27, జనవరి 2014, సోమవారం

60 years of Indepedence -an assessment




  మన దేశం స్వతత్రమై 66ఏళ్ళు ,మొదటి గణతంత్రదినోత్సవం 63 ఏళ్ళు ఐనవి.ఈ సందర్భంలో  మనదేశం సాధించినదేమిటి   అని తర్కించుకోవాలి.ప్రభుత్వాలు,పార్టీలు,ప్రజలు అని కాకుండా మన జాతిమొత్తం సాధించినది బేరీజు వేసుకుంటే క్లుప్తంగా నాకు తోచినది రాస్తాను.అమెరికాలోఉన్న నా మిత్రులు ఇండియా  బాగా మారిపోయింది,అని అంటారు.ప్రభుత్వ,ప్రైవేటు సంస్థల రిపోర్టుల ఆధారంగాను,మనం ప్రత్యక్షంగా  చూస్తున్న దాని ప్రకారము ఈ విషయాలు రాస్తున్నాను.
  1,వ్యవసాయరంగం ;- 3రెట్లు జనాభా పెరిగినా 5 రెట్లు వ్యవసాయౌత్పత్తులు పెరిగి కరువుకాటకలని నివారించాము.
  2.పారిశ్రామిక రంగం;- తాతా  ఉక్కుఫాక్టరీ తప్ప మరి పెద్ద పరిశ్రమలు లేని పరిస్థితి నుంచి ప్రపంచంలో ఒక  పెద్ద పారిశ్రామిక దేశాల్లో మనదేశం ఒకటైనది.
  3.అణుశక్తి,అంతరిక్షయానం ,వీటిలో 6అగ్రగామి దేశాల్లో ఒకటి ఐనాము.
  4.విద్య;-100కి 10 మంది విద్యావంతులున్న   స్థితినుంచి 100కి70 మంది చదువుకున్నవారి గా    అభివృద్ధి సాధించాము.ఉన్నతవిద్య, సాంకేతిక విద్య లో బాగా అభివృద్ధి  సాధించాము.information technology లో అగ్రస్థానంలో ఉన్నాము.
  5.వైద్యం,ఆరోగ్యం;- మశూచి ,ప్లేగు,కలరా,కుష్ఠు ,పోలియో  వంటి అంటురోగాల్ని నిర్మూలించగలిగాము.సగటు ఆయుప్రమాణం 30 సం;నుంచి దాదాపు 70 సం; కి పెరిగింది.
  6.జీవనవ్యయం బాగా పెరిగినా సగటు ఆదాయం కూదా అంతకన్నా పెరిగింది.ప్రజల జీవనప్రమాణాలు ,శైలి కూడా వృద్ధిపొందింది.
  7.infrastructure ,రోడ్లు,విద్యుత్ ఉత్పత్తి అందరికీ అందుబాటులో కి వచ్చాయి.
  8.అప్పటిలో 100కి 80 మంది దారిద్ర్యరేఖకు   దిగువలో ఉండేవారు.నేడు100కి 30మంది పేదరికంలో(3రెట్లు జనాభా పెరిగినా)ఉన్నారు.
  పై అంశాలని బట్టి మనం ఒకదేశంగా పాక్షికవిజయాల్నిమాత్రమే సాధించామని ఇంక చాలా కృషి చెయ్యాలని.సరి ఐన విధానాలతో ప్రభుత్వాలు (కేంద్ర,రాస్ట్రప్రభుత్వాలు) అన్నివర్గాల ప్రజలూ,పట్టుదలతో పనిచేస్తే,వచ్చే 20,లేక 30 సంవత్సరాలలో పూర్తి అభివృద్ధి  సాధించి ప్రపంచంలోని నాలుగు లేక ఐదు అగ్రరాజ్యాల్లో ఒకటిగా విలసిల్లుతామని  భావిస్తున్నాను.      

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ఒక టపా రాయించేసేందుకు ప్రేరణ ఇచ్చారు, ధన్యవాదాలు.