27, సెప్టెంబర్ 2011, మంగళవారం

heritage buildings

ఈమధ్య ఒక వారపత్రికలో వరుసగా తెలంగాణలో ఘధీల గురించి వ్యాసాలూ వస్తున్నాయి.ఇవి కోటలంత పెద్దవీ,గట్టివీ కాదు .మామూలు ఇళ్ళ వంటివీ కాదు.చిన్న జాగీర్దార్లు ,దొరలూ కట్టించుకోన్నవి.వీటిని కోస్తా జిల్లాలలో దేవిడీలని అంటారు.ఇవి కొన్ని మాత్రం బాగున్నవి.చాలా శిధిలం ఔతున్నవి.౧౦౦ సం;దాటిన కట్టడాలు హీరిటాజ్బిల్డింగుల కింద వస్తాయి.వాటిని యజమానులు బాగుచేసి కాపాడాలి.ప్రభుత్వం ,ప్రాజలు కూడా పూనుకోవాలి ఈ వ్యాస కర్తలకు నేను ఒక సూచనా చేశాను ఈ భావనలు మంచి ఫోటోలు తీసి ఎన్లార్జ్ చేసి హైదరాబాద్ ఆర్ట్ గాలరీ లో ప్రదర్శిస్తే మంచిది అందరికి తెలుస్తుంది ఇంటాక్ సంస్థ వారి సహాయం కూడా తీసుకో వచ్చును 

కమనీయం: my motto

కమనీయం: my motto
koodali.org

25, సెప్టెంబర్ 2011, ఆదివారం

my motto


 


 ' నా తెలంగాణ కోటి రత్నాల వీణ '
   రత్న ఖచిత కిరీటమ్ము రాయసీమ
   దివ్య కాంచన రథము మా తీర భూమి
   వెలుగు ముప్పేట హారమ్ము తెలుగునాడు.
  పై పద్యంలో మొదటి పాదం అందరికీ తెలిసిన దాశరథి పద్యంలోనిది.మిగిలిన మూడు పాదాలూ నేను వ్రాసినవి.పై పద్యమే నా
 నిశ్చిత అభిప్రాయం.నేను అంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలనూ,అన్ని జిల్లాలనూ ప్రేమిస్తాను.ఆంధ్రులు అంటే అన్ని  జిల్లాలవారూ. అజ్ఞానం వలననో దురుద్దేశం తోనో ఈ విషయం సామాన్యులకు కవులు, రచయితలు,పత్రికల వారూ,టీ.వీ,ల వారూ ఎందుకు చెప్పడం లేదో తెలియదు.ఇప్పటి ఉద్రిక్త వాతావరణంలో ఇంతకన్న వ్రాయ దలచుకో లేదు.  

20, సెప్టెంబర్ 2011, మంగళవారం

కమనీయం: okageyam-niraasa

కమనీయం: okageyam-niraasa

okageyam-niraasa


 

  భిక్షకుడొకడిని-బీద అరుపులవాణ్ణి
  వీధుల కూడలిలో -వెళ్తూ చూశాను
  భయపడకు బీదల-ప్రభుత్వం వస్తుంది
  బాగుపడుతుంది నీజీవితం -భరోసా ఇచ్చాడొక సోషలిస్ట్
  మురిగిపోయిన వ్యవస్థే - మూలకారణం
  తిరగబడమన్నాడు- తీవ్రవాది ఒకడు
  గతజన్మలో పాపాలే-కారణం నీ స్థితికి
  ప్రాయశ్చిత్తం చేసుకో -పదమన్నాడు మతగురువు
  బలంగావున్నావు కదా- పనిచేసుకోలేవా
  కష్టపడుపొమ్మని- కసిరాడు కేపిటలిస్ట్
  అమ్మాయిల అందం - ఆరాధించే అబ్బాయి
  ఏమిటి యీ న్యూసెన్స్- ఇక్కడనుండి పొమ్మన్నాడు
  పదిరూపాయలు చేరితే- పట్టెడన్నం తినాలన్న
  బిచ్చగానికి నిరాశే- మిగిలింది చివరకి .              

కమనీయం: oka padyam,kalingaseema

కమనీయం: oka padyam,kalingaseema

oka padyam,kalingaseema


 

 వంశధారాతీర వసుమతి యంతయు
       ప్రాక్తన నిర్మాణ భరిత భూమి
 బౌద్ధచైత్యవిహార భవ్యవిద్యాలయ
       సకలదేశాగమ చ్చాత్రవితతి
 శత్రుభీకర మహాసామ్రాజ్య విస్తృత
       సేనానికరముల చెలగునేల
 సాగరాంతర వణిక్ సంపద్విభవార్జ
       నమున లక్ష్మీ సదనమ్ము గాగ
     నగరికటకశ్రీకాళింగ నగరప్రముఖ
     శ్రీముఖక్షేత్ర దంతపురీమహేంద్ర
     శైలశాలిహుండాది ప్రశస్త దివ్య
     క్షేత్రముల నలరారె నీ సీమ మున్ను. 

13, సెప్టెంబర్ 2011, మంగళవారం

nidra


  
 తల్లి  యొడి లోన వెచ్చగ తనువు మరచి
 శాంత్యమాయక భావాల స్వాదురసము
 నీలి కన్నుల రెప్పల నిదుర గ్రమ్మ
 చింత లెరుగని పొన్నారి చిట్టిపాప
            ---------
 ప్రేమికుని కౌగిలిని చేరి ప రియవధూటి
 సేద దీరంగ స్వప్నాల చిత్రరచన
 వాలుగన్నుల నర్తింప లీల నగవు
 మోము నలరింప నిద్రించు ముగ్ధ హృదయ
             -----------
 వెతల ,రుగ్మత  భారాన వేసరిల్లి
 నిద్ర రానట్టి సుదీర్ఘ నిశల యందు
 ఘడియలను లెక్కపెట్టుచు గడుపుచుండు
 కొంత దనుకను ముదిమిని కునుకు పట్టు .
              -----------
  

8, సెప్టెంబర్ 2011, గురువారం

arudra-contd

 
 ఈ ధరణి అంతా పుణ్యభూమే అంటూ
    ''దేవుడిచటే వెలసెనంచు =తెలివిహీనులు భ్రాంతిపడుచు
       చావుకోసము వలసపోయి =సతమతంబవనేల భాయి
       ఈ వసుంధర మేనుపైన =ఏవొక్క అంగుళంబైన
       పావనమ్మే ,పుణ్యవహము =వారణాసే స్వంతగృహము
   జనులు పాడుకొనే పాటే పండిత కావ్యాలకన్నా ముందు పుట్టిందని ఆరుద్రగారి అభిప్రాయం
      ''గేయమే ముందు పుట్టింది = హాయిగా జాతి నవ్వింది
        వేయిపేరుల లక్షణమ్ము =వెనుక వచ్చిన దుప్పికొమ్ము
        తీయతీయని నాటు  పాట =దేశీయ సంపదల మూట
        హేయమైనది పండితులకు =ఇల సంస్కృతపు హెచ్చు కొరకు ''
   పండితుల శుష్కవాదాల గురించి చమత్కారం
        ''వీపులో అరసున్నవుందా= వెర్రి శకటములెక్కుతుందా ?
          ఆపదం వ్యుత్పత్తి ఎల్లా =అన్యదేశ్యం మనకు డిల్లా
          ఈ పగిది చర్చించువాళ్ళు = ఇతరులకు పదపిచ్చివాళ్ళు
          వ్యాపకం వ్యాకరణవృత్తి =జ్ఞాపకాలకు కొంతనత్తి ''
     ఇంకా అక్కడక్కడ మంచి చమక్కులు కనిపిస్తాయి,
     ''ఆలయము నేడు ఆఫీసు=అర్చనకు కట్టాలి ఫీజు ''
   బలహీనులైనా తిరగబడితే పాలకులు లొంగిపోవలసిందే నని హెచ్చరిక
      ''నలుసు చాల అలుసుగాని=నయనాల పడినచో హానీ'
      ఐతే అందరు కవులలాగే ఆరుద్ర కూడా'' ఏకాలమందు మగవాడు ఇంతి హృదయము నరయలేడు '' అంటారు.కాని నిజం చెప్పాలంటే ఆడ ఐనా మగ ఐనా ఇతరుల హృదయం అర్థం చేసుకోడం కష్టమే .
   ఈ చిన్న కావ్యం (శుద్ధ మధ్యాక్కరలు) విశిష్టత
      1.పద్యాలని పాటగా మలచటం 2.సరళమైన  శిష్ట వ్యావహారికంలో వ్రాయడం.3.ఉర్దూ ,ఇంగ్లిష్ పదాలను విరివిగా వాడడం4. వివిధ విషయాలపై తన చమత్కారశైలిలో విమర్శించడం.5.తన ముద్ర ఐన అంత్యప్రాసలను కొనసాగించడం .6.మధ్యాక్కరల గణవిభజననీ ,ఆదిప్రాసనీ ,యతిస్థానాన్ని తప్పక పాటించడం .
                   (సమాప్తం)        

6, సెప్టెంబర్ 2011, మంగళవారం

arudra-contd.

   ఆంధ్రలో రోడ్లన్న భయము=ఆఫ్రికా అడవులే నయము
 చాంద్రాయణము చేయు జనులు=జపము విడిచిన మేటి మునులు
 గంద్రగోళపు ఆటవిడుపు =సంద్రపు ఘోష దిగదుడుపు
 ఇంద్రుడైనా గుడ్డివాడు =ఇచ్చోట నడువలేడు.
   ఇంద్రుడికి వెయ్యికళ్ళు అని ప్రతీతి కదా .మన రోడ్ల పరిస్థితి ఇప్పట్కీ అంత మారలెదు కదా.
   జూదం గురించి రాసినది.
  న్యూయార్కు ప్రత్తి మార్కెట్టు = నూత్నద్యూతపుటాటపట్టు
  హాలుద్వారాలు క్లోజింగు =ఆపదలకు ఓపెనింగు
  వేయకోయి నువ్వు బ్రాకెట్టు = విలువైనవన్ని తాకట్టు
  మాయజూదాలు కనిపెట్టు = మానవుడు సైతాను జట్టు
  ఎవరివెర్రి వారికి ఆనందమంటూ ఇలాగంటారు.
   తనకాంతుడె తనకు శౌరి = తనభార్యయె తనకురంభ
   తనవారు దేవతల బృందం = తన పిచ్చి తనకు ఆనందం
        శౌరి అంటె కృష్ణుడు.
   మంకుపట్టు వీడలేక = మావోసిటుంగూదు బాక
   డొంకతిరుగు మాటలాడి =వంకపెట్టును సిగ్గువీడి
   బొంకులను వేమారు ప్రేల = పూర్ణసత్యము మారు నేల
    పంకజాప్తుడి దివ్యశోభ = పరికించునా గుడ్లగూబ .
      పైపద్యం రాసేటప్పటికి మనదేశం పై చైనా దండయాత్రవలన (1962) కమ్మ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చింది.ఆరుద్ర చైనాను వ్యతిరేకించాడు.శ్రీశ్రీకి ,ఆరుద్రకి కూడా మనస్పర్ధలు వచ్చాయి.
        మరొకసారి మరికొన్ని ఆరుద్ర మధ్యాక్కరలు.    

pictures for all to see













దామెర్ల రామారావు ఆధునిక ఆంధ్ర చిత్ర కళాకారులలో సుప్రసిద్ధుడు.దురదృష్ట వశాత్తు యవ్వనంలోనే మరణించాడు. ఆయన చిత్రాలు రాజమండ్రిలో ప్రదర్సన శాలలో ఉన్నాయి. నా దగ్గర వున్నవి ఇస్తున్నాను.అలాగే బాపు గారి చిత్రాలు కొన్ని ,శ్రీకాకుళం జిల్లాలో కొన్నిదర్సనీయమైనవి కూడా ఇస్తున్నాను

3, సెప్టెంబర్ 2011, శనివారం

arudra contd.


ఆరుద్ర సరళమైన శిష్టవ్యావహారికం లోనే ఈ శుద్ధమధ్యాక్కరలను వ్రాసారు.సులభంగా అర్థమౌతుంది కనక అట్టే వివరణ అక్కరలేదు.
  తనలక్ష్యాన్ని చెపుతూ రాసింది.ప్రతీ పాదానికీ 13మాత్రలు ఉంటాయి.
    ''కూనలమ్మపదాల రీతి =కూర్చాక దీనిలో నీతి
      వీనులకు విందొనరించి =ప్రేముడిని జగతిలో పెంచి
      దానవత్వము వేగద్రుంచి =ధర్మపథమే అనుసరించి
      మానవుల మంచినే ఎంచి = మదిమీటు కవితావిపంచి  
     అని తన కవితా లక్ష్యాన్ని చాటిస్తారు.
     ఆరుద్ర నాస్తికుడు.మూఢనమ్మకాలను నిరసిస్తూ రాసినది.
      '' జంతువులతలలున్న సురలు =చలనమ్ములేనట్టి తరులు
         వింతగా కనిపించు రాళ్ళు =వెర్రిమానవుల దేవుళ్ళు
         పంతుళ్ళు పొత్తర్లు పట్ట=భరమగున పితరాళ్ళపొట్ట
        అంతరాత్మను తలచుకొమ్ము = అనవసరమీ తద్దినమ్ము.
      కాని పూర్వికుల సంస్మరణ ఏదో ఒకరూపంలో అన్ని నాగరకతలలోనూ ఉందికదా!
      కట్నాలని నిరసిస్తూనే తనదాకా వస్తేమాత్రం కట్నాన్ని ఆశించే కపటులమీద ఆరుద్రవిసుర్లు.

      ''కన్యకల పరిణయసమస్య=కారునల్లని అమావాస్య
        మా న్యాలపై అప్పుదెచ్చి=మ్యారేజి చేయడం పిచ్చి
        అన్యాయమీ శుల్కం =అడగడం పాపమనుచు
        అన్యులకు తానుబోధించి =ఆశించు కట్నాలసంచి
       మనేన్నికలమీద ,అవినీతిమీద విమర్శ
     '' కులతత్వ కూటాలవోట్లు =బలమున్నపదవులకు మెట్లు
        పలుకుబడిబడిలోన సీట్లు=పండించులే పచ్చనోట్లు
        కలవాళ్ళ అవగుణపు చెట్లు= ఫలియించె కోటానుకోట్లు
       తలబిరుసుతనపు పర్మిట్లు=దాపురించెను మనకు పాట్లూ'
       ఇంకా కొన్ని మరో సారి.
              ----------

2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

arudra


ఆరుద్ర= శుద్ధమధ్యాక్కరలు=మధ్యాక్కరలు దేశి చందస్సు .ఆటవెలది,ద్విపద వంటిది.నన్నయ నుంచి నేటి వరకు కవులు ఈ చందస్సులో పద్యాలు రాసారు.విశ్వనాథవారు రచించిన మధ్యాక్కరలకి సాహిత్య అకాడమీ అవార్డు(1965)ఇచ్చింది.
    ఐతే ఆరుద్ర అభ్య ంతర మేమంటే దెశిచందస్సు ఐన దీనిన్ని ,పాటగా పాడుకోవలసిన దానిని పద్యాల్లో కఠిన పదబంధాల్లో బిగించి అ ందాన్ని హరించారని అన్నారు.అందువలనా తానే ఆ చందస్సు లోనే పాటవలె మలచి 67రాసి వాటికి శుద్ధమధ్యాక్కరలు అని పేరు పెట్టారు.సమకాలిక సంఘటనలు,సమాజపరిస్థితులను వస్తువుగా తీసుకొని తనదైన శైలిలో హాస్యం ,వ్యంగ్యం జోడించి రచించారు.
   అక్కరలు1,మహాక్కర 2.మధురాక్కర 3.మధ్యాక్కర 4.అంతరాక్కర 5.అల్పాక్కర అని కొన్ని భేదాలతో ఉన్నాయి.
    మధ్యాక్కర లక్షణాలు. == నాలుగుపాదాలు ఉంటాయి. పాదానికి రెండు  ఇంద్రగణాలు,ఒక సూర్యగణము మళ్ళీ రెండు ఇంద్రగణాలు ,ఒక సూర్యగణము ఉంటాయి.నాల్గవ గణము మొదటి అక్షరం యతిస్థానం.
  ఆరుద్ర పై చందస్సునే తేసుకొని  ఒకపాదాన్ని రెండుగా విడగొట్టి మొత్తం ఎనిమిది పాదాలు చేసారు.దానికి తోడుగా తన ముద్ర ఐన అంత్యప్రాసని జోడించారు.ప్రతిపాదానికి సంప్రదాయంగా ప్రథమంలో ప్రాసనియమం ఎలాగూ ఉన్నది.
   ఆరుద్రగారి మద్యాక్కరలు కొన్ని మాత్రం ఉదహరిస్తూ మళ్ళీ రాస్తాను.ఆయన మొత్తం 67 అక్కరలు జానుతెనుగులో రచించారు.
 

1, సెప్టెంబర్ 2011, గురువారం

stroke

STROKE.==Is a cerebrovascular accident--It develops rapidly causing loss of function of brain. due to obstruction of blood supply.TIA or transient ischemic attack resolves within 24hours and is a warning sign.
   CAUSES==1.Local blood clot or thrombosis.2.blood clot from other regions or embolism3.shock with general decrease in blood supply4.veinous thrombosis
    In some cases bloodvessels rupture of blood vessels may occur an bleeding occurs into the brain.(hemorrhagic shock.)
   SIGNSand SYMPTOMS==depend on the area in the brain affected.Look for the for the following.-
   1.weakness and loss of function of limb or limbs on one side.2.facial changes ,muscle weakness of face.3.numbness on one side of body.4.loss of memory 5.defect in speech
   INVESTIGATIONS;=1,record blood pressure2.examine  blood  and urine esp.f or sugar3.lipid profile4.arteriography5.MR SCAN 6.Doppler ultrasound
    TREATMENT;=1.Anti coagulation drugs 2control of hypertension and diabetes if needed 3.Surgery in select cases to be decided by experts.
     Physiotherapy and rehabilitation  by specially trained personnel are essential for recovery.

photos of srikaakulam