15, జనవరి 2012, ఆదివారం

state policy.


 

 15-1-12 ఈనాడు పత్రికలో గురుచరణ్దాస్ అనే ప్రసిద్ధ జర్నలిస్టు రాసిన వ్యాసం తెలుగు అనువాదం నాకు నచ్చింది.దానిలోని అంశాలు క్లుప్తంగా ఇస్తున్నాను.
 1.మనదేశం చరిత్రలో ఎప్పుడూ సంపన్న మైనదే ఐనా ,చిన్నరాజ్యాలు ,అంతహ్కలహాలవల్ల పతనమయ్యేది.సామ్రాజ్యాలు పెద్దవి ఏర్పడినా అవికూడా పరిపాలనా రీత్యా బలహీనమైనవే.
 2.బ్రిటిష్ వాళ్ళు బలమైన పరిపాలనా యంత్రాంగం, సుశిక్షిత మిలిటరీ, న్యాయ వ్యవస్థను ఇచ్చి వెళ్ళి పోయారు.
 3.మనరాజ్యం ప్రభుత్వం కన్నా మన సమాజం,సంస్కృతీ బలమైనవి.
 4.మనదేశం గణనీయమైన అభివృద్ధి సాధించినా ,మనప్రధాన లోపం బలహీనమైన రాజ్యం (state) నిర్ణయాలు తీసుకోడంలో విపరీతమైన జాప్యం.ఆచరణలో కూడా విపరీతమైన అలసత్వం.
 5.బలమైన కేంద్ర,రాష్త్ర ప్రభుత్వాలు అవసరం.
 6.అలా అని నియంతృత్వం మంచిది కాదు.
 7.ప్రజాస్వామిక ప్రభుత్వమే బలంగాను,కఠినం గాను ఉండాలి.ఉదారంగాను, క్షెమంకరంగాను ఉండాలి.కోర్టులు కూడా అలాగే ఉండాలి. ఒక మాటలో  చెప్పాలంటే 'దుష్ట శిక్షణ ,శిష్ట  రక్షణ' చెయ్యాలి.
 8.రాజకీయ జోక్యం, అవినీతిని సహించకూడదు.పై సిద్ధాంతాలు పాటిస్తే ప్రజాస్వామికంగానే మనం సత్వర పురోభివృద్ధి సాధించగలము.
   మొత్తం మీద గురుచరణ్ దాసు చెప్పేదేమంటే ప్రజాస్వామిక మంటే అరాచకమూ,క్రమశిక్షణా రాహిత్యమూ కాదు.పాశ్చాత్యదెశాల వలెనే వ్యక్తిస్వేచ్చతో బాటు క్రమశిక్షణా,  రూల్స్ ని కఠినంగా  పాటించడం కూడా.
 

కామెంట్‌లు లేవు: