26, డిసెంబర్ 2011, సోమవారం

chalam samaadhi


 

 26-12-11 ఆంధ్రజ్యోతిలో చలం సమాధి గురించి రంగనాయకమ్మగారు రాసిన వ్యాఖ్యతో చాలావరకు ఏకీభవించవచ్చును.మరణించినవారికి సమాధి కట్టినా ,వారి పుస్తకాలు మనం దాచుకొన్నా   ,చదివినా వాళ్ళకేమీ తెలియదు కదా.ఏమి చేసినా మనకోసమే.వారి వంశీకులు .,అనుచరులు,అభిమానుల ,భక్తుల,తృప్తి కోసమే.సెంటిమెంట్  కోసమే.ఐతే ,మృత దేహాలనుగాని,మమ్మీలనుగాని భద్రపరచే సంప్రదాయం మనకి లెకపోడం మంచిదే.బుద్ధుడి అస్తికల మీదేకదా స్తూపాలను నిర్మించారు. అవి బౌద్ధ మత ప్రచారానికి ఆలవాలమైనాయి.ఏ సమాధి,ఏ పుస్తకం   ఏ కళాఖండం, ఎంతకాలం నిలుస్తుందో  ఎవరూ చెప్పలేరు కదా! ఏమైనా సమాధుల  కోసం ఆవేశం,పెంచుకోడం, తగవులాడుకోడం విజ్ఞత కాదు.కాని కొందరు విశిష్ట వ్యక్తులమరణానంతరం సమాధులో,స్మారక చిహ్నాలని ఏర్పరచడం జరుగుతూనేవుంటుంది.
                                                 
   

కామెంట్‌లు లేవు: