16, డిసెంబర్ 2013, సోమవారం

A.P.division bill




 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు  ఇప్పుడు రాష్ట్ర శాసన సభ ముందుకు వచ్చింది కదా.అందులోని మంచిచెడ్డలేమైనా ,అందులో ఏమిఉందో వివరాలు ఏమీ తెలియడంలేదు.రాజకీయ నాయకులు.ప్రజా ప్రతినిధులు,పత్రికలు,టి.వి.మాధ్యమం చానెల్సు ఎవరూ ఏమీ
 చెప్పడం లేదు.బ్లాగరుమిత్రులెవరికైనా తెలిస్తే అందులోని ముఖ్యమైన అంశాలగురంచి (వివరంగా కాకపోయినా,సూత్రప్రాయంగానైనా) తెలియజేయమని కోరుతున్నాను.

9, డిసెంబర్ 2013, సోమవారం

bhagavatam


 

  ఈ మధ్య  ఈటి.వి. లో సాయంత్రం 6 గం;కి ప్రసారమయ్యే 'భాగవతం '(బాపు-రమణ దర్శకత్వం,సుమన్ సమర్పించిన)చూస్తున్నాను.బాగా తీసారు.పాత్రధారులు కూడా అందరూ బాగున్నారు.నేటి సినిమా రంగంలో పౌరాణిక చిత్రాలకి సరిపోయే నటీ నటులు లేరనిపిస్తుంది.కాని ఈ సీరియల్ చూస్తే టి.వి.లో అందుకు తగిన నటీనటులు ,ఉన్నారనిపిస్తుంది.అలాగే గాయనీగాయకులు,సంగీతదర్శకులు,సాంకేతిక సిబ్బంది కూడా ఉన్నారని  స్పష్టమౌతుంది.                  

5, డిసెంబర్ 2013, గురువారం

capital




  central cabinet నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ విభజన దాదాపు ఖాయమైనది కాబట్టి అనవసరమైన ఆందోళనలతో కాలం,శక్తి,వృథాచెయ్యకుండా అభివృద్ధి మీద కేంద్రీకరించడం మంచిది.అంతేకాదు; కృష్ణా,గుంటూరు వారు తమ అహంకారాన్ని,స్వార్థ బుద్ధిని విడిచిపెట్టి,రాష్ట్ర రాజధానిని రాయలసీమప్రాంతంలో ,కర్నూలులోగాని,ఒంగోలుప్రాంతంలో గాని చండీఘడ్ లాగ చక్కగా తీర్చి నిర్మించడానికి అంగీకరించడం మంచిది.లేకపోతే మళ్ళీ రాయలసీమలో  అసంతృప్తి కలుగుతుంది. అలాగే, విశాఖపట్నం ని పారిశ్రామీక,I.T.HUB గా అభివృద్ధిచేయవలసిఉంటుంది.

29, నవంబర్ 2013, శుక్రవారం




  నేను వ్యవసాయంలోగాని,నీటిపారుదల (irrigation)లోగాని నిపుణుడనుగాను.కాని నిన్న వెలువడిన కృష్ణా నది  ' బచావత్ ట్రైబ్యునల్ ' అంతిమ తీర్పు గురించి నా అభిప్రాయం తెలియ జేసుకుంటున్నాను.నిపుణులు వివరించగలరు.దీనిని గురించి  మీడియా,రాజకీయ నాయకులు,బెదరగొడుతూ.ఆంధ్రప్రదేశంతా ఎడారిగా మారిపోతుందని  భయపెట్టుతున్నారేమో  ననిపిస్తుంది.ఎందుకంటే ,మనవాటా  800 T,M.C.లనుండి 1000 T.M.C.  లకిపెంచారు.మిగులుజలాలు ఇదమిత్థంగా నిర్ణయించడం కష్టం కాబట్టి.ఈ అదనపు 200 T.M.C.కిగోదావరినుంచి మళ్ళించే (టైల్ పాండ్ ,పోలవరం ప్రాజెక్టుల  నుంచి ) దాదాపు 200 T.M.C. ల నీటిని నల్గొండ,మహబూబ్ నగర్,రాయలసీమ జిల్లాల ప్రాజెక్టులకు వినియోగిస్తే సరిపోతుంది కదా.ఇవి నికరజలాలు కాబట్టి లభ్యతకు అనుమానం ఉండదు.ఐతే అన్నిరాష్ట్రాలు నీటి పంపకాన్ని ఖచ్చితంగా పాటించేలాగ అమలుపరచే అధికారాలతో నదీజలాల కమిషన్ ని కేంద్ర పర్యవేక్షణలో నియమించాలి.        

19, నవంబర్ 2013, మంగళవారం

కమనీయం: national awards

కమనీయం: national awards

  గతసారి ప్రఖ్యాతసంగీతకళాకారుడు శ్రీ మంగళంపల్లి  బాలమురళీకృష్ణకి,ISRO CHAIRMAN 'మంగళ్యాన్ '(Mars expedition  ') నిర్దేశకులు శ్రీ రాధాకృష్ణన్ కి వచ్చే ఏడాదైనా భారతరత్న ' అవార్డు ఇవ్వాలని సూచించేను.ఆ సంగతి అలా ఉంచితే ఈసారి  సచిన్ కి  ఆ అవార్డు గురించి వివాదం,కోర్టు  వ్యాజ్యం బయలుదేరాయి.భారతరత్న ఎవరికివ్వాలనేది  కేంద్రప్రభుత్వానికే అంతిమనిర్ణయం ఇవ్వాలి.పద్మశ్రీ లాగ కాదుకదా ఒక సంవత్సరంలో ఈ అత్యున్నత పురస్కారం ఒకరికో ,ఇద్దరికో మాత్రం ఇవ్వాలి.ఇక కీర్తిశేషులకు ఇచ్చే విషయం; సాధ్యమైనంతవరకు వారిజీవితకాలంలోనే ఇవ్వాలి.ఐతే మరణం సంగతి ఎవరూ ముందుగా చెప్పలేరు కాబట్టి ఇవ్వడానికి తగినవారైతే వారి    మరణానంతరం  ఒక్క సంవత్సరంలోనే ఇవ్వాలి.అలా కాకపోతే చాలాకాలం కొంద చనిపోయిన గొప్పవాళ్ళందరికీ ఇవ్వాలనే  వివాదాలు రేకెత్తే అవకాశం ఉంది.ఇది చాలా ridiculous extent కి వెళ్ళే ప్రమాదముంది.టాగూరు,రాజా  రామ్మోహన్రాయి,అక్బరు,అశోకుడు ఇలాగన్నమాట.అందువలన జాతీయావార్డుల ప్రదానానికి కొన్ని మార్గదర్శక నిర్దేశకాలు కల్పించి ,అమలుచేయడం మంచిది.కాని నిర్ణయాన్ని  కేంద్రప్రభుత్వానికే అంతిమంగా వదిలివేయడం మంచిది,అని నా అభిప్రాయం.       




national awards




  గతసారి ప్రఖ్యాతసంగీతకళాకారుడు శ్రీ మంగళంపల్లి  బాలమురళీకృష్ణకి,ISRO CHAIRMAN 'మంగళ్యాన్ '(Mars expedition  ') నిర్దేశకులు శ్రీ రాధాకృష్ణన్ కి వచ్చే ఏడాదైనా భారతరత్న ' అవార్డు ఇవ్వాలని సూచించేను.ఆ సంగతి అలా ఉంచితే ఈసారి  సచిన్ కి  ఆ అవార్డు గురించి వివాదం,కోర్టు  వ్యాజ్యం బయలుదేరాయి.భారతరత్న ఎవరికివ్వాలనేది  కేంద్రప్రభుత్వానికే అంతిమనిర్ణయం ఇవ్వాలి.పద్మశ్రీ లాగ కాదుకదా ఒక సంవత్సరంలో ఈ అత్యున్నత పురస్కారం ఒకరికో ,ఇద్దరికో మాత్రం ఇవ్వాలి.ఇక కీర్తిశేషులకు ఇచ్చే విషయం; సాధ్యమైనంతవరకు వారిజీవితకాలంలోనే ఇవ్వాలి.ఐతే మరణం సంగతి ఎవరూ ముందుగా చెప్పలేరు కాబట్టి ఇవ్వడానికి తగినవారైతే వారి    మరణానంతరం  ఒక్క సంవత్సరంలోనే ఇవ్వాలి.అలా కాకపోతే చాలాకాలం కొంద చనిపోయిన గొప్పవాళ్ళందరికీ ఇవ్వాలనే  వివాదాలు రేకెత్తే అవకాశం ఉంది.ఇది చాలా ridiculous extent కి వెళ్ళే ప్రమాదముంది.టాగూరు,రాజా  రామ్మోహన్రాయి,అక్బరు,అశోకుడు ఇలాగన్నమాట.అందువలన జాతీయావార్డుల ప్రదానానికి కొన్ని మార్గదర్శక నిర్దేశకాలు కల్పించి ,అమలుచేయడం మంచిది.కాని నిర్ణయాన్ని  కేంద్రప్రభుత్వానికే అంతిమంగా వదిలివేయడం మంచిది,అని నా అభిప్రాయం.      




16, నవంబర్ 2013, శనివారం




 సచిన్ టెండుల్కర్ కి,డా;C.N.రావుకి భారతప్రభుత్వం  ' భారతరత్న 'ప్రదానం చెయ్యడం మనకందరికీ అమితానందదాయక మైన విషయం.సచిన్ గురించి అందరికీ తెలుసును.కాని శాస్త్రజ్ఞులు ఎంత గొప్పవారైనా  క్రీడాకారుల వలె,సినిమా వారివలె సామాన్యప్రజలకు తెలియదు.డా;రావుగారు రసాయనికశాస్త్రంలో నిష్ణాతుడు.అంగారకగ్రహయాన రాకెట్ విజయంలో కూడా ప్రముఖపాత్ర వహించారని తెలిసింది.వీరిద్దర్కీ హార్దికాభినందనలు  తెలుపుదాము.కాని ఒక్క విషయం. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి భారతరత్న వస్తుందనీఅశించాను.సంగీతరంగంలో ఆయన అగ్రగామికదా.వచ్చేసంవత్సరంలోనైనా  ఆయనకు ఆ అవార్డు వస్తుందని ఆశిస్తున్నాను.ఇప్పటివరకు  పండిట్ రవిశంకర్ కి,పండిట్ భీంసేన్ జోషి కి ,ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ కి ఇచ్చారు.కర్ణాటకసంగీతంలో దక్షిణాది నుంచి ఒక్క సుబ్బులక్ష్మిగారికే ఈ గౌరవం దక్కింది.అందువలన వచ్చే ఏడాది బాలమురళీకృష్ణ గారికి 'భారతరత్న 'పురస్కారం తప్పక లభించాలని   కోరుకొందాము.అలాగే ISRO DIRECTOR రాధాకృష్ణన్ కికూడా(మంగళ్యాన్ ప్రాజెక్టుకు నిర్దేశకులు)  'భారతరత్న 'బహూకరిస్తారని ఆశిద్దాము. 

BHARATARATNA AWARDS



 

 సచిన్ టెండుల్కర్ కి,డా;C.N.రావుకి భారతప్రభుత్వం  ' భారతరత్న 'ప్రదానం చెయ్యడం మనకందరికీ అమితానందదాయక మైన విషయం.సచిన్ గురించి అందరికీ తెలుసును.కాని శాస్త్రజ్ఞులు ఎంత గొప్పవారైనా  క్రీడాకారుల వలె,సినిమా వారివలె సామాన్యప్రజలకు తెలియదు.డా;రావుగారు రసాయనికశాస్త్రంలో నిష్ణాతుడు.అంగారకగ్రహయాన రాకెట్ విజయంలో కూడా ప్రముఖపాత్ర వహించారని తెలిసింది.వీరిద్దర్కీ హార్దికాభినందనలు  తెలుపుదాము.కాని ఒక్క విషయం. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి భారతరత్న వస్తుందనీఅశించాను.సంగీతరంగంలో ఆయన అగ్రగామికదా.వచ్చేసంవత్సరంలోనైనా  ఆయనకు ఆ అవార్డు వస్తుందని ఆశిస్తున్నాను.ఇప్పటివరకు  పండిట్ రవిశంకర్ కి,పండిట్ భీంసేన్ జోషి కి ,ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ కి ఇచ్చారు.కర్ణాటకసంగీతంలో దక్షిణాది నుంచి ఒక్క సుబ్బులక్ష్మిగారికే ఈ గౌరవం దక్కింది.అందువలన వచ్చే ఏడాది బాలమురళీకృష్ణ గారికి 'భారతరత్న 'పురస్కారం తప్పక లభించాలని   కోరుకొందాము.అలాగే ISRO DIRECTOR రాధాకృష్ణన్ కికూడా(మంగళ్యాన్ ప్రాజెక్టుకు నిర్దేశకులు)  'భారతరత్న 'బహూకరిస్తారని ఆశిద్దాము. 

9, నవంబర్ 2013, శనివారం

Saastreeyasangeetam-5.prabhaavam.





  Niraval=singing one or two lines repeatedly but with melodic improvisations to outline the raagaa and its theme.
 Taanam=cosists of expanding the raagaa with syllables like ' tha,na,nom.ra etc.
 Tani aavartanam = is the extended solo play by the percussionists .
   శుద్ధ శాస్త్రీయ  సంగీత కచేరిని విని అర్థంచేసుకొని జీర్ణించుకోవాలంటే చాలా మందికి సాధ్యం కాదు.కాని దానిని ఆధారంగా చేసుకొని రచించిన ,సంగీతం సమకూర్చిన పాటలను చాలా మంది విని ఆనందించగలరు.నాటకాల్లో పాటలు,పద్యాలు,లలితసంగీతం.భజనలు,సినిమాపాటలు,స్త్త్రీలపాటలవంటి అన్నిరకాలసంగీతం  పైన శాస్త్రీయసంగీతప్రభావంవుంది.ముఖ్యంగా 1940-1970 మధ్య వచ్చిన ఫిల్మ్ సంగీతం వినండి,( తెలుగు,హిందీ).తెలుగులో రాజేశ్వరరావు,పెండ్యాల,ఆదినారాయణరావు .టి.వి.రాజు ,మహదేవన్ వంటి ప్రసిద్ధసంగీతదర్శకులు ఎన్నో పాటలను శాస్త్రీయ రాగాలను అనుసరంచి వరుసలు సమకూర్చారు.రాజేశ్వరరావు గారికి మోహన,భీంపలాస్,రాగాలంటే ఇష్టమట.ఘంటసాలగారికి మోహన,కళ్యాణి రాగాలంటే ఇష్టమట.'మల్లీశ్వరి   'సినిమాలో ' పిలచిన బిగువటరా ' పాట కాపీ రాగంలోను,'ఎందుకే నీకింత తొందరా ' అనే పాట  కమాచ్ రాగంలో ఉంటాయి.ప్రసిద్ధిపొందిన ' నీలి మేఘాలలో '  పాట (బావామరదళ్ళు ')భీంపలాస్ రాగంలో ఉన్నది.ఘంటసాల,భానుమతి,  కొన్ని కృతులు ,యథాతథంగానే  సినిమాల్లో పాడేరు. (ఉదా; వాతాపిగణపతిం భజే,నగుమోము గనలేని ). కొన్ని పాటలను రెండురాగాలు కలిపి జనరంజకం గా కంపోజ్ చేసారు.(ఉదా; జయభేరి సినిమాలో  ప్రసిద్ధమైన పాట 'రసికరాజ తగువారముకామా ' చక్రవాకం,మలయమారుతం రాగాలు మేళవించి స్వరపరచినట్లు పాత్ర చేతనే పెండ్యాలవారు చెప్పించారు.)1980 తర్వాత క్రమంగా సినిమాలపై క్లాసికల్ మ్యూజిక్ ప్రభావం తగ్గిపోయి,పాశ్చాత్య,'పాప్' మ్యూజిక్ ప్రబావం హెచ్చయింది.పాత గాయనీగాయకుల్లో చాలామందికి శాస్త్రీయ సంగీతంలో పరిజ్ఞానం ఉండేది.ఘంటసాల,పి.బి.శ్రీనివాస్  ,భానుమతి,లీల,సుశీల ,నాగయ్య ,రఘురామయ్య సూర్యకుమారి,బాలసరస్వతి మొ;వారిని  చెప్పుకోవచ్చును.
  అలాగే హిందీ సినిమారంగంలో, సైగల్, అనిల్ బిస్వాస్, మన్నాడే,నౌషాద్,రామచంద్ర, శంకర్-జైకిషన్,లతా, ఆశా సిస్టర్స్,రఫీ,మదన్మోహన్ లవంటివారిని చెప్పుకోవచ్చును.
     శాస్త్రీయ సంగీతం ఆధునిక కాలంలో కూడా  తన వైభవాన్ని కోల్పోకుండా వర్ధిల్లాలని ఆశిద్దాము.
  అందుకోసమే  యువకళకారులు ,సీ.డీ లద్వారా,ఫ్యూజన్ మ్యూజిక్ ద్వారా ,లఘు కచేరీలద్వారా ప్రయత్నిస్తున్నారు.
                                     (సమాప్తం)      
                                     -------      



                                                                    

కమనీయం: Saastreeya sangeetam=4;kacheri

కమనీయం: Saastreeya sangeetam=4;kacheri

 శాస్త్రీయసంగీతం బాగా అభ్యసించిన తర్వాత కచేరీ (public concert) చేయనిదీ సాఫల్యం కలగదు.దీనికి సహజ ప్రతిభ,వ్యుత్పత్తి,శిక్షణ చాలా అవసరం.శ్రావ్యమైన కంఠస్వరం లేనిదే ఎంత విద్య వున్నా రాణించదు.అలాగే తగినంత శిక్షణ లేనిదే మంచి కంఠస్వరం వున్నా బాగుండదు.మనం ఎన్ని సీ.డీలు విన్నా ముఖతా(live) విన్న అనుభవం వేరు.
  సాధారణంగా కచెరీ ఈ విధంగా జరుగుతుంది.1.మొదట వినాయక స్తోత్రం తో ప్రారంభమౌతుంది. 2.నాటరాగంలోరచనతో ప్రారంభించడం ఒక సంప్రదాయం.3.తర్వాత కొన్ని వర్ణాలు,తర్వాత కృతులు ఒక్కొక్కటి 5 నుంచి 10 నిముషాలు సమయం తీసుకొని పాడతారు.3.ఆ తర్వాత ప్రధానమైన కృతి అరగంట నుంచి ఒక గంట వరకు కూడా సమయం తీసుకొని పాడతారు.( piece de resistance).ఇది ఈ విధంగా సంగీతంలోని అన్ని పార్శ్వాలను ప్రదర్ర్శిస్తూ  దాని పూర్ణ స్వరూపం తెలుసుకోడానికి పనికివస్తుంది. మొదట రాగాలాపన ,సాహిత్యం లేకుండా రాగంలోఉన్న విశిష్టతను మంద్ర,మధ్యమ,తారాస్థాయిలను స్పృశిస్తుంది. తర్వాత ' తానం ' (స్వరాలతోమాత్రం) పాడుతారు. ఆ పిమ్మట వరుసగా పల్లవి,అనుపల్లవి, చరణాలు  రిపీట్ చేస్తూ వివిధ గమకాలు,సంగతులతో(అంటే వివిధరీతుల్లో ) పాడతారు.మూడు కాలాల్లోను,మూడు స్థాయిల్లోను పాడవచ్చును.ముగించేముందు ప్రక్కవాయిద్యాలకి వయొలిన్,మృదంగం ,ఘటం లకు వారి ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం,సమయం కల్పిస్తారు.4.తర్వాత మళ్ళీ కొన్ని కీర్తనలు వివరంగా పాదుతారు.5.చివరి దశలో జావళి,తిల్లాన వంటీనృత్యానికి అనువైన పాటలు పాడేక ,తేలికగా,అన్నమయ్య ,రామదాసు  వంటి  వారి కీర్తవలు,భజనలు పాడతారు.మొత్తం మీద కచేరీ దాదాపు 3 గంటలు సేపు కొనసాగవచ్చును.ఇటీవల వినేవారికి,పాడేవారికి ఓపిక తగ్గడంవలన కొంత  కుదిస్తున్నారు.5.కచేరీని ' మంగళం 'తోముగించడం సంప్రదాయం.
  పాడే వేగాన్ని బట్టి విలంబిత (slow) ,మధ్యమ (medium) ద్రుత (fast) అని మూడు రకాలు.
  పాడే స్థాయినిబట్టి (pitch) మంద్ర (low),మధ్య (medium),తార (high) స్తాయీ భేదం వుంటుంది. 
  మనకన్నా ఉత్తరాదిలో  ఫలాన రాగం ఫలానా వేళలో,లేక ఫలానా రుతువులో పాడాలనే నియమముంది.అవి అప్పటి mood కి సరిపోతాయని వారి నమ్మకం.కొన్ని ఉదాహరణలు 1.భూపాలరాగం=ఉదయకాలంలో 2.మేఘమల్ హార్= వర్షాకాలం .3.దీపక్ రాగం=రాత్రిపూట.4.చక్రవాకం,సావేరి= ఆర్తిని,ఆవేదనని కలిగిస్తాయి.4.మోహన,కళ్యాణి,కాపీ రాగాలు=శృంగార ,ఆనంద భావాలు కలిగిస్తాయి. 5.కదనకుతూహల,దర్బారీకానడ రాగాలు = ఉత్సాహాన్ని,ఉద్వేగాన్ని కలిగిస్తాయి .marching songs  కి ,జాతీయగీతాలకి పనికివస్తాయి. (ఇంకా వుంది)    

Saastreeya sangeetam=4;kacheri




 శాస్త్రీయసంగీతం బాగా అభ్యసించిన తర్వాత కచేరీ (public concert) చేయనిదీ సాఫల్యం కలగదు.దీనికి సహజ ప్రతిభ,వ్యుత్పత్తి,శిక్షణ చాలా అవసరం.శ్రావ్యమైన కంఠస్వరం లేనిదే ఎంత విద్య వున్నా రాణించదు.అలాగే తగినంత శిక్షణ లేనిదే మంచి కంఠస్వరం వున్నా బాగుండదు.మనం ఎన్ని సీ.డీలు విన్నా ముఖతా(live) విన్న అనుభవం వేరు.
  సాధారణంగా కచెరీ ఈ విధంగా జరుగుతుంది.1.మొదట వినాయక స్తోత్రం తో ప్రారంభమౌతుంది. 2.నాటరాగంలోరచనతో ప్రారంభించడం ఒక సంప్రదాయం.3.తర్వాత కొన్ని వర్ణాలు,తర్వాత కృతులు ఒక్కొక్కటి 5 నుంచి 10 నిముషాలు సమయం తీసుకొని పాడతారు.3.ఆ తర్వాత ప్రధానమైన కృతి అరగంట నుంచి ఒక గంట వరకు కూడా సమయం తీసుకొని పాడతారు.( piece de resistance).ఇది ఈ విధంగా సంగీతంలోని అన్ని పార్శ్వాలను ప్రదర్ర్శిస్తూ  దాని పూర్ణ స్వరూపం తెలుసుకోడానికి పనికివస్తుంది. మొదట రాగాలాపన ,సాహిత్యం లేకుండా రాగంలోఉన్న విశిష్టతను మంద్ర,మధ్యమ,తారాస్థాయిలను స్పృశిస్తుంది. తర్వాత ' తానం ' (స్వరాలతోమాత్రం) పాడుతారు. ఆ పిమ్మట వరుసగా పల్లవి,అనుపల్లవి, చరణాలు  రిపీట్ చేస్తూ వివిధ గమకాలు,సంగతులతో(అంటే వివిధరీతుల్లో ) పాడతారు.మూడు కాలాల్లోను,మూడు స్థాయిల్లోను పాడవచ్చును.ముగించేముందు ప్రక్కవాయిద్యాలకి వయొలిన్,మృదంగం ,ఘటం లకు వారి ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం,సమయం కల్పిస్తారు.4.తర్వాత మళ్ళీ కొన్ని కీర్తనలు వివరంగా పాదుతారు.5.చివరి దశలో జావళి,తిల్లాన వంటీనృత్యానికి అనువైన పాటలు పాడేక ,తేలికగా,అన్నమయ్య ,రామదాసు  వంటి  వారి కీర్తవలు,భజనలు పాడతారు.మొత్తం మీద కచేరీ దాదాపు 3 గంటలు సేపు కొనసాగవచ్చును.ఇటీవల వినేవారికి,పాడేవారికి ఓపిక తగ్గడంవలన కొంత  కుదిస్తున్నారు.5.కచేరీని ' మంగళం 'తోముగించడం సంప్రదాయం.
  పాడే వేగాన్ని బట్టి విలంబిత (slow) ,మధ్యమ (medium) ద్రుత (fast) అని మూడు రకాలు.
  పాడే స్థాయినిబట్టి (pitch) మంద్ర (low),మధ్య (medium),తార (high) స్తాయీ భేదం వుంటుంది.
  మనకన్నా ఉత్తరాదిలో  ఫలాన రాగం ఫలానా వేళలో,లేక ఫలానా రుతువులో పాడాలనే నియమముంది.అవి అప్పటి mood కి సరిపోతాయని వారి నమ్మకం.కొన్ని ఉదాహరణలు 1.భూపాలరాగం=ఉదయకాలంలో 2.మేఘమల్ హార్= వర్షాకాలం .3.దీపక్ రాగం=రాత్రిపూట.4.చక్రవాకం,సావేరి= ఆర్తిని,ఆవేదనని కలిగిస్తాయి.4.మోహన,కళ్యాణి,కాపీ రాగాలు=శృంగార ,ఆనంద భావాలు కలిగిస్తాయి. 5.కదనకుతూహల,దర్బారీకానడ రాగాలు = ఉత్సాహాన్ని,ఉద్వేగాన్ని కలిగిస్తాయి .marching songs  కి ,జాతీయగీతాలకి పనికివస్తాయి. (ఇంకా వుంది)    

8, నవంబర్ 2013, శుక్రవారం

Sastreeyasangeetam-3;performers




 20 వ శతాబ్దానికి ముందు గాయకులు గురించి,అంతగా తెలియదు.కాని తర్వాత ధ్వనిముద్రణ కనిపెట్టి  గ్రామొఫోన్ రికార్డు కంపెనీలు వచ్చాక గాయనీగాయకుల,వాయిద్యకారులperformance ని దాచుకొని వినడానికి వీలయింది.పత్రికలు,నాటక నృత్య,సంగీతసభలద్వారా ప్రభువుల ఆస్థానాలనుంచి సంగీతం ప్రజలవద్దకు చేరుకొంది.ప్రజాదరణతోనే వృద్ధిపొందింది.
  తొలితరం గాత్రసంగీతంలో పేరుగాంచిన కొందరి జాబితా 1.డి .కె.పట్టమ్మాళ్.2.యం.యల్.వసంతకుమారి.3.యం.యస్.సుబ్బులక్ష్మి.4.యన్.సి.వసంతకోకిలం .5.టి.బృంద 6.రాధా-జయలక్ష్మి. 7.ముత్తయ్య భాగవతార్ 8.మైసూర్ వాసుదేవాచార్ 9.చెంబై వైద్యనాథ  భాగవతార్ 10.అరియకుడి రామానుజ అయంగార్ 11.సెమ్మంగుడిశ్రీనివాస అయ్యర్. 12.ముసిరి సుబ్రమణ్య అయ్యర్. 13.మహారాజపురం విశ్వనాథ అయ్యర్.14.అలత్తూర్ బ్రదర్స్. 15.యం.డి.రామనాథన్ 16.మదుర మణి అయ్యర్ .17.మహారాజపురం సంతానం.18.కె.వి.నారాయణస్వామి.19. శీర్కాళి గోవిందరాజన్.
  తరవాతి తరంవారు ;- డా.యం.బాలమురళీ కృష్ణ 2.టి.యన్.శేషగోపాలన్.3.ఆర్.వేదవల్లి.4. కె.జె.జేసుదాస్. 5.నేదునూరి కృష్ణమూర్తి.6.నూకలచినసత్యనారాయణ. 7.బాంబే సిస్టర్స్. 8.ప్రిన్స్ రామవర్మ. 9.మండా సుధారాణి. 10.యస్.ఆర్.జానకీరామన్. 11.మండపాకశారద . 12.పంతుల రమ 13. శ్రీరంగం  గోపాలరత్నం .
   ఇటీవల కాలంలో పేరుపడుతున్నవారు.1.సుధారఘునాథన్. 2.నిత్యశ్రీ.3. ఉన్నికృష్ణన్. 4.ప్రియా సిస్టర్స్. 5.మల్లాది బ్రదర్స్.
  వాయిద్యకారులలో కొందరు ప్రసిద్ధులు;-
  వయొలిన్;-- 1.కున్నక్కుడి వైద్యనాథన్.2.టి.చౌడయ్య.3.ద్వారం వెంకటస్వామినాయుడు 4.లాల్గుడి జయరామన్. 5.యం.యస్.గోపాలకృష్ణన్. 6.యల్.వైద్యనాథన్. 7.యల్.సుబ్రమణ్యం. 8.టి.యన్.కృష్ణన్. 9.యల్.శంకర్.10. టి. వి. గోపాలకృష్ణన్ 11.గణేష్=కుమరేష్.
   వీణ;= 1.ఈమని శంకరశాస్త్రి 2.యస్.బాలచందర్. 3.సి.హెచ్.చిట్టిబాబు. 4.గాయత్రి. 5.రాజేష్ వైద్య.  
  మురళి;= టి.ఆర్.మహాలింగం . 2.యన్.రమణి.3.ప్రపంచం సీతారాం. 4.విశ్వనాథన్. 5.భాస్కరన్. 6.సిక్కిల్ సిస్టర్స్.
 నా దస్వరం. ;=1.నామగిరిపేట కృష్ణన్ .2.షేక్ మహబూబ్ సుభాని .3.షేక్ చిన మౌలానా సాహెబ్.
  మృదంగం;= 1.పాల్ఘాట్ మణి అయ్యర్. 2.పళని సుబ్రమణి అయ్యర్. 3.పాల్ఘాట్ రఘు. 4.యల్లా వెంకటెశ్వర రావు.
  ఘటం;=1.టి.ఆర్.వినాయకం(విక్కు).
  కంజీర;= 1.హరిశంకర్. 2.గణేష్.
  మాండొలిన్;=యు.శ్రీనివాస్.
  గిటార్ =ఆర్.ప్రసన్న.
  మోర్సింగ్;=శ్రీరంగం కన్నన్
 చిత్రవీణ;=యన్.రవికిరణ్.
  జలతరంగిణి;= అనయంపట్టి యస్.గణేశన్.
     శాగ్జోఫోన్;- కదిరి గోపీనాథ్.
    ఏ జాబితా  కూడా సంపూర్ణం కా లేదు.నాకు తెలిసినంతవరకు వ్రాయగలిగాను.పై జాబితాలో  కీర్తిశేషులు,సుప్రసిద్ధులై ఇంకా మనమధ్య ఉన్నవారు, వర్ధమాన కళాకారులు అందరూ ఉన్నారు.నెటి యువతీయువకుల్లో కూడా శాస్త్రీయ సంగీతాన్ని(గాత్రం,వాద్యములు,) అభ్యసిస్తున్నవారు చాలామంది ఉండడం సంతోష దాయకమే. (ఇంకా ఉంది).    

7, నవంబర్ 2013, గురువారం

Sastreeyasangeetam-2;composers



 

 కర్నాటక సంగీతంలో  గాత్రానికి సహకారంగానూ,స్వతంత్రంగానూ కొన్నివాద్యాలని వాడ్తారు.1.తంత్రీ వాద్యాలు.వయొలిన్, వీణ వంటివి.(stringed instruments)2.సుషిర   వాయిద్యాలు;వేణువు,సన్నాయి వంటివి ( wind instruments ) 3.అనవద్ధ వాద్యాలు.(percussion instruments) మృదంగం  ,డోలు వంటివి.ఈ రోజుల్లో క్లారినెట్.మాండొలిన్,శాక్జొఫోన్ వంటివి కూడా వాడుతున్నారు.
  వాగ్గేయకారులు (composers) ;-- 1.పురందరదాస(1484-1564) కన్నడంలోను,సంస్కృతంలోను ఎన్నోవేల కీర్తనలు రచిస్తే ఇప్పుడు లభ్యమౌతున్నవి 2000.
   2.కనకదాస;-- (1509-1609 )కన్నడంలో 1000 కీర్తనలు
  3.అన్నమాచార్య ;-- 30000దాకా రచించినట్లు ప్రతీతి.కాని నేడు 3600 కీర్తనలు మాత్రం లభ్యం.తెలుగులోను,కొన్ని సంస్కృతంలోను రచించాడు .
  4.అరుణగిరినాథ;--  తమిళంలో దాదాపు  1500 రచనలు చేసాడు.(15 వశతాబ్దం.)
 5.భద్రాచల రామదాసు ;-- (1620-1688) తెలుగులో500 కీర్తనలు రచించాడు.దాశరథి  శతకకర్త కూడా.
  6.క్షేత్రయ్య;-- (1600-1680)తెలుగులో100 పదాలు రచించాడు
   7.నారాయణతీర్థ;- (1650-1745) తెలుగు,సంస్కృతంలో 200 రచనలు
  8.సారంగపాణి;--  (1680-1750) తెలుగులో 200 పైగా పదాలు రచించాడు
  9.విజయదాస- (1682-1755 ) కన్నడంలో 25000  కీర్తనలు రాసినట్లు ప్రతీతి.
  ఇక సంగీతానికి త్రిమూర్తులుగా పేరుపడిన వారు18 వ  శతాబ్దపు మలిభాగంలోను,19వ  శతాబ్దం తొలిభాగంలోను  జీవించారు.సమకాలికులు.తంజావూరు ప్రాంతీయులు.
  1.త్యాగరాజు;- సుప్రసిద్ధులు. వేలకొద్దీ కృతులు పాడినా  ప్రస్తుతం దాదాపు 1000 కీర్తనలే దొరుకుతున్నవి.జీవితకాలం 1767-1845 ప్రహ్లాదవిజయం.నౌకాచరిత్రం అనే సంగీత నాటికలు కూడా రచించాడు.
  2.శ్యామశాస్త్రి;-మీనాక్షీదేవి పైన ఎక్కువ కృతులు రచించాడు.(1762 -1827)
  3.ముత్తుస్వామి దీక్షితులు ;- (1776-1835) 300 కృతులు రచించాడు.సంస్కృతంలో వ్రాసిన ఈ కీర్తనలలో ఒక చోట రాగం పేరును సూచించడం ఈయన ప్రత్యేకత.
  వీరుగాక,తిరువాంకూర్ ప్రభువు స్వాతితిరునాళ్ (1813-1843 ) బహుభాషావేత్త .చాలా భాషల్లో స్వల్ప   జీవితకాలంలోనే రచించాడు.
  సదాశివబ్రహ్మం,మైసూర్ వాసుదేవాచార్ ,పట్నం సుబ్రమణ్య అయ్యర్, చెప్పుకోదగిన  వాగ్గేయకారులు.
  ఆధునికులు కూడా కొందరు ( బాలమురళీకృష్ణ   వంటివారు ) సంగీతరచనలు కొనసాగిస్తూనేఉన్నారు.చాలామంది వాగ్గేయకారులు తమపేరును ఒకచోట ఉటంకిస్తారు. (ఉదా;'త్యాగరాజనుత 'అన్నట్లు).   

6, నవంబర్ 2013, బుధవారం

sastreeya sangeetam



 

  మన భారతీయశాస్త్రీయసంగీతం చాలాకాలం దేశమంతా ఒకే రీతిలో ఉండేది.12వశతాబ్దం నుంచి ముస్లిం దందయాత్రలు ,ఆక్రమణలతో ఉత్తర హిందూస్థానంలో పర్షియన్ సంగీతప్రభావంవలన ఉత్తరాది,దక్షిణాది సంగీతాలు  విభిన్న మార్గాలు అనుసరించాయి. దక్షిణాది లేక కర్ణాటక సంగీతంపై పర్షియన్ ప్రభావం చాలా తక్కువ.ఇది నాలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా,ఆంధ్ర.తమిళ,కేరళ,కన్నడ ప్రాంతాల్లో వ్యాపించింది.విజయనగర సామ్రాజ్యకాలం నుంచి  మొత్తం దక్షిణ భారతాన్ని తెలుగు రాజులు,ప్రభువులు ,జమీందారులు పాలించడం వలన తెలుగువారేకాక ఇతర భాషల వాగ్గేయకారులు కూడా తమరచనలని చాలా తెలుగులోనే చేసారు.
  మనసంగీతంలో పాశ్చాత్య సంగీతం తోపోలిస్తే haarmony (అనేకవాయిద్యల సమ్మేళనం ) కన్నా melody  (రాగం ,స్వరప్రస్తారం )ముఖ్యం.అలాగే prescribed notations  కన్నా,మనోధర్మం(improvisation) ముఖ్యం.
 సంగీతం సప్తస్వరాల సమ్మేళనం వలన ఏర్పడుతుంది.అవి,1స (షడ్జమ) 2. రి (వృషభ) 3.గ(గాంధార) 4.మ(మధ్యమ) 5.ప (పంచమ) 6.ద (దైవత) 7, ని (నిషాద)
 2.శ్రుతి -(musicall pitch ) స్తాయి.ఇది తప్పిపోకుండా maintainn చేయాలి.దీనికి తంబురా వాడుతారు.
 3.తాళం (fixed time cycle ) లయ.
 4.రాగం మొత్తం 72 మేళకర్త రాగాలు ఉన్నాయి.(జనకరాగాలు).వీట్లోంచి ఎన్నో జన్య రాగాలు సాధించవచ్చును.పాటల్లో వైవిధ్యం ఈ వివిధ రాగాలవలననే కలుగుతుంది.(tunes)
   సంగీతం నేర్చుకొనడానికి ప్రాథమిక మైన  దశ నుంచి ప్రారంభించి క్రమంగా ఉన్నతమైన ,క్లిష్టమైన దశకు చెరుకోవలసి ఉంటుంది.అందుకు కొన్ని సంవత్సరాలు పడుతుందంటారు.
  మొదట సరిగమలు సరిగ పలకడం నేర్పుతారు. తర్వాత వాటినే జంటగా.సస,రిరి,గగ-,అని సాధనచేయిస్తారు.తర్వాత సరళీస్వరాలు ,గీతాలు నేర్పిస్తారు.
 వర్ణం;-ఇందులో రాగానికి కావలసిన పల్లవి,అనుపల్లవి,చరణం, చిట్టస్వరం(పదాలుల్లేకుండా స్వరాలు మాత్రమే) ఉంటాయి.ఇవి బాగా నేర్చుకుంటే ,శ్రుతి,తాళం,voice culture అలవడుతాయి.
  కృతి(కీర్తన) ;-ఇంకా పై మెట్టు అన్నమాట.వీటిలో,పల్లవి,అనుపల్లవి,చరణాలు ఉంటాయి.పాడినప్పుడు రాగాలాపన,తానం,సంగతులు,గమకాలు వేసి పాడతారు.
 
 ఇవి గాక నృత్యానికి  అనుకూలమైన జావళీలు,తిల్లానలు.భజనపాటలు మొదలైనవి కూడా ఉంటాయి.
  ఈ బ్లాగులు సీరియల్గా వ్రాయదలుచుకొన్నాను.సంగీతంలో ప్రవేశం ఉన్నవారికి ఇవి అనవసరము.  అలాగే అభిరుచి లేనివారికి కూడా అనవసరమే.నాలాగ అభిరుచి ఉన్నా ప్రవేశంలేనివారికోసమే.,నా పరిమితజ్ఞానం తో  వ్రాస్తున్నాను.
               ((ఇంకా ఉంది)).

5, నవంబర్ 2013, మంగళవారం

jayaketanam




 


  అభ్రవీథిలో-అద్భుతం
                 భారతీయ జయకేతనం
  శాస్త్రవేత్తల,మేధావుల
  జ్ఞానరాశుల- ఘనతమప్రయోగం
  అంగారకుని చేరగా -అత్యాధునిక సాంకేతికం
  అగ్నిధారలను చిమ్ముచు,-అంబరం లోకి దూసుకుపోయెను
  నిర్ణీత కాలంలో- నిర్దేశితకక్షను చేరిన
   మంగళయాన క్షిపణి ప్రయోగం
                      భారతీయజయకేతనం
   జయఘోషలతో నినదిద్దాం - జైత్రయాత్రను సాగిద్దాం
   అగ్రదేశాల సరసన -అవలీలగ నిలుద్దాం
   అబ్రవీథిలో,అంబరాంచలాల - అన్నిదేశాలు తిలకించి అబ్బురపడగా
                  ఎగురవేద్దాం భారత జయకేతనం!          
                --------------------
       

3, నవంబర్ 2013, ఆదివారం

gold imports




 ప్రపంచంలో బంగారం దిగుమతిచేసుకొనే దేశాల్లో ప్రధానమైనవి భారత్,చైనాలు.మనదేశంలో కొన్ని పండుగలకి,పెళ్ళిళ్ళకి బంగారం ఎక్కువగా ధనవంతులేగాక మధ్యతరగతివాళ్ళు కూడాకొంటారు.ఇటీవల ప్రపంచంలో ఆర్థికమాంద్యం వలన మన ఎగుమతులు తగ్గిపోయి ,మనం ప్రధానంగా దిగుమతి చేసుకొనే పెట్రోలు,డీజలు ,బంగారం విలువేక్కువై ,ఆర్థికలోటు fiscal  deficit ఎక్కువయింది.అందువలన  కొత్త రిజర్వ్ బాంక్ గవర్నర్ సలహాపై బంగారం దిగుమతిని ప్రభుత్వం తగ్గించివేసింది.దీనితో దేశీయ,అంతర్జాతీయ గోల్డ్ మార్కెట్లు గిరాకి తగ్గి దెబ్బతిన్నాయి.వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చినా  విధానం మార్చుకో లేదు.డీజల్.గ్యాస్ ధరలు కూడాకొంతపెంచారు.దీనితో ద్రవ్యలోటు తగ్గి దేశార్థికపరిస్థితి  కొంత చక్కబడింది.కాని ఇవి ప్రజల్లో వ్యతిరేకత పెంచే  నిర్ణయాలు.(unpopular decisions ) వీటి పరిణామాలు వేచి చూడాలి.  



 ప్రపంచంలో బంగారం దిగుమతిచేసుకొనే దేశాల్లో ప్రధానమైనవి భారత్,చైనాలు.మనదేశంలో కొన్ని పండుగలకి,పెళ్ళిళ్ళకి బంగారం ఎక్కువగా ధనవంతులేగాక మధ్యతరగతివాళ్ళు కూడాకొంటారు.ఇటీవల ప్రపంచంలో ఆర్థికమాంద్యం వలన మన ఎగుమతులు తగ్గిపోయి ,మనం ప్రధానంగా దిగుమతి చేసుకొనే పెట్రోలు,డీజలు ,బంగారం విలువేక్కువై ,ఆర్థికలోటు fiscal  deficit ఎక్కువయింది.అందువలన  కొత్త రిజర్వ్ బాంక్ గవర్నర్ సలహాపై బంగారం దిగుమతిని ప్రభుత్వం తగ్గించివేసింది.దీనితో దేశీయ,అంతర్జాతీయ గోల్డ్ మార్కెట్లు గిరాకి తగ్గి దెబ్బతిన్నాయి.వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చినా  విధానం మార్చుకో లేదు.డీజల్.గ్యాస్ ధరలు కూడాకొంతపెంచారు.దీనితో ద్రవ్యలోటు తగ్గి దేశార్థికపరిస్థితి  కొంత చక్కబడింది.కాని ఇవి ప్రజల్లో వ్యతిరేకత పెంచే  నిర్ణయాలు.(unpopular decisions ) వీటి పరిణామాలు వేచి చూడాలి.  

30, అక్టోబర్ 2013, బుధవారం

Big bang theory



 

  మన పురాణాల ప్రకారం ఆదిలో బ్రహ్మాండమంతా ఒక అండంలో సూక్ష్మరూపంలో ఉండేదని ,అది పగిలి విరజిమ్మబడి స్థూలరూపంలో మహావిశ్వం అయిందని,మళ్ళీ కోట్లసంవత్సరాల పిదప ఈ విధానం process పునరావృతం అవుతుందని చెప్పబడింది.ఇది చదువుతే నేటి సైన్సు చెప్పే 'బిగ్ బాంగ్ ' (bigbang) సిద్ధాంతాన్ని పోలివుంది.భౌతిక,ఖగోళ శాస్త్ర వేత్తలెవరైనా ఈ విషయం విశదీకరిస్తే సంతోషిస్తాను.దీనిపై చర్చకు ఆహ్వానిస్తున్నాను.  

21, అక్టోబర్ 2013, సోమవారం





  ఇదాకటి బ్లాగులో,నారదుడు ధర్మరాజుకిచేసిన ఉపదేశంలో ఒక  ముఖ్యమైన సలహా రాయడం మరిచిపోయాను.అదేమంటే;-ఆదాయాన్ని మించి వ్యయం చేయకూడదని.అది ఇప్పటికీ వర్తిస్తుంది కదా!మనదేశం తోబాటు అమెరికా తోసహా చాలా దేశాలు ఆదాయాన్ని మించి ఖర్చు చేస్తున్నాయి.(deficit financing )అప్పులు చేసి బడ్జెట్ balance చెయ్యలేకపోతున్నాయి . 



 మనమిప్పుడు ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యం ఎలా ఉండాలని ఒక concept పెట్టుకొంటామో, అలాగే పూర్వం ఆదర్శవంతమైన రాజరికం ఎల ఉండాలో ననే conceptఉండేది.మహాభారతంలో నారదముని   ధర్మరాజు కి ఈ పరిపాలనావిషయాలు, రాజధర్మాల గురించి బోధిస్తాడు.వాటిని ఎందరు రాజులు ఆచరించేవారనేది వేరే సంగతి.ధర్మరాజు మాత్రం తనశక్తి కొలది వాటిని పాటిస్తున్నానని చెప్తాడు.ఆ సూత్రాలు కొన్ని ఈరోజు కూడా  పరిపాలకులకు (ministers and highoffcials ) కి వర్తిస్తాయి.అవి ఏమిటంటే;-- 1.ఉత్తమ,మధ్యమ,అధమ,కార్యాలకి ఉత్తమ,మధ్యమ,అధమ వ్యక్తులను నియోగించాలి.2.ఉద్యోగులకు క్రమం తప్పకుండా జీతాలు చెల్లించాలి.3.రాజ్యం కోసం ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలను పోషించాలి.4.రాచకార్యాలకి లంచగొండులను,దొంగలను,దుర్జనులను నియోగించకూడదు.5.చెరువులు,ఇతర జలాశయాలను రక్షించాలి.6.రైతులకు విత్తనాలు సరఫరా చెయ్యాలి.7.వర్తకులకు వ్యాపారానికి అప్పులు ఇవ్వాలి.8.వికలాంగులను,వృద్ధులను పోషించాలి.9. ధనాగారములు,ఆయుధశాలలు ,భాండారాలు,దక్షత,నమ్మకం కలవారి చేతనే నిర్వహింపజేయాలి(treasuries,armouries ,stores) 10. గురువులు,వృద్ధులు,శిల్పులు,కళాకారులు,వర్తకులు(businessmen) ,సాధువులు,బంధువులు,ఆశ్రితులు ,వీరిని  పేదరికము పొందకుండా కాపాడాలి.
  మరినేటి పరిపాలకులు పై ధర్మాలు,సూత్రాలు ఎంతవరకు పాలిస్తున్నారో నిర్ణయించుకొనండి.చిట్టచివరి సూత్రాన్నిమాత్రం (బంధుజనులను,ఆశ్రితులను ) బాగానే  పాటిస్తున్నట్లు ఉంది.    

16, అక్టోబర్ 2013, బుధవారం

aarudra madhyakkaralu


 

 ఆరుద్ర  శుద్ధమధ్యాక్కరలు.;-ఆరుద్ర వ్యంగ్యానికి,హాస్యానికి,కొత్తప్రయోగాలకీ పెట్టిందిపేరు.విశ్వనాథవారికి 'మధ్యాక్కరలకి సాహిత్య  అకాడమీ బహుమతి వచినప్పుడు ఆరుద్ర తన మధ్యాక్కరలనివ్రాసి ఆయనకే అంకితం ఇచ్చారు.ఆరుద్ర అభిప్రాయంప్రకారం పాడుకోడానికి పుట్టిన 'అక్కరలనీ జటిలమైన చందోవ్యాకరణాలతో పండితకవులు పద్యాలుగా మార్చేసారని.అందువలన సరళంగా తన శుద్ధ మధ్యాక్కరలు రచించారు.వాటి చందసుని తానే ఇలా నిర్వచించారు.'' పదమూడు మాత్రలున్నట్టి పాదార్థముల  వళ్ళుపెట్టి ,తుదిప్రాసలందు నిలుపు,తూకాన అవి రెండు కలుపు.మొదలట్లు తొలిప్రాసవుంచి ముద్దుగా నాల్గాలపించు. '' ఉదాహరణకు మూడు రాస్తున్నాను.
     '' ఆంధ్రలో రోడ్లన్న భయము--ఆఫ్రికా అడవులే నయము.
        చాంద్రాయణము చేయు జనులు --- జపము విడిచిన మేటి మునులు
        గంద్రగోళపు ఆటవిడుపు ---సంద్రపు ఘోష దిగదుడుపు
        ఇంద్రుడైనా గుడ్డివాడు,--ఇచ్చోట తానడువలేడు.''

     '' గేయమేముందుపుట్టింది --హాయిగా జాతి నవ్వింది.
        వేయిపేరుల  లక్షణమ్ము --వెనుకవచ్చిన దుప్పికొమ్ము.
        తీయతీయని నాటుపాట --దేశీయసంపదల మూట
        హేయమైనది పండితులకు --ఇల సంస్కృతపు హెచ్చుకొరకు. ''''

     '' తనకు లేదని బాధకాదు-- తనవారికలిమిచేదు
        తనివి తీరడమనుటలేదు  --తనలోని చెడు దుగ్ధ పోదు.
        కనబడని రోగమే ఈసు--- కాలకూటపు కంచు గ్లాసు
       మునిగిపోయే పిచ్చివాడు--ముందు తీరము చేర లేడు  
  

10, అక్టోబర్ 2013, గురువారం




 ఇది పాత ప్రశ్నే.సమాధానం కూడా తెలిసిందే.కాని ఆచరణ లో విఫలం అవుతున్నది.మనిషికి కావలసిన సహజ అవసరాలు;1,తిండి,బట్ట,ఇల్లు.2.ఆరోగ్యం 3.విద్యావకాశాలు.4.శాంతి,భద్రత.గాంధీజీ చెప్పినట్లు.tere is enough for everyman's need but there is not enough for every man's greed.ఇందుకు కమ్యూనిజం పరిష్కారమని అనుకున్నారు కాని అది కూడా ఆచరణలో విఫలమైంది.అభిజ్ఞుల ప్రకారం పూర్తిగా కాకపోయినా ,చాలా వరకు ఈ ఆదర్శాలు స్కాండినేవియన్ దేశాలలో (స్వీడెన్,నార్వే,డెన్మార్క్)  సఫలీకృతం ఔతున్నాయంటారు. 

Baburnama


 

 బాబర్నామా ,మొఘల్ సామ్రాజ్యస్థాపకుడు బాబర్ తన ఆత్మకథగా రాసుకొన్న పుస్తకం.మధ్య యుగాల చరిత్ర ,స్థితిగతులు  దీనివలన యథాతథంగా  తెలుస్తాయి.భారతదేశంలో అప్పుదున్న రాజ్యాలు,వాటి సైన్యాలు ,చేసిన యుద్ధాలే కాకుండా,భౌగోళికపరిస్థితులు,చరిత్ర వివరంగా తెలియజేసాడు.అంతేకాదు,మనదేశంలో వ్యవసాయం,మనుష్యుల కట్టుబొట్టు,ఆచారాలు,చెట్లు,జంతువులు,పక్షులు ప్రతీది సవిస్తరంగా కనిపెట్టి రాశాడు.తక్కువసైన్యంతో పెద్దసైన్యాలని ఓడించి ఎలా సామ్రాజ్యస్థాపన చేసాడో వర్ణించాడు.మన అనైక్యత,యుద్ధతంత్ర బలహీనతలు,ఏవిధంగా విదేశీ దండయాత్రలకు లోను కావలసివచ్చింది తెలుస్తుంది .మరొక్క ముఖ్యవిషయం; ఎన్ని రాజ్యాలుగా విడిపోయిఉన్నా సింధునదినుంచి అస్సాం వరకు,హిమాలయాలనుంచి హిందూమహాసముద్రం వరకు ఆనాడే భరత్ లేక హిందూస్తాన్ విస్తరించిఉన్నదనే అవగాహన ఉన్నట్లు ఈ గ్రంథం ద్వారా తెలుస్తుంది.జిజ్ఞాసువులందరూ తప్పక చదవవలసిన పుస్తకం.    

30, సెప్టెంబర్ 2013, సోమవారం

kalavantulu


 
 


  ఒకప్పుడు బోగంవారని,తర్వాత కళావంతులని పేరున్నవారి కులవృత్తి గురించి ఇక్కడవ్రాయడంలేదు.వారిలో చాలామంది చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు.ఈ రోజుల్లో అనేక కారణాలవలన ఇతర కులాలలోకి కూడా ఈ పడుపు వృత్తి  వ్యాపించింది.నేను వ్రాయదలుచుకొన్నది;వారు సంప్రదాయకళలకి,ఆధునిక కళలకీ.చేసిన సేవ ,contribution గురించి మాత్రమే.రాజసభల్లో నర్తకులుగా,దేవాలయాల్లో దేవదాసీ నర్తకులుగా నృత్యకళను బాగా నేర్చుకొని ప్రదర్శించేవారు.మేజువాణీల్లోను,కొన్ని పెళ్ళిళ్ళలోను కూడా నాట్య ప్రదర్శనలిచ్చేవారు.శాస్త్రం తెలిసిన పండితులు వీరికి నేర్పేవారు.ఒక్క మన రాష్ట్రం లోనేకాదు ,ఒడిస్సా,తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాగే సంప్రదాయసంగీతం,నృత్యం ,పోషించారు.ఉత్తరాదిలో కూడా,నవాబులు,మహారాజాల ప్రాపకంలో హిందూస్తానీ సంగీతాన్ని,నృత్యాల్ని అభ్యసించి ప్రదర్శించేవారు.వీరిలో కొందరు కవయిత్రులూ,విదుషీ మణులూ కూడా ఉండేవారు,వీరిలో ధనవంతులైనవారు కొందరు గుళ్ళు తటాకాల నిర్మాణానికి ,గోపురాలకి,సత్రాలకి దానధర్మాలు చేసిన శాసనాలు ఉన్నాయి.
  ఇక ఆధునిక కాలంలో చూస్తే,మొదట్లో సంసారస్త్రీలు ముందుకురాని  రోజుల్లో నాటకాలు, సినిమాలలో,ప్రధానపాత్రలు ధరించి జనరంజకంగా ప్రసిద్ధి పొందిన వారు.జానపదకళాకారులవలె మన కళల్ని ఆచరించి,వృద్ధి పొందించడంలో  వీరి ముఖ్య పాత్రకు అభినందనలు, కృతజ్ఞతను తెలుపవలసి వున్నది. 

20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

naa amerika yatra =contd.-Independence Day


4--7--13:- 4th  of  July , American Independence Day: ఇవేళ అమెరికా స్వాతంత్ర్య దినం. హడ్సన్ (Hudson) నదిలో నౌకలని నిలబెట్టి వాటినుంచి బాణాసంచా కాలుస్తారు. సాయంకాలం నుంచి ట్రాఫిక్ నిబంధన, పోలీసు పహరా ప్రారంభమైనది. కొందరు కార్లలో ఇతర ప్రాంతాలనుంచి వచ్చి వీక్షించారు. కొందరు పడవలు, క్రూయిజ్ల (cruise) నుంచి వీక్షించారు. మేము మాత్రం మా ఇంట్లోనుంచే చూడగలిగాము. రాత్రి9-30 నుంచి 10 గంటలదాకా ఆ కార్యక్రమం కొనసాగింది. ఎంతో గొప్పగా, మనోజ్ఞంగా సాగింది. నవరత్నాలు రాశులుగా ఆకాశం లోంచి రాలుతున్నట్లు అనిపించింది. జాతీయ కార్యక్రమం కాబట్టి ప్రభుత్వశాఖ నిర్వహిస్తుంది అనుకొన్నాము. కాని, అమెరికా కదా, దీన్ని కూడా ఒక ప్రైవేటు కంపెనీ కి అప్పజెప్పారు. మొత్తం మీద జులై నాలుగు ఉల్లాసంగా గడిచింది.
(ఇంకావుంది)













18, సెప్టెంబర్ 2013, బుధవారం

paata taram heerolu..పాత తరం చిత్ర సీమ కథా నాయకులు

1940-1950 మధ్య తెలుగు సినిమా హీరోల్లో నాగయ్య, సీ.హెచ్.నారాయణరావు సినిమాలు, అలాగే సీ.యస్.ఆర్., ఈలపాట రఘురామయ్య సినిమాలు కొద్దిమందికైనా గుర్తు ఉండవచ్చును. లేక  ఈమధ్య టీ.వీ.లో వేసినప్పుడు చూసివుంటారు.

కాని ఉమామహేశ్వరరావు గురించి ఎవరికైనా గుర్తుందో లేదో తెలియదు. ఆయన కాంచనమాల,లక్ష్మీరాజ్యం తో కలిసి 'ఇల్లాలు', లక్ష్మీరాజ్యం తో కలిసి 'పంతులమ్మ' లో నటించారు. కడప లో ఉన్నప్పుడు ఆయనను చూసాను. వృత్తి రీత్యా లాయరు. మంచి స్ఫురద్రూపి. తెల్లగా, కొంచెం లావుగా వుండేవాడు.

గిరి అని మరొక హీరో రెండు సినిమాల్లోనే  వేసినట్టు గుర్తు. బందా కనకలింగేశ్వరరావు ప్రధానంగా నాటకాల్లో వేస్తూ ప్రసిద్ధి పొందినా కాంచనమాలతో కలిసి 'బాలనాగమ్మ' సినిమాలో వేసారు. ఆ రోజుల్లో స్టేజి నటులు అప్పుడప్పుడు సినిమాల్లో వేసినా నాటకరంగానికే ప్రాధాన్య మిచ్చేవారు.       

16, సెప్టెంబర్ 2013, సోమవారం

naa amerikaa yaatra--11: తిరుగు ప్రయాణం


ఆగస్టు 4 న మా వాళ్ళతో కలసి విమానంలో న్యూయార్కు లో బయలుదేరి 5వ తేదీన క్షేమంగా హైద్రాబాదు చేరుకున్నాము. తిరుగు ప్రయాణం సాఫీగా జరిగిపోయింది.

అమెరికా గురించి నా భావనలు (impressions): ఒక దేశం గురించి బాగా  తెలుసుకోవాలంటే ఆ దేశంలో ఒక ఏడాదిపాటు ఉండి, ప్రజలతో పరిచయం చేసుకొని, దేశమంతా తిరిగి అధ్యయనం  చేస్తేనే నిజ పరిస్థితి కొంతైనా తెలుస్తుంది. నేను చూసింది తూర్పుతీరంలో ఈశాన్యభాగమే. ఇది బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం. చాలా పెద్దదైన అమెరికాలో లోపల, ఎడారులు, వర్షాభావప్రాంతాలు కూడా ఉన్నవి. ఐనా నేను చూసి తెలుసుకొన్నంత వరకు మాత్రం వ్రాస్తున్నాను.

1. అమెరికా అప్పుల్లో ఉంది, ఆర్థికసంక్షోభంలో  ఉంది అంటారు కాని స్థూలదృష్టికి మనకు అంతా బాగనే ఉన్నట్లు అనిపిస్తుంది.

2. అమెరికాలో జీవన వ్యయం బాగా ఎక్కువ; ఐతే ఆదాయాలు కూడా బాగా ఎక్కువే. పేదరికం లేకపోలేదు కాని, బాగా తక్కువే. భారత్ కన్నా బాగా వైశాల్యంలో పెద్ద దేశం. జనాభా  తక్కువ. మంచి నీరు,విద్యుత్, రోడ్ల వంటి ప్రాథమిక అవసరాలు అందరికి అందుబాటులో ఉన్నాయి.

3. ఇక్కడ infrastructure బాగుంది. ఐతే పెరిగిన జనాభా, అవసరాలకి తగినట్లు  ఇంకా అభివృద్ది చేద్దామంటే డబ్బుచాలదు. కొన్ని నగర పాలక సంస్థలు దివాలాతీసాయి.

4. కార్లకిచ్చిన ప్రాముఖ్యం బస్సులకీ, రైళ్ళకీ లేదు. చాలా చోట్ల బస్సులు దొరకవు. రైళ్ళు నెమ్మదిగా నడుస్తాయి. జపాన్ లోలాగ వేగంగా నడవవు. రైలు చార్జీలు కూడా బాగా ఎక్కువ. public transport కి ప్రాముఖ్యత లేదు.

5. హైస్కూలు విద్య వరకూ అందరికీ ఉచితం, నిర్బంధమూ. ఉన్నత విద్య మాత్రం చాలా ఖరీదు. అందువలన చాలా మంది పై చదువులు చదవ లేకపోతున్నారు.పై చదువులు చదవాలంటే పెద్ద మొత్తంలో అప్పు చేయాలి. ఇక్కడ జబ్బుచేస్తే  చాలా కష్టమే. వైద్య  ఖర్చులు చాలా ఎక్కువ. అందరికీ ఇన్షూరెన్సు లేదు. అందుకే అద్యక్షుడు ఒబామ తగిన చర్యలు  తీసుకుంటున్నారు.

6. వ్యక్తి స్వేచ్చకు ప్రాముఖ్యమిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోరు.

7. సింగిల్ పేరెంట్ కుటుంబాలు 30  శాతం ఉన్నాయి. దీనికి కారణం విడాకులు, లేక అసలు పెళ్ళి లేకుండా ఉండటం.

8.high technology, యుద్ధ సామగ్రి (armaments) ఉత్పత్తి  ఎక్కువ.  కాని వినిమయ వస్తువుల ఉత్పత్తి బాగా తక్కువ. ఎలక్ట్రానిక్ ప్రాడక్ట్స్, గృహోపకరణాలు, అన్నీ ఇతరదేశాల నుంచి, ముఖ్యంగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటారు. బజార్లలో made in U.S.A.అని ఏ వస్తువు మీదా ముద్ర కనబడదు. రోడ్ల మీద జపాన్ వారి   హోండా, టొయోటా, నిస్సాన్ కార్లే ఎక్కువ కనబడ్తాయి. అమెరికన్ కార్లైన  Ford , General  Motors, Chrylser మరీ ఎక్కువగా కనబడ లేదు.

9. సామాన్య ప్రజలకి పొదుపు తక్కువ. విలాసాలకి బాగా ఖర్చు పెడతారు. పిలలు పెద్దవగానే విడిపోయి వేరే జీవిస్తూఉంటారు.

10. ప్రభుత్వ ఉద్యోగాలు బాగా తక్కువ. ప్రైమరీ టీచర్లు, అగ్ని మాపక దళం, పోలీసుల వంటివి కొన్ని తప్ప, ఎక్కువ మంది ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూనో , లేక స్వతంత్రం గానో బతుకుతుంటారు. ఐతే నిరుద్యోగులు, వృద్ధులు మొదలైనవరికి, సోషల్ సెక్యూరిటీ కింద ప్రభుత్వం కొంత భరణం చెల్లిస్తుంది.

చివరిమాట. ఒకమనిషిని 10,20, సంవత్సరాలు రోజూ చూస్తుంటే మనకు పెద్ద మార్పు కనబడదు. అదే మరొకరు చాలాకాలం దూరంగా ఉండి చూస్తే చాలా మార్పు కనిపిస్తుంది. స్వతంత్రం వచ్చి60 ఏళ్ళైనా దేశం అలాగే ఉందని మనవాళ్ళు రాస్తూఉంటారు. కాని,నా అమెరికా మిత్రుడు సత్యం గారు మన దేశం, ప్రజలు, అన్నిరంగాల్లో  చాలా అభివృద్ధి  చెందిందని, బాగా మారిపోయిందని అంటారు. 2050 నాటికి ఇంకా చాలా అభివృద్ధి చెంది ప్రపంచంలో ఒక అగ్రరాజ్యమౌతుందని ఆయన అభిప్రాయం. అదే నిజం కావాలని మనమంతా  ఆశిద్దాము.
         
(అమెరికా యాత్ర సమాప్తం)    

15, సెప్టెంబర్ 2013, ఆదివారం

naa america yaatra --10: Metropolitan Museum




 ఇంతకు ముందే రాయవలసిందిమరచిపోయి ఇప్పుడు రాస్తున్నాను. ఈ రోజు మెట్రోపాలిటన్ ముసెఉం (మెట్రోపాలిటన్  మ్యూజియం) కి బయలుదేరాము. న్యూయర్కులో ఎన్నో మ్యూజియంస్ ఉన్నాయి. ఒక్కొక్క  విషయానికి ఒక మ్యూజియం వేర్వేరు గా ఉన్నాయి. ప్రాణికోటికి Natural history museum, చిత్రకళకి Guggeinheim
 museum, ఇలా వేరువేరు గా ఉన్నాయి.

ఈ Metropolitan Museum కళాత్మక వస్తువులు వివిధ దేశాలనుంచి సేకరించి ఉన్నవి. ఇది 5వ అవెన్యూలోఉంది. రోజుకి కొన్ని వేలమంది సందర్శిస్తుంటారు. అసలు బిల్డింగే ఎంతో ఉన్నతంగా గొప్పగా ఆకర్షణీయంగాఉంది. ముఖద్వారం గ్రీకో రోమన్ శైలిలో పెద్దస్తంభాలతో ఉంది. లోపల పెద్దహాలు రినజాన్సు renaissance శైలిలో ఉంది. ప్రాచీన ఈజిప్టు, సుమేరియా, సింధు నాగరకత నుంచి, మధ్యయుగాలు దాటి ,ఆధునిక అమెరికన్ నాగరకత వరకు కళాత్మక వస్తువులు, శిల్పాలు, చిత్రాలు  ఎన్నో ఉన్నవి. ఒక్కొక్క విభాగానికి దాని దాత పేరు పెట్టారు. ఈ మ్యూజియం మన సాలార్జంగ్ మ్యూజియం కి రెండురెట్లు పైగా ఉంటుంది. మూడు అంతస్తులలో వందలకొద్ది గదులలో  ప్రదర్శించిన పద్ధతి  బాగుంది. మధ్యలో అల్పాహారం తీసుకొని ఉదయం 11 గంటల్నుంచి, సాయంత్రం 5 గంటల వరకు తిరిగి చూసాము.నాకు చక్రాల బండి ఏర్పాటు చేసారు. ప్రతీది వివరంగా చూస్తూ పోతే కొన్ని  రోజులు పట్టుతుందంటారు.

మనకన్నా ఇక్కడి ప్రజలకి ఇటువంటి ప్రదర్శనలంటే ఎక్కువ ఆసక్తి. శ్రద్ధ చూపిస్తారు. ఇందులో నేను చూసిన విగ్రహాలన్నిటిలోను  ఆకర్షించినవి, చాలా పెద్దవి, ఒక్కొక్కటి 20 అడుగుల కన్నా ఎత్తయినవి మూడు:
1.ఈజిప్టు రాజు ఫరో రాంసెస్ విగ్రహం.
2.'మెడుసా ' తల ఖండించి చెతితో పట్టుకున్న గ్రీకువీరుడు 'పెర్సియస్ ' విగ్రహం
3.పాండ్య దేశపు శిల్పము, విష్ణుమూర్తి విగ్రహము.

ఇంతకు ముందు చూడని అస్సీరియన్, ఫొనీషియన్, సైప్రస్, పెర్షియన్ శిల్పాలు ఉన్నాయి. మరొక ముఖ్యమైనవిషయం, ప్రాచీన ఈజిప్టు  దేవాలయం ఒకదాన్ని తీసుకువచ్చి ఇక్కడ మళ్ళీ కట్టారు.'హాట్సెప్సట్ ' రాణి ' స్ఫిన్క్ ' విగ్రహం కూడా ఉన్నది. మొత్తం మీద విజ్ఞానాని, వినోదాన్ని పంచిపెట్టే యీ మ్యూజియం ని చూడటం ఒక గొప్ప అనుభవం.  

























12, సెప్టెంబర్ 2013, గురువారం

naa amerikaa yaatra;-9: Lincoln Center


లింకన్ సెంటర్ లో 6 పెద్ద బిల్డింగులు ఉన్నాయి. ఇది మాన్ హాటన్ లో ప్రధాన కళావేదిక అనవచ్చును. రోజూ వీటిలో ఏవో ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. మధ్యలో ఒక జలయంత్రం (water fountain) వెలుగులు చిమ్ముతూ ఉంది.

థియేటర్లు, ఒపెరాహాల్స్, కాన్సర్ట్ హాల్స్, ఫలహారశాలలు, పెద్ద్ షాపులు ఉన్నవి. అందులో ఏవరీ  ఫిషర్ హాల్ (Avery fisher hall ) కి టికెట్లు తీసుకొని వెళ్ళాము. అందులో  బీథోవెన్,మొజార్టు సంగీత కచేరీ జరుగుతున్నది. సరిగా 7-30 కి ప్రారంభమై 9 గం. కి ముగిసింది. మోజార్ట్ 40 బీథోవెన్7  వ సింఫనీ, వాయించారు. 40 మంది వాద్యకారులు, వయొలిన్స్, సెల్లోలు, ఫ్లూట్స్, సాగ్జోఫోన్స్, డ్రంస్ తో బృందం బాగా ప్రదర్శన  ఇచ్చారు. కండక్టర్ బాగా ప్రసిద్ధుడైన  'లూయీ లాంగ్రి. '
మన కచేరీలకి పాశ్చాత్యుల వాటికీ  కొన్ని తేడాలున్నాయి.
1.ప్రకటించిన సమయానికి సరిగ్గా మొదలుపెడతారు.
2.కచేరీ జరిగినంతసేపు నిశ్శబ్దంగా ఉండాలి.
3.ఎవరి ఇష్టం వచ్చినప్పుడు వారు రావడం, పోవడం కుదరదు. ఒక ప్రదర్శన ముగిసిన తర్వాతే శ్రోతలు చప్పట్లతో వారి అభినందనలు  తెలియజెయ్యాలి కాని మధ్య మధ్యలో చెయ్యకూడదు.
4. సన్మానాలు, దీర్ఘప్రసంగాలు, వీ.ఐ.పీ.ల కోసం వేచి ఉండటం ఉండదు.
సరిగా వీళ్ళ లాగే మనం చెయ్యాలి అనను; మన పద్ధతులు సంప్రదాయాలు మన కుంటాయి కాని సమయపాలన, నిశ్శబ్దం పాటించాలని  నా అభిప్రాయం.
శాస్త్రీయ సంగీతమైనా హాలు నిండిపోయింది. 2 వేలమంది వచ్చిఉంటారు. వేదిక చుట్టూ ఉన్న గాలరీలే కాక, పెద్ద, చిన్న బాల్కనీలన్నీ నిండిపోయాయి. మన ఆంధ్రదేశంలో శాస్త్రీయ కళలకి లభించే ఆదరణ గూర్చి తలచుకొంటే బాధ కలుగుతుంది.


11, సెప్టెంబర్ 2013, బుధవారం

naa amerikaa yaatra---8 (contd): నేస్తం

27-7-2013 నేస్తం:

ఈ రోజు అంతా బిజీగా గడచింది. నా బాల్యమిత్రుడు గొర్తి సత్యం (G.V.Satyanaaraayana moorti) న్యూయార్కు స్టేట్ లోనే కటోనా అనేప్రాంతంలో ఉంటున్నాడు. అక్కడికి వెళ్ళడానికి మేము మధ్యాహ్నం 1-30 కి బయలుదేరి, గ్రాండ్  సెంట్రల్  స్టేషన్ నుంచి రైలు లో వెళ్ళాము. స్టేషన్ నిజంగానే 'గ్రాండ్ ' గా ఉంది. గంటంపావు ప్రయాణం తర్వాత కటోనా స్టేషన్ లో దిగాము. అక్కడనుంచి సత్యం మమ్మల్ని కారులో తీసుకొని వెళ్ళాడు. మా యీడు  వారైనా వారిద్దరూ కారు డ్రైవ్ చేస్తారు. అక్కడ తప్పదని చెప్పాడు. దారిలో అంతా పచ్చని చెట్లు, వనాలు, సరస్సులతో మనోహరంగా ఉంది.మా సత్యం వృత్తి రీత్యా అడ్వొకేట్. ఆయన సతీమణి ఇందిర మెడికల్ డాక్టర్. ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నారు. పిల్లలు నలుగురు బాగా పైకి వచ్చి వేరే చోట్ల ఉంటున్నారు. ఇక్కడ అది మామూలే.

వాళ్ళ ఇల్లు పై గోడలతో సహా అంతా కలప (wood) తో కట్టినదే. కింద 2 హాల్సు, మేడమీద 2 పడక గదులు ఉన్నవి. వంటగది వేరే ఉంది. రెందు ఎకరాలస్థలంలో ఒకపక్క చిన్నచెరువు లేక కుంట (pond) ఉంది. అందులో చాల లిల్లీ పువ్వులు వికసించి ఉన్నాయి. చుట్టూ చెట్లు, పూలమొక్కలు, అంతా ఒక ఋష్యాశ్రమం లాగ ఉన్నది. మా సత్యంకి నాలాగే పుస్తక పఠనం అంటే ఆసక్తి. సెల్లార్ లో పెద్ద లైబ్రరీ ఉంది. డాక్టర్ ఇందిరకి ప్రపంచ యాత్రలంటే ఇష్టం. (wander lust) ఐదు ఖండాల్లోను అనేక యత్రాస్థలాలు దర్శించింది.

వాళ్ళ ఇంట్లో కొంతసమయం గడిపాక మళ్ళీ బయలుదేరి సాయంత్రం 5-30 కి న్యూయార్కు మాన్ హాటన్ చేరుకున్నాము. సాయంత్రం 7-30 గంటలకి లింకన్ సెంటర్లో (concert) కి వెళ్ళాము. దానికి ముందే టికెట్లు రిజర్వు చేసుకున్నాము.

naa amerikaa yaatra--contd: Haggers Town-NY


తర్వాత ఇంటికి వచ్చి, భోజనం చేసి  హేగర్స్ టౌన్ నుంచి వాషింగ్టన్ బయలుదేరాము. ఒక పక్క అపలేషియన్ కొండలు, అడవులు, పచ్చని బయళ్ళు వారి ఇంటి పరిసరాలు ఎంత అందం గా ఉన్నవో చెప్పలేను. దారిలో fairfax వెళ్ళి, మా అబ్బాయి మిత్రుడు, విజయకుమార్ ఇంటికి వెళ్ళాము. కారులో GPS సహాయంతో అడ్రెస్ కనుక్కొన్నాము. వాళ్ళ ఇలు చాలా పెద్దది చాలా బాగుంది. కాని అక్కడ ఎక్కువ సేపు ఉండలేకపోయాము. మా అబ్బాయిని తీసుకొని మళ్ళీ బయలుదేరాము. విజయకుమార్ దంపతులిద్దరూ I.T.ప్రొఫెషనల్స్. మమ్మల్ని వాషింగ్టన్ బస్ స్టేషన్ దగ్గర వదలి డాక్టర్ దంపతులు  వెళ్ళిపోయారు. మేము 5 గంటలు ప్రయాణం చేసి న్యూయార్కు చేరుకున్నాము. దారి అంతటా నదులు, పచ్చదనం తో ఆహ్లాదంగాఉంది.


Naa America Yaatra: Haggers Town


 హేగర్స్ టౌన్ కి వెళ్ళేముందు, దారిలో Dr.లక్ష్మి ఆనంద్ ల కూతురు స్నిగ్ధ చదువుకుంటున్న మేరీలాండ్ (Maryland) విశ్వవిద్యాలయం కు వెళ్ళి అమ్మాయి హాస్టల్ రూం లో కొంతసేపు గడిపాము. మేరీలాంద్ యూనివర్సిటీ చాలా పెద్దదే. అన్ని ఇటుకలతొ కట్టబడిన పెద్దా కట్టడాలే. చాలా ఫేకల్టీలు ఉన్నాయి. మధ్య మధ్యలో పార్కులు, చెట్లు, అవెన్యూలతో అందంగా ఉంది. స్నిగ్ధ  అండర్ గ్రాడ్యుఏషన్ చేస్తున్నది. neuro biology, Hospital administration చేస్తున్నది. గ్రాడ్యుయేషన్, post-Graduation తర్వాత చెస్తుందట. ఇక్కడ పిల్లలు 18 సం; నిండక ముందే స్వతంత్రంగా బతకాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అంచేత పార్ట్ టైం ఏదో ఒక పని చేస్తుంటారు. ధనవంతులైనా నామోషీ పడరు. ఇదిగాక కొంతకాలం పియానో నేర్చుకుంది. ఇప్పుడు నృత్యం నేర్చుకుంటున్నది. తన సహచరులతో కలిసి చేసిన fusion నృత్యం విడియో చూపించింది. చాలా ప్రతిభ, పట్టుదల ఉన్న అమ్మాయి.
మొత్తం మీద నాకంపించింది; ఇక్కడి యువజనం స్వతంత్ర భావాలు కలిగి ఉంటారని, కొత్తవి నేర్చుకోవాలనే తపన కలిగి ఉంటారని. కొందరు మాత్రం స్కూలు వదిలేక చదువు మానివేసి ఏదో పనులు చేసుకుంటూ బదుకుతారు. కొందరు డ్రగ్స్ అలవాటు చేసుకుంటారు.

తర్వాత హేగర్స్ టౌన్ చేరుకున్నాము. ఊరికి శివార్లలో 2 ఎకరాల స్తలం లో వాళ్ళైల్లు వుంది. బాగా పెద్దదే. సెల్లరు (cellar), గ్రౌండ్ ఫ్లోరు, పై అంతస్తు ఉన్నాయి. భార్యాభర్తలకి చెరొక కారు ఉన్నాయి. కింది అంతస్తులో డ్రాయింగ్ రూం, భోజనశాల, వంటగది ఉన్నాయి. పై అంతస్తులో పడక గదులు ఉన్నాయి. సెల్లారులో హోం టీ.వీ.ఉంది. మొత్తం 12 గదులు ఉన్నాయి. ఆరాత్రి అక్కద గడిపాక  మర్నాడు Dr,ఆనంద్ తాను 4 గురు సహచరులతో కలిసి ప్రాక్టీసు నడుపుతున్న హాస్పిటల్కి తీసుకు వెళ్ళాడు. వాళ్ళందరూ పిల్లల స్పెషలిస్టులే. ఎవరి ప్రాక్టీసు  వాళ్ళకుంది. వీరుకాక ఇద్దరు నర్స్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు. ఆ చుట్టుపకల వీళ్ళదే  ముఖ్యమైన పిల్లల హాస్పటల్  అని తెలిసింది.

10, సెప్టెంబర్ 2013, మంగళవారం

naa amerikaa yaatra;==7: Philly-DC

18,19,20 జులై,2013;--
19వ తా; మధ్యాహ్నం బస్సులో బయలుదేరి రెండు గంటలు ప్రయాణం చేసి 'ఫిలడెల్ఫియా 'చేరుకున్నాము. ఎప్పటిలానే మా పెద్దబ్బాయి నాకు తోడు. ఆవూళ్ళో మా చిన్నన్న కూతురు, మనమడు, అతని భార్య ఉన్నారు. ఇద్దరూ ఉద్యోగాలు  చేస్తున్నారు. బస్ స్టేషన్ కి వచ్చి లోకల్ ట్రైన్ లో మమ్మల్ని వాళ్ళింటికి తీసుకొని వెళ్లాడు. ఆ ఇల్లు గేటెడ్ కమ్మ్యూనిటీలోఉంది. కొంచెం చిన్నదైనా అన్ని సదుపాయాలు కలిగి ఉంది.ఉదయం 9 గంటలకి మా మనమడు వాసు కారులో అందరం వాషింగ్టన్ బయలుదేరాము. ఫిలడెల్ఫియా కూడ పెద్ద పట్టణమే.అక్కడికి గంటప్రయాణం.మా అమ్మాయి తెలుగు భోజనం తెచ్చింది కాబట్టి లంచ్ కి ఇబ్బంది లేకపోయింది.

న్యూయార్క్ అమెరికాకి ఆర్థిక,వ్యాపారకేంద్రం కాగా ,వాషింగ్టన్ పరిపాలనాకేంద్రం.రాజధాని.న్యూయార్క్ తో పోలిస్తే చిన్న నగరం. కాని,న్యూఢిల్లీ లాగే అందంగా, హుందాగా ఉంది, మీదు మిక్కిలి విశాలంగా. ఊరినిండా విగ్రహాలు, పార్కులు, మ్యూజియంస్, monument s ఉన్నాయి. మేము లింకన్ మెమోరియల్, జెఫ్రెసన్ మెమోరియల్, వాషింగ్టన్ మెమోరియల్ చూసాము. వాషింగ్టన్ మెమోరియల్ దగ్గర ఒక పెద్ద స్తంభం (column/ obelisk) ఉంది. ఊరంతా కనిపిస్తుంది. Smithsonian institutes అని చాలా ప్రదర్శన శాలలు ఉన్నాయి. ఇంకొక విశేషం ఏమిటంటే ఈ smithsonian  institutes  ల లోకి ప్రవేశం ఉచితం. కాని సమయాభావంచేత లోపలికి వెళ్ళి చూడలేదు.

తర్వాత తిన్నగా శ్వేత సౌధం అనగా వైట్ హౌస్ (white house) కి వెళ్ళాము. పూర్తిగా తెల్లగా రంగులేవీ లేకుండా ఉండటంచేత దీనిని వైట్ హౌస్ అంటారు. ఇదే అమెరికా అధ్యక్షుడి నివాస  స్థానము, మరియూ ఆఫీసు. అంటే ప్రపంచంలోకెల్లా ధనవంతమూ, శక్తివంతమూ అయిన దేశానికి పరిపాలకుని నివాసం. జాతీయ,అంతర్జాతీయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే చోటు. ఇది మూడంతస్తులలో ఉంది. ప్రవేశ ద్వారం గ్రీకు స్తంభాలతో నిర్మించారు. చుట్టూ ఇనప కటకటాలు, గేట్లతో ఉంది. ప్రత్యేక అనుమతి లేనిదే లోనకు వెళ్ళలేము. పైనుంచే చూసాము. కాని ఇంతకు ముందు ప్రత్యేక అనుమతి సంపాదించి చూసామని మా పెద్ద కోడలు విజయ చెప్పింది. చాలా బాగుంటుంది, చూడవలసినవి  చాలా ఉన్నాయని చెప్పింది. బ్లూరూం, రెడ్ రూం,  గ్రీన్ రూం అని డెకర్ బట్టి  పేర్లు పెట్టారు. ఒక చైనా రూం కూడా ఉందట. అందులో అరుదైన పింగాణీ వస్తువులు ఉంటాయి. అతిథులను ఆహ్వానించె గది,    సమావేశపు గదులు, భోజనశాలలు, విదేశీప్రతినిధులతో సమావేశమయ్యే గది ఇలా ఉన్నాయట. అధ్యక్షుల కుటుంబం నివసించే భాగానికి మాత్రం ప్రవేశం నిషిద్ధం. ఏమైనా మన రాష్ట్ర పతి భవనం కన్నా బాగా చిన్నది. బకింగ్ హాం ప్యాలెస్ (Buckingham  Palace) కన్న, రష్యా లోని క్రెంలిన్ (Kremlin) కన్నా చిన్నదే.

తర్వాత ముఖ్యంగా చూడవలసిన కేపిటల్ హిల్ (capitol hill) కి వెళ్ళాము. ఇందులోనే అమెరికా శాసనసభల సమావేశాలు జరుగుతాయి.(U.S.congress and senate) అనేక సినిమాల్లో  పెద్దగుమ్మటం లాగ కనిపించేది ఇదే. మేము ముందే అనుమతి తీసుకొని సెక్యూరిటీ చెక్ తర్వాత లోపలికి వెళ్ళాము. విశాలమైన హాల్స్ దాటి డోం లోకి ప్రవెశించాము. ప్రపంచంలోని అతిపెద్ద డోంస్ (domes) లొ ఇదొకటి అని చెప్పవచ్చును. గోడలు,స్తంభాలు, పైకప్పు మీద అమెరికన్ చరిత్రను,300 సం; సంఘటనలను, ప్రముఖ వ్యక్తులను చిత్రించే శిల్పాలు, చిత్రాలు (paintings) ఉన్నాయి. దీనికి ఆనుకొని కొన్ని సమావేశపు హాల్స్ ఉన్నవి. కింద, ఇంత పెద్ద గుమ్మటాన్ని నిలబెట్టే మూలస్తంభాల గది ఉంది. లింకన్, రీగన్, రెడ్ ఇండియన్ చీఫ్  విగ్రహాలు చూడదగినవి. మొత్తం మీద వాషింగ్ టన్ నగరాన్ని డామినేట్  చేసే యీ భవనాన్ని చూడకుండా రాకూడదు.

ఊరి నిండా ఆఫీసులు, మ్యూజియములు, గ్రంథాలయాలు, 18,19, శతాబ్దపు శైలి కట్టడాలు చాలా ఉన్నాయి. కాని న్యూయార్కులో వలె పెద్ద ఆకాశ హర్మ్యాలు లేవు. న్యూయార్క్ నగరం కన్నా  విశాలంగా, సుందరంగా వుంది. ఐనా దేని ప్రత్యేకత దానిదే కదా.

కేపిటల్ హిల్ చూసి బయటకు వచ్చాక మా వాసు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మాచిన్నకోడలు  చెల్లెలు, డాక్టర్ లక్ష్మి, ఆమె భర్త డాక్టర్ ఆనంద్ నన్ను  వాళ్ళవూరు హేగర్స్ టౌన్ (Haaggers Town) తీసుకు వెళ్ళారు. మా అబ్బాయిని అతని స్నేహితుడు వాళ్ళవూరు 'ఫెయిర్ఫాక్స్ (Fairfax) తీసుకొని వెళ్ళాడు. (ఇంకా ఉంది).