6, జులై 2012, శుక్రవారం

padyarachana

.


 ఈమధ్య అంతర్జాల సమస్య వలన రెండు శ్రీశంకరయ్యగారు ఇచ్చిన పద్యరచనలు చేసి కూడా నెట్లో ఉంచలేక పోయాను .వాటిని దిగువ రాస్తున్నాను.
  1.పద్యరచన35-28-6-12 ద్రౌపది వస్త్రాపహరణం చిత్రపటం గురించి-
      ఉచితానుచితముల నుపేక్షించి ధర్మజుడు
         స్వీయభార్యనె యొడ్డె సిగ్గుమాలి
      నిండు సభాస్థలి నెదుట జూచుచు నూర
          కుండిరి భీష్మాది కురుగురువులు
      దుష్టాత్ముడగు నీచ దుశ్శాసనుడు సాధ్వి
          వస్త్రమ్ము నపహరింపంగ జూసె
       ధర్మబద్ధత పాండుతనయులు వారింప
          కసహాయులట్టుల కదలకుండ్రి
            కృష్ణ భగవానుడే కాచె కృష్ణ నపుడు
            మహిళ స్థానమ్ము భరతసమాజమందు
            పురుషుల యహంకారమ్ము ,పరుషసరళి
            తెలుపు నీపటమ్మును జూడ గలుగు రోత .

    2 పద్యరచన 36
          ముసలి బిచ్చగాని ఫొతో ని చూసి  రాసినది.
        ''ఆరిపోయిన కుంపటీ'  యట్లు జవము
          సత్త్వములను గోల్పడి వృద్దజనుడొకండు
          వీధిలో బిచ్చమెత్తుచు వేచియుండె
          దానపరులెవరైన నుదారబుద్ధి
          ఆకలిని దీర్ప ధనమిత్తు రనుచు దలచి.
   
          అరువదేండ్ల స్వరాజ్యమ్ము నందు నేడు
           సైతమిట్టి స్థితిని గాంచ సిగ్గుచేటు
          సకలజనుల  శ్రేయో రాజ్య సాధనమ్ము
           ఇంక యెన్నాళ్ళు పట్టునో యేమొ కాని.
    మొదటి పద్యం మొదటి పాదం శ్రీ శ్రీ కి కృతజ్ఞతలతో
 
           
                          
   

కామెంట్‌లు లేవు: