28, మార్చి 2012, బుధవారం

China-6-contd.




  మనమిప్పుడు 11 వ శతాబ్ది వరకు చైనా చరిత్రను విహంగావలోకనం చేసాము.టాంగ్ వంశీయుల ఉచ్చదశ,క్షీణదశ తర్వాత చైనా 6,7,రాజ్యాలుగా విడిపోయింది.టాంగుట్,జుర్చెన్,మంగోల్,తార్తార్ ,టిబెటన్ మొ '" చైనీయేతర జాతులవారు చాలా భాగాలను ఆక్రమించుకొన్నారు. చైనా రాజులు యాంగ్- సికి- యాంగ్ నదీ ప్రాంతాన్ని ,దక్షిణ చైనా ప్రాంతాన్ని నిలబెట్టుకొన్నారు.ఈ వంశం పేరు సోంగ్ లేక సాంగ్ వంశం.(song dynasty  ) వీరు ఏ.డి. 1000 నుంచి 1250 వరకు పాలించారు.
  అప్పుడు ప్రపంచాన్నే గడగడ లాడించిన మంగోల్ దండ యాత్రలు చెంగిజ్ ఖాన్ నాయకత్వంలో ప్రారంభమయ్యాయి. ఆసియా, యూరప్ ఖండాల్లో విశాలమైన ప్రాంతాలు ,రాజ్యాలు జయించి చెహెంఘిజ్ఖాన్ ,అతని వారసులు,మధ్యధరా సముద్రం నుండి పసిఫిక్ మహాసముద్రంవరకు సామ్రాజ్యాన్ని విస్తరింప జేసారు.చెంగిజ్ మనుమడు కుబ్లైఖాన్ చైనా అంతటినీ వశపర్చుకొన్నాడు.తన వంశానికి 'యువాన్ ' వంశమని పేరుపెట్టుకొన్నాడు. మంగోలులు సంచారజాతులు కాబట్టి వారి జీవన విధానం వేరుగా ఉండేది. కాని ,కుబ్లైఖాన్ చైనా(హాన్ జాతి) వారి విధానాలను,కంఫూసియస్ సిద్ధాంతాలను అనుసరించి పరిపాలించేడు.ఇతని కాలంలోనే మార్కో పోలో అనే ఇటలీ దేశస్తుడు వచ్చి రాజదర్బారులో కొంతకాలం ఉన్నాడు.అతని వ్రాతలవలన ,అప్పటి చైనా దేశపు నగరాలు, సంపదలు, భవనాలు,వైభవం గురించి యూరప్ కి తెలిసింది.ఆకాలంలో యూరప్ ఇంకా పేదరికంలో, అనాగరకంగా వెనుకబడిఉండేది.అందువలన మార్కోపోలో రాసినవి అతిశయోక్తులో,కల్పనలో అని కొందరు అనుకొన్నారట.
   కుబ్లైఖాన్ చైనాను ఆక్రమించిన తర్వాత ,కొరియా, జపాన్, వీత్నాంలను ఆక్రమించడానికి పెద్ద నౌకా దళాన్ని తయారుచేసి పంపించాడు.కాని రెండుసార్లు పెద్ద తుఫాన్లు (టైఫూన్) వచ్చి ఆ ప్రయత్నాలు విఫలమైనవి.
  మంగోలువంశపు పాలన వంద 100 సంవత్సరాలు సాగినతర్వాత తిరుగుబాట్లు చెలరేగాయి. ఝూ (zhu) అనే వీరుడు నాయకత్వంవహించి క్రమంగా మంగోలుల పాలనను అంతంచేసి మళ్ళీ స్వదేశీ చైనా  వారి పాలనను ప్రారంభించాడు.చైనా చక్రవర్తిగా ప్రకటించుకొన్నాక (A.D.1375) తన వంశానికి 'మింగ్ ' (MING) అనే పేరు పెట్టుకొన్నాడు.మింగ్ అంటే ప్రకాశవంతమైన అని అర్థం.ఈ మింగ్ వంశం చైనా చరిత్రలో ప్రసిద్ధి గాంచినది. (మిగతా మరొక సారి. )
   

కామెంట్‌లు లేవు: