13, మార్చి 2012, మంగళవారం

China-contd.




 చైనా -A.D.189 TO 550.
 హాన్ సామ్రాజ్యం అంతరించిన తర్వాత ,దాదాపు 400 సంవత్సరాలు చైనా మూడు రాజ్యాలుగా చీలిపోయింది.సరిహద్దు ప్రాంతాలన్నీ ఇతర జాతులవారు ఆక్రమించుకొన్నారు.మూడు రాజ్యాలలో ఉత్తర వెయ్ (wey) ,పశ్చిమ ప్రంతం షు,(shu) ,తూర్పు(wu) వు,అనిపేర్లు. వరుసగా వాటిని 5,16,9, వంశాలు పాలించాయి.ఈ కాలంలో కంఫుసీన్ ,దావొలా ఎ,బౌద్ధ మతాలు వర్ధిల్లాయి.వీటిని అనుసరించే వారి మధ్య చర్చలు,వాదప్రతివాదాలు జరిగేవి.ఒక్కొక్క సారి ఒకరి పద్ధతులను,సిద్ధాంతాలను,మరొకరు అనుసరించేవారు.కాని మతప్రాతిపదిక పైన యుద్ధాలు జరిగేవి కావు.చైనా చరిత్ర లో కూడా చాలా యుద్ధాలు ,రక్తపాతాలు,అంతహ్కలహాలు,జనహత్యలు జరిగాయి. కాని అవి మతం కోసం కాదు.రాజ్యం కోసం ,అధికారం, ప్రాబల్యం కోసం ,పగలు ద్వేషాల వలన జరిగాయి.
  సామ్రాజ్యం విచ్చిన్నమైనా ,వర్తకవ్యాపారాలు,కళలు,నాగరకత కొనసాగాయి.అనేక బౌద్ధ ఆలయాలు నిర్మించబడినవి.కాని అవి మన దేశంలో లాగ గుండ్రని స్తూపాల వలె కాక,చైనా పద్ధతిలో 3,4,అంతస్తులతో చతురస్రం గా నిర్మింపబడినవి.ఈ కాలంలో చైనా(హాన్) జాతివారే గాక హూణులు (Huns ) సియాలు (Xias) మొదలైన ఇతర జాతులవారు కూడా కొన్ని ప్రాంతాలు ఆక్రమించుకొని  పాలించారు.
   ఆ.డ్.550--755-ఈ కాలంలోనే మళ్ళీ చైనాని  ఒకే ఆధిపత్యం కిందికి తీసుకువచ్చే ప్రయత్నం జరిగింది.ఇందులో మొదటి కొంతకాలం సుయి (suyi) అనే రాజవంశం ,తర్వాత టాంగ్ (tang) అనే వంశం పాలించాయి.ఈ కాలంలోనే హుయన్సాంగ్ (xuanzang) అనే బౌద్ధ భిక్షువు మన దేశానికి వచ్చి బొద్ధమతాన్ని ,గ్రంథాలను అధ్యయనం   చేశాడు. అప్పుడు మనదేశంలో హర్షవర్ధనుడు పాలించేవాడు.ఈ యాత్రికుని చాలా ఆదరించాడు.హుయన్సాంగ్ A.D, 629లో చైనా వదలి చాలా కష్టం మీద భూమార్గంలో మనదేశం వచ్చి,దేశమంతా తిరిగి A,D.645 లో సముద్ర మార్గంలో తిరిగి వెళ్ళాడు. అనేక గ్రంథాలను  తీసుకొని వెళ్ళాడు.   -to be continued later
 

  

కామెంట్‌లు లేవు: