16, డిసెంబర్ 2013, సోమవారం

A.P.division bill




 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు  ఇప్పుడు రాష్ట్ర శాసన సభ ముందుకు వచ్చింది కదా.అందులోని మంచిచెడ్డలేమైనా ,అందులో ఏమిఉందో వివరాలు ఏమీ తెలియడంలేదు.రాజకీయ నాయకులు.ప్రజా ప్రతినిధులు,పత్రికలు,టి.వి.మాధ్యమం చానెల్సు ఎవరూ ఏమీ
 చెప్పడం లేదు.బ్లాగరుమిత్రులెవరికైనా తెలిస్తే అందులోని ముఖ్యమైన అంశాలగురంచి (వివరంగా కాకపోయినా,సూత్రప్రాయంగానైనా) తెలియజేయమని కోరుతున్నాను.

9, డిసెంబర్ 2013, సోమవారం

bhagavatam


 

  ఈ మధ్య  ఈటి.వి. లో సాయంత్రం 6 గం;కి ప్రసారమయ్యే 'భాగవతం '(బాపు-రమణ దర్శకత్వం,సుమన్ సమర్పించిన)చూస్తున్నాను.బాగా తీసారు.పాత్రధారులు కూడా అందరూ బాగున్నారు.నేటి సినిమా రంగంలో పౌరాణిక చిత్రాలకి సరిపోయే నటీ నటులు లేరనిపిస్తుంది.కాని ఈ సీరియల్ చూస్తే టి.వి.లో అందుకు తగిన నటీనటులు ,ఉన్నారనిపిస్తుంది.అలాగే గాయనీగాయకులు,సంగీతదర్శకులు,సాంకేతిక సిబ్బంది కూడా ఉన్నారని  స్పష్టమౌతుంది.                  

5, డిసెంబర్ 2013, గురువారం

capital




  central cabinet నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ విభజన దాదాపు ఖాయమైనది కాబట్టి అనవసరమైన ఆందోళనలతో కాలం,శక్తి,వృథాచెయ్యకుండా అభివృద్ధి మీద కేంద్రీకరించడం మంచిది.అంతేకాదు; కృష్ణా,గుంటూరు వారు తమ అహంకారాన్ని,స్వార్థ బుద్ధిని విడిచిపెట్టి,రాష్ట్ర రాజధానిని రాయలసీమప్రాంతంలో ,కర్నూలులోగాని,ఒంగోలుప్రాంతంలో గాని చండీఘడ్ లాగ చక్కగా తీర్చి నిర్మించడానికి అంగీకరించడం మంచిది.లేకపోతే మళ్ళీ రాయలసీమలో  అసంతృప్తి కలుగుతుంది. అలాగే, విశాఖపట్నం ని పారిశ్రామీక,I.T.HUB గా అభివృద్ధిచేయవలసిఉంటుంది.

29, నవంబర్ 2013, శుక్రవారం




  నేను వ్యవసాయంలోగాని,నీటిపారుదల (irrigation)లోగాని నిపుణుడనుగాను.కాని నిన్న వెలువడిన కృష్ణా నది  ' బచావత్ ట్రైబ్యునల్ ' అంతిమ తీర్పు గురించి నా అభిప్రాయం తెలియ జేసుకుంటున్నాను.నిపుణులు వివరించగలరు.దీనిని గురించి  మీడియా,రాజకీయ నాయకులు,బెదరగొడుతూ.ఆంధ్రప్రదేశంతా ఎడారిగా మారిపోతుందని  భయపెట్టుతున్నారేమో  ననిపిస్తుంది.ఎందుకంటే ,మనవాటా  800 T,M.C.లనుండి 1000 T.M.C.  లకిపెంచారు.మిగులుజలాలు ఇదమిత్థంగా నిర్ణయించడం కష్టం కాబట్టి.ఈ అదనపు 200 T.M.C.కిగోదావరినుంచి మళ్ళించే (టైల్ పాండ్ ,పోలవరం ప్రాజెక్టుల  నుంచి ) దాదాపు 200 T.M.C. ల నీటిని నల్గొండ,మహబూబ్ నగర్,రాయలసీమ జిల్లాల ప్రాజెక్టులకు వినియోగిస్తే సరిపోతుంది కదా.ఇవి నికరజలాలు కాబట్టి లభ్యతకు అనుమానం ఉండదు.ఐతే అన్నిరాష్ట్రాలు నీటి పంపకాన్ని ఖచ్చితంగా పాటించేలాగ అమలుపరచే అధికారాలతో నదీజలాల కమిషన్ ని కేంద్ర పర్యవేక్షణలో నియమించాలి.        

19, నవంబర్ 2013, మంగళవారం

కమనీయం: national awards

కమనీయం: national awards

  గతసారి ప్రఖ్యాతసంగీతకళాకారుడు శ్రీ మంగళంపల్లి  బాలమురళీకృష్ణకి,ISRO CHAIRMAN 'మంగళ్యాన్ '(Mars expedition  ') నిర్దేశకులు శ్రీ రాధాకృష్ణన్ కి వచ్చే ఏడాదైనా భారతరత్న ' అవార్డు ఇవ్వాలని సూచించేను.ఆ సంగతి అలా ఉంచితే ఈసారి  సచిన్ కి  ఆ అవార్డు గురించి వివాదం,కోర్టు  వ్యాజ్యం బయలుదేరాయి.భారతరత్న ఎవరికివ్వాలనేది  కేంద్రప్రభుత్వానికే అంతిమనిర్ణయం ఇవ్వాలి.పద్మశ్రీ లాగ కాదుకదా ఒక సంవత్సరంలో ఈ అత్యున్నత పురస్కారం ఒకరికో ,ఇద్దరికో మాత్రం ఇవ్వాలి.ఇక కీర్తిశేషులకు ఇచ్చే విషయం; సాధ్యమైనంతవరకు వారిజీవితకాలంలోనే ఇవ్వాలి.ఐతే మరణం సంగతి ఎవరూ ముందుగా చెప్పలేరు కాబట్టి ఇవ్వడానికి తగినవారైతే వారి    మరణానంతరం  ఒక్క సంవత్సరంలోనే ఇవ్వాలి.అలా కాకపోతే చాలాకాలం కొంద చనిపోయిన గొప్పవాళ్ళందరికీ ఇవ్వాలనే  వివాదాలు రేకెత్తే అవకాశం ఉంది.ఇది చాలా ridiculous extent కి వెళ్ళే ప్రమాదముంది.టాగూరు,రాజా  రామ్మోహన్రాయి,అక్బరు,అశోకుడు ఇలాగన్నమాట.అందువలన జాతీయావార్డుల ప్రదానానికి కొన్ని మార్గదర్శక నిర్దేశకాలు కల్పించి ,అమలుచేయడం మంచిది.కాని నిర్ణయాన్ని  కేంద్రప్రభుత్వానికే అంతిమంగా వదిలివేయడం మంచిది,అని నా అభిప్రాయం.       




national awards




  గతసారి ప్రఖ్యాతసంగీతకళాకారుడు శ్రీ మంగళంపల్లి  బాలమురళీకృష్ణకి,ISRO CHAIRMAN 'మంగళ్యాన్ '(Mars expedition  ') నిర్దేశకులు శ్రీ రాధాకృష్ణన్ కి వచ్చే ఏడాదైనా భారతరత్న ' అవార్డు ఇవ్వాలని సూచించేను.ఆ సంగతి అలా ఉంచితే ఈసారి  సచిన్ కి  ఆ అవార్డు గురించి వివాదం,కోర్టు  వ్యాజ్యం బయలుదేరాయి.భారతరత్న ఎవరికివ్వాలనేది  కేంద్రప్రభుత్వానికే అంతిమనిర్ణయం ఇవ్వాలి.పద్మశ్రీ లాగ కాదుకదా ఒక సంవత్సరంలో ఈ అత్యున్నత పురస్కారం ఒకరికో ,ఇద్దరికో మాత్రం ఇవ్వాలి.ఇక కీర్తిశేషులకు ఇచ్చే విషయం; సాధ్యమైనంతవరకు వారిజీవితకాలంలోనే ఇవ్వాలి.ఐతే మరణం సంగతి ఎవరూ ముందుగా చెప్పలేరు కాబట్టి ఇవ్వడానికి తగినవారైతే వారి    మరణానంతరం  ఒక్క సంవత్సరంలోనే ఇవ్వాలి.అలా కాకపోతే చాలాకాలం కొంద చనిపోయిన గొప్పవాళ్ళందరికీ ఇవ్వాలనే  వివాదాలు రేకెత్తే అవకాశం ఉంది.ఇది చాలా ridiculous extent కి వెళ్ళే ప్రమాదముంది.టాగూరు,రాజా  రామ్మోహన్రాయి,అక్బరు,అశోకుడు ఇలాగన్నమాట.అందువలన జాతీయావార్డుల ప్రదానానికి కొన్ని మార్గదర్శక నిర్దేశకాలు కల్పించి ,అమలుచేయడం మంచిది.కాని నిర్ణయాన్ని  కేంద్రప్రభుత్వానికే అంతిమంగా వదిలివేయడం మంచిది,అని నా అభిప్రాయం.      




16, నవంబర్ 2013, శనివారం




 సచిన్ టెండుల్కర్ కి,డా;C.N.రావుకి భారతప్రభుత్వం  ' భారతరత్న 'ప్రదానం చెయ్యడం మనకందరికీ అమితానందదాయక మైన విషయం.సచిన్ గురించి అందరికీ తెలుసును.కాని శాస్త్రజ్ఞులు ఎంత గొప్పవారైనా  క్రీడాకారుల వలె,సినిమా వారివలె సామాన్యప్రజలకు తెలియదు.డా;రావుగారు రసాయనికశాస్త్రంలో నిష్ణాతుడు.అంగారకగ్రహయాన రాకెట్ విజయంలో కూడా ప్రముఖపాత్ర వహించారని తెలిసింది.వీరిద్దర్కీ హార్దికాభినందనలు  తెలుపుదాము.కాని ఒక్క విషయం. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి భారతరత్న వస్తుందనీఅశించాను.సంగీతరంగంలో ఆయన అగ్రగామికదా.వచ్చేసంవత్సరంలోనైనా  ఆయనకు ఆ అవార్డు వస్తుందని ఆశిస్తున్నాను.ఇప్పటివరకు  పండిట్ రవిశంకర్ కి,పండిట్ భీంసేన్ జోషి కి ,ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ కి ఇచ్చారు.కర్ణాటకసంగీతంలో దక్షిణాది నుంచి ఒక్క సుబ్బులక్ష్మిగారికే ఈ గౌరవం దక్కింది.అందువలన వచ్చే ఏడాది బాలమురళీకృష్ణ గారికి 'భారతరత్న 'పురస్కారం తప్పక లభించాలని   కోరుకొందాము.అలాగే ISRO DIRECTOR రాధాకృష్ణన్ కికూడా(మంగళ్యాన్ ప్రాజెక్టుకు నిర్దేశకులు)  'భారతరత్న 'బహూకరిస్తారని ఆశిద్దాము.