10, అక్టోబర్ 2013, గురువారం

Baburnama


 

 బాబర్నామా ,మొఘల్ సామ్రాజ్యస్థాపకుడు బాబర్ తన ఆత్మకథగా రాసుకొన్న పుస్తకం.మధ్య యుగాల చరిత్ర ,స్థితిగతులు  దీనివలన యథాతథంగా  తెలుస్తాయి.భారతదేశంలో అప్పుదున్న రాజ్యాలు,వాటి సైన్యాలు ,చేసిన యుద్ధాలే కాకుండా,భౌగోళికపరిస్థితులు,చరిత్ర వివరంగా తెలియజేసాడు.అంతేకాదు,మనదేశంలో వ్యవసాయం,మనుష్యుల కట్టుబొట్టు,ఆచారాలు,చెట్లు,జంతువులు,పక్షులు ప్రతీది సవిస్తరంగా కనిపెట్టి రాశాడు.తక్కువసైన్యంతో పెద్దసైన్యాలని ఓడించి ఎలా సామ్రాజ్యస్థాపన చేసాడో వర్ణించాడు.మన అనైక్యత,యుద్ధతంత్ర బలహీనతలు,ఏవిధంగా విదేశీ దండయాత్రలకు లోను కావలసివచ్చింది తెలుస్తుంది .మరొక్క ముఖ్యవిషయం; ఎన్ని రాజ్యాలుగా విడిపోయిఉన్నా సింధునదినుంచి అస్సాం వరకు,హిమాలయాలనుంచి హిందూమహాసముద్రం వరకు ఆనాడే భరత్ లేక హిందూస్తాన్ విస్తరించిఉన్నదనే అవగాహన ఉన్నట్లు ఈ గ్రంథం ద్వారా తెలుస్తుంది.జిజ్ఞాసువులందరూ తప్పక చదవవలసిన పుస్తకం.    

కామెంట్‌లు లేవు: