19, నవంబర్ 2013, మంగళవారం

national awards




  గతసారి ప్రఖ్యాతసంగీతకళాకారుడు శ్రీ మంగళంపల్లి  బాలమురళీకృష్ణకి,ISRO CHAIRMAN 'మంగళ్యాన్ '(Mars expedition  ') నిర్దేశకులు శ్రీ రాధాకృష్ణన్ కి వచ్చే ఏడాదైనా భారతరత్న ' అవార్డు ఇవ్వాలని సూచించేను.ఆ సంగతి అలా ఉంచితే ఈసారి  సచిన్ కి  ఆ అవార్డు గురించి వివాదం,కోర్టు  వ్యాజ్యం బయలుదేరాయి.భారతరత్న ఎవరికివ్వాలనేది  కేంద్రప్రభుత్వానికే అంతిమనిర్ణయం ఇవ్వాలి.పద్మశ్రీ లాగ కాదుకదా ఒక సంవత్సరంలో ఈ అత్యున్నత పురస్కారం ఒకరికో ,ఇద్దరికో మాత్రం ఇవ్వాలి.ఇక కీర్తిశేషులకు ఇచ్చే విషయం; సాధ్యమైనంతవరకు వారిజీవితకాలంలోనే ఇవ్వాలి.ఐతే మరణం సంగతి ఎవరూ ముందుగా చెప్పలేరు కాబట్టి ఇవ్వడానికి తగినవారైతే వారి    మరణానంతరం  ఒక్క సంవత్సరంలోనే ఇవ్వాలి.అలా కాకపోతే చాలాకాలం కొంద చనిపోయిన గొప్పవాళ్ళందరికీ ఇవ్వాలనే  వివాదాలు రేకెత్తే అవకాశం ఉంది.ఇది చాలా ridiculous extent కి వెళ్ళే ప్రమాదముంది.టాగూరు,రాజా  రామ్మోహన్రాయి,అక్బరు,అశోకుడు ఇలాగన్నమాట.అందువలన జాతీయావార్డుల ప్రదానానికి కొన్ని మార్గదర్శక నిర్దేశకాలు కల్పించి ,అమలుచేయడం మంచిది.కాని నిర్ణయాన్ని  కేంద్రప్రభుత్వానికే అంతిమంగా వదిలివేయడం మంచిది,అని నా అభిప్రాయం.      




కామెంట్‌లు లేవు: