22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

terrorism-long struggle.




  పరస్పర నిందారోపణలకిది సమయం కాదు.ప్రతి అధికారి,మంత్రి  బధ్యత తమది కాదన్నట్లు మాట్లాడుతారు.కృతనిశ్చయంతోను, ఐకమత్యంతోను  ప్రభుత్వమూ.ప్రజలూ ఉగ్రవాదం పై పోరాడాలి.ఒకో సారి విఫలం కావచ్చును.ప్రమాదసూచనలు పంపడంతో మాత్రమే కేద్రం బాధ్యత తీరిపోదు.ఉగ్రవాద సెల్స్ పై నిఘా పెట్టి అనుమానితులను ముందే ప్రత్యేక చట్టాలద్వారా అరెస్టు చెయ్యాలి.హైదరాబాదు వంటి మహానగరం లో జనసమ్మర్దం ఉండే స్థలాలు చాలా ఉంటాయి కదా.
  పాకీస్తాను,ఇస్లమిక్ ఉగ్రవాదసంస్థలూ భారత్ని నాశనం చెయ్యడానికి,లేక,సాధ్యమైనంత హింస ,కల్లోలం రేకెత్తించడానికి ,నిత్ణయించుకొన్నవన్నది  బహిరంగసత్యమే.ప్రత్యక్షయుద్ధం ద్వారా భారత్ ను జయించలేమని వాళ్ళకి  తెలుసును.అందుకే ఈ పరోక్ష చర్యలు.ఇది దీర్ఘకాల పోరాటమని  మనం సిద్ధపడాలి.
  కొందరు మంత్రులు నోరు మూసుకుంటేనే మంచిది.నా అభిప్రాయంలో  కేంద్రంలో షిండే,రాష్ట్రంలో సబితారెడ్డి హోం శాఖ మంత్రులు గా పనికి రారు. వారిని మార్చి ఇంకా సమర్థులను నియమించవలసి ఉంది.U.P.A. ప్రభుత్వం vote bank  రాజకీయాలు మాని ఇస్లామిక్ ఉగ్రవాదం ని ఉక్కుపాదంతో అణచివెయ్యాలి.   

కామెంట్‌లు లేవు: