29, నవంబర్ 2013, శుక్రవారం




  నేను వ్యవసాయంలోగాని,నీటిపారుదల (irrigation)లోగాని నిపుణుడనుగాను.కాని నిన్న వెలువడిన కృష్ణా నది  ' బచావత్ ట్రైబ్యునల్ ' అంతిమ తీర్పు గురించి నా అభిప్రాయం తెలియ జేసుకుంటున్నాను.నిపుణులు వివరించగలరు.దీనిని గురించి  మీడియా,రాజకీయ నాయకులు,బెదరగొడుతూ.ఆంధ్రప్రదేశంతా ఎడారిగా మారిపోతుందని  భయపెట్టుతున్నారేమో  ననిపిస్తుంది.ఎందుకంటే ,మనవాటా  800 T,M.C.లనుండి 1000 T.M.C.  లకిపెంచారు.మిగులుజలాలు ఇదమిత్థంగా నిర్ణయించడం కష్టం కాబట్టి.ఈ అదనపు 200 T.M.C.కిగోదావరినుంచి మళ్ళించే (టైల్ పాండ్ ,పోలవరం ప్రాజెక్టుల  నుంచి ) దాదాపు 200 T.M.C. ల నీటిని నల్గొండ,మహబూబ్ నగర్,రాయలసీమ జిల్లాల ప్రాజెక్టులకు వినియోగిస్తే సరిపోతుంది కదా.ఇవి నికరజలాలు కాబట్టి లభ్యతకు అనుమానం ఉండదు.ఐతే అన్నిరాష్ట్రాలు నీటి పంపకాన్ని ఖచ్చితంగా పాటించేలాగ అమలుపరచే అధికారాలతో నదీజలాల కమిషన్ ని కేంద్ర పర్యవేక్షణలో నియమించాలి.        

కామెంట్‌లు లేవు: