16, జులై 2014, బుధవారం

NAALOE NEANU




 నా  మిత్రుడొకరు బి.రామలింగరాజు (సత్యం కంప్యూటర్స్ కి మాజీ అధినేత)రచించిన ''నాలో నేను ''అనే వచన కవితల పుస్తకాన్ని తెచ్చి యిచ్చారు.(ఎమెస్కో ప్రచురణ,జులై 2011) .ఆయన వ్యాపారాలు, క్రిమినల్ కేసులు ,వీటిని పక్కన పెట్టి చూస్తే,ఈ రచనల్లో కొంత భావుకత, తెలుగు భాషా పరిజ్ఞానం.తాత్వికదృష్టి  కనిపిస్తాయి.కొన్ని కవితలు బాగున్నవి.ఆలోచనల్ని రేకెత్తించేలా ఉన్నవి.కొన్ని సాదాసీదాగాఉన్నవి.ఉదాహరణకి నాకు నచ్చింది;; ' టికెట్టు లేని ప్రయాణికుడు ' అనే ఖండికలో --;;'' విధి అనే సామాన్లు మోస్తూ,గతి అనే స్టేషన్లో ఎక్కావీ రైలు,టికెట్టు  లేని ప్రయాణికుడివి నువ్వు,ఏ క్షణం లో నైనా టికెట్ కలెక్టర్ రావచ్చును,ఆ వచ్చేదే నీ ఆఖరు స్టేషను కావచ్చును. ' '; రామలింగరాజు ఇంకో  పార్శ్వం తెలుసుకోవాలనుకొన్నవాళ్ళు ఈ పుస్తకం చదవాలి.