29, డిసెంబర్ 2015, మంగళవారం

RAJAAJEE




 ఈ మధ్య కాంగ్రెస్ పత్రికలోనే నెహ్రూ,ఇందిరా గాంధీలకు వ్యతిరేకంగా రాసారట.కొన్ని విషయాలు నేను విశదపరచదల్చుకొన్నాను.మనదేశానికి స్వరాజ్యం వచ్చేనాటికి మేము కాలేజిలో చదువుకొనేవాళ్ళం. అప్పుడు ముఖ్యులూ గొప్పవాళ్ళైన నాయకులు  గాంధిజీ,నెహ్రూ,పటేల్,అజాద్,రాజేంద్రప్రసాద్.నేతాజీ (సుభాస్ చంద్ర బోస్ ) గొప్పనాయకుడు ఐనా మరణించినట్లు సమాచారం(విదేశాల్లో ఒక విమానప్రమాదంలో ) ప్రజాదరణ పాపులారిటీ ఎక్కువ ఉండటంచేత నెహ్రూజీ  ప్రధానమంత్రి ఐనాడు. కాశ్మీర్,చైనాల విషయంలో నెహ్రూ తప్పుడు,బలహీన విధానాలను నేను కూడా వ్యతిరేకిస్తున్నాను.కాని ఆయన నవభారతనిర్మాత అనిఒప్పుకోవాలి.ఎన్నో పారిశ్రామిక,విద్యుత్,నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించాడు.రాజ్యాంగ ,సాంఘిక,సంస్కరణలని ఎన్నో ప్రవేశపెట్టాడు.ఐతే నెహ్రూ బదులు పటేల్ ప్రధాని ఐవుంటే బాగుండేదని కొందరు విశ్వసిస్తారు.ఇవన్నీ చరిత్రలోని ifs and buts కదా.
    కాని నేనిప్పుడు వ్రాయదలుచుకొన్నది రాజాజీ (రాజగోపాలాచారి)గురించి.ఆయనకూడా మేధావి,గొప్పనాయకుడే.కాని ఇతరనాయకులనుంచి విభేదించేవాడు. 1942 లోనే పాకిస్తాన్ ఇవ్వక తప్పదని  చెప్పాడు.కాంగ్రెస్ సోషలిస్టు పాలసీలను వ్యతిరేకించాడు.'పర్మిట్,లైసెన్స్,రాజ్ ' ని రద్దుచెయ్యమన్నాడు. చివరకు 1990 లో మళ్ళీ కాంగ్రెస్ ప్రధాని ఐన పీ.వీ.నరసిమ్హారావు గారు రాజాజీ పాలసీలను అమలు పరచారు.
        పైన పేర్కొన్న నాయకులందరూ (వారిలోవారికి విభేదాలు ఉన్నా) నిజాయితీకలవారు, ,నిస్స్వార్థపరులూ ,దేశభక్తులూ.
         నాకు తెలిసిన విషయాలు ఇక్కడ వ్రాశాను.
             

18, డిసెంబర్ 2015, శుక్రవారం

renDu paarTeela naaTakam

#GST BILL#modalaina  mukhyamaina

 

 GST BILLవంటి బిల్ల్స్ ని పార్లమెంట్ లో పాసవకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకొనంటున్నదనిB,J,P,ప్రభుత్వం ఆరోపిస్తున్నది .మా ప్రభుత్వకాలంలో ఇలాగే మీరు ఇదె బిల్లులిని అడ్డుకొన్నారని కాంగ్రెస్ జవాబిస్తున్నది ,ఈ మధ్య మామిత్రుడొకడు ,ఇద్దరికీ GST bill పాసవడం  ఇష్టం లేదని explain చేసాడు. ఉదాహరణకి మన ఇచ్చాపురం దగ్గర ఒడిస్సా ,ఆంధ్ర సరిహద్దులో టొల్ల్ గేట్ రోజుకి ఆదాయం30లక్షలు .అందులో రాజకీయనాయకులకు ,ప్రజాప్రతినిధులకు,పెద్ద అధికారులకు,చివరకు  గుమాస్తాలకు,అటెండర్లసహా అందరికీ వారి వారి వాటాలు ఉంటాయి .ఇలా దేశమంతా  ఎన్ని టోల్ గేట్లు ఉన్నాయో వాటి మొత్తం ఆదాయం . ఎంతో ఆలోచించుకొండి.  ఇంత ఆదాయాన్నిఏ పార్టీవాళ్ళయినా వదులుకొంటారా అందుకే జీ,యస్.టీ బిల్లు ఎప్పటికీ పాసవదనిచెప్పాడు.  

19, సెప్టెంబర్ 2015, శనివారం

srisailam project




  అసలు రాయలసీమకు ఎప్పుడో మొదటి ద్రోహం జరిగింది.అది క్రిష్ణా పెన్నార్ ప్రాజెక్టు  మొదటి ప్రయారిటీ గా కట్టి,అతర్వాత నాగార్జున సాగర్ కట్టి ఉండవలసింది.క్రిష్ణా గుంటూర్ వాళ్ళ ప్రాబల్యం వల్ల అలా జరగలేదు. సంజీవరెడ్డి వంటి సీమ నాయకులు కూడా అప్పుడు నోరెత్తలేదు.గాలేరు-నగరి,హంద్రీ -నీవా పథకాల సంగతి అలా ఉంచండి.ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయిర్ లో ఉన్న నీటిలో   కనీసం 100 TMC  లనీటిని రాయలసీమకు విడిచిపెట్టకుండా  దిగువకు నీరు వదలకూడదు.ఈ విషయంలో రాయలసీమ నాయకులంతా,మంత్రులతో సహా గట్టిగా పట్టు పట్టాలి. చిత్తూరు జిల్లా వాడైనా చంద్రబాబు క్రిష్ణా డెల్టా గురించేగాని రాయలసీమ అవసరాలు పట్టవు.ఇప్పటికైనా రాయలసీమవారంతా మేలుకోవాలి.

12, ఆగస్టు 2015, బుధవారం

old age and children




 వృద్ధాప్యంలో పిల్లలు చూడకపోవడం వల్ల తల్లిదండ్రులు పడుతున్న కష్టాలగురించి ఈమధ్య పత్రికల్లో చాలా కథలు వస్తున్నాయి.నిజమే కాదనను.కాని కొంచెం అవతలి  వైపు కూడా చూడవలసి  ఉంటుంది.కావాలనే deliberateగా నిర్లక్ష్యం చేసేవారి గురించి  రాయదలుచుకోలేదు.  కాని తల్లి దండ్రుల మీద అంతో, ఇంతో ప్రేమ ఉండి ,కూడా సరిగా చూడలేనివారి  సంగతి గమనించాలి.
  1.తక్కువ ఆదాయం ఉన్నవారికి ఆర్థిక పరిస్థితులు.2. తమ ముసలితనానికి అంతో ఇంతో  వెనక వేసుకొనక పోవడం.3,ఈ రోజుల్లో భార్యా ,భర్తలిద్దరూ ఉద్యోగాలో,పనులో చేస్తూఉండడం వల్ల తీరుబాటు లేకపోవటం.పిల్లలు కూడా అందరూ చదువులకు వెళ్ళిపోవడం వలన 4.పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో ఎవరో ఒకరు వృద్ధుల్ని చూసేవారు.ఇప్పుడు అంతా nuclear families కదా. 5.వృద్ధాప్యంలో జబ్బులు ఎక్కువ. ఇప్పుడు వైద్యం కూడా చాలా ఖరీదు.medical insurance లేకపోతే భరించడం చాలా కష్టం. ఇలాగ అనేక కారణాలు ఉన్నాయి.వాటిని మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది.

10, ఆగస్టు 2015, సోమవారం

INDIA -poverty-my observation




 మన దేశంలో పేదరికం ఇంకా ఉన్నదని ఒప్పుకుంటాను.ఈ విషయంలో ప్రభుత్వ గణాంకాలు ,ఇతర గణాంకాలు విభేదిస్తున్నాయి.వాటి మాట ఎలాఉన్నా, ప్రాక్టికల్ గా నా పరిశీలనలో ముఖ్యాంగా మన కోస్తా ఆంధ్ర లో పేదరికం మునపటి కన్నా  బాగా తగ్గిందని అనిపిస్తున్నది.
 1.మాఇంటికి పూర్వం రోజూ కనీసం 10 మంది బిచ్చానికి వచ్చేవారు.ఇప్పుడు ఒకరూ రావటం లేదు.
 2.పనిమనుషులు దొరకటం కష్టం గాఉంది.దొరికినా వాళ్ళు పూర్వం లాగ మిగిలిన అన్నం,కూరలు పట్టుకెళ్ళటం లేదు.
 3.అందరి దగ్గరా  సెల్ ఫోన్లు ,టీ.వీలు ఉన్నాయి.మోటార్  బైక్ లేక పోయినా సైకిలేనా లేని కుటుంబాలు కనిపించడం లేదు.
 4.పూర్వం తాటాకు గుడిసెలూ ,పూరిళ్ళూ ఎక్కువగా ఉండేవి.ఇప్పుడవి చాలా తక్కువ.సిమెంట్,లేక ఇటుక ఇళ్ళు (పల్లెలలో కూడా ) ఎక్కువగా ఉన్నాయి.
  5.పూర్వం చదువు చాలా తక్కువ ,ఇప్పుడు చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు.
 6. ఇప్పుడు దాదాపు అందరూ మంచి బట్టలే ధరిస్తున్నారు.
   ప్రజల ఆదాయం పెరగడం, ప్రభుత్వపు సంక్షేమ కార్యక్రమాలవల్ల ఈ మార్పులు వస్తున్నవని అనుకుంటున్నాను.అలా అని పేదరికం లేదని నా అభిప్రాయం కాదు.ఇంకా చెయ్యవలసినవీ,సాధించవలసినవీ చాలా ఉన్నాయని ఒప్పుకుంటాను.

31, జులై 2015, శుక్రవారం

our population


 

  పత్రికల్లో సమాచారం;మనదేశ జనాభా 130 కోట్లు అని ఏడెనిమిది ఏళ్ళలో చైనాను మించి పో తుందని2050 కి 170 కోట్లకు చేరుతుందని.అధిక జనాభా ఒకరకం గా మంచిదే ఐనా  దానికి ఒక హద్దు ఉండాలి.  నా అభిప్రాయంలో ,12 లక్షల చదరపు మైళ్ళ వైశాల్యం ఉన్న మనదేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ  180 కోట్లను దాటకూడదు.(చ ;మై;కి 1500  మంది జనసాంద్రత ) లేకపోతే  అందరికీ  ఆహారం ,నీటి సరఫరా, గృహవసతి ,విద్యా,వైద్య సౌకర్యాలు అందించలేము. 150కోట్లకు limit చేసుకో  గలుగుతే ఇంకా మంచిదే .మన నాయకులెవరూ కుటుంబ నియంత్రణ గురించి మాటలాడడానికే  భయపడుతున్నారు.దక్షిణరాష్ట్రాలలో  జనాభా అభివృద్ధి బాగా తగ్గుతుండడం మంచిపరిణామమే.కాని ఉత్తరాదిలో ఇంకా తగ్గడంలేదు. అందువలన కుల,మత,ప్రాంత భేదం లేకుండా జనాభా నియంత్రణ చేపట్టాలి.  

30, జూన్ 2015, మంగళవారం

medical exam before marriage.




 ఒక డాక్టర్ గా అనుభవపూర్వంగా చెప్తున్నాను.చాలామందికి రుచించక పోవచ్చును.అమలు చేయడంకూడా కష్టమే.పెళ్ళికి ముందు ఎన్నో చూస్తారు.అందచందాలు,సంప్రదాయం,హోదా,డబ్బు, ఇంకా ఎన్నో.మంచిదే.కాని వధువు,లేక వరుడి ఆరొగ్యం గురించి మాత్రం అంతగా పట్టించుకోరు.పెళ్ళి నాటికి ఆరోగ్యంగానే ఉన్నా.అనేక వ్యాధులు  క్రమంగా బయట పడతాయి.అప్పుడేమీ చెయ్యలేరు.చాలాజబ్బులు వంశపారంపర్యంగా వస్తాయి.కొన్ని ముందే తెలుసుకోవచ్చును. అందుచేత,కాబోయే పార్ట్నర్ పూర్తి మెడికల్ రిపోర్ట్  చూసి వివాహం చేసుకోడం మంచిది.ఇరువురూ అవతలవారి రిపోర్టుల్ని చూసుకొని సమ్మతమైతేనే వివాహం చేసుకోడం మంచిది.కాని దీన్ని ఆచరణలో  పెట్టడం కష్టం.ఇది ఒక సలహా మాత్రమే.

29, జూన్ 2015, సోమవారం

national songs




 '' మా తెలుగుతల్లికి మల్లెపూదండ ''గేయం తెలుగువారి(కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో)జాతీయ గేయం అయింది.ఇందులో originalగా శంకరంబాడి సుందరాచారి రచించిన గేయంలో ' అమరావతీగుహల అపురూపశిల్పాలు  ' అనిఉన్నది.అమరావతిలో గుహలూ లేవు,అందులో శిల్పాలూ లేవు.అందుకని ఆ చరణాన్ని అమరావతీ నగర ' అనిమార్చారు.దరిమిలా ఇప్పుడు ' అమరావతీ గుడుల ' అని మార్చి పాడుతున్నారు.ఆ శిల్పాలులో చాలా భాగం  లండన్ మ్యూజియం లోను,కొన్ని స్థానిక మ్యూజియం లో ను ఉన్నాయి.మొదట్లో టంగుటూరి సూర్యకుమారి పాడిన గ్రామొఫోన్ రికార్డు లోను ' అమరావతీ గుహల ' అనేఉంది.ఇది  మన తెలుగు జాతీయ గేయం కథ.
   ఇక భారత జాతీయ గేయం '' జనగణ మన అధినాయక '' విషయం ;;ఆదిలో దీన్ని రవీంద్ర నాథ టాగూర్ బ్రిటిష్ చక్రవర్తిని కీర్తిస్తూ రాసేడని, అప్పటికింకా టాగూర్గారికి జాతీయోద్యమంతో బాగా సంబంధం లేదని ,తర్వాతనే  బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన సర్  బిరుదుని త్యజించారని  ఒక వాదం ఉంది. కాదు ఆ గేయాన్ని భారతమాతను స్తుతిస్తూ రాసిన జాతీయగీతం అని ప్రతివాదం గా చెప్తారు.
   ఇంకొక జాతీయగీతం ''వందేమాతరం' గురించి; ఇది దుర్గామాత గురించి కీర్తిస్తూ రాసింది  దీన్ని పాడమని మమ్మల్ని నిర్బంధిచకూడదని ముస్లిం నాయకుల అభ్యంతరం.కాదు, ఇది భారతమాత గురించి బంకించంద్ర రాసినదని సమర్థిస్తారు. నా ఉద్దేశంలో ఈ గేయం మొదటి నాలుగు చరణాలు దేశాన్ని ఉద్దేశించినవే కాబట్టి

''వందేమాతరం సుజలాం ...నుంచి సుఖదాం వరదాం మాతరం '' వరకూపాడితే ఎవరికీ  అభ్యంతరం ఉండకూడదని.
  ఇలాగే బ్రిటిష్ జాతీయగీతం'  long live the King ' కి  కొందరు రాచరికవ్యవస్థ వ్యతిరెకులు అభ్యంతరం తెలుపుతున్నారు.ఆస్ట్రేలియాలో కూడా కొందరు ఇప్పుడు ఆ దేశం స్వతంత్రమైనది,అన్ని జాతులవారూ నివసిస్తూ ఉన్నారు కాబట్టి బ్రిటిష్ జాతీయ గీతం పనికిరాదంటున్నారు.రెపు స్కాట్లాండ్ విడిపోతే వాళ్ళూ అదే అంటారు. 

9, జూన్ 2015, మంగళవారం

Revant Reddy's affair




 ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డితోబాటు చంద్రబాబునాయుడు కూడా భ్రష్టు పడ్డాడు.చివరికి కేసు కోర్టులో ఏమౌతుందో కాని,ప్రజల దృష్టిలో నాయుడుగారు అపఖ్యాతి పాలయ్యాడు.అందువల్ల తనపదవికి రాజీనామా చేసే నైతిక బాధ్యత ఆయనపైఉంది.ఐనాపరవాలేదు ,లాలూప్రసాద్ యాదవ్ గారు ముందే దారిచూపించిఉన్నాడుకదా!తాను దిగిపోవలసివచ్చినప్పుడు తన భార్య రబ్దీదేవిని ముఖ్యమంత్రిపదవిలో అధిష్ఠింప జేసాడుకదా.అలాగే చంద్రబాబునాయుడు  కూడా కుమారుడు లోకేష్ ని ముఖ్యమంత్రినిచేసి  తాను రాజీనామా చెయ్యవచ్చును. దానితో నైతికంగా ప్రవర్తించాడని పేరూ వస్తుంది.మళ్ళీ అదనుచూసుకొని గద్దెనెక్కవచ్చును. ఈలోగా ఎలాగూ లోకేష్ అధ్వర్యంలో T.D.P.ప్రభుత్వం కొనసాగుతుంది.తాను వెనకనుంచి చక్రం తిప్పవచ్చును. ఏమంటారు? 

28, మే 2015, గురువారం

prasannabhaaskaram




 ప్రసిద్ధ కవీ,అధ్యాపకుడు,పండితుడూ ఐన శ్రీ మానాప్రగడ శేషశాయిగారి 'ప్రసన్నభాస్కరం 'ఈ మధ్యనే నాకు లభించింది.ఆయనకు చూపు మందగించినప్పుడు రచించినట్లు తెలుస్తోంది.మొత్తం 223 పద్యాలున్నవి.అందులో రెండు మాత్రం ఉదహరిస్తాను.    
    చం'; హరితమణి చ్చటా చకిత హారి తురంగమ సప్తకాప్రభా
           పరిణతమద్భుత ప్రణమితామరమౌళి గుళుచ్చ కాంతిభా
           సురము,జగత్త్రయీ సదనసుందర కాంచన తోరణమ్ము, భా
           స్కర నవరత్న  మండలము,చయ్యన మాకు బ్రసన్నమయ్యెడున్

   మత్తే';  నిను సేవింప రవీ !మయూరుడనుగానే,లేక శ్రీనాథుడై
             నను గానే ,దరినుండు చాయనైనన్ గానే,ఉషహ్కాంతినై
             నను గానే,ప్రియపద్మినీరమణి నైనంగానె త్రైలోక్యపా
             వనముల్ నీఅరుణారుణ ప్రభలెటుల్ వర్ణింపగా జాలుదున్?
   అన్ని పద్యాలూ అద్భుతంగా ఉన్నాయి.సంస్కృతంలోని మయూరశతకంకి సాటి వస్తుందని ధీమాగా  చెప్పగలను.

23, ఏప్రిల్ 2015, గురువారం

invitation to discussion




 ఇప్పుడు మన దేశంలో తీవ్రమైన వివాదాన్ని రేకెత్తిస్తున్న అంశం;ఆధునికీకరణ,పారిశ్రామికీకరణ అందుకు వ్యతిరేకంగా రైతుల వద్ద భూసేకరణకు నిరాకరణ,పర్యావరణరక్షణ..(modernization,industrialization  vs.refusal by farmers ,protection of environment.) రెండు వైపుల వాదం బలంగానే వుంది.మనం చైనాలాగ  ఇంకా బాగా అభివృద్ధి చెందాలంటే   మొదటిది తప్పదంటుంది ప్రభుత్వం.ఇంకొక వర్గంవారు దానిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.నేను నిపుణిణ్ణి కాదు.అందువల్ల ఈ విషయాలు బాగా తెలిసిన వారు చర్చలో తమ అభిప్రాయాలు  తెలియ జేయ కోరుతున్నాను.  

invitation to discussion




 ఇప్పుడు మన దేశంలో తీవ్రమైన వివాదాన్ని రేకెత్తిస్తున్న అంశం;ఆధునికీకరణ,పారిశ్రామికీకరణ అందుకు వ్యతిరేకంగా రైతుల వద్ద భూసేకరణకు నిరాకరణ,పర్యావరణరక్షణ..(modernization,industrialization  vs.refusal by farmers ,protection of environment.) రెండు వైపుల వాదం బలంగానే వుంది.మనం చైనాలాగ  ఇంకా బాగా అభివృద్ధి చెందాలంటే   మొదటిది తప్పదంటుంది ప్రభుత్వం.ఇంకొక వర్గంవారు దానిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.నేను నిపుణిణ్ణి కాదు.అందువల్ల ఈ విషయాలు బాగా తెలిసిన వారు చర్చలో తమ అభిప్రాయాలు  తెలియ జేయ కోరుతున్నాను.  

16, ఏప్రిల్ 2015, గురువారం

AL BERUNI




 ఘజనీ మహమ్మద్ 17సార్లు మనదేశంపై దండెత్తి అనేక దేవాలయాల్ని ధ్వంసం చేసి ,సంపదకొల్లగొట్టి దోచుకొనిపోయినట్లే మనకు తెలుసు.కాని ,అతడు తన ఆస్థానంలో పండితుల్ని.కవుల్ని,శాస్త్రజ్ఞుల్నీ పోషించినట్లు చాలామందికి తెలియదు/.అందులో ఒకడు అల్ బెరుని. గొప్పవిద్వాంసుడు.శాస్త్రజ్ఞుడు.అతడు మన దేశంలో 13 సంవత్సరాలు నివసించి మన గ్రంథాలు సేకరించి,పండితులనుంచి సమాచారం సేకరించి ,పరిశోధనలు చేసి మనదేశం పైన ఒక పెద్దగ్రంథం వ్రాసాడు.అందులో హిందువుల ఆచారవ్యవహారాలు,దేశ  పరిస్థితులు,ఇక్కడి శాస్త్రగ్రంథాలు,మతము,పురాణాలు,పంచాంగం ఒకటేమిటి చాలా విస్తారంగా రచించాడు.కొన్ని చోట్ల విమర్శలు కూడా నిశితంగా చేసాడు.తప్పక  చదవ వలసిన పుస్తకం        INDIA by AL BERUNI.edited byDr.Edward C. Sachau ;RUPA PUBLICATIONS NEW DELHI.         

7, ఏప్రిల్ 2015, మంగళవారం

rudramadevi




  ఉద్రమదేవి సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నది కాబట్టి,వీలయితే అడవి బాపిరాజుగారు  రచించిన 'గోన గన్నారెడ్డి 'అనే నవలను చదివితే మంచిది.చాలాకాలం క్రిందటే బాపిరాజుగారు  చాలా పరిశోధించి ఈ నవల వ్రాసారు.చిన్నప్పటినుండి రుద్రమదేవిని మగపిల్లవాడిగా పెంచడం.చాలాకొద్దిమందికే ఈ విషయం తెలియడం,తర్వాత  ముమ్మడమ్మను ఆమెకు వివాహం చేయడం,మగవేషంలోనే ఆమె రాజ్యంచెయ్యడం వంటి అనేక వింత విషయాలు ఇందులో ఉన్నాయి. సినిమాను తీసినవాళ్ళు ఈనవలను చదివి ఉంటారనుకొంటాను.గోనగన్నారెడ్డి అనేకులదృష్టిలో గజదొంగ, కాని అతడు రుద్రమదేవికి యుద్ధాల్లో సహాయం చేస్తాడు.వీలయితే చదవ వలసిన నవల. 

18, మార్చి 2015, బుధవారం

pattiseema project




 హటాత్తుగా ఈ పట్టిసీమ ప్రాజెక్టుని చంద్రబాబునాయుడి బుర్ర లో ప్రవేశించడానికి కారణమేమిటి?పోలవరం ప్రాజెక్టుని గాలికి వదిలేసి  దివాలాకోరుతనంతో  దీన్ని ప్రొమోట్ చేస్తున్నాడు.పట్టిసీమకి అయే 1500 కోట్లతో పోలవరం ప్రాజెక్టు కొంతవరకైనా పనిజరుగుతుంగి కదా.B.J.P.,T.D.P. కుమ్మక్కై  ఆంధ్రులని ముంచేసారు.ఎంత మోసగాళ్ళు ?సరే కాంగ్రెస్ వాళ్ళు ముందే తీరని ద్రోహం చేసారు.చివరి దాకా  ఆంధ్రులు ఈ దొంగ రాజకీ యాలతో బాధపడవలసిందేనా?

17, ఫిబ్రవరి 2015, మంగళవారం

mahabharatam




 ఇదండీ భారతం 'గురించి రంగనాయకమ్మగారి ఇంటర్వ్యూ టీ.వీ. 9 లో చదివాను.ఆవిడ ,ఆమె మిత్రులు ఈ మధ్యనే భారతాన్ని చదివినట్లుంది.ఆవిడ చెప్పిందానిలో  నాకు కొత్త ఏమీ కనిపించలేదు.ఇప్పటికే ఎందరో పరిశోధకులు ఈ విషయాలన్నీ కూలంకషంగా చర్చించి  రాసారు.ప్రపంచ  క్లాసిక్స్ లో ఒక ముఖ్యమైన  గ్రంథంగా పండితులు పరిగణించేదానిలో ఆవిడకు మెరిటేమీ కనిపించకపోవడం విచిత్రమే. మనం గుర్తించవలసిన ముఖ్యమైన విషయాలు ఇవి.1.దాదాపు 4000 సం; క్రితం రాజ్యం  కోసం  జరిగిన పెద్ద యుద్ధం  ఇందులో మూలకథ.వ్యాసుడి interpretation లో పక్షపాతం ఉండవచ్చును కాని కథాంశాలు,పాత్రల చిత్రీకరణలో ఏదీ దాచలేదు.2.అప్పటి వ్యవస్థ ఫ్యూడల్ వ్యవస్థ.రాజులు,రాజ్యాల కోసం యుద్ధాలు మామూలే.వర్ణ వ్యవస్థ కూడవాస్తవమే.మనం ఆపరిధిలోనే ఆలోచించాలి.3.రంగనాయకమ్మగారు బోధించే  మార్క్సిజం ఏమైంది?అన్నిచోట్లా విఫలమైంది కదా?4.నాకు మహాభారతంలోనచ్చిన విషయాలు;ధర్మాధర్మాల గురించి,యుద్ధము,శాంతి గురించి వాదోపవాదాలు,చర్చలు.అవి ఈ రోజుల్లో కూడా అన్వయిస్తాయి కదా.అలాగే ఆసక్తి కరమైన  పెద్ద కథ,వివిధ మనస్తత్వాల చిత్రణ కూడా ఆకర్షిస్తుంది.

13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

Dr.Kesavareddi.




 డాక్టర్ కేశవరెడ్డి గారి మరణ వార్త చదివి బాధపడ్డాను.ఆయనతో నాకు  పరిచయం లేకపోయినా, ఆయన నవలలు కొన్ని చదివాను.ప్రసిద్ధ రచయిత.''ఇంక్రెడిబుల్ గాడెస్  ',రాముడున్నాడు రాజ్యమున్నాది ' వంటి నవలలు రచించారు.ఆయన నవల 'అతడు అడవిని జయించాడు '  హెమింగ్వే నవల ' oldman and sea  'కి అనుకరణ.'మునెమ్మ ' నవల కూడా కొన్ని విమర్శలకు గురయింది.ఆయన నవలలన్నీ   పల్లెటూళ్ళ వాతావరణం  తో అతి సామాన్యుల జీవితాలకి అద్దం పడతాయి.
    వైద్యునిగా కూడా కుష్టు  రోగులకు ఆయన చేసిన సేవలు స్మరణీయమైనవి .నా సంతాపాన్ని ఈ విధంగా తెలియ జేసుకొంటున్నాను. 

9, జనవరి 2015, శుక్రవారం

pelli market




 ఆడపిల్ల పెళ్ళి గురించి మధ్యతరగతి కుటుంబాలలో బెంగపెట్టుకోవడం,నానా తంటాలు పడి ఎలాగో పెళ్ళి చేసి పెద్ద బరువు దించుకొన్నట్లు ఫీలవడం మామూలే.ఐతే ఈ మధ్య,ముఖ్యంగా ఉన్నతవిద్యావంతులైన మధ్యతరగతి కుటుంబాల్లో ఈ పరిస్థితి తిరగ బడ్డాదేమో ననిపిస్తున్నది.అమ్మాయిలు బాగా చదివి మంచి ఉద్యోగాలు  చేస్తున్నవారు తల్లిదండ్రులు చెప్పినట్లు ఎవరినైనా పెళ్ళి చేసుకోడానికి ఒప్పుకోటం లేదు.వరుడు కూడా తనపాటైనా చదువుకొని మంచి జాబ్ చేస్తూఉండాలి.వయస్సు తేడా ఎక్కువ ఉండ కూడదు,అని షరతులు పెట్టుతున్నారు.అంచేత మగవాళ్ళకి మంచి ,తగిన అమ్మాయిలు దొరకడం లేదు.నాకు తెలిసిన కొందరు పెళ్ళికొడుకులకు తగిన వధువులు దొరకడం లేదు.వాళ్ళకి  30 ఏళ్ళు దాటిపోయాయి.ఏవో కారణాలవలన,మంచి క్వాలిఫికేషన్లు  ,ఉద్యోగాలు ఉన్నా, పెళ్ళి ఆలస్యమై ఇప్పుడు కావాలన్నా పెళ్ళికుదరటం  లేదు.దీన్నిబట్టి చూస్తే మధ్యతరగతి,విద్యావంతుల్లో పెళ్ళి మార్కెట్ తిరగబడిందా అనిపిస్తున్నది.