో ఒక సామ్రాజ్యం పడిపోయాక ,కొన్నాళ్ళు పోయాక మరొక సామ్రాజ్యం ఏర్పడేది.
   తరవాత చరిత్ర మరొకసారి చెప్పుకొందాము.     

17, ఫిబ్రవరి 2012, శుక్రవారం

china-contd.


 

 చైనా చరిత్రలో మొదటి సామ్రాజ్యం క్విన్ లేక చిన్ వంశంలో 5వ తరం వాడైన ఝెంగ్ అనే రాజు స్థాపించాడు.ఇతని కాలం క్రీ.పూ.246 నుంచి 210 వరకు.దాదాపు చైనా అంతటినీ జయించి చక్రవర్తిగా (షి హువాంగ్డి ) గా పాలించాడు.ఇతడు సమర్థుడు, క్రూరుడు.చైనా వాళ్ళ పేర్లు మనకు చిత్రంగా ఉంటాయి.ఇంగ్లిష్ లోకి వచ్చేసరికి ఉచ్చారణ మారిపోతుంది.అందువలన క్లుప్తంగానే రాస్తాను.క్విన్ చక్రవర్తి పాలన వలన చైనా చరిత్రలో కలిగిన ఫలితాలు,మార్పులు మనకు ముఖ్యం. ఇతని పాలనలో చేసిన పనులు ,జరిగిన సంఘటనలు ముఖ్యం.
  1.రాజులు,రాజవంశాలు ఎన్ని మారినా చైనాకు అంతటికి ఒక సామ్రాజ్యం, సామ్రాట్టు ఉండాలనే భావం బలంగా నాటుకొనడం .
  2.చైనా జాతి ,దేశం ఇతరుల కన్నా గొప్పదని భావం కలగడం.
  3.సరిహద్దుల్లో నుంచి అనాగరక ,సంచారక జాతుల దాడుల నుంచి రక్షించు కొనుటకు ఉత్తర సరిహద్దులో పెద్ద గోడను నిర్మించడం .కాని మనం అనుకొన్నట్లు 3000 మైళ్ళ దూరం ఒకే గొప్ప గోడ కాదట.సందర్శకులు రాజధాని బీజింగ్ దగ్గర ఉన్నట్లు మహాకుడ్యం కాదు.అక్కడక్కడ కోటలు ,బురుజులు ,కొన్ని చోట్ల కట్టెలు ,మట్టి తో కట్టినవి కూడా ఉన్నవి.
 4.రాళ్ళతోను,మట్టితోను వందల మైళ్ళ దూరం రహదార్లు నిర్మించడం.
 5.(అప్పటికే ఉన్న) హొయాంఘో,యాంగ్ సీ ,నదుల మధ్య కాలువల సిస్టమ్ని అభివృద్ధి చేయడం.
 6.శాసనాలద్వారా పరిపాలనా నియమాలని అమలు చేయడం.ఒకే పాలనాపద్ధతులను చైనా అంతటా ప్రవేశపెట్టుట.
 7.అప్పటికి ఉన్న గ్రంథాలన్నిటినీ పనికిరావని తగలబెట్టించాడు.కాని కొన్ని కాపాడ బడ్డాయి.
 8.తన రాజ్యానికి చిన్న నకలుగా (miniatureempire) గా పెద్ద సమాధిని తన జీవితకాలంలోనే నిర్మింప జేసాడు.కాని దీనిని తర్వాత కాలంలో కొల్లగొట్టారు. A.D.1974లో ఈ సమాధి బయట పడింది.అందులో వందలకొద్ది మట్టితో చెసిననిలువెత్తు సైనికులు,రథాలు కనుగొన్నారు.(Toy army) చైనా పర్యాటకులు విధిగా  దర్శించేవి చైనా గోడ,బొమ్మల సైన్యం.
  తన తర్వాత శాశ్వతంగా తన వంశం,సామ్రాజ్యం నిలిచి ఉంటాయనుకున్నాడు ,ఈ క్విన్ చక్రవర్తి.కాని త్వరగానే అతని మనమడి కాలంలోనే ఈ సామ్రాజ్యం అంతరించింది.కాని దాని ముద్ర మాత్రం చైనా పైన శాశ్వతంగా పడినది.అది ఎలా జరిగిందో,తర్వాతి పరిణామాలేమిటో  మరోసారి రాస్తాను. 

15, ఫిబ్రవరి 2012, బుధవారం

chaina




 జాన్ కే అనే రచయిత చాలా పరిశోధించి రాసిన 'china-a history అనే గ్రంథాన్ని చదువుతున్నాను.అగ్రరాజ్యంగా వేగంగా ఎదుగుతున్న చైనా గురించి తెలుసుకోవాలంటే దాని ప్రాచీన చరిత్ర కూడా తెలుసుకోవాలని రచయిత అంటాడు .చాలా క్లుప్తంగా వివరిస్తాను.
 1.బి.సి.2000సం. పూర్వం మన షట్ చక్రవర్తులలాగే వాళ్ళు 5 గురు చక్రవర్తులు పాలించారని నమ్ముతారు.
 2.చారిత్రక కాలానికి వస్తే దాదాపు బి.సి.2000 నుంచి బి.సి.250 వరకు మూడు రాజవంశాలు పాలించినట్లు  ఆధారాలు ఉన్నాయి.ఐతే వీరిని రాజులుగానే గుర్తించారు.కారణం; వారు హొయాంగ్ హో ( yellow river ) పరీవాహక ప్రాంతాన్ని మాత్రమే పాలించారు.1.క్సియా (xia) వంశం బి.సి.2070 - బి.సి.1600 వరకు.2.షాంగ్ (shang) వంశం బి.సి.1600 - 1050 బి.సి.వరకు.3.ఝౌ ( zhou) వంశం బి.సి.1050- 256 బి.సి.వరకు పాలించాయి.వీరి గురించి సమాచారం ,ఎముకలు,వెదురుదబ్బలు ,కంచు పాత్రలపై చెక్కిన లిపులచేతను ,కొన్ని సమాధులలో లభ్యమైన అవశేషాల ద్వారా
 లభ్యమైనది.ఇవి కాక దక్షిణాన 'చు ' (chu) అనే రాజ్యం ,ఇంకా   కలహించుకొంటూ ఉండే చిన్న రాజ్యాలు కొన్ని ఉండేవి.(warring states)
  చైనా  వారికి మన లాగ మతాలు,వేదాంతాలు లేవు.వారికి కొన్ని నమ్మకాలు ఉండేవి.పిత్రుదేవతల ఆరాధన ముఖ్యం.(ancestor worship) బి.సి.6,5,శతాబ్దుల్లో కంఫుషస్   (confushiyas) ,లాత్సె (Laotse) ,మెంజి (mencius) అనే తత్వవేత్తలు  నీతిసూత్రాలు,సమాజనియమాలు,ప్రవర్తనావళి ,రచించారు.బోధించారు.వారి కాలంలో ప్రసిద్ధి కాంచకపోయినా ,తర్వాత కాలంలోను, ఈనాటికి కూడా చైనీయ సమాజానికి మార్గదర్శకంగా ఉన్నాయి.
 క్రీ.పూ.256 లో చైనాలో మొదటి సామ్రాజ్యం స్థాపించబడి చైనాలో అత్యధిక భాగం తన ఏలుబడి లోకి తెచ్చుకున్నది.ఈ వంశం పేరు క్విన్ లేక చిన్ .ఇతడు తనని చక్రవర్తిగా ప్రకటించుకొన్నాడు.(huyangDi).తర్వాతి చరిత్ర మరొకమారు తెలియజేస్తాను    చైనా చరిత్ర మనకెందుకు అని చాలా మంది అనుకోవచ్చును.కాని ఈ క్రింది కారణాలవలన అది మనకు ముఖ్యం.
  1.టిబెట్ని ఆక్రమించుకోడం చేత చైనా మనకు పొరుగు దేశం ఐనది మనకు,వాళ్ళకు సరిహద్దు తగాదాలు ఉన్నవి.2.1962 లో  మనపై దండయాత్ర చేసి ఆక్సాఇచిన్ ప్రాంతం ఆక్రమించింది.అరుణాచల్ తనదే అంటున్నది.3.మనకు విరోధి ఐన పాకీస్తాన్ కు బలమైన సప్పోర్టు ఇస్తూ ఉంటుంది.4.మనం కూడా క్రమంగా అగ్రరాజ్యంగా ఎదుగుతున్నాము.అందుచేత భారత్,చైనాలు అనేక రంగాల్లో పోటీ పడే అవకాశం ఉంది.5.మనదేశంలో చైనా అనుకూల  వర్గాలు,లాబీలు ఉన్నాయి.అవి మన దేశంలో అస్థిరత్వం కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి.
      -----------------------------
          

8, ఫిబ్రవరి 2012, బుధవారం

known already


  1.
 మా అబ్బాయి అప్పుడప్పుడూ ఫోన్ చేసి కొత్త విషయాలని చెప్పుతూ ఉంటాడు.సైన్సు సంగతులు వదిలేస్తే ,మేనేజ్మెంట్,పరిపాలన,మానవసంబంధాలు, నీతిసూక్తులు,వ్యాపార సూత్రాలు మొ;వాటి గురించి చెప్పినప్పుడు ,నేను ఇవన్నీ వేమన పద్యాల్లో ,సుమతీ శతకంలో ,భర్తృహరి సుభాషితాల్లో,మహాభారతంలో,భగవద్గీతలో,లేక కంఫూషస్ సూత్రాల్లోనో ఉన్నాయని చెప్పేసరికి ,మీరు అగ్నిహొత్రావధానులు లాగ 'అన్నీ మన వేదాల్లో ఉన్నాయష 'అన్నట్టు మాట్లాడతారని విసుక్కొంటాడు.అవును,మరి ఇవన్నీ పూర్వులు ఎవరో, ఎప్పుడో చెప్పినవే అంటాను.
 2.ఈ మధ్య హొయసాల శిల్పాల ఫొటోలతో ఒకరు బ్లాగు రాశారు .అందులో వరాహావతారంలో విష్ణుమూర్తి భూమిని పైకెత్తినట్లు చూపిస్తూ మామూలుగా చెక్కే స్త్రీమూర్తిగా కాకుండా గోళంలాగ ( globe ) చెక్కేరు.ఆశిల్పాలు 13వ శతాబ్దమ్నాటివి.  యూరప్లో భూమి గుండ్రంగా ఉందని 15వ శతాబ్దందాకా తెలియదు.బల్లపరుపుగా ఉందని అనుకొనే వాళ్ళు.కపిత్థాకారం భూగోళం అని మనవాళ్ళు   ఎప్పుడో చెప్పారు.( కపిత్థం అంటే వెలగపండు అని అర్థం ) .
 రచన పత్రికలో  చిట్టెన్రాజుగారి  జోకులతో ముగిస్తాను.ఆయనే చెప్పినట్లు జోకులమీద అందరికీ 'కాపీ రైటు ' ఉందికదా.
  1.మొగుడూ, పెళ్ళం, ఒకే నాణేనికి రెండు పక్కలే,ఎందుకంటే  పెళ్ళయ్యాక కొన్నాళ్ళకి ఒకరిమొహం మరొహరు చూసుకోలేరు కాబట్టి!
  2.ఒక ఫిలాసఫర్ యువకుడికి ఇచ్చిన సలహా ' తప్పకుండా  పెళ్ళి చేసుకో .మంచి పెళ్ళాం వస్తే జీవితాంతం ఆనందిస్తావు. లేకపోతే నాలాగ ఫిలాసఫర్వి అవుతావు.
  3.డాక్టర్ పేషెంటుతో 'ఈ రెండు మాత్రలు తీసుకొని రాత్రి ఒకటి వేసుకొండి .పొద్దున్న లేస్తే రెండో మాత్ర వేసుకొండి!

      -------------------------------     

22, జనవరి 2012, ఆదివారం

sooktulu


 

 1. కులమనుట చాల తప్పది
    వలవదు ,దానిని సమాజ వర్గంబనుచున్
    పిలుచుటయే సరియైనది
    తెలియుమ, కులరహిత భరత దేశంబందున్.
             ----------
 2. ప్రతి పక్షమ్ముల దిట్టుట
    యతిసహజమ్మె యధికార మందెడివరకున్
    మితిమీరి స్వపక్షమునే
    కతిపయదినముల ను దూరగా దగు నేడున్ .
             -------------
 3. నీవే పక్షమ్మైనను
    నీ వారలు కొందరెదిరి నిలువగ దగుగా
    శ్రీవారి పనులు తీర్చగ
    నేవాదమ్ము గెలిచినను నీకే మేలౌ  
              -------------- 

20, జనవరి 2012, శుక్రవారం

roots.contd.




 తిరుగు ప్రయాణం విజయనగరం మీదుగా.అక్కడ కొంచెం సేపు ఆగాము.అప్పటికే చీకటి పడింది.సెలవురోజు.ఇంతకు ముందు చూసిందే ఐనా మా వాళ్ళు కోసం కోట చూడ్డానికి వెళ్ళాము.గేట్లు మూసివున్నాయి.వాచ్మన్ ట్రాప్ డోర్ ద్వారా లోపలికి తీసుకు  వెళ్ళాడు.కోటని కా లేజికి ఇచ్చేసారు.సెలవురోజు, రాత్రి, గదులన్నీ మూసివున్నాయి. పైనుంచే చూసాము.కోట ఆవరణ చాలా పెద్దది.బిల్డింగులు కూడా పెద్దవీ ,మూడు అంతస్తుల్లో ఉన్నవి.కోట ప్రహరీ గోడ ఎత్తుగా రెండు కిలోమీటర్లు ఉంటుంది.కోట శిథిలం కాలేదు .బాగానే ఉంది.కాని చుట్టూ ఉన్న కందకం పూడ్చేసి గోడ దా కా ఏవో ఇళ్ళూ, దుకాణాలూ కట్టడం వలన బయట నుంచి కోట బాగా కనబడలేదు. ముఖద్వారం ఎదురుగా మాత్రం ఖాళీగా ఉంది.కన్యాశుల్కం ఫేం బొంకులదిబ్బ  లేదు.గంటస్తంభం (ఒక landmark )ఉంది.పెద్దచెరువు చుట్టూ చెట్లు పెంచారు.గట్టు మీద రాజుల విగ్రహాలు  ప్రతిష్ఠించారు.అన్నట్టు పీ.వీ.జీ.రాజుగారి విగ్రహమూ,ఒకప్పటి రాణి వాసం భవనాలూ కోటలోనే ఉన్న వి చూసాము.విజయనగరం చాలాకాలం    దాకా,పాతగా, అభివృద్ధి లేకుండా ఉండేది.కాని ఇటీవల ,ముఖ్యంగా రైల్వే స్టేషన్ వైపు  పెద్దరోడ్లు,మేడలు,ఆఫీసులు,హోటల్సు, కాలనీలు బాగా అభివృద్ధి చెందాయి.     గురజాడవారి ఇల్లు కూడా చూసాము.మంచి స్థితి లోనే ఉంది.మీరెవరైనా ఉత్తరాంధ్రకి వస్తే వైజాగ్ మాత్రమే కాక విజయనగరం కూడా చూడండి. ఒక శోచనీయమైన విష యమేమంటే అప్పటి కత్తులూ కటార్లూ కవచాలు దుస్తులూ ఇతర వస్తువులు  చాలా వరకూ విశాఖపట్నం,హైద్రాబాద్  వంటి చోట్లకి మ్యూజియంస్ కి తరలించేసార ట.  
  

18, జనవరి 2012, బుధవారం

sandeham.




  ఒక సందేహం;వాల్మీకి  రామాయణం,వ్యాసభారతం ,పూర్తిగా తెలుగులో చదివాను.కాని అందులో ఎక్కడా వ్రాత writingఉన్నట్లు దాఖలా లేదు.ఒకరు ఇంకొకరికి కబురు పెట్టినా ,రాయబారం పంపినా 'నా మాటగా ఇలా చెప్పు 'అని మాటలతోనే సందేశం పంపే వారు కాని లేఖలు రాసినట్లు నిదర్శనాలు లేవు.ఆ కాలం లో వ్రాత లిపి ఉండేదా ?మొదటి సారిగా మనకు అశోకుడి శాసనాల్లో నే వ్రాత ( బ్రాహ్మీ లిపి అనుకొంటాను.క్రీ.పూ.300 ) సింధు నాగరకతా శిథిలాల్లో ముద్రల పై లిపి కనిపిస్తుంది.కాని అది ఆర్యనాగరకత కాదు ,ద్రావిడ లేక దస్య నాగరకత అంటారు.( క్రీ.పూ.2500 )ఈ విషయానికి మన పండితులు ,పౌరాణికులు సమాధానం చెప్పలేరు.చరిత్ర పరిశోధకులు కాని,వారిని బాగా చదివినవారే చెప్పగలరు.మన  బ్లాగు మిత్రులెవరైనా తెలిసినవారుంటే విశదీకరిస్తే సంతోషిస్తాను.--రమణారావు.  

15, జనవరి 2012, ఆదివారం

roots

  

 మాది మొదట చామలాపల్లి అనే పల్లె,అగ్రహారం.మా తాతగారి కాలం లోనే దాన్ని విడిచి వైజాగ్లో సెటిలయ్యారు.మా భూములు 'జమిందారీ ,ఇనాందారీ, రద్దు చట్టం క్రింద 'స్వరాజ్యం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని రైతులకు పంచి పెట్టింది.ఒక తోట ,ఇల్లు మిగిలి ఉంటే మా నాన్నగారు అమ్మేసారు.అందువలన ఆ వూరి మీద ఆసక్తి లేక జీవితంలో ఎన్నడూ వెళ్ళి చూడలేదు.ఇన్నాళ్ళకి చాలా అలస్యంగా ఎందుకో బుద్ధి పుట్టి ,మా అబ్బాయి,మనమడు,మనమరాలుతో మా కారులో వెళ్ళాము.శ్రీకాకుళం నుంచి రమారమి 100  కి.మీ.దూరం.విజయనగరం నుంచియస్. .కోట కి వెళ్ళే దారిలో ఉంది,సంక్రాంతి రోజులు కాబట్టి చల్లగా,దారి పొడుగునా పచ్చగా మనోహరంగా ఉంది.ఊరి చుట్టూ కూడా పొలాలు,చెట్లు,తోటలు ఉన్నాయి.గోస్తని యేరు దగ్గరే. తాటిపూడి రిజర్వాయర్ కొంచెం దూరంలో ఉంది.మరికొంత దూరంలో తూర్పు కనుమలు.
    ఊళ్ళో బ్రాహ్మణ వీధిలో 50-60 గడపలు ఉన్నాయి.కాని చాలావరకు ఖాళీ.విజయనగరం,విశాఖపట్నం,హైద్రాబాద్, అమెరికాలలో వున్నారట.ఉన్న కొద్దిమందీంధువుల్ని కలిసాము.ఊరిదాకా మంచి తారురోడ్డు ఉంది.ఊళ్ళో సిమెంటు రోడ్లు ఉన్నాయి.కరెంటు ఉండటం వల్ల అందరి యిళ్ళలో విద్యుత్ దీపాలు,పంకాలు,ఫ్రిజ్లూ ,ఫోన్లూ ఉన్నాయి,కొంతమందికి కార్లు,ఏ.సీ.లు ,మోటారు సైకిళ్ళు ఉన్నవి.ఊర్లోనే ఒక స్కూలు కూడా ఉంది.
  రైతుల ఇళ్ళు కూడా 100 గడపల దాకా ఉన్నాయి.పూరిళ్ళు దాదాపు మాయం ఔతున్నవి.సిమెంటు ,ఇటుకల తో కట్టిన డాబా ఇళ్ళు ఎక్కువగా ఉన్నాయి.ట్రాక్టర్లు ,మోటారు పంపులూ వాడుతున్నారు. ఊళ్ళో మంచి నీటి కొళాయిలు కూడా ఉన్నాయి.
  బ్రాహ్మల ఇళ్ళు మాత్రం పాతవే ఉన్నా గట్టిగానే ఉన్నాయి.ఇటుకలు,మట్టితో నిర్మించారు.కొన్ని పెంకుటిళ్ళు,కొన్ని డాబా యిళ్ళు.to be continued.      

state policy.


 

 15-1-12 ఈనాడు పత్రికలో గురుచరణ్దాస్ అనే ప్రసిద్ధ జర్నలిస్టు రాసిన వ్యాసం తెలుగు అనువాదం నాకు నచ్చింది.దానిలోని అంశాలు క్లుప్తంగా ఇస్తున్నాను.
 1.మనదేశం చరిత్రలో ఎప్పుడూ సంపన్న మైనదే ఐనా ,చిన్నరాజ్యాలు ,అంతహ్కలహాలవల్ల పతనమయ్యేది.సామ్రాజ్యాలు పెద్దవి ఏర్పడినా అవికూడా పరిపాలనా రీత్యా బలహీనమైనవే.
 2.బ్రిటిష్ వాళ్ళు బలమైన పరిపాలనా యంత్రాంగం, సుశిక్షిత మిలిటరీ, న్యాయ వ్యవస్థను ఇచ్చి వెళ్ళి పోయారు.
 3.మనరాజ్యం ప్రభుత్వం కన్నా మన సమాజం,సంస్కృతీ బలమైనవి.
 4.మనదేశం గణనీయమైన అభివృద్ధి సాధించినా ,మనప్రధాన లోపం బలహీనమైన రాజ్యం (state) నిర్ణయాలు తీసుకోడంలో విపరీతమైన జాప్యం.ఆచరణలో కూడా విపరీతమైన అలసత్వం.
 5.బలమైన కేంద్ర,రాష్త్ర ప్రభుత్వాలు అవసరం.
 6.అలా అని నియంతృత్వం మంచిది కాదు.
 7.ప్రజాస్వామిక ప్రభుత్వమే బలంగాను,కఠినం గాను ఉండాలి.ఉదారంగాను, క్షెమంకరంగాను ఉండాలి.కోర్టులు కూడా అలాగే ఉండాలి. ఒక మాటలో  చెప్పాలంటే 'దుష్ట శిక్షణ ,శిష్ట  రక్షణ' చెయ్యాలి.
 8.రాజకీయ జోక్యం, అవినీతిని సహించకూడదు.పై సిద్ధాంతాలు పాటిస్తే ప్రజాస్వామికంగానే మనం సత్వర పురోభివృద్ధి సాధించగలము.
   మొత్తం మీద గురుచరణ్ దాసు చెప్పేదేమంటే ప్రజాస్వామిక మంటే అరాచకమూ,క్రమశిక్షణా రాహిత్యమూ కాదు.పాశ్చాత్యదెశాల వలెనే వ్యక్తిస్వేచ్చతో బాటు క్రమశిక్షణా,  రూల్స్ ని కఠినంగా  పాటించడం కూడా.
 

13, జనవరి 2012, శుక్రవారం

bhogimantalu


 

 ఈ సంక్రాంతి శుభ వారంలో మరొక సారి అందరికీ శుభాకాంక్షలు.-ముఖ్యంగా దూర ంగా ఇతర రాష్ట్రాల్లో,విదేశాల్లో వున్న వారికి.మా శ్రీకాకుళంలో మాత్రం బాగా చలిగా వుంది.శీతాకాలాన్ని,సంక్రాంతిని ముందే పద్యాల్లో వర్ణించి వుండటం చేత మళ్ళీ వ్రాసి కవిత్వంతో విసిగించదల్చు కో లేదు.ఈ రోజుల్లో ఇంతకు ముందు లాగ వచ్చే జానపద కళా కారులు,భిక్షుకులు, బాగా తగ్గిపోయారు.గంగిరెద్దులవాళ్ళు మాత్రం కొందరు వస్తున్నారు.కాని వాళ్ళు సినిమా పాటలు సన్నాయి తో వాయిస్తున్నారు !
  మా ఇంటి ఆవరణలో పిల్లలు  పెద్ద భోగి మంట వేసారు.ఈ రోజుల్లో independent గా ఇల్లు,చుట్టూ తోట ఉండటం లగ్జరీ అంటున్నారు.మాకలాంటి ఇల్లు ఉండటం ఆనందం గాఉంది.కాని, హైదరాబాదు,విశాఖ, లోనేగాక, జిల్లా కేంద్రాల్లోను, ఇతర పట్టణాల్లోను  కూడా ఈ అపార్టుమెంటు కల్చర్ వ్యాపిస్తూ ఉండటం శోచనీయమే.చివరికి  పల్లెల్లో మాత్రమే అలాంటి ఇళ్ళు మిగులుతాయేమో .కాని ఏమిచేస్తాము ?భూమి,నిర్మాణ వ్యయం కొండెక్కడం తో తప్పదనుకొంటాను.    

12, జనవరి 2012, గురువారం

GOOD WISHES.


 

  ఈ సంక్రాంతి మహోత్సవావసరమందీ చంద్రికా రాత్రులన్,
  ఏ సీమన్ గనినన్ వినోదములతో నింపారు గేహమ్ములన్,
  రాసుల్ పోసిన ధాన్య సంపదలతో రాణించు గ్రామమ్ములున్,
  భాసించెన్ హిమశీత వాయువులు  ,సద్భావమ్ము వర్ధిల్లగన్
              -----------------
    పౌష్యలక్ష్మిచే వెలుగునీ ప్రకృతి యెల్ల
    'బ్లాగు '  మిత్రులందరికి సౌభాగ్య మలర
    ఆయురారోగ్య సంపద లమరు గాత !  
    అని శుభాకాంక్ష లందింతు నమల బుద్ధి ,
           -------------- 

11, జనవరి 2012, బుధవారం

కమనీయం: aahaaryam

కమనీయం: aahaaryam koodali.org

10, జనవరి 2012, మంగళవారం

aahaaryam-contd.


 

 1-1-2012 ఆంధ్రజ్యోతి హాస్యసంచికలో Y.A.రమణగారి అసూబా అనే బ్లాగు చదివి దానికి కొనసాగింపుగా ఆయనకు కృతజ్ఞతలతో ఇది రాస్తున్నాను.దీనికి ముందటి నా బ్లాగు కూడా చూడండి.దానికిది కొనసాగింపు.
  విష్ణుమూర్తీ,పరమశివుడే కాదు,లక్ష్మీ దేవి,సరస్వతీ కూడా కిరీటాలు,పద్మం ,వీణ ఇత్యాది హంగులు లేకుండా కనిపిస్తే పోల్చుకో లేము.
  మాటవరసకి, కృష్ణ దేవరాయలు మనమధ్యకి వచ్చాడనుకోండి.ముత్యాలు,తురాయి పొదిగిన తలపాగా,కోరమీసాలు,కత్తీ అవీ లేకుండా వస్తే ఖాతరు చెయ్యం. షాజహాన్ చక్రవర్తి, సిల్కు తలపాగా ,మొఘల్ దుస్తులూ ,ముత్యాలహారాలూ,గడ్డం  లెకుండా,వస్తే ఎవరు నువ్వు అంటాము.పురాణాలు,చరిత్ర,వదిలేసి 20,21,శతాబ్దాలకి వస్తే 50,60,ఏళ్ళకిందట వేషాన్ని బట్టి కులాన్ని,మతాన్ని పోల్చుకొనేవీలు ఉండేది.అలాగే తమిళ్,బెంగాలీ ,గుజరాతీ ,పంజాబీ ప్రాంతాలవాళ్ళని నోరు విప్పకపోయినా తెలిసిపోయేది.ఇప్పుడలా కాదుకదా!
   మా చిన్నప్పుడు,పోలీసులకి ఎర్రటోపీలు ఉండేవి.ఇన్స్పెక్టర్లకు ఎర్రతలపాగాలు (బంగారు అంచుతో) ఉండేవి.అసలు ఎర్రటోపీ అంటేనే పోలీసు అని అర్థం.దానికి తోడు ఖాకీ డ్రెస్సు. ఇవేమీ లేకుండా వెళితే ఎవరు పట్టించుకొంటారు ?
  ఒక్క అసూబాలే కాదు(అమెరికా సూటు బాబులు ) మన దేశంలో కూడా ప్రైవేటు బేంకు ఆఫీసర్లు,కంపెనీ ఎగ్జెక్యూటివ్లూ,మెడికల్ రెప్రజెంటేటివ్లు, కూడా సూటుబాబులే.వా ళ్ళకది తప్పనిసరి,ఉక్కపోత,చెమట్లు తో ఉడికి పోతున్నా.ఎక్కడికైనా సూటు తో కారులో వెళ్ళారనుకోండి.ఆ మర్యాదలే వేరు.(చార్జీలు,ధరలూ ఎక్కువ వాయించేస్తారనుకోండి.)
  ఒకప్పుడు,రాజకీయనాయకులకు ,దేశభక్తులకు చిహ్నం ;ఖద్దరు పంచె ,నెహ్రూ కోటు,గాంధీ టోపీ .ఇప్పుడు వాటిని అవినీతికి,మోసానికి చిహ్నాలుగ కార్టూన్లలో చూపిస్తున్నారు.హతవిధీ!అలాగే ఒకప్పుడు షరాయి ,పొడుగు లాల్చీ ,గడ్డం ,పక్కసంచీ ఉంటే  కమ్యూనిస్టు,లేక కనీసం లెఫ్టిస్టు రాడికల్ అన్న మాట.అందువల్ల ఆహార్యం లో ఏముంది అని కొట్టివేయకండి.అందులో చాలా ఉంది.
  ఇందులో ఆడవాళ్ళ ఆహార్యం గురించి రాయలేదు.మీరెవరు ,మా యిష్టం అనవచ్చును.వాళ్ళ లోనే ఎవరైనా రాస్తే బాగుంటుంది.    
       'వైద్య వర్యులకు ధవళ వర్ణ కోటు ,
        న్యాయమూర్తులకెల్లను నల్ల కోటు,
        ఘనులు పోలీసు వారికి ఖాకి తగును
        చిత్రమగు వేష మొప్పును చిత్రసీమ.
 
     అసూబాలో రమణ గారు చెప్పినట్లు ,మన వేడి దేశంలో యోగి వేమన ఆహార్యమే ఉత్తమం కాని ,అది మరీ ఘోరం గా ఉంటుంది కాబట్టి ,మగవాళ్ళకి లుంగీ,పైన తుండు గుడ్డ  బెస్టు.

9, జనవరి 2012, సోమవారం

aahaaryam


 

 ఆహార్యం  అంటే దుస్తులు.అలంకరణలు అని అర్థం.తిండి అని కాదు,నాటకాల్లోను.సినిమాల్లోను ,ముఖ్యంగా పౌరాణికాల్లో చాలా ముఖ్యం.మా చిన్నప్పుడు  స్కూల్ మాస్టెర్లు ధోవతి.జుబ్బా, కండువా వేసుకొని వచ్చే వాళ్ళు.కొందరు కోటు,తలపాగాతో వచ్చేవాళ్ళు.ఎవరు మాస్టరో ఎవ రు స్టూడెంటో సులభంగా తెలిసేది.ఇప్పుడు మాస్టర్లు.స్టూదెంట్లూ ఒకే లాగ ఉంటారు.
  మెడికల్ కాలేజీలొ  మేము తెల్ల షర్టూ పాంటూ టక్ చేసుకొనే వాళ్ళం.పొట్టీ చేతుల తెల్లకోటు వేసుకోవాలి.బూట్లే కాని చెప్పులు వేసుకోకూడదు.మా ప్రొఫెసర్లు సూటూ .ట్   ఐ వేసుకొనే వాళ్ళు.భేదం తెలిసేది.ఒక ప్రొఫెసర్ రోజూ కోటు  వేసుకొని వచ్చి .అది హాంగెర్కి తగిలించి తెల్లకోటు వేసుకునే వాడు.ఎప్పుడూ ఒకే రంగు వేసుకొనే వారు .ఒక కొంటే నర్సు ఆయన కోటు మీద ఒకమూల తేదీ వేసింది.నెల రోజుల తర్వాత  కూడా   ఆతేదె ఉన్న కొటే ఆయన వేసుకొని వచ్చారు. to be cotinurd.   

7, జనవరి 2012, శనివారం

epics



 EPICSఎపిక్ అంటే గ్రీకు భాషలో కథ,కావ్యం ,అని అర్థం.ఐతే అన్ని కథలూ,  ,కావ్యాలూ  ,ఎపిక్స్ కాలేవు.తెలుగులో వీటిని మహాకావ్యాలు అనవచ్చును.ప్రాచీన గ్రీకు భాషలో హోమర్  రచించిన 'ఇలియడ్, ఒడెస్సీ ' ,అపొల్లోనియస్ 'ఆర్గొనాటికా',లాటిన్ భాషలో వర్జిల్ కావ్యం 'ఏనియడ్ 'ఈ కోవలోకి వస్తాయి.మొదట్లో వీటిని గానం చేసేవారు.  తర్వాతి కాలం లోనే గ్రంథస్థం చేసారు.మన రామాయణం ,మహాభారతం ప్రపంచంలోనే గొప్ప ఎపిక్స్ గా పరిగణింపబడుతున్నవి.ప్రాచీన పర్షియా రాజవంశాల కథ 'షానామా' ఒక ఎపిక్ .ఆ దేశాల్లో అప్పటి మతాలు అంతరించి పోవడం వలన వాటిని కేవలం గొప్ప కావ్యాలు గానే భావిస్తారు.మన దేశంలో హిందూ మతం ఇంకా ప్రబలంగా ఉండుట వలన రామాయణ ,భారతాలను పవిత్ర మతగ్రంథాలుగా భావిస్తాము.వీటి మీద అనేక చర్చలు, వ్యాఖ్యలు ,వాదోప వాదాలు ,ఖండనమండనలు,జరుగుతున్నవి.కాని వాటి జోలికి పోదలచు కోలేదు.ఇన్ని వేలసంవత్సరాల పిదప కూడా ఇవి ఇంత ప్రాచుర్యం లో  ఉండటానికి కారణమేమిటి?ఎపిక్స్ ముఖ్య లక్షణాలను పరిశీలిస్తే అర్థమౌతుంది.
  1,ఎపిక్ ఆ దేశపు ,జాతి, ఆశయాలను, ఆవేశాలను,లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది.
  2.దీర్ఘమైన కథతో మలుపులు తిరుగుతూ ,అనేక సంఘటనలతో నిండి ఉంటుంది,
  3.హీరో, హీరోల సాహస కృత్యాలు చిత్రింపబడి ఉంటాయి.శౌర్యం, ప్రతాపం ముఖ్యం.
  4.చాలా ఎపిక్స్ లో దేశ కాలాల కేన్వాసు బాగా విస్తరించి ఉంటుంది.
  5.అన్నికాలాలకీ ,దేశాలకి, అన్వయించే విషయాలు కూడా కొన్ని ఉంటాయి.
  6.నాయికా,నాయకులు అనేక కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని చివరకు విజయం సాధిస్తారు.
   7.కొన్ని అద్భుతాలు,అతీంద్రియ శక్తులు ,దేవతల ప్రవేశం ఉండవచ్చును.
   8.మానవులు ఇప్పటికీ యుద్ధప్రియులే. ఎపిక్స్ లో సాదారణంగా చివర్లో మహా   యుద్ధం,అందులో నాయకుడు విలన్ల మీద అంతిమ విజయం సాధిస్తాడు.
  9.దీర్ఘ ప్రయాణాలు, వర్ణనలూ ఎక్కువగా ఉంటాయి.
  పై కారణాల వలన ఈ ఎపిక్స్ అన్నీ ఇప్పటికీ పాపులర్ గా ఉన్నాయి.పైగా మన రామాయణ భారతాలు ,బైబిలు ,పవిత్ర మతగ్రంథాలు  గా కూడా గౌరవింప బడటం చివరి కారణం.నేటి  సినిమాల్లో కూడా ఇవే సూత్రాలను అనుసరించడం గమనించ వలసిన విషయం.