13, ఏప్రిల్ 2013, శనివారం

dharmasandeham.




  నాకొక ధర్మసందేహం.పండితులనడుగుతే చెప్పలేకపోయారు.వారికి పాండిత్యమేకాని చారిత్రక దృక్పథం ఉండదు కదా!. ఇంతకీ నా ధర్మసందేహమేమంటే;రామాయణ,భారత కాలాల్లో వ్రాత,లిపి ఉండేదా?ఆరెండు గ్రంధాల్లో  అందుకు ఆధారం కనబడదు.'' నా మాటగా ఇలా చెప్పమని సందేశమేగాని లేఖలు పంపడం  కనబడదు.వ్యాసుడు ,వినాయకుడికి చెప్తే అతడు రచించినట్లు కట్టుకథ ఉన్నదికాని దానికి మహాభారతంలో  ఆధారం కనబడదు. సింధునాగరకత  నుంచి ఆర్యులు లిపిని,వ్రాతను తెచ్చుకున్నట్లు నేను అనుకొంటున్నాను.అంతవరకు,చదువు,కవిత్వం అన్నీ మౌఖికమే.
     దీనిపై శాస్త్రీయ ఆధారాలతో, చారిత్రక  జ్ఞానం తో ఎవరైనా విజ్ఞులు వ్యాఖ్యానిస్తే ఆనందిస్తాను.      

కామెంట్‌లు లేవు: