19, జూన్ 2012, మంగళవారం

INTACH.SEMINAR ON KALINGASEEMA




 17,18 జూన్ 2012న స్థానిక గాయత్రి కళాశాలలో  ,అధికారుల,దాతల సహాయంతో I.N.T.A.C.H.ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ హెరిటేజ్ తరఫున ఉత్తరాంధ్ర  సాంస్కృత ,వారసత్వ ,చారిత్రక సదస్సు జయప్రదంగా జరిగింది.రాష్ట్రం లోని వివిధ నగరాలనుంచి,ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన పరిశోధకులు,చరిత్ర ప్రొఫెసర్లు,పురావస్తు వేత్తలు(archeologists)ఉత్తరాంధ్ర ,కళింగ సీమ పై ముఖ్యంగా శ్రీ కాకుళం జిల్లాపై కేంద్రీకరించి వివిధ అంశాలపై పరిశోధనా పత్రాలు చదివి చర్చించారు.ఈ సదస్సును నిర్వహించిన వారినందరినీ అభినందిస్తూనే ,ఒక విషయం వ్రాయదలచుకొన్నాను.కార్యక్రమవివరాలు చివర దాకా ప్రజలకు తెలియజేయలేదు.సదస్సు గురించి పత్రికలు,టీ.వీ.లో ఏ ప్రచారమూ ముందుగా జరగలేదు.పేపర్లు,ఉపన్యాసకార్యక్రమాలు ఇంగ్లిష్ బదులు తెలుగులో జరిపించివుంటే  బాగుండేది. 

కామెంట్‌లు లేవు: