2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

arudra


ఆరుద్ర= శుద్ధమధ్యాక్కరలు=మధ్యాక్కరలు దేశి చందస్సు .ఆటవెలది,ద్విపద వంటిది.నన్నయ నుంచి నేటి వరకు కవులు ఈ చందస్సులో పద్యాలు రాసారు.విశ్వనాథవారు రచించిన మధ్యాక్కరలకి సాహిత్య అకాడమీ అవార్డు(1965)ఇచ్చింది.
    ఐతే ఆరుద్ర అభ్య ంతర మేమంటే దెశిచందస్సు ఐన దీనిన్ని ,పాటగా పాడుకోవలసిన దానిని పద్యాల్లో కఠిన పదబంధాల్లో బిగించి అ ందాన్ని హరించారని అన్నారు.అందువలనా తానే ఆ చందస్సు లోనే పాటవలె మలచి 67రాసి వాటికి శుద్ధమధ్యాక్కరలు అని పేరు పెట్టారు.సమకాలిక సంఘటనలు,సమాజపరిస్థితులను వస్తువుగా తీసుకొని తనదైన శైలిలో హాస్యం ,వ్యంగ్యం జోడించి రచించారు.
   అక్కరలు1,మహాక్కర 2.మధురాక్కర 3.మధ్యాక్కర 4.అంతరాక్కర 5.అల్పాక్కర అని కొన్ని భేదాలతో ఉన్నాయి.
    మధ్యాక్కర లక్షణాలు. == నాలుగుపాదాలు ఉంటాయి. పాదానికి రెండు  ఇంద్రగణాలు,ఒక సూర్యగణము మళ్ళీ రెండు ఇంద్రగణాలు ,ఒక సూర్యగణము ఉంటాయి.నాల్గవ గణము మొదటి అక్షరం యతిస్థానం.
  ఆరుద్ర పై చందస్సునే తేసుకొని  ఒకపాదాన్ని రెండుగా విడగొట్టి మొత్తం ఎనిమిది పాదాలు చేసారు.దానికి తోడుగా తన ముద్ర ఐన అంత్యప్రాసని జోడించారు.ప్రతిపాదానికి సంప్రదాయంగా ప్రథమంలో ప్రాసనియమం ఎలాగూ ఉన్నది.
   ఆరుద్రగారి మద్యాక్కరలు కొన్ని మాత్రం ఉదహరిస్తూ మళ్ళీ రాస్తాను.ఆయన మొత్తం 67 అక్కరలు జానుతెనుగులో రచించారు.
 

కామెంట్‌లు లేవు: