8, సెప్టెంబర్ 2011, గురువారం

arudra-contd

 
 ఈ ధరణి అంతా పుణ్యభూమే అంటూ
    ''దేవుడిచటే వెలసెనంచు =తెలివిహీనులు భ్రాంతిపడుచు
       చావుకోసము వలసపోయి =సతమతంబవనేల భాయి
       ఈ వసుంధర మేనుపైన =ఏవొక్క అంగుళంబైన
       పావనమ్మే ,పుణ్యవహము =వారణాసే స్వంతగృహము
   జనులు పాడుకొనే పాటే పండిత కావ్యాలకన్నా ముందు పుట్టిందని ఆరుద్రగారి అభిప్రాయం
      ''గేయమే ముందు పుట్టింది = హాయిగా జాతి నవ్వింది
        వేయిపేరుల లక్షణమ్ము =వెనుక వచ్చిన దుప్పికొమ్ము
        తీయతీయని నాటు  పాట =దేశీయ సంపదల మూట
        హేయమైనది పండితులకు =ఇల సంస్కృతపు హెచ్చు కొరకు ''
   పండితుల శుష్కవాదాల గురించి చమత్కారం
        ''వీపులో అరసున్నవుందా= వెర్రి శకటములెక్కుతుందా ?
          ఆపదం వ్యుత్పత్తి ఎల్లా =అన్యదేశ్యం మనకు డిల్లా
          ఈ పగిది చర్చించువాళ్ళు = ఇతరులకు పదపిచ్చివాళ్ళు
          వ్యాపకం వ్యాకరణవృత్తి =జ్ఞాపకాలకు కొంతనత్తి ''
     ఇంకా అక్కడక్కడ మంచి చమక్కులు కనిపిస్తాయి,
     ''ఆలయము నేడు ఆఫీసు=అర్చనకు కట్టాలి ఫీజు ''
   బలహీనులైనా తిరగబడితే పాలకులు లొంగిపోవలసిందే నని హెచ్చరిక
      ''నలుసు చాల అలుసుగాని=నయనాల పడినచో హానీ'
      ఐతే అందరు కవులలాగే ఆరుద్ర కూడా'' ఏకాలమందు మగవాడు ఇంతి హృదయము నరయలేడు '' అంటారు.కాని నిజం చెప్పాలంటే ఆడ ఐనా మగ ఐనా ఇతరుల హృదయం అర్థం చేసుకోడం కష్టమే .
   ఈ చిన్న కావ్యం (శుద్ధ మధ్యాక్కరలు) విశిష్టత
      1.పద్యాలని పాటగా మలచటం 2.సరళమైన  శిష్ట వ్యావహారికంలో వ్రాయడం.3.ఉర్దూ ,ఇంగ్లిష్ పదాలను విరివిగా వాడడం4. వివిధ విషయాలపై తన చమత్కారశైలిలో విమర్శించడం.5.తన ముద్ర ఐన అంత్యప్రాసలను కొనసాగించడం .6.మధ్యాక్కరల గణవిభజననీ ,ఆదిప్రాసనీ ,యతిస్థానాన్ని తప్పక పాటించడం .
                   (సమాప్తం)        

కామెంట్‌లు లేవు: