6, సెప్టెంబర్ 2011, మంగళవారం

arudra-contd.

   ఆంధ్రలో రోడ్లన్న భయము=ఆఫ్రికా అడవులే నయము
 చాంద్రాయణము చేయు జనులు=జపము విడిచిన మేటి మునులు
 గంద్రగోళపు ఆటవిడుపు =సంద్రపు ఘోష దిగదుడుపు
 ఇంద్రుడైనా గుడ్డివాడు =ఇచ్చోట నడువలేడు.
   ఇంద్రుడికి వెయ్యికళ్ళు అని ప్రతీతి కదా .మన రోడ్ల పరిస్థితి ఇప్పట్కీ అంత మారలెదు కదా.
   జూదం గురించి రాసినది.
  న్యూయార్కు ప్రత్తి మార్కెట్టు = నూత్నద్యూతపుటాటపట్టు
  హాలుద్వారాలు క్లోజింగు =ఆపదలకు ఓపెనింగు
  వేయకోయి నువ్వు బ్రాకెట్టు = విలువైనవన్ని తాకట్టు
  మాయజూదాలు కనిపెట్టు = మానవుడు సైతాను జట్టు
  ఎవరివెర్రి వారికి ఆనందమంటూ ఇలాగంటారు.
   తనకాంతుడె తనకు శౌరి = తనభార్యయె తనకురంభ
   తనవారు దేవతల బృందం = తన పిచ్చి తనకు ఆనందం
        శౌరి అంటె కృష్ణుడు.
   మంకుపట్టు వీడలేక = మావోసిటుంగూదు బాక
   డొంకతిరుగు మాటలాడి =వంకపెట్టును సిగ్గువీడి
   బొంకులను వేమారు ప్రేల = పూర్ణసత్యము మారు నేల
    పంకజాప్తుడి దివ్యశోభ = పరికించునా గుడ్లగూబ .
      పైపద్యం రాసేటప్పటికి మనదేశం పై చైనా దండయాత్రవలన (1962) కమ్మ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చింది.ఆరుద్ర చైనాను వ్యతిరేకించాడు.శ్రీశ్రీకి ,ఆరుద్రకి కూడా మనస్పర్ధలు వచ్చాయి.
        మరొకసారి మరికొన్ని ఆరుద్ర మధ్యాక్కరలు.    

pictures for all to see













దామెర్ల రామారావు ఆధునిక ఆంధ్ర చిత్ర కళాకారులలో సుప్రసిద్ధుడు.దురదృష్ట వశాత్తు యవ్వనంలోనే మరణించాడు. ఆయన చిత్రాలు రాజమండ్రిలో ప్రదర్సన శాలలో ఉన్నాయి. నా దగ్గర వున్నవి ఇస్తున్నాను.అలాగే బాపు గారి చిత్రాలు కొన్ని ,శ్రీకాకుళం జిల్లాలో కొన్నిదర్సనీయమైనవి కూడా ఇస్తున్నాను

3, సెప్టెంబర్ 2011, శనివారం

arudra contd.


ఆరుద్ర సరళమైన శిష్టవ్యావహారికం లోనే ఈ శుద్ధమధ్యాక్కరలను వ్రాసారు.సులభంగా అర్థమౌతుంది కనక అట్టే వివరణ అక్కరలేదు.
  తనలక్ష్యాన్ని చెపుతూ రాసింది.ప్రతీ పాదానికీ 13మాత్రలు ఉంటాయి.
    ''కూనలమ్మపదాల రీతి =కూర్చాక దీనిలో నీతి
      వీనులకు విందొనరించి =ప్రేముడిని జగతిలో పెంచి
      దానవత్వము వేగద్రుంచి =ధర్మపథమే అనుసరించి
      మానవుల మంచినే ఎంచి = మదిమీటు కవితావిపంచి  
     అని తన కవితా లక్ష్యాన్ని చాటిస్తారు.
     ఆరుద్ర నాస్తికుడు.మూఢనమ్మకాలను నిరసిస్తూ రాసినది.
      '' జంతువులతలలున్న సురలు =చలనమ్ములేనట్టి తరులు
         వింతగా కనిపించు రాళ్ళు =వెర్రిమానవుల దేవుళ్ళు
         పంతుళ్ళు పొత్తర్లు పట్ట=భరమగున పితరాళ్ళపొట్ట
        అంతరాత్మను తలచుకొమ్ము = అనవసరమీ తద్దినమ్ము.
      కాని పూర్వికుల సంస్మరణ ఏదో ఒకరూపంలో అన్ని నాగరకతలలోనూ ఉందికదా!
      కట్నాలని నిరసిస్తూనే తనదాకా వస్తేమాత్రం కట్నాన్ని ఆశించే కపటులమీద ఆరుద్రవిసుర్లు.

      ''కన్యకల పరిణయసమస్య=కారునల్లని అమావాస్య
        మా న్యాలపై అప్పుదెచ్చి=మ్యారేజి చేయడం పిచ్చి
        అన్యాయమీ శుల్కం =అడగడం పాపమనుచు
        అన్యులకు తానుబోధించి =ఆశించు కట్నాలసంచి
       మనేన్నికలమీద ,అవినీతిమీద విమర్శ
     '' కులతత్వ కూటాలవోట్లు =బలమున్నపదవులకు మెట్లు
        పలుకుబడిబడిలోన సీట్లు=పండించులే పచ్చనోట్లు
        కలవాళ్ళ అవగుణపు చెట్లు= ఫలియించె కోటానుకోట్లు
       తలబిరుసుతనపు పర్మిట్లు=దాపురించెను మనకు పాట్లూ'
       ఇంకా కొన్ని మరో సారి.
              ----------

2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

arudra


ఆరుద్ర= శుద్ధమధ్యాక్కరలు=మధ్యాక్కరలు దేశి చందస్సు .ఆటవెలది,ద్విపద వంటిది.నన్నయ నుంచి నేటి వరకు కవులు ఈ చందస్సులో పద్యాలు రాసారు.విశ్వనాథవారు రచించిన మధ్యాక్కరలకి సాహిత్య అకాడమీ అవార్డు(1965)ఇచ్చింది.
    ఐతే ఆరుద్ర అభ్య ంతర మేమంటే దెశిచందస్సు ఐన దీనిన్ని ,పాటగా పాడుకోవలసిన దానిని పద్యాల్లో కఠిన పదబంధాల్లో బిగించి అ ందాన్ని హరించారని అన్నారు.అందువలనా తానే ఆ చందస్సు లోనే పాటవలె మలచి 67రాసి వాటికి శుద్ధమధ్యాక్కరలు అని పేరు పెట్టారు.సమకాలిక సంఘటనలు,సమాజపరిస్థితులను వస్తువుగా తీసుకొని తనదైన శైలిలో హాస్యం ,వ్యంగ్యం జోడించి రచించారు.
   అక్కరలు1,మహాక్కర 2.మధురాక్కర 3.మధ్యాక్కర 4.అంతరాక్కర 5.అల్పాక్కర అని కొన్ని భేదాలతో ఉన్నాయి.
    మధ్యాక్కర లక్షణాలు. == నాలుగుపాదాలు ఉంటాయి. పాదానికి రెండు  ఇంద్రగణాలు,ఒక సూర్యగణము మళ్ళీ రెండు ఇంద్రగణాలు ,ఒక సూర్యగణము ఉంటాయి.నాల్గవ గణము మొదటి అక్షరం యతిస్థానం.
  ఆరుద్ర పై చందస్సునే తేసుకొని  ఒకపాదాన్ని రెండుగా విడగొట్టి మొత్తం ఎనిమిది పాదాలు చేసారు.దానికి తోడుగా తన ముద్ర ఐన అంత్యప్రాసని జోడించారు.ప్రతిపాదానికి సంప్రదాయంగా ప్రథమంలో ప్రాసనియమం ఎలాగూ ఉన్నది.
   ఆరుద్రగారి మద్యాక్కరలు కొన్ని మాత్రం ఉదహరిస్తూ మళ్ళీ రాస్తాను.ఆయన మొత్తం 67 అక్కరలు జానుతెనుగులో రచించారు.
 

1, సెప్టెంబర్ 2011, గురువారం

stroke

STROKE.==Is a cerebrovascular accident--It develops rapidly causing loss of function of brain. due to obstruction of blood supply.TIA or transient ischemic attack resolves within 24hours and is a warning sign.
   CAUSES==1.Local blood clot or thrombosis.2.blood clot from other regions or embolism3.shock with general decrease in blood supply4.veinous thrombosis
    In some cases bloodvessels rupture of blood vessels may occur an bleeding occurs into the brain.(hemorrhagic shock.)
   SIGNSand SYMPTOMS==depend on the area in the brain affected.Look for the for the following.-
   1.weakness and loss of function of limb or limbs on one side.2.facial changes ,muscle weakness of face.3.numbness on one side of body.4.loss of memory 5.defect in speech
   INVESTIGATIONS;=1,record blood pressure2.examine  blood  and urine esp.f or sugar3.lipid profile4.arteriography5.MR SCAN 6.Doppler ultrasound
    TREATMENT;=1.Anti coagulation drugs 2control of hypertension and diabetes if needed 3.Surgery in select cases to be decided by experts.
     Physiotherapy and rehabilitation  by specially trained personnel are essential for recovery.

photos of srikaakulam