బుధవారం 18 జనవరి 2012

sandeham.




  ఒక సందేహం;వాల్మీకి  రామాయణం,వ్యాసభారతం ,పూర్తిగా తెలుగులో చదివాను.కాని అందులో ఎక్కడా వ్రాత writingఉన్నట్లు దాఖలా లేదు.ఒకరు ఇంకొకరికి కబురు పెట్టినా ,రాయబారం పంపినా 'నా మాటగా ఇలా చెప్పు 'అని మాటలతోనే సందేశం పంపే వారు కాని లేఖలు రాసినట్లు నిదర్శనాలు లేవు.ఆ కాలం లో వ్రాత లిపి ఉండేదా ?మొదటి సారిగా మనకు అశోకుడి శాసనాల్లో నే వ్రాత ( బ్రాహ్మీ లిపి అనుకొంటాను.క్రీ.పూ.300 ) సింధు నాగరకతా శిథిలాల్లో ముద్రల పై లిపి కనిపిస్తుంది.కాని అది ఆర్యనాగరకత కాదు ,ద్రావిడ లేక దస్య నాగరకత అంటారు.( క్రీ.పూ.2500 )ఈ విషయానికి మన పండితులు ,పౌరాణికులు సమాధానం చెప్పలేరు.చరిత్ర పరిశోధకులు కాని,వారిని బాగా చదివినవారే చెప్పగలరు.మన  బ్లాగు మిత్రులెవరైనా తెలిసినవారుంటే విశదీకరిస్తే సంతోషిస్తాను.--రమణారావు.