15, ఆగస్టు 2012, బుధవారం

INDEPENDENT INDIA-a summary



 అందరికీ స్వాతంత్ర్య దినశుభాకాంక్షలు.
  60 ఏళ్ళ నుంచి ,బ్రిటిష్ పరిపాలనాకాలం నుంచి చూస్తున్నానుకాబట్టి,ప్రజలు,ప్రభుత్వం సాధించిన అభివృద్ధి,విజయాలు,పొందిన అపజయాలు ,ఇంకా సాధించవలసినవి ,ఏపార్టీ కోణం లోనుగాక,సామాన్యపౌరుడిగా రాస్తున్నాను.
 1,1947-1960 'నెహ్రూగారి హయాం.కులమతభేదంలేని రాజ్యాంగం అమలులొకితేవడం.పంచాయతీరజ్ అమలు.హిందుకోడ్ సవరణ ,స్త్రీలకు హక్కులుకల్పించదం,స్వేచ్చాయుత ప్రజాస్వామికం,ఎన్నికలు,; ప్రైమరీ ఆరోగ్యకేంద్రాలు,I.I.T.,A.I.I.M.S.వంటి విద్యాసంస్థలస్థాపన,ప్రభుత్వరంగంలో చాలా భారీ పరుశ్రమల స్థాపన,ముందుచూపుతో అణు పరిశోధన,అంతరిక్షపరిశోధనా కేంద్రాల ఏర్పాటు.భారీ ఇరిగేషన్ ప్రాజెక్టుల స్థాపన.
  అపజయాలు తీవ్ర విమర్శలు; శాంతికాముకత్వంతో రక్షణావసరాలు అశ్రద్ధచేయడం.చైనాతో యుద్ధంలో ఓటమి.కాశ్మీర్ ని సంపూర్ణంగా విలీనం చేయకపోవడం. లైసెన్స్- పర్మిట్రాజ్యంగా మారడం.
  2.1960-1980 ఈకాలంలో ఆర్థికాభివృద్ధి మందగించింది.నెహ్రూ,లాల్బహదూర్శాస్త్రిల మరణం.సిండికేట్తో ఇందిరాగాంధి తగవు.ఎమర్జెన్సీ విధింపు.నక్సలిజం,ఖలీస్తాన్ ఉద్యమాలతో హింస, కరువుకాటకాలు. అశాంతి.
  పాజిటివ్గా ; పాకిస్తాన్ని ఓడించి బంగ్లాదేశ్ని  విడగొట్టడం. ఆటంబాంబుని పేల్చడం ,సైనికంగా దేశం బలపడటం.ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణచివేయడం.హరితవిప్లవాన్నిసాధించి (greenrevolution)కరువుకాటకాలనుంచి బయటపడటం.
 1980-1990 ;అబివృద్ధికి మొదటవేసిన బీజాలు క్రమంగాఫలించడం.communication  revolution ,టీ.వీ. టెలిఫోన్ల విస్తరణ ,పట్టణీకరణ ప్రారంభం.
 1990-2000;నరసిమ్హారావుగారి ఆర్థికసంస్కరణలు సరళీకరణ ( liberalization) వలన ఆర్థికపెరుగుదలరేటు ఎక్కువై సత్వర పారిశ్రామికీకరణ జరగడం.రోడ్లు,నౌకా విమానాశ్రయాల అభివృద్ధి .తర్వాత వచ్చిన వాజ్పాయిగారి ప్రభుత్వంలో కూడా ఈ అభివృద్ధిరేటు 8-9 % కొనసాగింది.
 2000 నుంచి-అభివృద్ధికొనసాగినా పేదరికం ఇంకా అధికంగానే ఉంది.రాష్ట్రాలలో వ్యత్యాసం ఉంది.దేశంలో సంపద,ఆదాయాలుపెర్గి వాటితోబాటు  భూమి,అస్తులు,వస్తువుల ధరలూ బాగా పెరిగాయి.ఇటీవల పలుప్రపంచదేశాల్లో మాంద్యంవలన ఆ ప్రభావం మనమీద కూడా పడింది.H.D.I.(HUMAN DEVELOPMENTINDEX )లో ఇంకా వెనకబదేఉన్నాము.
 2020నాతికైనా మనం ఈ కిందివి సాధిస్తే 'అభివృద్ధి చెందుతున్న దేశం'గాకాక '  'అభివృద్ధి చెందినదేశంగా ' పేరుపడతాము.
 1.ప్రతి గ్రామానికి,పేటకు,రోడ్డు,మంచినీరు,విద్యుత్ సప్లై ఇవ్వాలి.2.శిశు మరణాలుబాగా తగ్గించాలి.3.సగటు ఆయుర్దాయం కనీసం70సం.కి పెరగాలి.4. .అక్షరాస్యత కనీసం 90శాతానికి పెరగాలి. 5.ఆహారభద్రత,విద్య,వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి.6.infrastructure రోడ్లు,విద్యుత్ మొ;ప్రపంచప్రమాణాలతో సరితూగేలా అభివృద్ధి సాధించాలి.7.వ్యవసాయం,నీట్పారుదలప్రాజెఖ్తులపై ఎక్కువశ్రద్ధ చూపించాలి.
  అందువలన మనం నిరాశ చెందనక్కర లేదు. కలిసికట్టుగా,తెలివిగా ప్రభుత్వమూ,ప్రజలూ పనిచెస్తే ,మరొక 20లేక 30 సం;;లలో అగ్రరాజ్యాలలోమనదేశం స్థానం సంపాదించుకొంటుంది అని ధైర్యంగా చెప్పవచ్చును.
                జై హింద్.
                           

కామెంట్‌లు లేవు: