9, ఏప్రిల్ 2012, సోమవారం

China-contd-10.ain

చైనా 1911 -1949 రాజరికం అంతరించి రిపబ్లిక్ అవతరించిన తర్వాతి చరిత్ర.మంచూ రాజుల పరిపాలన చివరికాలం లోనే  ఆధునికమైన పరిణామాలు ప్రారంభమై ,20 శతాబ్దంలో కొనసాగాయి.పాస్చ్చాత్య ప్రభావం వల్ల ప్రజాస్వామ్యభావాలు, శాస్త్రీయ ,సాంకేతిక విద్యా వ్యాప్తి జరిగాయి.రైలు మార్గాలు,టెలిగ్రాఫ్,టెలిఫోన్, కార్లు,బస్సులు,లారీల వలన మనుషులు,సరకుల రవాణా,పెరిగి సమాచారసౌకర్యం ఏర్పడింది .వ్యాపారం,పరిశ్రమలు వ్రిద్ధి చెందాయి.స్త్రీవిద్య,హక్కులు పెంపొందాయి.1902 లో బాలికల పాదాలు కట్లతో బంధించే దురాచారం నిషేధింపబడినది.చైనాలో కాగితం,ముద్రణ పూర్వ కాలంనుంచి ఉన్నా ,గ్రంథాలన్నీ పండితభాషలో రాసేవారు.వ్యవహారిక భాషలో వ్రాయడం ప్రారంభమైనది.ఆధునిక ముద్రనాయంత్రాలు ,టైపు మెషీన్ల తో అనేక పత్రికలూ,పుస్తకాలు ప్రచురించడం జరిగింది.పాథసాలలు,కళాశాలలు స్తాపనతో విద్యావ్యాప్తి జరిగింది  

కామెంట్‌లు లేవు: