22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

terrorism-long struggle.




  పరస్పర నిందారోపణలకిది సమయం కాదు.ప్రతి అధికారి,మంత్రి  బధ్యత తమది కాదన్నట్లు మాట్లాడుతారు.కృతనిశ్చయంతోను, ఐకమత్యంతోను  ప్రభుత్వమూ.ప్రజలూ ఉగ్రవాదం పై పోరాడాలి.ఒకో సారి విఫలం కావచ్చును.ప్రమాదసూచనలు పంపడంతో మాత్రమే కేద్రం బాధ్యత తీరిపోదు.ఉగ్రవాద సెల్స్ పై నిఘా పెట్టి అనుమానితులను ముందే ప్రత్యేక చట్టాలద్వారా అరెస్టు చెయ్యాలి.హైదరాబాదు వంటి మహానగరం లో జనసమ్మర్దం ఉండే స్థలాలు చాలా ఉంటాయి కదా.
  పాకీస్తాను,ఇస్లమిక్ ఉగ్రవాదసంస్థలూ భారత్ని నాశనం చెయ్యడానికి,లేక,సాధ్యమైనంత హింస ,కల్లోలం రేకెత్తించడానికి ,నిత్ణయించుకొన్నవన్నది  బహిరంగసత్యమే.ప్రత్యక్షయుద్ధం ద్వారా భారత్ ను జయించలేమని వాళ్ళకి  తెలుసును.అందుకే ఈ పరోక్ష చర్యలు.ఇది దీర్ఘకాల పోరాటమని  మనం సిద్ధపడాలి.
  కొందరు మంత్రులు నోరు మూసుకుంటేనే మంచిది.నా అభిప్రాయంలో  కేంద్రంలో షిండే,రాష్ట్రంలో సబితారెడ్డి హోం శాఖ మంత్రులు గా పనికి రారు. వారిని మార్చి ఇంకా సమర్థులను నియమించవలసి ఉంది.U.P.A. ప్రభుత్వం vote bank  రాజకీయాలు మాని ఇస్లామిక్ ఉగ్రవాదం ని ఉక్కుపాదంతో అణచివెయ్యాలి.   

16, ఫిబ్రవరి 2013, శనివారం



 

 రెండు విషయాలు వ్రాయదలచుకొన్నాను.
  1.ఇటీవల పాఠశాలలో తెలుగు నిర్బంధంగా ఒక సబ్జెక్టు గా ,ప్రైవేటు స్కూళ్ళతో సహా విద్యార్థులు చదవాలని ప్రభుత్వం తీసుకూన్న నిర్ణయం.2.ప్రైవేటు సంస్థలతో సహా ,అన్ని నామఫలకాలమీద(name boards) తెలుగులో రాయాలన్న నిర్ణయం,నిర్బంధం చేయడం.కర్ణాటక,తమిళ్నాడుల్లో ఈ నిబంధనలు ఇప్పటికే అమలు చేస్తూ ఉన్నారు.3.రద్దు చేయబడిన అకాడమీలను పునరుద్ధరిస్తామని వాగ్దానం చేయడం.దీనిని తప్పక అమలుపరుస్తారని ఆశిద్దాము.ముఖ్యమంత్రిగారినీ,బుద్ధప్రసాద్ గారినీ అభినందించాలి.

  రెండవ విషయం.పాకిస్తాన్ వలె  ( అంత మూర్ఖంగాను,హింసాత్మకంగాను కాకపోయినా ) మనదేశంలో కూడా moral policing  ఎక్కువైంది.వ్యక్తుల వేషభాషలు,ఆహారవిహారాలు,అలవాట్లు,సంబంధాలు విషయంలో కలుగజేసుకోకూడదు.ఇతరులకు హాని కలిగించనంతవరకు,వ్యక్తి స్వేచ్చకు ఆటంకం ఉండకూడదు.ప్రత్యేకమైన,బలవత్తరమైన కారణాలు ఉంటేనే ,ప్రభుత్వం మాత్రమే కలుగ జేసుకోవచ్చును. 

3, ఫిబ్రవరి 2013, ఆదివారం

Blaagarloo, bahuparaak.



 


  బహు పరాక్!రచయితలూ,రాజకీయులూ,సినిమా వాళ్ళూ,ఉపన్యాసకులూ,ఆఖరికి బ్లాగులు రాసేవాళ్ళు కూడా జాగ్రత్త.లేకపోతే చిక్కుల్లో ఇరుక్కుంటారు.రాజకీయనాయకులకీ,సినిమా వాళ్ళకీ అంత పరవా లేదు.వాళ్ళకి ధనబలమూ,జనబలమూ ఉంటాయి.రాజకీయనాయకులకు జైలుకి వెళ్ళడం ఒక క్రెడిట్  కూడాను.కోర్టులకి వెళ్ళడం వాళ్ళకి అలవాటే.కాని మన poor blog  writers మాత్రం జాగ్రతగా ఉండాలి.ఎప్పుడు ఏది రాస్తే ఎవరికి  కోపం వస్తుందో చెప్పలేము.స్వతంత్ర భారతదేశంలో ,ప్రజాస్వామ్యంలో రచనా స్వాతంత్ర్యం  ఉందని ఇష్టం  వచ్చినట్లు రాయకండి.కులం,మతం,భాష,వర్గం,ప్రాంతం ,మనోభావాలూ' అన్నీ జాగ్రతగా చూసుకోవాలి.పోలీసులు పట్టికెళ్ళకపోయినా ,కనీసం తిట్లూ, శాపనార్థాలూ మాత్రం తప్పవు.అంచేత  బహుపరాక్!  

7, జనవరి 2013, సోమవారం

కమనీయం: NRI autobiography

కమనీయం: NRI autobiographyNRI autobiography

NRI autobiography




  పుస్తకం పేరు;'నేలా,నింగీ,నేనూ '
   భాష;తెలుగు; రచయిత;డా;ప్రయాగమురళీమోహన్ కృష్ణ.
  ప్రచురణ;ఎమెస్కో బుక్స్;హైదరాబాద్ -500 029
   ముద్రణ-2011;మూల్యం-రూ.150 .పుటలు=494.
  ఒక NRI ఆత్మకథ  అని రాసుకొన్న పుస్తకాన్ని  ఈమధ్యనే చదివాను.శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట దగ్గర గొటివాడ అనే అగ్రహారంలో జన్మించి ,వైజాగ్ లో మెడిసిన్ చదివి ,కొంతకాలం ప్రభుత్వ సర్వీసులో పనిచెసినతర్వాత,అనెస్థీషియా లో స్పెషలైజ్ చేసిన డాక్టరుగారు.
  ఆ తర్వాత అనూహ్యంగా విదేశాలకి వెళ్ళి,3 దశాబ్దాలు పైగా 6 దేశాలలో ( ట్రినిడాడ్ ,ఐర్లండ్,ఇంగ్లండ్,డెన్మార్క్, స్వీడన్,నార్వే)  లలో బాగా పనిచేసి పేరు తెచ్చుకున్నారు. వృద్ధాప్యంలో మనదేశానికి  తిరిగి వచ్చి ఇక్కదే ప్రశాంతజీవనం గడుపుతున్నారు.తన సబ్జెక్టు అనస్తీషియా మీద రెండు పుస్తకాలు రచించారు.
 500పేజీల గ్రంథంలో,మొదటి 280 పేజీలు తన బాల్యమ్నుంచి ఇండియాలో జీవితం,తర్వాత 140 పేజీలు  విదేశాల్లో   జీవిత విశేషాల గురించి చివరి 60 పేజీలలో మళ్ళీ మనదేశంలో జీవితం గురించి రాసారు.చిన్న చిన్న విషయాలు కూడా వదలిపెట్టలేదు.
  దీనిద్వారా పూర్వపురోజులు,ఇప్పుడు మనదేశంలో పరిస్థితులు, మార్పులు తెలుస్తాయి.అభివృద్ధి చెందిన విదేశాల గురించి ,అనేక వైద్య విషయాలు తెలుస్తాయి.ఎన్నాళ్ళు విదేశాల్లో ఉన్నా రచయితకి వున్న స్వదేశాభిమానం,సంప్రదాయాలమీదా ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు.సులభంగా చదువుకుపోగల పుస్తకం.శైలి బాగుంది.
  నాకు ప్రత్యేక ఆసక్తి ;ఇందులో పి.జి.కె.(పంతుల గోపాలకృష్ణారావు) అనబడే  రచయిత మిత్రుడు నాకు స్వయానా మేనల్లుడు కావడం.అలాగే కుమారగుప్తా,కొందరు డాక్టర్లు,ప్రొఫెసర్లు పరిచయం ఉన్నవాళ్ళు కావటం ఆసక్తి కలిగిస్తుంది.
  ఇటీవలికాలంలో ఆత్మకథలు బాగా వస్తున్నవి.మంచిదే.ఎలాంటి వారి జీవితంలోనైనా ఎంతో కొంత తెలుసుకోవలసినదీ,ఆసక్తికరమైనదీ ఉంటుందని నా అభిప్రాయం.
    ' నేలా,నింగీ,నేనూ ' అందరూ చదవవలసిన గ్రంథం.మరొక్క విశేషం;చిన్నప్పుడు చదువురాని బడుద్ధాయి అనిపించుకొన్న  వ్యక్తే స్వయంకృషితో పెద్ద డాక్టర్ గా ఎదిగి పేరొందడం ప్రశంసనీయమే. 

6, జనవరి 2013, ఆదివారం

Hindu Gods




 ఈ మధ్య అక్బరుద్దీన్ ప్రేలాపనలలో హిందూ దేవతలను దూషించిన దానిపై పలువురు ఆగ్రహించారు.అతన్ని తీవ్రంగా శిక్షించాలీన్నారు.నిజమే.నేను కూడా ఏకీభవిస్తున్నాను.నేను కూడా ఖండిస్తున్నాను.కాని ఒక్క విషయం;  మన సినిమాల్లో,ముఖ్యంగా తెలుగు సినిమాల్లో యముడు,కృష్ణుడు ,మొ;దేవతల గురించి బఫూన్ల లాగ చిత్రించినా ఎవరూ మాట్లాడరేమి?సెన్సారుబోర్డు వారు కళ్ళు మూసుకొంటున్నారా?ఇది చాలా అభ్యంతరకరమైన విషయం కాదా?

27, డిసెంబర్ 2012, గురువారం



  


  ఈనాడు (27-12-12)తెలుగుగడ్డపై 37 స.;తర్వాత తిరుపతిలో రాష్ట్రపతిచె ప్రారంభింపబడిన4వ ప్రపంచ తెలుగుమహాసభల ప్రారంభోత్సవం బాగానే జరిగిందని నా అభిప్రాయం.విమర్శలు ఎలాగూ ఉంటాయి.కొన్ని పొరబాట్లు కూడా జరిగిఉండవచ్చును.కాని మొత్తం మీద జయప్రదంగానే జరిగిందని చెప్పవచ్చును.' మా తెలుగుతల్లి ' ప్రార్థనాగీతం సుశీల, బాలసరస్వతి బాగా పాడలేకపోయారు,వృద్ధాప్యంవలన.ఎవరైనా మంచి యువ గాయనీగాయకులచే పాడించవలసింది.
  కిరణ్కుమార్ రెడ్డి గారి ప్రసంగాన్ని మామూలుగా హేళన చెస్తూఉంటారు.కాని ఆయన తెలుగు ఈమధ్య improve  అయింది.చిత్తూరు యాస ఉండవచ్చును ,కాని అందులో తప్పేమీలేదుకదా.కొంచెం తప్పులున్నా  గవర్నర్ గారు తెలుగు బాగానే మాట్లాదుతారు. 
  సభలకి good start  అనుకోవచ్చును.