కొత్త ఆంధ్రప్రదేశ్ రాజధాని నామకరణం గురించి వ్రాయదలిచాను.కొందరు దానిని N.T.R,నగర్ అని పేరు పెట్టమని సలహా ఇస్తున్నారు.కాని ఇది వాదవివాదాలకి ,కొంతమందికి అసంప్ తృప్తికి దారితీయగలదు.ఒక నాయకుడి పేరుపెట్టకుండా ,అందరికీ ఆమోద యోగ్యమైన నేను సూచించే పేరుని అందరూ పరిశీలనలోకి తీసుకుంటే బాగుంటుందని కోరుతున్నాను.
వందలసంవత్సరాలు ఆంధ్రదేశాన్ని అంతా పరిపాలించిన శాతవాహనచక్రవర్తుల రాజధాని ' అమరావతి ' .దానినే ' ఆంధ్రనగరి ' అనికూడా పిలిచేవారని చరిత్ర చెబుతున్నది.ఇంచుమించు ఆప్రాంతం లోనే రాజధానిని నెలకొల్పబోతున్నారు కాబట్టి కొత్త రాజధానిపేరు ' అమరావతి ' అనికాని ' ఆంధ్రనగరి ' అనికాని పెట్టితే బాగుంటుంది . నా అభిప్రాయంపై బ్లాగరు మిత్రుల చర్చను ఆహ్వానిస్తున్నాను.